ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక స్టూడెంట్ * స్నాప్ చాట్ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్ * ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక స్టూడెంట్
* స్నాప్ చాట్ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్
* ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి
సికింద్రాబాద్, ఏప్రిల్ 16 ( ప్రజామంటలు ):
చదువుకోవడానికి చెల్లెలు కూతురుకు తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన పెద్దమ్మ ఇంటికే ఓ విద్యార్థిని కన్నం వేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్. గిరిధర్ మంగళవారం చిలకలగూడ పీఎస్ ఆవరణలో మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...చిలకలగూడ లోని ప్రభుత్వ ఉద్యోగి పెద్దమ్మ ఇంట్లో ఉండి ఓ బాలిక (13) 2020 సంవత్సరం నుంచి (8 వ తరగతి) చదువుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో బాలిక పెద్దనాన్న శ్రీనివాసరావు ( ప్రభుత్వ ఎంప్లాయి ) షర్ట్ లోని రూ 3వేలు నగదు మాయమైంది. అనుమానం వచ్చి ఇంట్లో సదరు బాలికను ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో లాకర్లు తెరచి చూడగా, విలువైన బంగారు ఆర్నమెంట్స్, నగదు కనబడకుండా పోవడంతో ఆందోళన చెందిన ఫ్యామిలీ మెంబర్స్ బాలికను ప్రశ్నించారు. బాలిక మొబైల్ చూడగా, అందులో స్నాప్చాట్, వాట్సాప్ లో విజయ్ కుమార్ అబ్బాయితో చనువుగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన తతంగాన్ని పూర్తిగా వివరించింది. ఇన్స్టాగ్రామ్ లో కడప నివాసి, ప్రస్తుతం బెంగళూర్ లో డిగ్రీ చదువుతున్న చెప్పలి విజయ్ కుమార్ (19) తో పరిచయం ఉందని పేర్కొంది. తన పేరేంట్స్ ఆరోగ్యం బాగాలేదని చెబితే బాధితుల ఇంట్లో నుంచి 16 తులాల బంగారం నగలను, ఒక లక్షా 50 వేల నగదును దొంగలించి, విజయ్ కి ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. బంగారం నగలను పలు చోట్ల తాకట్టు పెట్టగా, నగదును లిక్కర్, సిగరేట్స్ తాగడానికి, ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు వాడుకున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బాధితులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని, హైదరాబాద్ లోనే ఉంటున్న విజయ్ కుమార్ సినిమాలు, షికార్లకు తీసుకెళ్ళి, లైంగికంగా కూడ దాడిచేసినట్లు గుర్తించారు. ఈనెల 15న నిందితుడు విజయ్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. విజయ్ కుమార్ పై ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్, తదితర నేరాలకు సంబందించిన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. సకాలంలో నిందితుడిని గుర్తించి, 16 తులాల బంగారం ఆర్నమెంట్స్ ను రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించి, సీపీ ప్రకటించిన రివార్డులను చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్హెచ్వో అనుదీప్, లాలాగూడ ఎస్హెచ్వో రమేశ్ గౌడ్, ఆంజనేయులు, కరుణాకర్ రెడ్డి, జగదీశ్, నవీన్, గణేశ్, విజయ్ , కానిస్టేబుళ్ళకు అందచేశారు. ఈరోజుల్లో అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయని, మొబైల్ సాయంతో కూడ నిందితులను గుర్తించడం సులభంగా మారిందని, నేరస్థులు తప్పించుకోవడం జరగదని డీసీపీ గిరిధర్ పేర్కొన్నారు. ఎవరూ కూడ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
––––––––––––
–ఫొటోలు:
More News...
<%- node_title %>
<%- node_title %>
భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ
జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు)పట్టణం లోని సిద్ధార్థ విద్యాసంస్థ ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో సూర్య గ్లోబల్ స్కూల్, జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థులకోసం “ఎగ్జామ్ ఛాలెంజెస్– మోటివేషనల్ సెషన్ ” అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ... కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం
హైదరాబాద్ జనవరి 07 (ప్రజామంటలు):
నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు.
కల్వకుంట్ల కవిత 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి... కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ముందుగా బేతాళ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టెంకాయ మొక్కులు చెల్లించి తమ... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
బొజ్జనపెల్లి గణేష్ కొండగట్టు
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన... ప్రపంచ తెలుగు మహాసభల్లో జగిత్యాల వాసి సముద్రాల రాములు కు అరుదైన గౌరవం
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు( అమరావతి) లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో భారతదేశ వ్యాప్తంగా ఎంపికైన 120 మంది గాయని గాయకులలో జగిత్యాల వాసి సముద్రాల రాములు ఒకరిగా ఎంపికయ్యారు.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ సముద్రాల రాములు గూర్చి మాట్లాడుతూ... నోడల్ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)
జిల్లాలోని 5 మున్సిపల్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కొరకు భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి... శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా, లలితా చాలీసా పారాయణం
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం, లలితా చాలీసా పారాయణం సామూహికంగా భక్తులచే సాయంత్రం 7 గంటల నుండి సామూహిక పారాయణం కొనసాగింది.
.అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం ,తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో... మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం
జగిత్యాల డిసెంబర్ 5 ( ప్రజా మంటలు)ఇటీవల జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.
ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని... కొండగట్టు గిరిప్రదక్షిణ కొరకు రోడ్డు పరిశీలన అరుణాచలం, సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళిక రూపకల్పన - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
మల్యాల జనవరి 5 (ప్రజామంటలు)ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం కొండగట్టు లోని రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అగ్రవర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అందజేయాలి జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు కల్పించాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారిలో అలసత్వం వద్దు ప్రజావాణిలో కలెక్టర్ కు ఓసి జేఏసీ నాయకుల వినతి
జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు)అగ్ర వర్ణాలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనీ ఓసి జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్కు ఓ.సి.జెఏసీ నాయకులు ఓ.సి వర్గాలకు సంబంధించిన పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సోమవారం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు
ఈనెల... రోడ్డు భద్రతే జీవన రక్షణ విద్యార్థులే మార్పుకు దూతలు సూర్య గ్లోబల్ పాఠశాలలో రోడ్డు భద్రత పై అవగాహన జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్
జగిత్యాల జనవరి 5 ( ప్రజా మంటలు)
రోడ్డు భద్రతే జీవన రక్షణ విద్యార్థులే మార్పుకు దూతలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు రవాణా భద్రత గూర్చి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రవాణా... 