తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ" మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా
"తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ"
మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా
రామ కిష్టయ్య సంగనభట్ల...9440595494
తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో పలు పౌరాణిక సాంఘిక చారిత్రక నాటకాలు - నాటికలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రజాభిమానాన్ని చూర గొన్నది. గోదావరి తీరస్థ ప్రాచీన తీర్థము, పుణ్య క్షేత్రము అయిన ధర్మపురి పట్టణం, వేల సంవత్సరాల నుండి ఉజ్వల సాంస్కృతిక, వైదిక, నాగరికత, కలిగివున్న క్షేత్రంగా... ఆర్ష విద్యతో పాటు, సంగీతాది లలిత కళలకు నిలయంగా వాసికెక్కింది. తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం అంతగా లేక, స్తబ్దంగా ఉన్న రోజుల్లో, స్థానికుల సహకారంతో స్థాపించబడిన నాటక సంస్థ, తెలంగాణ లోనే మొదటిదిగా నిలువ కలిగింది. ఇది ప్రారంభం అయ్యే నాటికి తెలుగు భాషకు విలువ లేని "ఉర్దూ రాజభాష"గా గల నిజాం రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు... భారతీయ సంస్కృతికి వైద్యులకు కళలకు విలువ ఇవ్వని కేంద్ర ఆంగ్ల ప్రభుత్వం మరోవైపు, అననుకూల వాతావరణం ఉండేది. అయినా స్థానికుల అభిమానం, ధనం, సేవాభావం, ఈ సంస్థకు ఊపిరి పోసాయి. కీర్తిశేషులు కాసర్ల వెంకట రాజయ్య శిక్షణలో, దర్శకత్వంలో, తొలి తరం నటులు "సతీ సావిత్రి" నాటక ప్రదర్శనతో ప్రారంభించి, అనంతర కాలంలో వెను తిరిగి చూడకుండా, సుమారు పాతిక పౌరాణిక నాటకాలు... ద్రౌపతి వస్త్రాపహరణం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, శ్రీకృష్ణ రాయబారం, పాండవోద్యోగం వంటి అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ఈ నటులు ప్రదర్శించని పౌరాణిక నాటకమే లేదంటే అతిశయోక్తి లేదేమో. కాకెరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి, సంగనభట్ల మాణిక్య శాస్త్రి, తెలంగాణ త్యాగయ్య చాచం కృష్ణయ్య, జగన్నగారి విశ్వనాథశాస్త్రి లాంటి ఉద్దండులు, వారి సరసన దెమ్మ బాలకృష్ణయ్య స్త్రీ పాత్ర ధారిగా తొలి తరం నటులు బహు ప్రశంసా పాత్రులు అయినారు. నాటక సంస్థ రథసారథులలో ఒకరైన కే. వీ. కేశవులు ( రాష్ట్ర మాజీ మంత్రి), 1946 లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా సభలలో, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్షింప చేయగా, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నాటకాన్ని కాంచి, బహుథా ప్రశంసించారు. తర్వాత కాలంలో దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, స్థానం నరసింహారావు లాంటి మేధావుల ప్రశంసా పాత్రమైంది. స్థానిక దైవం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో, ప్రత్యేక ఓపెన్ థియేటర్ లో ప్రదర్శిత నాటకాలకు జనం టిక్కెట్టు కొని మరీ చూసేవారు. ఆ రోజుల్లోనే సొంత నాటక ప్రదర్శన శాల ఉండేది. రకరకాల సీనరీ పరదాలు, మేకప్ సామగ్రి, గదలు, కిరీటాలు, ఉయ్యాలలు, నిచ్చెనలు, ఫైర్ వర్క్స్, వగయిరా సకల హంగులతో అట్టహాసంగా ఉండేది. మొదటి తెరపై భారతమాత చిత్రపటం కలిగి ఉన్న ఈ సంస్థ ఆ రోజుల్లో పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే ఇది రాజ ద్రోహం కిందకు వచ్చేది. ఫైర్ వర్క్స్ లో యముని రాక, నారదుని మబ్బుల్లో ప్రయాణం, శిశుపాలుని శిరచ్ఛేదం, ప్రహ్లాదుని అగ్నిగుండంలో వేయడం, ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించడం, వంటి ఎన్నో అద్భుతాలను కశో జ్జల శివరామయ్య పర్యవేక్షణలో