ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక స్టూడెంట్ * స్నాప్ చాట్ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్ * ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక స్టూడెంట్
* స్నాప్ చాట్ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్
* ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి
సికింద్రాబాద్, ఏప్రిల్ 16 ( ప్రజామంటలు ):
చదువుకోవడానికి చెల్లెలు కూతురుకు తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన పెద్దమ్మ ఇంటికే ఓ విద్యార్థిని కన్నం వేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్. గిరిధర్ మంగళవారం చిలకలగూడ పీఎస్ ఆవరణలో మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...చిలకలగూడ లోని ప్రభుత్వ ఉద్యోగి పెద్దమ్మ ఇంట్లో ఉండి ఓ బాలిక (13) 2020 సంవత్సరం నుంచి (8 వ తరగతి) చదువుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో బాలిక పెద్దనాన్న శ్రీనివాసరావు ( ప్రభుత్వ ఎంప్లాయి ) షర్ట్ లోని రూ 3వేలు నగదు మాయమైంది. అనుమానం వచ్చి ఇంట్లో సదరు బాలికను ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో లాకర్లు తెరచి చూడగా, విలువైన బంగారు ఆర్నమెంట్స్, నగదు కనబడకుండా పోవడంతో ఆందోళన చెందిన ఫ్యామిలీ మెంబర్స్ బాలికను ప్రశ్నించారు. బాలిక మొబైల్ చూడగా, అందులో స్నాప్చాట్, వాట్సాప్ లో విజయ్ కుమార్ అబ్బాయితో చనువుగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన తతంగాన్ని పూర్తిగా వివరించింది. ఇన్స్టాగ్రామ్ లో కడప నివాసి, ప్రస్తుతం బెంగళూర్ లో డిగ్రీ చదువుతున్న చెప్పలి విజయ్ కుమార్ (19) తో పరిచయం ఉందని పేర్కొంది. తన పేరేంట్స్ ఆరోగ్యం బాగాలేదని చెబితే బాధితుల ఇంట్లో నుంచి 16 తులాల బంగారం నగలను, ఒక లక్షా 50 వేల నగదును దొంగలించి, విజయ్ కి ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. బంగారం నగలను పలు చోట్ల తాకట్టు పెట్టగా, నగదును లిక్కర్, సిగరేట్స్ తాగడానికి, ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు వాడుకున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బాధితులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని, హైదరాబాద్ లోనే ఉంటున్న విజయ్ కుమార్ సినిమాలు, షికార్లకు తీసుకెళ్ళి, లైంగికంగా కూడ దాడిచేసినట్లు గుర్తించారు. ఈనెల 15న నిందితుడు విజయ్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. విజయ్ కుమార్ పై ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్, తదితర నేరాలకు సంబందించిన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. సకాలంలో నిందితుడిని గుర్తించి, 16 తులాల బంగారం ఆర్నమెంట్స్ ను రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించి, సీపీ ప్రకటించిన రివార్డులను చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్హెచ్వో అనుదీప్, లాలాగూడ ఎస్హెచ్వో రమేశ్ గౌడ్, ఆంజనేయులు, కరుణాకర్ రెడ్డి, జగదీశ్, నవీన్, గణేశ్, విజయ్ , కానిస్టేబుళ్ళకు అందచేశారు. ఈరోజుల్లో అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయని, మొబైల్ సాయంతో కూడ నిందితులను గుర్తించడం సులభంగా మారిందని, నేరస్థులు తప్పించుకోవడం జరగదని డీసీపీ గిరిధర్ పేర్కొన్నారు. ఎవరూ కూడ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
––––––––––––
–ఫొటోలు:
More News...
<%- node_title %>
<%- node_title %>
మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా... జ్ఞాన స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
.జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరి చరణ్ రావు మాట్లాడుతూ... సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ
""
జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని సామాజిక సమరసతా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో గల మోచి సంఘంలో సంఘ నాయకుల సమక్షంలో సంతు రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరించి క్యాలెండర్ తో పాటు అతని బోధనలతో కూడిన పుస్తకాన్ని కూడా సభ్యులందరికీ పంచటం... సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా... జగిత్యాలలో నిజామాబాద్ రోడ్ పై వంతెన పనులు – ట్రాఫిక్ మళ్లింపు అమలు
జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేలో హ్యాంగౌట్ హోటల్ సమీపంలో వంతెన నిర్మాణ పనులు ఏప్రిల్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు పోలీసులు మార్గ మళ్లింపులు అమలు చేస్తున్నారు.ముఖ్య మార్పులు ఇలా ఉన్నాయి:జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్లే RTC బస్సులు,... గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు
గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
బుగ్గారం మండలానికి చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్ ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ... ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఒంటరితనం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జంబుక ఆశన్న (78), తండ్రి గంగారం, ఎస్సీ మాల వర్గానికి చెందినవాడు.ఆశన్న గతంలో గ్రామ సుంకరి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2025... బాబు జగ్జీవన్ సేవలు చిరస్మరనీయం -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెటుపల్లి ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
బాబు జాగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరనీయం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. బార్ అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి
కార్మికుల... ప్రజా ప్రతినిధుల శిక్షణ బుగ్గారంలోనే పెట్టాలి - చుక్క శ్రీలత
బుగ్గారం, ఏప్రిల్ 05(ప్రజా మంటలు):బుగ్గారం మండల కేంద్రాన్ని పక్కనబెట్టి శేఖల్లలో వార్డ్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల వార్డ్ సభ్యులు హాజరు కావాల్సిన ఈ శిక్షణను దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.“ఇది... సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం - తెలంగాణ జాగృతి హెచ్చరిక
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
హైదరాబాద్లో తెలంగాణ జాగృతి, hms కార్మిక సంఘం ఇతర స.మతాలతో కలిసి, నిర్వహించిన “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి సంస్థపై ప్రభుత్వ వైఖరిని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల నియామకాలపై విచారణ పేరుతో ఒత్తిడి చేయడం కంటే, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్... మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా? డిసిసి అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా అని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య జీవన్ రెడ్డిని ఉద్దేశించి
జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై విమర్శల అస్త్రాలు ఎక్కు పెట్టారు.కాంగ్రెస్... 2047 నాటికి తెలంగాణ టెక్స్టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
(సిరిసిల్ల .రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 03 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.
టెక్స్టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో... 