తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ" మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా

On
తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ

"తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ"
మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా 

 రామ కిష్టయ్య సంగనభట్ల...9440595494

 తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో పలు పౌరాణిక సాంఘిక చారిత్రక నాటకాలు - నాటికలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రజాభిమానాన్ని చూర గొన్నది. గోదావరి తీరస్థ ప్రాచీన తీర్థము, పుణ్య క్షేత్రము అయిన ధర్మపురి పట్టణం, వేల సంవత్సరాల నుండి ఉజ్వల సాంస్కృతిక, వైదిక, నాగరికత, కలిగివున్న క్షేత్రంగా... ఆర్ష విద్యతో పాటు, సంగీతాది లలిత కళలకు నిలయంగా వాసికెక్కింది. తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం అంతగా లేక, స్తబ్దంగా ఉన్న రోజుల్లో, స్థానికుల సహకారంతో స్థాపించబడిన నాటక సంస్థ, తెలంగాణ లోనే మొదటిదిగా నిలువ కలిగింది. ఇది ప్రారంభం అయ్యే నాటికి తెలుగు భాషకు విలువ లేని "ఉర్దూ రాజభాష"గా గల నిజాం రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు... భారతీయ సంస్కృతికి వైద్యులకు కళలకు విలువ ఇవ్వని కేంద్ర  ఆంగ్ల ప్రభుత్వం మరోవైపు, అననుకూల వాతావరణం ఉండేది. అయినా స్థానికుల అభిమానం, ధనం, సేవాభావం, ఈ సంస్థకు ఊపిరి పోసాయి. కీర్తిశేషులు కాసర్ల వెంకట రాజయ్య శిక్షణలో, దర్శకత్వంలో, తొలి తరం నటులు "సతీ సావిత్రి" నాటక ప్రదర్శనతో ప్రారంభించి, అనంతర కాలంలో వెను తిరిగి చూడకుండా, సుమారు పాతిక పౌరాణిక నాటకాలు... ద్రౌపతి వస్త్రాపహరణం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, శ్రీకృష్ణ రాయబారం, పాండవోద్యోగం వంటి అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ఈ నటులు ప్రదర్శించని పౌరాణిక నాటకమే లేదంటే అతిశయోక్తి లేదేమో. కాకెరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి, సంగనభట్ల మాణిక్య శాస్త్రి, తెలంగాణ త్యాగయ్య చాచం కృష్ణయ్య, జగన్నగారి విశ్వనాథశాస్త్రి లాంటి ఉద్దండులు, వారి సరసన దెమ్మ బాలకృష్ణయ్య స్త్రీ పాత్ర ధారిగా తొలి తరం నటులు బహు ప్రశంసా పాత్రులు అయినారు. నాటక సంస్థ రథసారథులలో  ఒకరైన కే. వీ. కేశవులు ( రాష్ట్ర మాజీ మంత్రి), 1946 లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా సభలలో, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్షింప చేయగా, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నాటకాన్ని కాంచి, బహుథా ప్రశంసించారు. తర్వాత కాలంలో దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, స్థానం నరసింహారావు లాంటి మేధావుల ప్రశంసా పాత్రమైంది. స్థానిక దైవం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో, ప్రత్యేక ఓపెన్ థియేటర్ లో  ప్రదర్శిత నాటకాలకు జనం టిక్కెట్టు కొని మరీ చూసేవారు. ఆ రోజుల్లోనే సొంత నాటక ప్రదర్శన శాల ఉండేది. రకరకాల సీనరీ పరదాలు,  మేకప్ సామగ్రి, గదలు, కిరీటాలు, ఉయ్యాలలు, నిచ్చెనలు, ఫైర్ వర్క్స్, వగయిరా సకల హంగులతో అట్టహాసంగా ఉండేది. మొదటి తెరపై భారతమాత చిత్రపటం కలిగి ఉన్న ఈ సంస్థ ఆ రోజుల్లో పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే ఇది రాజ ద్రోహం కిందకు వచ్చేది. ఫైర్ వర్క్స్ లో యముని రాక, నారదుని మబ్బుల్లో ప్రయాణం, శిశుపాలుని శిరచ్ఛేదం, ప్రహ్లాదుని అగ్నిగుండంలో వేయడం, ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించడం, వంటి ఎన్నో అద్భుతాలను కశో జ్జల