చూపారు. రెండవ తరం నటులు దశాబ్దకాలం ప్రదర్శన ఇవ్వగా, నాటి సీనియర్ నాయకులు దాద గారి కిషన్ రావు నిర్వహణలో, సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలకు ప్రారంభ నిధుల సేకరణ గావించారు. గయోపాఖ్యానం నాటకం తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి, గుండయ్య శాస్త్రి, పెండ్యాల శంకర్, ఓజ్జల రామచంద్రం, నరసింహా చారి, గుండి హనుమాన్లు, భోగం పురుషోత్తం వంటి మేటి నటులతో ప్రదర్శించారు. మూడవ తరంలో పౌరాణిక నాటకాలతో పాటు వీరపాండ్య కట్ట బొమ్మన, వీర కాపయ, నాగమ నాయకుడు లాంటి చారిత్రక నాటకాలు పెక్కు సాంఘిక నాటకాలు ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. 1984 లో జిల్లా కలెక్టర్ కె ఎస్ శర్మ, 1991 లో కలెక్టర్ బన్వర్ లాల్ ఆహ్వానం మేరకు, వారి సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నారు. 1989 లో తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన, సాంప్రదాయ పద్య నాటక పోటీలలో సూర్యాపేటలో "కట్టబొమ్మన" ప్రదర్శించారు. 2016లో వరంగల్ లో, వేణుమాధవ్ ఆడిటోరియంలో... అనంతరం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో.. ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నిధులు ప్రోగు చేసి సొంత సామగ్రిని సమకూర్చు కున్నారు. ప్రస్తుత నటులలో కొందరు వీడియో, చలన చిత్రాలలో అవకాశాలు పొందారు. విద్యావేత్త విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య, బహుముఖ ప్రజ్ఞాశాలి, నటులు కొరిడె నరహరిశర్మ, కాకెర్ల దత్తాత్రేయ, ఎస్ రామకృష్ణయ్య, మునిగాల కిషన్ తదితరులు చారిత్రక నటులుగా మిగుల గుర్తింపు పొందారు 1993 లో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పేర్వారం జగన్నాథం ద్వారా నిధులు పొంది, స్వర్ణోత్సవాలు జరిపి, గయోపాఖ్యానం నాటకం ప్రదర్శించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు దివంగత బి. ఎస్. నారాయణ చేత కళాకారులకు సన్మానాలు చేయించారు. సావనీర్ విడుదల చేశారు. 1955 లో ఈ సంస్థ కళాకారులకు ఆంధ్ర నాటక పరిషత్తు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ కాకర లక్ష్మీకాంత శాస్త్రికి, పెండ్యాల సీతారాములకు ఘనంగా సత్కారం చేశాయి. స్థానిక డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య నాటక రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామీణ కళా జ్యోతి అవార్డు లభించింది. నలుగురు వృద్ధ కళాకారులకు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పథకాలను మంజూరు చేసింది. ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా కళామతల్లికి సేవ చేస్తూ సాంప్రదాయక పద్య నాటకాలను బ్రతికిస్తున్న అపురూప అరుదైన నాట్యమండలి 2017 ఏప్రిల్ 2,3 తేదీలలో నాటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ. రమణాచారి, నాటి ప్రభుత్వ చీఫ్ విప్, గత రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బీ. ఎస్.రాములు తదితర ప్రముఖులు హాజరు కాగా, 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు. ప్రస్తుతం నరహరి శర్మ ఆధ్వర్యంలో, నర్సయ్య పర్యవేక్షణలో, దత్తాత్రి నిర్వహణలో, రామకిష్టయ్య, చంద్రమౌళి, వెంకట రమణ, కిశోర్, మహేందర్, సురేశ్, బాలకృష్ణ, శేఖర్, నర్సింహమూర్తి, జన్మంచి నరసయ్య, వంశీ కృష్ణ, నరహరి, అమర్, అనిల్, శ్రీనివాస్, రాంకిషన్ లకు తోడు కాకెరి అరుణ, సంగనభట్ల ప్రతిభ తదితరులు స్త్రీ పాత్రలను పోషిస్తూ, పౌరాణిక చారిత్రక నాటకాల ప్రదర్శనలను కొన సాగిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా?
