ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక

On
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక

ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక స్టూడెంట్​    * స్నాప్​ చాట్​ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్    *  ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి

ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక స్టూడెంట్​
   * స్నాప్​ చాట్​ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్
   *  ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి

సికింద్రాబాద్​, ఏప్రిల్​ 16 ( ప్రజామంటలు ):

చదువుకోవడానికి చెల్లెలు  కూతురుకు తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన పెద్దమ్మ ఇంటికే  ఓ విద్యార్థిని కన్నం వేసిన ఘటన చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్​ డీసీపీ ఆర్​. గిరిధర్​ మంగళవారం చిలకలగూడ పీఎస్​ ఆవరణలో మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...చిలకలగూడ లోని  ప్రభుత్వ ఉద్యోగి  పెద్దమ్మ ఇంట్లో ఉండి ఓ బాలిక (13) 2020 సంవత్సరం నుంచి  (8 వ తరగతి) చదువుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో బాలిక పెద్దనాన్న శ్రీనివాసరావు ( ప్రభుత్వ ఎంప్లాయి ) షర్ట్ లోని రూ 3వేలు నగదు మాయమైంది. అనుమానం వచ్చి ఇంట్లో సదరు బాలికను ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో లాకర్లు తెరచి చూడగా, విలువైన బంగారు ఆర్నమెంట్స్​, నగదు కనబడకుండా పోవడంతో ఆందోళన చెందిన ఫ్యామిలీ మెంబర్స్​ బాలికను ప్రశ్నించారు. బాలిక మొబైల్​ చూడగా, అందులో స్నాప్​చాట్​, వాట్సాప్​ లో విజయ్​ కుమార్​ అబ్బాయితో చనువుగా చాటింగ్​ చేసినట్లు గుర్తించారు. వారు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన తతంగాన్ని పూర్తిగా వివరించింది. ఇన్​స్టాగ్రామ్​ లో కడప నివాసి, ప్రస్తుతం బెంగళూర్​ లో డిగ్రీ చదువుతున్న  చెప్పలి విజయ్​ కుమార్​ (19) తో పరిచయం ఉందని పేర్కొంది. తన పేరేంట్స్​ ఆరోగ్యం బాగాలేదని చెబితే  బాధితుల ఇంట్లో నుంచి 16 తులాల బంగారం నగలను, ఒక లక్షా 50 వేల నగదును దొంగలించి,  విజయ్​ కి ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. బంగారం నగలను  పలు చోట్ల తాకట్టు పెట్టగా, నగదును లిక్కర్​, సిగరేట్స్​ తాగడానికి, ఆన్​ లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ కు వాడుకున్నట్లు గుర్తించారు.  ఆ తర్వాత బాధితులు చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ లో  ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రేమ పేరుతో మైనర్​ బాలికను లోబర్చుకొని,  హైదరాబాద్​ లోనే ఉంటున్న విజయ్​ కుమార్​ సినిమాలు, షికార్లకు  తీసుకెళ్ళి, లైంగికంగా కూడ దాడిచేసినట్లు గుర్తించారు. ఈనెల 15న నిందితుడు విజయ్​ కుమార్​ ను అరెస్టు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. విజయ్​ కుమార్​ పై ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్​,  తదితర నేరాలకు సంబందించిన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. సకాలంలో నిందితుడిని గుర్తించి, 16 తులాల బంగారం ఆర్నమెంట్స్​ ను రికవరీ చేసిన పోలీస్​ సిబ్బందిని అభినందించి, సీపీ ప్రకటించిన రివార్డులను చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్​హెచ్​వో అనుదీప్​, లాలాగూడ ఎస్​హెచ్​వో రమేశ్​ గౌడ్​, ఆంజనేయులు, కరుణాకర్​ రెడ్డి, జగదీశ్​, నవీన్​, గణేశ్​, విజయ్​ , కానిస్టేబుళ్ళకు అందచేశారు. ఈరోజుల్లో అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయని, మొబైల్​ సాయంతో కూడ నిందితులను గుర్తించడం సులభంగా మారిందని, నేరస్థులు తప్పించుకోవడం జరగదని డీసీపీ గిరిధర్​ పేర్కొన్నారు.  ఎవరూ కూడ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.  
––––––––––––
–ఫొటోలు:

