తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ" మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా

On
తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ

"తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ"
మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా 

 రామ కిష్టయ్య సంగనభట్ల...9440595494

 తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో పలు పౌరాణిక సాంఘిక చారిత్రక నాటకాలు - నాటికలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రజాభిమానాన్ని చూర గొన్నది. గోదావరి తీరస్థ ప్రాచీన తీర్థము, పుణ్య క్షేత్రము అయిన ధర్మపురి పట్టణం, వేల సంవత్సరాల నుండి ఉజ్వల సాంస్కృతిక, వైదిక, నాగరికత, కలిగివున్న క్షేత్రంగా... ఆర్ష విద్యతో పాటు, సంగీతాది లలిత కళలకు నిలయంగా వాసికెక్కింది. తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం అంతగా లేక, స్తబ్దంగా ఉన్న రోజుల్లో, స్థానికుల సహకారంతో స్థాపించబడిన నాటక సంస్థ, తెలంగాణ లోనే మొదటిదిగా నిలువ కలిగింది. ఇది ప్రారంభం అయ్యే నాటికి తెలుగు భాషకు విలువ లేని "ఉర్దూ రాజభాష"గా గల నిజాం రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు... భారతీయ సంస్కృతికి వైద్యులకు కళలకు విలువ ఇవ్వని కేంద్ర  ఆంగ్ల ప్రభుత్వం మరోవైపు, అననుకూల వాతావరణం ఉండేది. అయినా స్థానికుల అభిమానం, ధనం, సేవాభావం, ఈ సంస్థకు ఊపిరి పోసాయి. కీర్తిశేషులు కాసర్ల వెంకట రాజయ్య శిక్షణలో, దర్శకత్వంలో, తొలి తరం నటులు "సతీ సావిత్రి" నాటక ప్రదర్శనతో ప్రారంభించి, అనంతర కాలంలో వెను తిరిగి చూడకుండా, సుమారు పాతిక పౌరాణిక నాటకాలు... ద్రౌపతి వస్త్రాపహరణం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, శ్రీకృష్ణ రాయబారం, పాండవోద్యోగం వంటి అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ఈ నటులు ప్రదర్శించని పౌరాణిక నాటకమే లేదంటే అతిశయోక్తి లేదేమో. కాకెరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి, సంగనభట్ల మాణిక్య శాస్త్రి, తెలంగాణ త్యాగయ్య చాచం కృష్ణయ్య, జగన్నగారి విశ్వనాథశాస్త్రి లాంటి ఉద్దండులు, వారి సరసన దెమ్మ బాలకృష్ణయ్య స్త్రీ పాత్ర ధారిగా తొలి తరం నటులు బహు ప్రశంసా పాత్రులు అయినారు. నాటక సంస్థ రథసారథులలో  ఒకరైన కే. వీ. కేశవులు ( రాష్ట్ర మాజీ మంత్రి), 1946 లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా సభలలో, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్షింప చేయగా, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నాటకాన్ని కాంచి, బహుథా ప్రశంసించారు. తర్వాత కాలంలో దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, స్థానం నరసింహారావు లాంటి మేధావుల ప్రశంసా పాత్రమైంది. స్థానిక దైవం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో, ప్రత్యేక ఓపెన్ థియేటర్ లో  ప్రదర్శిత నాటకాలకు జనం టిక్కెట్టు కొని మరీ చూసేవారు. ఆ రోజుల్లోనే సొంత నాటక ప్రదర్శన శాల ఉండేది. రకరకాల సీనరీ పరదాలు,  మేకప్ సామగ్రి, గదలు, కిరీటాలు, ఉయ్యాలలు, నిచ్చెనలు, ఫైర్ వర్క్స్, వగయిరా సకల హంగులతో అట్టహాసంగా ఉండేది. మొదటి తెరపై భారతమాత చిత్రపటం కలిగి ఉన్న ఈ సంస్థ ఆ రోజుల్లో పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే ఇది రాజ ద్రోహం కిందకు వచ్చేది. ఫైర్ వర్క్స్ లో యముని రాక, నారదుని మబ్బుల్లో ప్రయాణం, శిశుపాలుని శిరచ్ఛేదం, ప్రహ్లాదుని అగ్నిగుండంలో వేయడం, ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించడం, వంటి