ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక స్టూడెంట్ * స్నాప్ చాట్ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్ * ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక స్టూడెంట్
* స్నాప్ చాట్ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్
* ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి
సికింద్రాబాద్, ఏప్రిల్ 16 ( ప్రజామంటలు ):
చదువుకోవడానికి చెల్లెలు కూతురుకు తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన పెద్దమ్మ ఇంటికే ఓ విద్యార్థిని కన్నం వేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్. గిరిధర్ మంగళవారం చిలకలగూడ పీఎస్ ఆవరణలో మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...చిలకలగూడ లోని ప్రభుత్వ ఉద్యోగి పెద్దమ్మ ఇంట్లో ఉండి ఓ బాలిక (13) 2020 సంవత్సరం నుంచి (8 వ తరగతి) చదువుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో బాలిక పెద్దనాన్న శ్రీనివాసరావు ( ప్రభుత్వ ఎంప్లాయి ) షర్ట్ లోని రూ 3వేలు నగదు మాయమైంది. అనుమానం వచ్చి ఇంట్లో సదరు బాలికను ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో లాకర్లు తెరచి చూడగా, విలువైన బంగారు ఆర్నమెంట్స్, నగదు కనబడకుండా పోవడంతో ఆందోళన చెందిన ఫ్యామిలీ మెంబర్స్ బాలికను ప్రశ్నించారు. బాలిక మొబైల్ చూడగా, అందులో స్నాప్చాట్, వాట్సాప్ లో విజయ్ కుమార్ అబ్బాయితో చనువుగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన తతంగాన్ని పూర్తిగా వివరించింది. ఇన్స్టాగ్రామ్ లో కడప నివాసి, ప్రస్తుతం బెంగళూర్ లో డిగ్రీ చదువుతున్న చెప్పలి విజయ్ కుమార్ (19) తో పరిచయం ఉందని పేర్కొంది. తన పేరేంట్స్ ఆరోగ్యం బాగాలేదని చెబితే బాధితుల ఇంట్లో నుంచి 16 తులాల బంగారం నగలను, ఒక లక్షా 50 వేల నగదును దొంగలించి, విజయ్ కి ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. బంగారం నగలను పలు చోట్ల తాకట్టు పెట్టగా, నగదును లిక్కర్, సిగరేట్స్ తాగడానికి, ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు వాడుకున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బాధితులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని, హైదరాబాద్ లోనే ఉంటున్న విజయ్ కుమార్ సినిమాలు, షికార్లకు తీసుకెళ్ళి, లైంగికంగా కూడ దాడిచేసినట్లు గుర్తించారు. ఈనెల 15న నిందితుడు విజయ్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. విజయ్ కుమార్ పై ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్, తదితర నేరాలకు సంబందించిన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. సకాలంలో నిందితుడిని గుర్తించి, 16 తులాల బంగారం ఆర్నమెంట్స్ ను రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించి, సీపీ ప్రకటించిన రివార్డులను చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్హెచ్వో అనుదీప్, లాలాగూడ ఎస్హెచ్వో రమేశ్ గౌడ్, ఆంజనేయులు, కరుణాకర్ రెడ్డి, జగదీశ్, నవీన్, గణేశ్, విజయ్ , కానిస్టేబుళ్ళకు అందచేశారు. ఈరోజుల్లో అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయని, మొబైల్ సాయంతో కూడ నిందితులను గుర్తించడం సులభంగా మారిందని, నేరస్థులు తప్పించుకోవడం జరగదని డీసీపీ గిరిధర్ పేర్కొన్నారు. ఎవరూ కూడ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
––––––––––––
–ఫొటోలు:
More News...
<%- node_title %>
<%- node_title %>
చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు.... సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత... రాయికల్లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్
రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం... రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా... శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి.
దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు... రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్ పూజలు
జగిత్యాల సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధిలోని రెడ్ బుల్స్ గణేశ మండపం వద్ద గురువారం సాయంత్రం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు సందర్శించి వినాయకునికి పూజలు చేశారు. రుద్రాంగి గోపాలకృష్ణ తీర్థప్రసాద్ అందజేసి స్వామి వారి శేష వస్తుందో సత్కరించి ఆశీర్వచనం చేశారు. జగిత్యాలలో అయోమయంలో "గణేశ నిమజ్జనోత్సవ తేదీలు
" జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జోత్సవ వేడుకలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అయోమయం నెలకొంది. 9 రాత్రులు ముగిసిన తర్వాత వారంతో సంబంధం లేకుండా నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అదేవిధంగా అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం కూడా ఓ ఆచారం కొనసాగుతుంది.
విశ్వహిందూ పరిషత్తు... రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద లలితా సహస్రనామ పారాయణం
జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి లో గల రెడ్ బుల్స్ గణేష్ మండపం వద్ద మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా భక్తబృందం వారిచే లలితా సహస్రనామం పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. 