ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక

On
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక

ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక స్టూడెంట్​    * స్నాప్​ చాట్​ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్    *  ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి

ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక స్టూడెంట్​
   * స్నాప్​ చాట్​ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్
   *  ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి

సికింద్రాబాద్​, ఏప్రిల్​ 16 ( ప్రజామంటలు ):

చదువుకోవడానికి చెల్లెలు  కూతురుకు తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన పెద్దమ్మ ఇంటికే  ఓ విద్యార్థిని కన్నం వేసిన ఘటన చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్​ డీసీపీ ఆర్​. గిరిధర్​ మంగళవారం చిలకలగూడ పీఎస్​ ఆవరణలో మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...చిలకలగూడ లోని  ప్రభుత్వ ఉద్యోగి  పెద్దమ్మ ఇంట్లో ఉండి ఓ బాలిక (13) 2020 సంవత్సరం నుంచి  (8 వ తరగతి) చదువుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో బాలిక పెద్దనాన్న శ్రీనివాసరావు ( ప్రభుత్వ ఎంప్లాయి ) షర్ట్ లోని రూ 3వేలు నగదు మాయమైంది. అనుమానం వచ్చి ఇంట్లో సదరు బాలికను ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో లాకర్లు తెరచి చూడగా, విలువైన బంగారు ఆర్నమెంట్స్​, నగదు కనబడకుండా పోవడంతో ఆందోళన చెందిన ఫ్యామిలీ మెంబర్స్​ బాలికను ప్రశ్నించారు. బాలిక మొబైల్​ చూడగా, అందులో స్నాప్​చాట్​, వాట్సాప్​ లో విజయ్​ కుమార్​ అబ్బాయితో చనువుగా చాటింగ్​ చేసినట్లు గుర్తించారు. వారు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన తతంగాన్ని పూర్తిగా వివరించింది. ఇన్​స్టాగ్రామ్​ లో కడప నివాసి, ప్రస్తుతం బెంగళూర్​ లో డిగ్రీ చదువుతున్న  చెప్పలి విజయ్​ కుమార్​ (19) తో పరిచయం ఉందని పేర్కొంది. తన పేరేంట్స్​ ఆరోగ్యం బాగాలేదని చెబితే  బాధితుల ఇంట్లో నుంచి 16 తులాల బంగారం నగలను, ఒక లక్షా 50 వేల నగదును దొంగలించి,  విజయ్​ కి ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. బంగారం నగలను  పలు చోట్ల తాకట్టు పెట్టగా, నగదును లిక్కర్​, సిగరేట్స్​ తాగడానికి, ఆన్​ లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ కు వాడుకున్నట్లు గుర్తించారు.  ఆ తర్వాత బాధితులు చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ లో  ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రేమ పేరుతో మైనర్​ బాలికను లోబర్చుకొని,  హైదరాబాద్​ లోనే ఉంటున్న విజయ్​ కుమార్​ సినిమాలు, షికార్లకు  తీసుకెళ్ళి, లైంగికంగా కూడ దాడిచేసినట్లు గుర్తించారు. ఈనెల 15న నిందితుడు విజయ్​ కుమార్​ ను అరెస్టు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. విజయ్​ కుమార్​ పై ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్​,  తదితర నేరాలకు సంబందించిన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. సకాలంలో నిందితుడిని గుర్తించి, 16 తులాల బంగారం ఆర్నమెంట్స్​ ను రికవరీ చేసిన పోలీస్​ సిబ్బందిని అభినందించి, సీపీ ప్రకటించిన రివార్డులను చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్​హెచ్​వో అనుదీప్​, లాలాగూడ ఎస్​హెచ్​వో రమేశ్​ గౌడ్​, ఆంజనేయులు, కరుణాకర్​ రెడ్డి, జగదీశ్​, నవీన్​, గణేశ్​, విజయ్​ , కానిస్టేబుళ్ళకు అందచేశారు. ఈరోజుల్లో అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయని, మొబైల్​ సాయంతో కూడ నిందితులను గుర్తించడం సులభంగా మారిందని, నేరస్థులు తప్పించుకోవడం జరగదని డీసీపీ గిరిధర్​ పేర్కొన్నారు.  ఎవరూ కూడ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.  
––––––––––––
–ఫొటోలు:

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు

రెండేళ్ల ప్రజా పాలన సక్సెస్ పై సికింద్రాబాద్ లో సంబరాలు సికింద్రాబాద్,  డిసెంబర్ 08 (ప్రజామంటలు): :    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని  సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ...
Read More...

