నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?
నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?
- ఇప్పటికే నలుగురు రెడ్డీలకు టికెట్లు-సామాజిక సమీకరణాలే జీవన్ రెడ్డి టికెట్ కు అడ్డంకి
హైదరాబాద్ మార్చ్ 25 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :
2019 మార్చిలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో గల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన టి. జీవన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్, బీజేపీ లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం టి. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా ప్రకటించే దశలో వాయిదా వేసి అనూహ్య పరిణామాలలో ఏ. రేవంత్ రెడ్డిని నియమించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోవడంతో ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం కోల్పోయారు జీవన్ రెడ్డి.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టి. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. రైతులు, నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇతర అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. నిజామాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక స్థానం నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఏఐసీసీ భావించింది. చివరికి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రెండు లిస్టులలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం నిజామాబాద్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అనుకున్న స్థాయి నుంచి ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితికి నెట్టివేయడం జీవన్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లలో పెండింగ్ లో కాంగ్రెస్ టికెట్లు
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరిగ్గా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచడం విశేషం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముందున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్తోమత దృష్ట్యా జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. 29 మార్చి 2025 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నందున మంత్రి పదవి ఇవ్వడంలో సాంకేతిక అవరోధం ఉండదు. ఎమ్మెల్సీ లకు కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీ కూడా.
నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్) లు తమ అభ్యర్థులుగా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరు ఇద్దరూ మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో పాటు ముత్యాల సునీల్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరు ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వైద్యురాలు డా. కవితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్. రమణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎల్. రమణ ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే జనరల్ క్యాటగిరీ లో మిగిలినవి 11 సీట్లు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం కోసం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో చల్లా వంశీచంద్ రెడ్డి (మహబూబ్ నగర్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్గొండ), డా. జి. రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి) నలుగురు రెడ్డీలకు టికెట్లు ఇచ్చింది. బలరాం నాయక్ (మహబూబాబాద్ - ఎస్టీ), డా. మల్లు రవి (నాగర్ కర్నూల్ - ఎస్సీ), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి - ఎస్సీ), బీసీ అభ్యర్థులు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), దానం నాగేందర్ (సికింద్రాబాద్) లకు టికెట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ), హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) టీజీజెఏసి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర టి జి ఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొని... చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి
గొల్లపల్లి, ఆగస్టు 31 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే చేయూత పెన్షన్లను ఎలాంటి కఠిన నిబంధనలు, షరతులు లేకుండా సరళతరం చేసి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన... గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం
గొల్లపల్లి, ఆగస్టు 31, ప్రజా మంటలు:
గొల్లపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఈ శిబిరాన్ని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్... క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్కు ఎమ్మెల్యే ప్రశంస.!
జగిత్యాల ఆగస్ట్ 31(ప్రజా మంటలు)
ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, గుట్కా, తంబాకు వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దాతల సహకారంతో సమకూర్చిన రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా. సంజయ్ కుమార్... తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు):
తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్ షాపులో పనిచేస్తున్న బిహార్కు చెందిన సైనా ఉల్లా ఖాన్ను నిందితుడిగా... ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.... రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల... జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల, ఆగస్టు 29:జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోరుట్ల సమీపంలోని ఓ... తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు
జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్... డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట... వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
నాంపల్లిలోని రామ్ ప్రతాప్ పిట్టి భవన్లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బాలాజీ మందిరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఉత్సవాల్లో మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ... వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఫారమ్–16 జారీ, జాప్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు
హైదరాబాద్ ఆగస్ట్ 28 (ప్రజా మంటలు):
ఉద్యోగికి సకాలంలో వేతనం చెల్లించకపోవడం, ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అందించడంలో జాప్యం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.... 