ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక

On
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక

ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక స్టూడెంట్​    * స్నాప్​ చాట్​ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్    *  ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి

ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక స్టూడెంట్​
   * స్నాప్​ చాట్​ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్
   *  ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి

సికింద్రాబాద్​, ఏప్రిల్​ 16 ( ప్రజామంటలు ):

చదువుకోవడానికి చెల్లెలు  కూతురుకు తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన పెద్దమ్మ ఇంటికే  ఓ విద్యార్థిని కన్నం వేసిన ఘటన చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్​ డీసీపీ ఆర్​. గిరిధర్​ మంగళవారం చిలకలగూడ పీఎస్​ ఆవరణలో మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...చిలకలగూడ లోని  ప్రభుత్వ ఉద్యోగి  పెద్దమ్మ ఇంట్లో ఉండి ఓ బాలిక (13) 2020 సంవత్సరం నుంచి  (8 వ తరగతి) చదువుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో బాలిక పెద్దనాన్న శ్రీనివాసరావు ( ప్రభుత్వ ఎంప్లాయి ) షర్ట్ లోని రూ 3వేలు నగదు మాయమైంది. అనుమానం వచ్చి ఇంట్లో సదరు బాలికను ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో లాకర్లు తెరచి చూడగా, విలువైన బంగారు ఆర్నమెంట్స్​, నగదు కనబడకుండా పోవడంతో ఆందోళన చెందిన ఫ్యామిలీ మెంబర్స్​ బాలికను ప్రశ్నించారు. బాలిక మొబైల్​ చూడగా, అందులో స్నాప్​చాట్​, వాట్సాప్​ లో విజయ్​ కుమార్​ అబ్బాయితో చనువుగా చాటింగ్​ చేసినట్లు గుర్తించారు. వారు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన తతంగాన్ని పూర్తిగా వివరించింది. ఇన్​స్టాగ్రామ్​ లో కడప నివాసి, ప్రస్తుతం బెంగళూర్​ లో డిగ్రీ చదువుతున్న  చెప్పలి విజయ్​ కుమార్​ (19) తో పరిచయం ఉందని పేర్కొంది. తన పేరేంట్స్​ ఆరోగ్యం బాగాలేదని చెబితే  బాధితుల ఇంట్లో నుంచి 16 తులాల బంగారం నగలను, ఒక లక్షా 50 వేల నగదును దొంగలించి,  విజయ్​ కి ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. బంగారం నగలను  పలు చోట్ల తాకట్టు పెట్టగా, నగదును లిక్కర్​, సిగరేట్స్​ తాగడానికి, ఆన్​ లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ కు వాడుకున్నట్లు గుర్తించారు.  ఆ తర్వాత బాధితులు చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ లో  ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రేమ పేరుతో మైనర్​ బాలికను లోబర్చుకొని,  హైదరాబాద్​ లోనే ఉంటున్న విజయ్​ కుమార్​ సినిమాలు, షికార్లకు  తీసుకెళ్ళి, లైంగికంగా కూడ దాడిచేసినట్లు గుర్తించారు. ఈనెల 15న నిందితుడు విజయ్​ కుమార్​ ను అరెస్టు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. విజయ్​ కుమార్​ పై ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్​,  తదితర నేరాలకు సంబందించిన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. సకాలంలో నిందితుడిని గుర్తించి, 16 తులాల బంగారం ఆర్నమెంట్స్​ ను రికవరీ చేసిన పోలీస్​ సిబ్బందిని అభినందించి, సీపీ ప్రకటించిన రివార్డులను చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్​హెచ్​వో అనుదీప్​, లాలాగూడ ఎస్​హెచ్​వో రమేశ్​ గౌడ్​, ఆంజనేయులు, కరుణాకర్​ రెడ్డి, జగదీశ్​, నవీన్​, గణేశ్​, విజయ్​ , కానిస్టేబుళ్ళకు అందచేశారు. ఈరోజుల్లో అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయని, మొబైల్​ సాయంతో కూడ నిందితులను గుర్తించడం సులభంగా మారిందని, నేరస్థులు తప్పించుకోవడం జరగదని డీసీపీ గిరిధర్​ పేర్కొన్నారు.  ఎవరూ కూడ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.  
––––––––––––
–ఫొటోలు:

Tags
Join WhatsApp

More News...

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ.. . ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు) శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2...
Read More...

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి  -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్    జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక...
Read More...
Local News  Crime 

ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు)  : మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్‌పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన...
Read More...
Local News  State News 

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు): వచ్చే ఏడాది జరగనున్న ఎస్‌ఐఆర్‌, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):  నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన...
Read More...
Crime  State News 

కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం

కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం బెంగళూరు డిసెంబర్ 25: కర్ణాటకలో ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 1:30–2:00 గంటల మధ్య చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలో ప్రయాణికులతో ఉన్న బస్సు మంటల్లో చిక్కడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read More...

భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం

   భర్త అడ్డుగా ఉన్నాడని హత్య..అక్రమ సంబంధంతో భార్య దారుణం అచ్చంపేట డిసెంబర్ 25 (ప్రజా మంటలు): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళే ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా తేలడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో నివాసం...
Read More...
Local News 

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న దావ వసంత్ సురేష్ –   క్రైస్తవులకు శుభాకాంక్షలు జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు): క్రిస్మస్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు....
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు 50 మంది నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖల్ల సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు 50 మంది నాయకులు బుగ్గారం డిసెంబర్ 25 (ప్రజా మంటలు):శేఖల్ల గ్రామానికి చెందిన సర్పంచ్ పర్సా రమేష్, ఉపసర్పంచ్ నార్ల బుచ్చయ్యతో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు వారందరికీ కాంగ్రెస్...
Read More...
Local News 

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా – పలువురు విద్యార్థులకు గాయాలు రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ డిసెంబర్ 25:శంషాబాద్ నుంచి హైదరాబాద్‌లోని జలవిహార్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బస్సును ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మందికి...
Read More...
National  Crime  State News 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ బస్సు ఢీకొని 8 మంది మృతి కడలూరు, డిసెంబర్ 24: తమిళనాడులోని కడలూరు జిల్లా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్ప్రెస్ బస్సు టైరు పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తిట్టకుడి ప్రాంతం సమీపంలోని తిరుచ్చి హైవేపై రాత్రి సుమారు...
Read More...
Local News 

కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం

కిసాన్ గ్రామీణ మేళలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు జిల్లా కురుమ సంఘం ఘన సన్మానం కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు): కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్‌, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను జిల్లా కురుమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి ఆయిలన్న కురుమ ఆధ్వర్యంలో దత్తాత్రేయకు మెమొంటో...
Read More...