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం

పెండ్లి నిరాకరణపై రెచ్చిపోయిన బావ : గొంతులో కత్తి దించి, యువతిని దారుణంగా చంపిన మానవ మృగం రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచిన పవిత్ర వారాసిగూడ పీఎస్ పరిధిలో పట్టపగలు అమానవీయ ఘటన
Read More...

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం*    జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ *కొడిమ్యాల డిసెంబర్ 8 (ప్రజా మంటలు) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా సోమవారం రోజున కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించి పలు అంశాల మీద ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన కల్పించారు....
Read More...

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్

జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్ ** జగిత్యాల, డిసెంబర్ 8(ప్రజా మంటలు)   భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ...
Read More...

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం ఫ్లాగ్ మార్చ్    * ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు  అన్ని వర్గాల  ప్రజలు పోలీసులకు సహకరించాలి జగిత్యాల రూరల్ డిసెంబర్ 8 (ప్రజా మంటలు) సర్పంచ్  ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్  పోలీస్ స్టేషన్ పరిధిలోని జాబితా పూర్  గ్రామంలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది.   ఈ సందర్భంగా  సి.ఐ సుధాకర్  మాట్లాడుతూ....
Read More...

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం 

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానానికి సుఖంగా చేరుకోవాలి  ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం  జగిత్యాలడిసెంబర్ 8 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ గమ్యానికి సుఖ ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం టౌన్ ఎస్ఐ రవికిరణ్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో డిఎస్పి రఘు చందర్ సూచనలతో టౌన్ సిఐ కరుణాకర్ పర్యవేక్షణలో arive alive కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపేటప్పుడు సురక్షితంగా గమ్యస్థానానికి...
Read More...
National  Filmi News 

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్

అవల్కొప్పం… న్యాయం కోసం 3,215 రోజుల నిరీక్షణ! దిలీప్ కేసు తీర్పుతో మళ్లీ ట్రెండ్‌లో హ్యాష్‌ట్యాగ్ కొచ్చి, డిసెంబర్ 08:2017లో ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ నిర్దోషి అని ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ప్రకటించడంతో, సోషల్ మీడియాలో ‘అవల్కొప్పం’ (We stand with her) హ్యాష్‌ట్యాగ్ మళ్లీ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మలయాళ సినీ పరిశ్రమలో 2017లో మహిళా భద్రత కోసం...
Read More...
National  State News 

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి

తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యం : రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు): తెలంగాణను దేశంలో ముందంజలో నిలపడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన **‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’**పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. సీఎం మాట్లాడుతూ,2047 నాటికి తెలంగాణను 3...
Read More...
Local News 

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు

వీరాపూర్ ఏకగ్రీవ ఎంపికలపై జీవన్ రెడ్డి అభినందనలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 08 (ప్రజా మంటలు): జగిత్యాల ఇందిరాభవన్‌లో వీరాపూర్ గ్రామం కొత్తగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి గౌడ్, ఉపసర్పంచ్ దుంపల నర్సిరెడ్డి సహా వార్డ్ సభ్యులను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ—గతంలో సర్పంచ్‌గా ఉన్న రామస్వామి...
Read More...
State News 

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత

మేడ్చల్–మల్కాజ్‌గిరి సమస్యలు భయంకర స్థాయిలో ఉన్నాయి: కవిత ఇది తెలంగాణ రైజింగ్ కాదు, Telangana Sinking,” తెలంగాణ జాగృతి జనంబాట – కూకట్‌పల్లి ప్రెస్ మీట్ కూకట్ పల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు): మేడ్చల్–మల్కాజ్‌గిరి పర్యటనలో ప్రజల సమస్యలను స్వయంగా చూశానని, పరిస్థితులు ఊహించని స్థాయిలో దారుణంగా ఉన్నాయని జాగృతి నాయకురాలు కవిత తెలిపారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్‌పల్లిలో జరిగిన...
Read More...
State News 

“ఏం సాధించారని సంబరాలు" – తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా.నలమాస శ్రీకాంత్ గౌడ్

“ఏం సాధించారని సంబరాలు “స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు” హైదరాబాద్, డిసెంబర్ 8 (ప్రజా మంటలు): ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండేళ్ల...
Read More...
Local News 

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తా — బార్ కౌన్సిల్ అభ్యర్థి పోలు వెంకట రాజ్ కుమార్ మెట్టుపల్లి డిసెంబర్ 08 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత బలోపేత చర్యలు తీసుకుంటానని కరీంనగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలు వెంకట రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం మెట్టుపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన...
Read More...