తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ" మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా

On
తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ

"తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ"
మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా 

 రామ కిష్టయ్య సంగనభట్ల...9440595494

 తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో పలు పౌరాణిక సాంఘిక చారిత్రక నాటకాలు - నాటికలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రజాభిమానాన్ని చూర గొన్నది. గోదావరి తీరస్థ ప్రాచీన తీర్థము, పుణ్య క్షేత్రము అయిన ధర్మపురి పట్టణం, వేల సంవత్సరాల నుండి ఉజ్వల సాంస్కృతిక, వైదిక, నాగరికత, కలిగివున్న క్షేత్రంగా... ఆర్ష విద్యతో పాటు, సంగీతాది లలిత కళలకు నిలయంగా వాసికెక్కింది. తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం అంతగా లేక, స్తబ్దంగా ఉన్న రోజుల్లో, స్థానికుల సహకారంతో స్థాపించబడిన నాటక సంస్థ, తెలంగాణ లోనే మొదటిదిగా నిలువ కలిగింది. ఇది ప్రారంభం అయ్యే నాటికి తెలుగు భాషకు విలువ లేని "ఉర్దూ రాజభాష"గా గల నిజాం రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు... భారతీయ సంస్కృతికి వైద్యులకు కళలకు విలువ ఇవ్వని కేంద్ర  ఆంగ్ల ప్రభుత్వం మరోవైపు, అననుకూల వాతావరణం ఉండేది. అయినా స్థానికుల అభిమానం, ధనం, సేవాభావం, ఈ సంస్థకు ఊపిరి పోసాయి. కీర్తిశేషులు కాసర్ల వెంకట రాజయ్య శిక్షణలో, దర్శకత్వంలో, తొలి తరం నటులు "సతీ సావిత్రి" నాటక ప్రదర్శనతో ప్రారంభించి, అనంతర కాలంలో వెను తిరిగి చూడకుండా, సుమారు పాతిక పౌరాణిక నాటకాలు... ద్రౌపతి వస్త్రాపహరణం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, శ్రీకృష్ణ రాయబారం, పాండవోద్యోగం వంటి అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ఈ నటులు ప్రదర్శించని పౌరాణిక నాటకమే లేదంటే అతిశయోక్తి లేదేమో. కాకెరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి, సంగనభట్ల మాణిక్య శాస్త్రి, తెలంగాణ త్యాగయ్య చాచం కృష్ణయ్య, జగన్నగారి విశ్వనాథశాస్త్రి లాంటి ఉద్దండులు, వారి సరసన దెమ్మ బాలకృష్ణయ్య స్త్రీ పాత్ర ధారిగా తొలి తరం నటులు బహు ప్రశంసా పాత్రులు అయినారు. నాటక సంస్థ రథసారథులలో  ఒకరైన కే. వీ. కేశవులు ( రాష్ట్ర మాజీ మంత్రి), 1946 లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా సభలలో, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్షింప చేయగా, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నాటకాన్ని కాంచి, బహుథా ప్రశంసించారు. తర్వాత కాలంలో దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, స్థానం నరసింహారావు లాంటి మేధావుల ప్రశంసా పాత్రమైంది. స్థానిక దైవం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో, ప్రత్యేక ఓపెన్ థియేటర్ లో  ప్రదర్శిత నాటకాలకు జనం టిక్కెట్టు కొని మరీ చూసేవారు. ఆ రోజుల్లోనే సొంత నాటక ప్రదర్శన శాల ఉండేది. రకరకాల సీనరీ పరదాలు,  మేకప్ సామగ్రి, గదలు, కిరీటాలు, ఉయ్యాలలు, నిచ్చెనలు, ఫైర్ వర్క్స్, వగయిరా సకల హంగులతో అట్టహాసంగా ఉండేది. మొదటి తెరపై భారతమాత చిత్రపటం కలిగి ఉన్న ఈ సంస్థ ఆ రోజుల్లో పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే ఇది రాజ ద్రోహం కిందకు వచ్చేది. ఫైర్ వర్క్స్ లో యముని రాక, నారదుని మబ్బుల్లో ప్రయాణం, శిశుపాలుని శిరచ్ఛేదం, ప్రహ్లాదుని అగ్నిగుండంలో వేయడం, ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించడం, వంటి ఎన్నో అద్భుతాలను కశో జ్జల శివరామయ్య పర్యవేక్షణలో చూపారు. రెండవ తరం నటులు దశాబ్దకాలం ప్రదర్శన ఇవ్వగా, నాటి సీనియర్ నాయకులు దాద గారి కిషన్ రావు నిర్వహణలో, సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలకు ప్రారంభ నిధుల సేకరణ గావించారు. గయోపాఖ్యానం నాటకం తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి, గుండయ్య శాస్త్రి, పెండ్యాల శంకర్, ఓజ్జల రామచంద్రం, నరసింహా చారి, గుండి హనుమాన్లు, భోగం పురుషోత్తం వంటి మేటి నటులతో ప్రదర్శించారు. మూడవ తరంలో పౌరాణిక నాటకాలతో పాటు వీరపాండ్య కట్ట బొమ్మన, వీర కాపయ, నాగమ నాయకుడు లాంటి చారిత్రక నాటకాలు పెక్కు సాంఘిక నాటకాలు ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. 1984 లో జిల్లా కలెక్టర్ కె ఎస్ శర్మ, 1991 లో కలెక్టర్ బన్వర్ లాల్ ఆహ్వానం మేరకు, వారి సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నారు. 1989 లో తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన, సాంప్రదాయ పద్య నాటక పోటీలలో సూర్యాపేటలో "కట్టబొమ్మన" ప్రదర్శించారు. 2016లో వరంగల్ లో, వేణుమాధవ్ ఆడిటోరియంలో... అనంతరం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో.. ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నిధులు ప్రోగు చేసి సొంత సామగ్రిని సమకూర్చు కున్నారు. ప్రస్తుత నటులలో కొందరు వీడియో, చలన చిత్రాలలో అవకాశాలు పొందారు. విద్యావేత్త విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య, బహుముఖ ప్రజ్ఞాశాలి,  నటులు కొరిడె నరహరిశర్మ, కాకెర్ల దత్తాత్రేయ, ఎస్ రామకృష్ణయ్య, మునిగాల కిషన్ తదితరులు చారిత్రక నటులుగా మిగుల గుర్తింపు పొందారు 1993 లో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పేర్వారం జగన్నాథం ద్వారా నిధులు పొంది, స్వర్ణోత్సవాలు జరిపి, గయోపాఖ్యానం నాటకం ప్రదర్శించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు దివంగత బి. ఎస్. నారాయణ చేత కళాకారులకు సన్మానాలు చేయించారు. సావనీర్ విడుదల చేశారు. 1955 లో ఈ సంస్థ కళాకారులకు ఆంధ్ర నాటక పరిషత్తు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ కాకర లక్ష్మీకాంత శాస్త్రికి, పెండ్యాల సీతారాములకు ఘనంగా సత్కారం చేశాయి. స్థానిక డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య నాటక రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామీణ కళా జ్యోతి అవార్డు లభించింది. నలుగురు వృద్ధ కళాకారులకు గత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పథకాలను మంజూరు చేసింది. ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా కళామతల్లికి సేవ చేస్తూ సాంప్రదాయక పద్య నాటకాలను బ్రతికిస్తున్న అపురూప అరుదైన నాట్యమండలి 2017 ఏప్రిల్ 2,3 తేదీలలో నాటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ. రమణాచారి, నాటి ప్రభుత్వ చీఫ్ విప్, గత రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బీ. ఎస్.రాములు తదితర ప్రముఖులు హాజరు కాగా, 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు. ప్రస్తుతం నరహరి శర్మ ఆధ్వర్యంలో, నర్సయ్య పర్యవేక్షణలో, దత్తాత్రి నిర్వహణలో, రామకిష్టయ్య, చంద్రమౌళి, వెంకట రమణ, కిశోర్, మహేందర్, సురేశ్, బాలకృష్ణ, శేఖర్, నర్సింహమూర్తి, జన్మంచి నరసయ్య, వంశీ కృష్ణ, నరహరి, అమర్, అనిల్, శ్రీనివాస్, రాంకిషన్ లకు తోడు కాకెరి అరుణ, సంగనభట్ల ప్రతిభ తదితరులు స్త్రీ పాత్రలను పోషిస్తూ, పౌరాణిక చారిత్రక నాటకాల ప్రదర్శనలను కొన సాగిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు 

అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు  జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో ఆర్ద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ వేడుకలు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని కొనసాగించారు భక్తులు...
Read More...

బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు

బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు *  బీర్పూర్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు)మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు ని ఏకగ్రీవంగా ఏనుకున్న బీర్పూర్ మండల సర్పంచులు, ప్రధాన కార్యదర్శి గా ఎల్లమట్ల హరీష్ (బీర్పూర్ సర్పంచ్ ), ఉపాధ్యక్షులు 1 గా బోడ సాగర్ (రంగసాగర్ సర్పంచ్ ),...
Read More...

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ *జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ  సంఘటన లేకుండా ముగిసిన ఏడాది* *మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,–  డ్రగ్స్‌ పై జీరో టాలరెన్స్ విధానం అమలు* *‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ...
Read More...
Local News  State News 

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి  జీవన్ రెడ్డి సూటి ప్రశ్న జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో...
Read More...

పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ….  పోలీస్ సిబ్బంది రోజువారీ...
Read More...
Local News 

పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ

పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్) ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన  గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు  మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో  ఇతర మండల అధికారులు....
Read More...

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు మహబూబ్‌నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్ కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్...
Read More...
National  Crime  State News 

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్...
Read More...
National  State News 

కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్‌ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ

కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్‌ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం): కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి...
Read More...

న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు

న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 (ప్రజా మంటలు): దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మానవ హక్కుల అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పలు సంఘాలు హైకమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున...
Read More...

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు): యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో...
Read More...