నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

On
నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా?  -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

- ఇప్పటికే నలుగురు రెడ్డీలకు టికెట్లు-సామాజిక సమీకరణాలే జీవన్ రెడ్డి టికెట్ కు అడ్డంకి  

హైదరాబాద్ మార్చ్ 25 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

2019 మార్చిలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో గల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన టి. జీవన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్, బీజేపీ లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం టి. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా ప్రకటించే దశలో వాయిదా వేసి అనూహ్య పరిణామాలలో ఏ. రేవంత్ రెడ్డిని నియమించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోవడంతో ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం కోల్పోయారు జీవన్ రెడ్డి.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టి. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. రైతులు, నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇతర అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. నిజామాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక స్థానం నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఏఐసీసీ భావించింది. చివరికి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రెండు లిస్టులలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం నిజామాబాద్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అనుకున్న స్థాయి నుంచి ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితికి నెట్టివేయడం జీవన్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

 మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లలో పెండింగ్ లో కాంగ్రెస్ టికెట్లు

 ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరిగ్గా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచడం విశేషం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముందున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్తోమత దృష్ట్యా జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. 29 మార్చి 2025 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నందున మంత్రి పదవి ఇవ్వడంలో సాంకేతిక అవరోధం ఉండదు. ఎమ్మెల్సీ లకు కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీ కూడా.

 

నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్) లు తమ అభ్యర్థులుగా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరు ఇద్దరూ మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో పాటు ముత్యాల సునీల్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరు ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వైద్యురాలు డా. కవితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్. రమణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎల్. రమణ ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.     

 

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే  జనరల్ క్యాటగిరీ లో మిగిలినవి 11 సీట్లు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం కోసం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో చల్లా వంశీచంద్ రెడ్డి (మహబూబ్ నగర్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్గొండ), డా. జి. రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి) నలుగురు రెడ్డీలకు టికెట్లు ఇచ్చింది. బలరాం నాయక్ (మహబూబాబాద్ - ఎస్టీ), డా. మల్లు రవి (నాగర్ కర్నూల్ - ఎస్సీ), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి - ఎస్సీ)బీసీ అభ్యర్థులు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), దానం నాగేందర్ (సికింద్రాబాద్) లకు టికెట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ), హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.

 

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం

రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):     రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ...
Read More...
Local News  State News 

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
Read More...
Crime  State News 

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు): హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర...
Read More...
Local News 

ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి* 

ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి*  * జగిత్యాల, మార్చి 7(ప్రజా మంటలు) ప్రతి జిల్లా కు ఓక వెల్నెస్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరబూజ రవీందర్ అన్నారు. శనివారం స్థానిక పెన్షనర్స్ భవన్ లో జిల్లా కార్యనిర్వాహక వర్గ...
Read More...
Local News 

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే సంజయ్

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే సంజయ్    జగిత్యాల:  మార్చి 7 (ప్రజా మంటలు)అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026 లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది.ఈ విజయాన్ని పురస్కరించుకొని జగిత్యాల  ఎమ్మెల్యే  సంజయ్ కుమార్  విద్యార్థిని ఆర్. శ్రేయాన్విని అభినందించారు . ప్రతిభావంతులుగా...
Read More...
Local News 

యూపీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన జగిత్యాల జిల్లా విద్యార్థి

యూపీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన జగిత్యాల జిల్లా విద్యార్థి    జగిత్యాల మార్చి 7 ( ప్రజా మంటలు)748 ర్యాంక్ సాధించిన రాహుల్ ను సన్మానించిన గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు      *ఇటీవల విడుదలైన యూపీఎస్సీ 2025 --2026 ఫలితాలలో జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్  748 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. *జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం హన్మజీపేట గ్రామానికి చెందిన పుదరి...
Read More...
Local News  State News 

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన మానస స్కూల్ విద్యార్థిని శ్రేయాన్వి

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన మానస స్కూల్ విద్యార్థిని శ్రేయాన్వి జగిత్యాల, మార్చ్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో విద్యా రంగంలో మరో విశిష్ట విజయాన్ని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించింది. అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ విజయాన్ని...
Read More...
Local News 

2025 తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రకటన: ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందాన 

2025 తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రకటన: ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందాన  2025 తెలంగాణ Gaddar Awards విజేతల జాబితా హైదరాబాద్, మార్చ్ 07: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డులు – 2025 ను ప్రకటించింది. తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ప్రకటించారు. ప్రధాన అవార్డులుఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)ఉత్తమ...
Read More...
Local News 

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి    జగిత్యాల మార్చ్6( ప్రజా మంటలు)  జిల్లా కలెక్టర్ కి. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెల్లించాలని. వినతి పత్రం సమర్పించిన బీసీ నాయకులు    (తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్.) తెలంగాణ రాష్ట్రంలో...
Read More...
Local News 

జిల్లాలో  ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లాలో  ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం   జగిత్యాల మార్చి 6 (ప్రజా మంటలు)జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది.జనరల్ కోర్సులకు సంబంధించి  4193 విద్యార్థులకు గాను 4138 విద్యార్థులు హాజరు కాగా 55 విద్యార్థులు గైర్హాజరయ్యారు మరియు ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 847 విద్యార్థులకు గాను 809 విద్యార్థులు హాజరు కాగా  38...
Read More...
Local News 

త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన తిరుమల మార్చ్ 06 (ప్రజా మంటలు): కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత, శుక్రవారం ఉదయం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత,...
Read More...
Local News  State News 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –  అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం...
Read More...