తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ" మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా

On
తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ

"తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ"
మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా 

 రామ కిష్టయ్య సంగనభట్ల...9440595494

 తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో పలు పౌరాణిక సాంఘిక చారిత్రక నాటకాలు - నాటికలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రజాభిమానాన్ని చూర గొన్నది. గోదావరి తీరస్థ ప్రాచీన తీర్థము, పుణ్య క్షేత్రము అయిన ధర్మపురి పట్టణం, వేల సంవత్సరాల నుండి ఉజ్వల సాంస్కృతిక, వైదిక, నాగరికత, కలిగివున్న క్షేత్రంగా... ఆర్ష విద్యతో పాటు, సంగీతాది లలిత కళలకు నిలయంగా వాసికెక్కింది. తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం అంతగా లేక, స్తబ్దంగా ఉన్న రోజుల్లో, స్థానికుల సహకారంతో స్థాపించబడిన నాటక సంస్థ, తెలంగాణ లోనే మొదటిదిగా నిలువ కలిగింది. ఇది ప్రారంభం అయ్యే నాటికి తెలుగు భాషకు విలువ లేని "ఉర్దూ రాజభాష"గా గల నిజాం రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు... భారతీయ సంస్కృతికి వైద్యులకు కళలకు విలువ ఇవ్వని కేంద్ర  ఆంగ్ల ప్రభుత్వం మరోవైపు, అననుకూల వాతావరణం ఉండేది. అయినా స్థానికుల అభిమానం, ధనం, సేవాభావం, ఈ సంస్థకు ఊపిరి పోసాయి. కీర్తిశేషులు కాసర్ల వెంకట రాజయ్య శిక్షణలో, దర్శకత్వంలో, తొలి తరం నటులు "సతీ సావిత్రి" నాటక ప్రదర్శనతో ప్రారంభించి, అనంతర కాలంలో వెను తిరిగి చూడకుండా, సుమారు పాతిక పౌరాణిక నాటకాలు... ద్రౌపతి వస్త్రాపహరణం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, శ్రీకృష్ణ రాయబారం, పాండవోద్యోగం వంటి అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ఈ నటులు ప్రదర్శించని పౌరాణిక నాటకమే లేదంటే అతిశయోక్తి లేదేమో. కాకెరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి, సంగనభట్ల మాణిక్య శాస్త్రి, తెలంగాణ త్యాగయ్య చాచం కృష్ణయ్య, జగన్నగారి విశ్వనాథశాస్త్రి లాంటి ఉద్దండులు, వారి సరసన దెమ్మ బాలకృష్ణయ్య స్త్రీ పాత్ర ధారిగా తొలి తరం నటులు బహు ప్రశంసా పాత్రులు అయినారు. నాటక సంస్థ రథసారథులలో  ఒకరైన కే. వీ. కేశవులు ( రాష్ట్ర మాజీ మంత్రి), 1946 లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా సభలలో, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్షింప చేయగా, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నాటకాన్ని కాంచి, బహుథా ప్రశంసించారు. తర్వాత కాలంలో దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, స్థానం నరసింహారావు లాంటి మేధావుల ప్రశంసా పాత్రమైంది. స్థానిక దైవం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో, ప్రత్యేక ఓపెన్ థియేటర్ లో  ప్రదర్శిత నాటకాలకు జనం టిక్కెట్టు కొని మరీ చూసేవారు. ఆ రోజుల్లోనే సొంత నాటక ప్రదర్శన శాల ఉండేది. రకరకాల సీనరీ పరదాలు,  మేకప్ సామగ్రి, గదలు, కిరీటాలు, ఉయ్యాలలు, నిచ్చెనలు, ఫైర్ వర్క్స్, వగయిరా సకల హంగులతో అట్టహాసంగా ఉండేది. మొదటి తెరపై భారతమాత చిత్రపటం కలిగి ఉన్న ఈ సంస్థ ఆ రోజుల్లో పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే ఇది రాజ ద్రోహం కిందకు వచ్చేది. ఫైర్ వర్క్స్ లో యముని రాక, నారదుని మబ్బుల్లో ప్రయాణం, శిశుపాలుని శిరచ్ఛేదం, ప్రహ్లాదుని అగ్నిగుండంలో వేయడం, ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించడం, వంటి ఎన్నో అద్భుతాలను కశో జ్జల శివరామయ్య పర్యవేక్షణలో చూపారు. రెండవ తరం నటులు దశాబ్దకాలం ప్రదర్శన ఇవ్వగా, నాటి సీనియర్ నాయకులు దాద గారి కిషన్ రావు నిర్వహణలో, సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలకు ప్రారంభ నిధుల సేకరణ గావించారు. గయోపాఖ్యానం నాటకం తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి, గుండయ్య శాస్త్రి, పెండ్యాల శంకర్, ఓజ్జల రామచంద్రం, నరసింహా చారి, గుండి హనుమాన్లు, భోగం పురుషోత్తం వంటి మేటి నటులతో ప్రదర్శించారు. మూడవ తరంలో పౌరాణిక నాటకాలతో పాటు వీరపాండ్య కట్ట బొమ్మన, వీర కాపయ, నాగమ నాయకుడు లాంటి చారిత్రక నాటకాలు పెక్కు సాంఘిక నాటకాలు ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. 1984 లో జిల్లా కలెక్టర్ కె ఎస్ శర్మ, 1991 లో కలెక్టర్ బన్వర్ లాల్ ఆహ్వానం మేరకు, వారి సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నారు. 1989 లో తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన, సాంప్రదాయ పద్య నాటక పోటీలలో సూర్యాపేటలో "కట్టబొమ్మన" ప్రదర్శించారు. 2016లో వరంగల్ లో, వేణుమాధవ్ ఆడిటోరియంలో... అనంతరం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో.. ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నిధులు ప్రోగు చేసి సొంత సామగ్రిని సమకూర్చు కున్నారు. ప్రస్తుత నటులలో కొందరు వీడియో, చలన చిత్రాలలో అవకాశాలు పొందారు. విద్యావేత్త విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య, బహుముఖ ప్రజ్ఞాశాలి,  నటులు కొరిడె నరహరిశర్మ, కాకెర్ల దత్తాత్రేయ, ఎస్ రామకృష్ణయ్య, మునిగాల కిషన్ తదితరులు చారిత్రక నటులుగా మిగుల గుర్తింపు పొందారు 1993 లో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పేర్వారం జగన్నాథం ద్వారా నిధులు పొంది, స్వర్ణోత్సవాలు జరిపి, గయోపాఖ్యానం నాటకం ప్రదర్శించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు దివంగత బి. ఎస్. నారాయణ చేత కళాకారులకు సన్మానాలు చేయించారు. సావనీర్ విడుదల చేశారు. 1955 లో ఈ సంస్థ కళాకారులకు ఆంధ్ర నాటక పరిషత్తు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ కాకర లక్ష్మీకాంత శాస్త్రికి, పెండ్యాల సీతారాములకు ఘనంగా సత్కారం చేశాయి. స్థానిక డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య నాటక రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామీణ కళా జ్యోతి అవార్డు లభించింది. నలుగురు వృద్ధ కళాకారులకు గత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పథకాలను మంజూరు చేసింది. ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా కళామతల్లికి సేవ చేస్తూ సాంప్రదాయక పద్య నాటకాలను బ్రతికిస్తున్న అపురూప అరుదైన నాట్యమండలి 2017 ఏప్రిల్ 2,3 తేదీలలో నాటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ. రమణాచారి, నాటి ప్రభుత్వ చీఫ్ విప్, గత రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బీ. ఎస్.రాములు తదితర ప్రముఖులు హాజరు కాగా, 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు. ప్రస్తుతం నరహరి శర్మ ఆధ్వర్యంలో, నర్సయ్య పర్యవేక్షణలో, దత్తాత్రి నిర్వహణలో, రామకిష్టయ్య, చంద్రమౌళి, వెంకట రమణ, కిశోర్, మహేందర్, సురేశ్, బాలకృష్ణ, శేఖర్, నర్సింహమూర్తి, జన్మంచి నరసయ్య, వంశీ కృష్ణ, నరహరి, అమర్, అనిల్, శ్రీనివాస్, రాంకిషన్ లకు తోడు కాకెరి అరుణ, సంగనభట్ల ప్రతిభ తదితరులు స్త్రీ పాత్రలను పోషిస్తూ, పౌరాణిక చారిత్రక నాటకాల ప్రదర్శనలను కొన సాగిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తు రాలేదా.. 