ఎన్నో అద్భుతాలను కశో జ్జల శివరామయ్య పర్యవేక్షణలో చూపారు. రెండవ తరం నటులు దశాబ్దకాలం ప్రదర్శన ఇవ్వగా, నాటి సీనియర్ నాయకులు దాద గారి కిషన్ రావు నిర్వహణలో, సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలకు ప్రారంభ నిధుల సేకరణ గావించారు. గయోపాఖ్యానం నాటకం తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి, గుండయ్య శాస్త్రి, పెండ్యాల శంకర్, ఓజ్జల రామచంద్రం, నరసింహా చారి, గుండి హనుమాన్లు, భోగం పురుషోత్తం వంటి మేటి నటులతో ప్రదర్శించారు. మూడవ తరంలో పౌరాణిక నాటకాలతో పాటు వీరపాండ్య కట్ట బొమ్మన, వీర కాపయ, నాగమ నాయకుడు లాంటి చారిత్రక నాటకాలు పెక్కు సాంఘిక నాటకాలు ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. 1984 లో జిల్లా కలెక్టర్ కె ఎస్ శర్మ, 1991 లో కలెక్టర్ బన్వర్ లాల్ ఆహ్వానం మేరకు, వారి సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నారు. 1989 లో తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన, సాంప్రదాయ పద్య నాటక పోటీలలో సూర్యాపేటలో "కట్టబొమ్మన" ప్రదర్శించారు. 2016లో వరంగల్ లో, వేణుమాధవ్ ఆడిటోరియంలో... అనంతరం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో.. ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నిధులు ప్రోగు చేసి సొంత సామగ్రిని సమకూర్చు కున్నారు. ప్రస్తుత నటులలో కొందరు వీడియో, చలన చిత్రాలలో అవకాశాలు పొందారు. విద్యావేత్త విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య, బహుముఖ ప్రజ్ఞాశాలి,  నటులు కొరిడె నరహరిశర్మ, కాకెర్ల దత్తాత్రేయ, ఎస్ రామకృష్ణయ్య, మునిగాల కిషన్ తదితరులు చారిత్రక నటులుగా మిగుల గుర్తింపు పొందారు 1993 లో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పేర్వారం జగన్నాథం ద్వారా నిధులు పొంది, స్వర్ణోత్సవాలు జరిపి, గయోపాఖ్యానం నాటకం ప్రదర్శించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు దివంగత బి. ఎస్. నారాయణ చేత కళాకారులకు సన్మానాలు చేయించారు. సావనీర్ విడుదల చేశారు. 1955 లో ఈ సంస్థ కళాకారులకు ఆంధ్ర నాటక పరిషత్తు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ కాకర లక్ష్మీకాంత శాస్త్రికి, పెండ్యాల సీతారాములకు ఘనంగా సత్కారం చేశాయి. స్థానిక డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య నాటక రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామీణ కళా జ్యోతి అవార్డు లభించింది. నలుగురు వృద్ధ కళాకారులకు గత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పథకాలను మంజూరు చేసింది. ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా కళామతల్లికి సేవ చేస్తూ సాంప్రదాయక పద్య నాటకాలను బ్రతికిస్తున్న అపురూప అరుదైన నాట్యమండలి 2017 ఏప్రిల్ 2,3 తేదీలలో నాటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ. రమణాచారి, నాటి ప్రభుత్వ చీఫ్ విప్, గత రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బీ. ఎస్.రాములు తదితర ప్రముఖులు హాజరు కాగా, 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు. ప్రస్తుతం నరహరి శర్మ ఆధ్వర్యంలో, నర్సయ్య పర్యవేక్షణలో, దత్తాత్రి నిర్వహణలో, రామకిష్టయ్య, చంద్రమౌళి, వెంకట రమణ, కిశోర్, మహేందర్, సురేశ్, బాలకృష్ణ, శేఖర్, నర్సింహమూర్తి, జన్మంచి నరసయ్య, వంశీ కృష్ణ, నరహరి, అమర్, అనిల్, శ్రీనివాస్, రాంకిషన్ లకు తోడు కాకెరి అరుణ, సంగనభట్ల ప్రతిభ తదితరులు స్త్రీ పాత్రలను పోషిస్తూ, పౌరాణిక చారిత్రక నాటకాల ప్రదర్శనలను కొన సాగిస్తున్నారు.