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

హైదరాబాద్‌లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్‌లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా మంటలు):హైదరాబాద్‌లో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఊగిసలాట, రూపాయి మార్పిడి విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాలు నగర రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ధరలను స్థానిక వ్యాపారులతో మాట్లాడి సరిపోల్చుకోండి. ఇవి సమాచారం కొరకు మాత్రమే. వాస్తవ...
Read More...
Local News  Crime 

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ

ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ జగిత్యాల (రూరల్), నవంబర్ 18 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ నూతన ఉపనిర్వాహక అధికారి (SI)గా ఉమా సాగర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మాన సూచికగా మొక్కను అందజేశారు. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమా సాగర్,...
Read More...

బేగంపేట్‌లో రోడ్డు ప్రమాదం: థార్‌ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా

బేగంపేట్‌లో రోడ్డు ప్రమాదం: థార్‌ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా బేగంపేట్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టిన హెవీ లోడ్ ట్రక్ బోల్తా. గాయపడిన వారు ఆసుపత్రికి తరలింపు. పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
Read More...
Local News  Crime  State News 

వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్‌లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్‌లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య శంషాబాద్‌లో ఐవీఎఫ్ చికిత్స వికటించడంతో ఎనిమిదో నెల గర్భిణి శ్రావ్య, గర్భంలోని కవలలు మృతి. షాక్ తట్టుకోలేక భర్త విజయ్ ఆత్మహత్య. కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసిన హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు.
Read More...

ఐ–బొమ్మ పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన

ఐ–బొమ్మ  పైరసీ వెబ్‌సైట్ లో సంచలన ప్రకటన హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది. ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా...
Read More...
Local News  State News 

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు

ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం
Read More...
Local News 

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ

15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ సికింద్రాబాద్, నవంబర్ 17 (ప్రజామంటలు) : బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయిగూడ, ఐడీహెచ్ కాలనీల పరిధిలోని 15 జీహెచ్ఎమ్ సీ షాపింగ్ కాంప్లెక్స్ లల్లోని మొత్తం 15 దుకాణాలకు కొత్తం ఓపెన్ వేలం వేసి, అర్హులకు కేటాయించాలని సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ నార్త్‌ జోన్‌ అధికారులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి సోమవారం...
Read More...
National  State News 

దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి

దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. దార్జిలింగ్ కొండ ప్రాంతంలోని గోర్ఖా సమస్యలపై చర్చలు నిర్వహించేందుకు కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నియామకాన్ని రద్దు చేయాలంటూ ఆమె పునరుద్ఘాటించారు. గోర్ఖాల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలనే...
Read More...
Local News 

తల్లిదండ్రులను  వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.  

తల్లిదండ్రులను  వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.   జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు): కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రులను వేధింపులకు గురిచేస్తూ, చంపుత మని     బెదిరిస్తూ, చివరకు ఇంట్లోంచి గెంటి వేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ( 80)    అనే వృద్దురాలిని ఆమె నడిపి  కొడుకు, కోడలు తన స్వంత ఇంటి లోనుంచి...
Read More...
National  Sports  State News 

డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు జపాన్ డెఫ్లింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం, ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్‌కు ప్రభుత్వ అండ.
Read More...

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం

సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన యాత్రికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సానుభూతి ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల...
Read More...

డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

డిసెంబర్ మొదటివారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు వేగం పెరిగింది. ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా రిజర్వేషన్లపై హైకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, 50 శాతం మించకుండా రిజర్వేషన్లు అమలు...
Read More...