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తు రాలేదా..  తలసానిని ప్రశ్నించిన బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ నాయకులు సికింద్రాబాద్,నవంబర్ 28 (ప్రజా మంటలు):  స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ది ఉందని, తమ ప్రయత్నాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకించాల్సిన అవసరం లేదని బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.  శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు బీసీల...
Read More...
Local News  Crime  State News 

రాజన్న సిరిసిల్లలో తల్లి–కొడుకు ఆత్మహత్య : కానిస్టేబుల్ అభిలాష్ విషాద మరణం

రాజన్న సిరిసిల్లలో తల్లి–కొడుకు ఆత్మహత్య : కానిస్టేబుల్ అభిలాష్ విషాద మరణం సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు): సిరిసిల్ల పట్టణంలోని మానేరు వాగులో తల్లి–కొడుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మహిళ ఆత్మహత్యను తట్టుకోలేక ఆమె కుమారుడు కూడా ప్రాణాలు తీసుకున్న ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. తల్లి లలిత మానేరు వాగులో దూకి ఆత్మహత్య సిరిసిల్లలోని మానేరు వాగులో లలిత...
Read More...
State News 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు): తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి, రిజర్వేషన్లను సరిచేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తీవ్రంగా డిమాండ్ చేశారు. “2019లో 22.78% ఇచ్చి… ఇప్పుడు అదికూడా తగ్గించడం ఏ న్యాయం?” – నిరంజన్ ప్రశ్న 2019...
Read More...

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు): మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్...
Read More...
Local News  Crime  State News 

తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్‌ నర్సయ్యను హతమార్చిన కొడుకు

తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్‌ నర్సయ్యను హతమార్చిన కొడుకు సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య (46) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట వద్ద జరిగింది. జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నర్సయ్యను హతమార్చి,...
Read More...
Local News 

వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్.

వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్. జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు): వయో వృద్ధులు (సీనియర్ సిటిజెన్లు ) ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్ కోరారు.  శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్  ఉచిత వైద్య సేవల విభాగాన్ని  జిల్లా...
Read More...
State News 

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు): కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.   బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక “రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.” “కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు...
Read More...
Local News 

స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష

స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్, నవంబర్28 (ప్రజామంటలు):  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి  29వ వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై బేగంపేట్‌లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వం వహించారు. డిసెంబర్...
Read More...
Local News 

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు...
Read More...
Local News 

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..     సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) : పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి...
Read More...
Local News 

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్  మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్...
Read More...

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు .   జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)  పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో  శ్రీ ధనలక్ష్మి సేవా సమితి  అధ్వర్యంలో    శుక్రవారం కాలభైరవాష్టమి  పర్వదినం  పురస్కరించుకొని, మాతలు పాల్గొని  అమ్మవారికి ప్రత్యేక  కుంకుమార్చన,  లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. పారాయణం అనంతరం మాతలు  అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ...
Read More...