తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ" మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా

On
తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ

"తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ"
మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా 

 రామ కిష్టయ్య సంగనభట్ల...9440595494

 తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో పలు పౌరాణిక సాంఘిక చారిత్రక నాటకాలు - నాటికలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రజాభిమానాన్ని చూర గొన్నది. గోదావరి తీరస్థ ప్రాచీన తీర్థము, పుణ్య క్షేత్రము అయిన ధర్మపురి పట్టణం, వేల సంవత్సరాల నుండి ఉజ్వల సాంస్కృతిక, వైదిక, నాగరికత, కలిగివున్న క్షేత్రంగా... ఆర్ష విద్యతో పాటు, సంగీతాది లలిత కళలకు నిలయంగా వాసికెక్కింది. తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం అంతగా లేక, స్తబ్దంగా ఉన్న రోజుల్లో, స్థానికుల సహకారంతో స్థాపించబడిన నాటక సంస్థ, తెలంగాణ లోనే మొదటిదిగా నిలువ కలిగింది. ఇది ప్రారంభం అయ్యే నాటికి తెలుగు భాషకు విలువ లేని "ఉర్దూ రాజభాష"గా గల నిజాం రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు... భారతీయ సంస్కృతికి వైద్యులకు కళలకు విలువ ఇవ్వని కేంద్ర  ఆంగ్ల ప్రభుత్వం మరోవైపు, అననుకూల వాతావరణం ఉండేది. అయినా స్థానికుల అభిమానం, ధనం, సేవాభావం, ఈ సంస్థకు ఊపిరి పోసాయి. కీర్తిశేషులు కాసర్ల వెంకట రాజయ్య శిక్షణలో, దర్శకత్వంలో, తొలి తరం నటులు "సతీ సావిత్రి" నాటక ప్రదర్శనతో ప్రారంభించి, అనంతర కాలంలో వెను తిరిగి చూడకుండా, సుమారు పాతిక పౌరాణిక నాటకాలు... ద్రౌపతి వస్త్రాపహరణం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, శ్రీకృష్ణ రాయబారం, పాండవోద్యోగం వంటి అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ఈ నటులు ప్రదర్శించని పౌరాణిక నాటకమే లేదంటే అతిశయోక్తి లేదేమో. కాకెరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి, సంగనభట్ల మాణిక్య శాస్త్రి, తెలంగాణ త్యాగయ్య చాచం కృష్ణయ్య, జగన్నగారి విశ్వనాథశాస్త్రి లాంటి ఉద్దండులు, వారి సరసన దెమ్మ బాలకృష్ణయ్య స్త్రీ పాత్ర ధారిగా తొలి తరం నటులు బహు ప్రశంసా పాత్రులు అయినారు. నాటక సంస్థ రథసారథులలో  ఒకరైన కే. వీ. కేశవులు ( రాష్ట్ర మాజీ మంత్రి), 1946 లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా సభలలో, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్షింప చేయగా, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నాటకాన్ని కాంచి, బహుథా ప్రశంసించారు. తర్వాత కాలంలో దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, స్థానం నరసింహారావు లాంటి మేధావుల ప్రశంసా పాత్రమైంది. స్థానిక దైవం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో, ప్రత్యేక ఓపెన్ థియేటర్ లో  ప్రదర్శిత నాటకాలకు జనం టిక్కెట్టు కొని మరీ చూసేవారు. ఆ రోజుల్లోనే సొంత నాటక ప్రదర్శన శాల ఉండేది. రకరకాల సీనరీ పరదాలు,  మేకప్ సామగ్రి, గదలు, కిరీటాలు, ఉయ్యాలలు, నిచ్చెనలు, ఫైర్ వర్క్స్, వగయిరా సకల హంగులతో అట్టహాసంగా ఉండేది. మొదటి తెరపై భారతమాత చిత్రపటం కలిగి ఉన్న ఈ సంస్థ ఆ రోజుల్లో పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే ఇది రాజ ద్రోహం కిందకు వచ్చేది. ఫైర్ వర్క్స్ లో యముని రాక, నారదుని మబ్బుల్లో ప్రయాణం, శిశుపాలుని శిరచ్ఛేదం, ప్రహ్లాదుని అగ్నిగుండంలో వేయడం, ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించడం, వంటి ఎన్నో అద్భుతాలను