జగిత్యాల రాజకీయాల్లో సంచలన మార్పు: కొత్త సమీకరణలు ?
(ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం)
జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక కావడం కేవలం స్థానిక పదవి మార్పు కాదు. ఇది కాంగ్రెస్ లోపలి శక్తి సమీకరణాల్లో ఒక కీలక మలుపు.
బయటికి చూస్తే ఇది👉 సంజయ్ కుమార్ వర్గ విజయం... బ్రేకింగ్ న్యూస్: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నికఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం పట్టు సాధించింది
▪️ మాజీ మంత్రి వర్గానికి మొండిచేయి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
▪️ వైస్ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన చాంద్ పాషా ఎంపిక▪️ మాజీ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్కు నిరాశ▪️ గాజుల... కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర
కరీంనగర్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చివరి నిమిషంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 66 డివిజన్లలో
భారతీయ జనతా... రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్కేనా?
రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని వింత, కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి..రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏకంకవలనే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తోంది. అధిక సంఖ్యలో సీట్లు గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి వారు... భారత్ పేరు ప్రస్తావించని తారిక్ రెహ్మాన్ – సమతుల్య విదేశాంగ విధాన సంకేతాలు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 16:
బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత, ప్రధాని-నియమితుడిగా బాధ్యతలు స్వీకరించనున్న Tarique Rahman తన తొలి మీడియా సమావేశంలో దేశ విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తన ప్రభుత్వం ఏ ఒక్క దేశం పక్షాన నిలిచే విధానాన్ని కాకుండా, “బంగ్లాదేశ్ ప్రయోజనాలే కేంద్రంగా... దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రంగుల వివాదం – భక్తుల విశ్వాసాలపై దాడేనా?
భక్తుల విశ్వాసాలపై దాడేనా?
–(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి పొందిన ఈ ఆలయంలో మహాశివరాత్రి జాతర... జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: ఛైర్పర్సన్ పీఠం చుట్టూ శక్తి–సమీకరణల రాజకీయ క్రీడ
మూడు కుర్చీకాటగా పదవి రాజకీయాలు
జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇక స్థానిక పరిమితుల్లో లేవు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో ముడిపడి, ఇవి రాష్ట్ర స్థాయి అధికార కేంద్రాల వరకూ చేరాయి. ముఖ్యంగా మున్సిపల్ ఛైర్పర్సన్ ఎంపిక ఒక్క పదవిగా కాకుండా, ఇద్దరు కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా... పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
కౌన్సిలర్లుగా గెలిచిన సమీండ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లను చైర్పర్సన్ అభ్యర్థులుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. వీరికి కాంగ్రెస్ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 30... జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి
(అంకం భూమయ్య)
జగిత్యాల ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో పట్టపగలు జరిగిన హత్య కలకలం రేపింది. జగిత్యాల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ డైరీ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.
జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా... రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
పాలేరు రిజర్వాయర్లో ఘోర ప్రమాదం: ఖమ్మం, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్లోకి దూసుకువెళ్లడంతో, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు బొగ్గుల శ్రీనివాస్ (49) నీట... తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కవిత... ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు
జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)
ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు
ఈసందర్భంగా... 