Tags

More News...

Local News 

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో  ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో  ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం   జగిత్యాల సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం   15 వ రోజుకు చేరింది.మంచిర్యాల వాస్తవ్యులు 200 సప్తాహా లు పూర్తి చేసుకున్న బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ శనివారం కూర్మ పురాణం లోని వివిద ఘట్టాలను...
Read More...
Local News 

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)   నలంద డిగ్రీ కళాశాల బీఎస్సీ విద్యార్థులచే ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్ మాట్లాడుతూ మీరంతా జెన్ జెడ్ యువత అని జెన్ జెడ్ యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నేపాల్ యువత మనకు చూపించారని మీరు కూడా...
Read More...
Local News 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) :   బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఇటీవల నూతనంగా  నియమితులైన మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  పార్టీలో తనకు సముచితమైన ప్రాధాన్యత కల్పించినందుకు కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొంతకాలంగా అంకితభావంతో
Read More...
State News 

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో రేపు 71వ వ్యవస్థాపక దినోత్సవం  సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చిన్నగా  పీపుల్స్‌మెడికల్‌కాలేజీగా మొదలైన గాంధీ మెడికల్‌కాలేజీ నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి  వరకు దేశ, విదేశాల్లో నిష్ణాతులైన వేలాది మంది వైద్యులను తయారు చేసి, వైద్యరంగంలో అగ్రగామిగా నిలిచిన ఈ కళాశాలను...
Read More...
Crime  State News 

ఓల్డ్ బోయిన్ పల్లిలో  మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఓల్డ్ బోయిన్ పల్లిలో  మత్తు మందు తయారీ గుట్టు రట్టు మూతపడిన స్కూల్ లో మత్తు పదార్థాల తయారీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : గుట్టుగా తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా ఈగల్‌టీం పట్టుకున్న ఘటన ఓల్డ్ బోయిన్ పల్లిలో చోటు చేసుకుంది. విశ్వసనీయ కథనం మేరకు సికింద్రాబాద్ ఓల్డ్  బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో పక్కా సమాచారంతో ఈగల్ టీం...
Read More...
Local News 

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ జగిత్యాల సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు):ఎల్. ఐ.సి. ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ కో -కన్వీనర్ గా జగిత్యాలకు చెందిన ఆమందు రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. జగిత్యాల బ్రాంచ్ నుండి డివిజన్ కమిటి సభ్యులుగా రేగొండ లక్ష్మీ కాంతం, రౌతు నర్సయ్య లను కూడా ఎన్నుకున్నారు. శనివారం మంచిర్యాలలో ఎల్.ఐ.సి. ఏజెంట్స్...
Read More...
Local News 

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 13 (ప్రజా మంటలు):  గొల్లపల్లి ప్యాక్స్ కు అనుబందంగాగొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో  ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను  మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్ శనివారం ప్రారంభించారు.మల్లన్న పేట గ్రామంలో ప్యాక్స్ కార్యాలయం ఏర్పాటు చేయడం వలన చుట్టూ ప్రక్కల గ్రామల రైతులకు లబ్ధి చేకూరుతుందని ఏఎంసీ చైర్మన్ భీమా...
Read More...

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి  - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత -మల్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు) ఆర్యవైశ్యుల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. శనివారం మల్యాల ఎక్స్ రోడ్డులో  ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసవి ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ పబ్బ శ్రీనివాస్ ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్ 2025 పేరిట...
Read More...
Local News 

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్  జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)   9వ వార్డులో 1 కోటి 25 లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. 1 కోటి 50 లక్షల తో రామాలయం...
Read More...
Local News 

పెన్షనర్ల సంక్షేమానికి కృషి.        - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి.        -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .                 జగిత్యాల సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)పెన్షనర్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ సంఘ కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి పుష్పగుచ్చము...
Read More...
Local News 

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్‌ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు.  నిందితునికి  కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్‌ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు.   నిందితునికి  కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత. జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)హత్య, హత్యయత్నాలు, దోపిడీలు, బెదిరింపులు సహా 20 కేసుల్లో నిందితుడిగా బండి శ్రీకాంత్   శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తాం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్    జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ కు చెందిన బండి@తరాల శ్రీకాంత్ అనే వ్యక్తి శాంతి భద్రతలకు...
Read More...
National  State News 

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు బెర్హంపూర్ (ఒడిశా) సెప్టెంబర్ 13: ఒడిశాలోని ఒక ఆశ్రమ  పాఠశాల హాస్టల్‌లో విద్యార్థుల కళ్ళు ఫెవిక్‌విక్‌తో ఎవరో అతికించిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత మరియు పర్యవేక్షణ గురించి ఆందోళనలను రేకెత్తించింది. బాధిత విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చారు మరియు వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెబుతున్నారు.బాధిత విద్యార్థులను...
Read More...