కశో జ్జల శివరామయ్య పర్యవేక్షణలో చూపారు. రెండవ తరం నటులు దశాబ్దకాలం ప్రదర్శన ఇవ్వగా, నాటి సీనియర్ నాయకులు దాద గారి కిషన్ రావు నిర్వహణలో, సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలకు ప్రారంభ నిధుల సేకరణ గావించారు. గయోపాఖ్యానం నాటకం తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి, గుండయ్య శాస్త్రి, పెండ్యాల శంకర్, ఓజ్జల రామచంద్రం, నరసింహా చారి, గుండి హనుమాన్లు, భోగం పురుషోత్తం వంటి మేటి నటులతో ప్రదర్శించారు. మూడవ తరంలో పౌరాణిక నాటకాలతో పాటు వీరపాండ్య కట్ట బొమ్మన, వీర కాపయ, నాగమ నాయకుడు లాంటి చారిత్రక నాటకాలు పెక్కు సాంఘిక నాటకాలు ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. 1984 లో జిల్లా కలెక్టర్ కె ఎస్ శర్మ, 1991 లో కలెక్టర్ బన్వర్ లాల్ ఆహ్వానం మేరకు, వారి సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నారు. 1989 లో తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన, సాంప్రదాయ పద్య నాటక పోటీలలో సూర్యాపేటలో "కట్టబొమ్మన" ప్రదర్శించారు. 2016లో వరంగల్ లో, వేణుమాధవ్ ఆడిటోరియంలో... అనంతరం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో.. ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నిధులు ప్రోగు చేసి సొంత సామగ్రిని సమకూర్చు కున్నారు. ప్రస్తుత నటులలో కొందరు వీడియో, చలన చిత్రాలలో అవకాశాలు పొందారు. విద్యావేత్త విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య, బహుముఖ ప్రజ్ఞాశాలి,  నటులు కొరిడె నరహరిశర్మ, కాకెర్ల దత్తాత్రేయ, ఎస్ రామకృష్ణయ్య, మునిగాల కిషన్ తదితరులు చారిత్రక నటులుగా మిగుల గుర్తింపు పొందారు 1993 లో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పేర్వారం జగన్నాథం ద్వారా నిధులు పొంది, స్వర్ణోత్సవాలు జరిపి, గయోపాఖ్యానం నాటకం ప్రదర్శించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు దివంగత బి. ఎస్. నారాయణ చేత కళాకారులకు సన్మానాలు చేయించారు. సావనీర్ విడుదల చేశారు. 1955 లో ఈ సంస్థ కళాకారులకు ఆంధ్ర నాటక పరిషత్తు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ కాకర లక్ష్మీకాంత శాస్త్రికి, పెండ్యాల సీతారాములకు ఘనంగా సత్కారం చేశాయి. స్థానిక డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య నాటక రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామీణ కళా జ్యోతి అవార్డు లభించింది. నలుగురు వృద్ధ కళాకారులకు గత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పథకాలను మంజూరు చేసింది. ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా కళామతల్లికి సేవ చేస్తూ సాంప్రదాయక పద్య నాటకాలను బ్రతికిస్తున్న అపురూప అరుదైన నాట్యమండలి 2017 ఏప్రిల్ 2,3 తేదీలలో నాటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ. రమణాచారి, నాటి ప్రభుత్వ చీఫ్ విప్, గత రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బీ. ఎస్.రాములు తదితర ప్రముఖులు హాజరు కాగా, 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు. ప్రస్తుతం నరహరి శర్మ ఆధ్వర్యంలో, నర్సయ్య పర్యవేక్షణలో, దత్తాత్రి నిర్వహణలో, రామకిష్టయ్య, చంద్రమౌళి, వెంకట రమణ, కిశోర్, మహేందర్, సురేశ్, బాలకృష్ణ, శేఖర్, నర్సింహమూర్తి, జన్మంచి నరసయ్య, వంశీ కృష్ణ, నరహరి, అమర్, అనిల్, శ్రీనివాస్, రాంకిషన్ లకు తోడు కాకెరి అరుణ, సంగనభట్ల ప్రతిభ తదితరులు స్త్రీ పాత్రలను పోషిస్తూ, పౌరాణిక చారిత్రక నాటకాల ప్రదర్శనలను కొన సాగిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం 