శివరామయ్య పర్యవేక్షణలో చూపారు. రెండవ తరం నటులు దశాబ్దకాలం ప్రదర్శన ఇవ్వగా, నాటి సీనియర్ నాయకులు దాద గారి కిషన్ రావు నిర్వహణలో, సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలకు ప్రారంభ నిధుల సేకరణ గావించారు. గయోపాఖ్యానం నాటకం తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి, గుండయ్య శాస్త్రి, పెండ్యాల శంకర్, ఓజ్జల రామచంద్రం, నరసింహా చారి, గుండి హనుమాన్లు, భోగం పురుషోత్తం వంటి మేటి నటులతో ప్రదర్శించారు. మూడవ తరంలో పౌరాణిక నాటకాలతో పాటు వీరపాండ్య కట్ట బొమ్మన, వీర కాపయ, నాగమ నాయకుడు లాంటి చారిత్రక నాటకాలు పెక్కు సాంఘిక నాటకాలు ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. 1984 లో జిల్లా కలెక్టర్ కె ఎస్ శర్మ, 1991 లో కలెక్టర్ బన్వర్ లాల్ ఆహ్వానం మేరకు, వారి సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నారు. 1989 లో తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన, సాంప్రదాయ పద్య నాటక పోటీలలో సూర్యాపేటలో "కట్టబొమ్మన" ప్రదర్శించారు. 2016లో వరంగల్ లో, వేణుమాధవ్ ఆడిటోరియంలో... అనంతరం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో.. ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నిధులు ప్రోగు చేసి సొంత సామగ్రిని సమకూర్చు కున్నారు. ప్రస్తుత నటులలో కొందరు వీడియో, చలన చిత్రాలలో అవకాశాలు పొందారు. విద్యావేత్త విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య, బహుముఖ ప్రజ్ఞాశాలి,  నటులు కొరిడె నరహరిశర్మ, కాకెర్ల దత్తాత్రేయ, ఎస్ రామకృష్ణయ్య, మునిగాల కిషన్ తదితరులు చారిత్రక నటులుగా మిగుల గుర్తింపు పొందారు 1993 లో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పేర్వారం జగన్నాథం ద్వారా నిధులు పొంది, స్వర్ణోత్సవాలు జరిపి, గయోపాఖ్యానం నాటకం ప్రదర్శించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు దివంగత బి. ఎస్. నారాయణ చేత కళాకారులకు సన్మానాలు చేయించారు. సావనీర్ విడుదల చేశారు. 1955 లో ఈ సంస్థ కళాకారులకు ఆంధ్ర నాటక పరిషత్తు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ కాకర లక్ష్మీకాంత శాస్త్రికి, పెండ్యాల సీతారాములకు ఘనంగా సత్కారం చేశాయి. స్థానిక డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య నాటక రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామీణ కళా జ్యోతి అవార్డు లభించింది. నలుగురు వృద్ధ కళాకారులకు గత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పథకాలను మంజూరు చేసింది. ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా కళామతల్లికి సేవ చేస్తూ సాంప్రదాయక పద్య నాటకాలను బ్రతికిస్తున్న అపురూప అరుదైన నాట్యమండలి 2017 ఏప్రిల్ 2,3 తేదీలలో నాటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ. రమణాచారి, నాటి ప్రభుత్వ చీఫ్ విప్, గత రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బీ. ఎస్.రాములు తదితర ప్రముఖులు హాజరు కాగా, 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు. ప్రస్తుతం నరహరి శర్మ ఆధ్వర్యంలో, నర్సయ్య పర్యవేక్షణలో, దత్తాత్రి నిర్వహణలో, రామకిష్టయ్య, చంద్రమౌళి, వెంకట రమణ, కిశోర్, మహేందర్, సురేశ్, బాలకృష్ణ, శేఖర్, నర్సింహమూర్తి, జన్మంచి నరసయ్య, వంశీ కృష్ణ, నరహరి, అమర్, అనిల్, శ్రీనివాస్, రాంకిషన్ లకు తోడు కాకెరి అరుణ, సంగనభట్ల ప్రతిభ తదితరులు స్త్రీ పాత్రలను పోషిస్తూ, పౌరాణిక చారిత్రక నాటకాల ప్రదర్శనలను కొన సాగిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Comment  State News 

అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే

అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే యాది....      *అతనేప్పటికీ చేరగని ,సుదీర్ఘ జ్ఞాపకమే.              - అల్లె రమేష్         *మానేటి  మట్టి పరిమళం సుదీర్ఘ కవి, యేన్నం సత్యం ఇక లేరు             సిరిసిల్ల మనసంతా పరుచుకున్న మానేరు మట్టి పరిమాలాల్లో ఎదిగొచ్చిన సాహిత్య కారులు అనేకమంది ప్రవాహంలా సాహిత్యలో సాగిపోతు తమదైన ప్రత్యేకముద్ర వేశారు. యేన్నం సత్యం బహుశా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన తెలుగు...
Read More...

ప్రముఖ జ్యోతిష్య పండితులు రమణాచారి సూచనతో 22వ తేదీకి గ్రామ సర్పంచ్ బాధ్యతల ప్రమాణ స్వీకారం మార్చిన ప్రభుత్వం

ప్రముఖ జ్యోతిష్య పండితులు రమణాచారి సూచనతో 22వ తేదీకి గ్రామ సర్పంచ్ బాధ్యతల ప్రమాణ స్వీకారం మార్చిన ప్రభుత్వం కరీంనగర్ డిసెంబర్ 18 (ప్రజా మంటలు)ప్రభుత్వం ముందుగా 20వ తేదీన నూతనంగా ఏర్పడిన  గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకారానికి నిర్ణయించగా ఆ ముహూర్తం బాగాలేదని ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు  శ్రీమాన్ శ్రీ నమిలకొండ రమణాచార్యులు ప్రభుత్వానికి ,ప్రభుత్వ పెద్దలకు సూచించడంతో వారు   ఆ సూచనలను పరిగణనలోకి తీసుకొని 22వ తేదీ...
Read More...

Today's Cartoon

Today's Cartoon
Read More...
Comment 

జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర

జిమ్మీ లాయ్ తీర్పు: హాంకాంగ్ స్వేచ్ఛపై వేసిన తుది ముద్ర హాంకాంగ్ మీడియా దిగ్గజం, ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన జిమ్మీ లాయ్‌కు కోర్టు దోషిగా తీర్పు ఇవ్వడం ఒక వ్యక్తిపై జరిగిన న్యాయ చర్యగా మాత్రమే చూడటం చరిత్రను చిన్నచూపు చేయడమే. ఇది హాంకాంగ్‌లో భిన్నాభిప్రాయాలకు, స్వతంత్ర మీడియాకు, ప్రజాస్వామ్య రాజకీయాలకు వేసిన చివరి ముద్రగా భావించాల్సిన ఘట్టం. 78 ఏళ్ల జిమ్మీ లాయ్...
Read More...

జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్

   జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ 79.64 శాతం 6 మండలాల్లో ఉత్సాహంగా ఓటింగ్ జగిత్యాల, డిసెంబర్ 17 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ శాతం 79.64గా నమోదైంది. మొత్తం 1,71,920 ఓట్లకు గానూ 1,36,917 ఓట్లు పోలయ్యాయి. బుధవారం బుగ్గారం, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపెల్లి, పెగడపెల్లి, వెల్గటూర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు...
Read More...
Local News 

జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన

జనావాసాల మధ్య మురుగునీరు : పట్టించుకోని మున్సిపల్ సిబ్బందిపై కాలనీవాసుల ఆవేదన జగిత్యాల (రూరల్) డిసెంబర్ 17 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డు, 1వ వార్డు సీతారాం నగర్ ప్రాంతంలో జనావాసాల మధ్య డ్రైనేజ్ మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన...
Read More...
Local News 

పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్

పద్మారావు నగర్ లో ఫుట్ పాత్ దుకాణాలకు మార్కింగ్ సికింద్రాబాద్ డిసెంబర్ 17 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ పద్మారావునగర్ పార్కు నుండి సర్దార్ పటేల్ కాలేజ్ వరకు ఉన్న 26 ఫుట్ పాత్ వ్యాపారస్తులకు జిహెచ్ఎంసి అధికారులు బుధవారం మార్కింగ్ వేశారు. ఇకపై తమ పరిధిని దాటి ముందుకు రాకూడదని వారు ఫుట్ పాత్ దుకాణాల  నిర్వాహకులను హెచ్చరించారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని...
Read More...

పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పెన్షనర్స్ భవనంలో అదనపు గది,లిఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల డిసెంబర్ 17(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా పెన్షనర్స్  భవన్ లో అదనపు గది మరియు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభోత్సవం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం పెన్షనర్స్ డే వేడుకల సందర్భంగా జగిత్యాల పట్టణ  ఫంక్షన్ హాల్ లో...
Read More...

మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

మూడవ విడత వివిధ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు) జిల్లాలో 3వ దశ పోలింగ్‌లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్...
Read More...

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     *జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు.*జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)మూడవ విడత సర్పంచ్  ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎస్పీ   తెలిపారు.ఎన్నికలు జరుగుతున్న  ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా...
Read More...
Local News 

కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు

కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన జగిత్యాల నేతలు జగిత్యాల, డిసెంబర్ 18 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను జగిత్యాల నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి పనులు కావాలంటే అసెంబ్లీలో మాట్లాడటమే కాకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో తరచుగా సమావేశమై ప్రతిపాదనలు తీసుకెళ్లాలని సూచించారు. రాజకీయంగా...
Read More...
Local News 

లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు.

లోక్ అదాలత్ కు న్యాయవాదులు సహకరించాలి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు. మెట్టుపల్లి డిసెంబర్ 17 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ )     మెట్టుపల్లి లో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 21 రోజున నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో క్రిమినల్...
Read More...