బతికుండగానే సమాధి నిర్మించుకున్న నక్క ఇంద్రయ్య మృతి – సంతాపం  జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్, జగిత్యాల రూరల్ మండల సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షుడు నక్క ఇంద్రయ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన బతికుండగానే స్వయంగా నిర్మించుకున్న సమాధిలోనే ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని భూస్థాపితం చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని...
Read More...
National  Crime 

తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం

తొలగించిన IAS పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా ఐదుగురు అచేతనం పుణే, జనవరి 11:పదవి నుంచి తొలగించబడిన IAS ట్రైనీ అధికారి పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు సహా మరో ముగ్గురు పుణేలోని వారి బంగ్లాలో అచేతన స్థితిలో కనిపించడం కలకలం రేపింది. బానెర్–ఆంధ్ ప్రాంతంలోని నివాసంలో జరిగిన ఈ ఘటనలో నిద్ర మందులు కలిపి వారిని అచేతనం చేసి దొంగతనం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం...
Read More...
National  International  

ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు

ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు బంద్: ప్రపంచంతో తెగిన సంబంధాలు టెహ్రాన్ జనవరి 11: నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో, ఇరాన్ ప్రపంచంతో సంబంధాలను తెంచుకుంది.ఆర్థిక వ్యవస్థపై నిరసనలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు నేషన్లవైడ్ స్థాయిలో విస్తరుతూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ నెట్వర్క్‌లను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు...
Read More...
Local News 

వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల, జనవరి 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. గోవింద్‌పల్లె సమీపంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, వడ్డే...
Read More...

మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి 

మంత్రి వాకిటి శ్రీహరి తో ముదిరాజ్ నేత భేటి  సికింద్రాబాద్,  జనవరి 11 (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్  ను ఆదివారం  జాతీయ ముదిరాజ్ సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.  దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. అలాగే మంత్రి...
Read More...
Local News 

జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ వేములవాడ, జనవరి 11 (ప్రజా మంటలు): జగిత్యాల మున్నూరు కాపు వర్తక–వ్యాపార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్‌ను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులబాంధవులందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి...
Read More...
Local News 

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి –కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ పిలుపు

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి –కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ పిలుపు రాయికల్, జనవరి 12 (ప్రజా మంటలు): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాయికల్ పట్టణంలోని ప్రగతి స్కూల్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...

ఓసి జేఏసీ సింహ గర్జనకు తరలి వెళ్లిన జగిత్యాల ఓసి జేఏసీ నాయకులు

ఓసి జేఏసీ సింహ గర్జనకు తరలి వెళ్లిన జగిత్యాల ఓసి జేఏసీ నాయకులు జగిత్యాల జనవరి 11 (ప్రజా మంటలు) ఓసి ల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాల నుండి ఓసి జెఏసి సభ్యులు ప్రత్యేక వాహనంలపై తరలి వెళ్లారు   ఓసి ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మహంకాళి రాజన్న కో కన్వీనర్...
Read More...

ఒకినోవా స్కూల్లో కరాటే  బెల్టుల ప్రధానం 

ఒకినోవా స్కూల్లో కరాటే  బెల్టుల ప్రధానం  జగిత్యాల జనవరి 11 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ఒకేనోవా స్కూల్ ఆఫ్ కరాటే స్కూల్లో బెల్టుల ప్రధానం జరిగింది. అంతకుముందు కరాటే శిక్షణార్థులు తమ పర్ఫార్మెన్స్ చూపించారు. అనంతరం బెల్టుల ప్రధానం చేశారు. మాస్టర్ మర్రిపల్లి లింగయ్య, ఇన్స్ట్రక్టర్ తిరుమల నరేష్ కరాటే శిక్షణార్థులు పాల్గొన్నారు.
Read More...

గుండె జబ్బుల నివారణను మిషన్‌గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి

గుండె జబ్బుల నివారణను మిషన్‌గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు): గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణను ఒక మిషన్‌గా తీసుకొని ప్రభుత్వం, వైద్యులు, సమాజం అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) శిక్షణ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దేశవ్యాప్తంగా...
Read More...

అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘ నూతన సంవత్సర కాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జగిత్యాల జనవరి 10 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు దా సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు   ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్...
Read More...
National  State News 

AIADMK–BJP కూటమిలో AMMK చేరికపై ఊహాగానాలు.

AIADMK–BJP కూటమిలో AMMK చేరికపై ఊహాగానాలు. అమిత్ షా ఫోన్ కాల్ తర్వాత మారిన దినకరన్ వ్యూహం! చెన్నై, జనవరి 11 (ప్రజా మంటలు): తంజావూరులో జనవరి 5న జరిగిన AMMK జనరల్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. AMMK ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రసంగం మధ్యలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
Read More...