నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

On
నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా?  -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

- ఇప్పటికే నలుగురు రెడ్డీలకు టికెట్లు-సామాజిక సమీకరణాలే జీవన్ రెడ్డి టికెట్ కు అడ్డంకి  

హైదరాబాద్ మార్చ్ 25 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

2019 మార్చిలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో గల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన టి. జీవన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్, బీజేపీ లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం టి. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా ప్రకటించే దశలో వాయిదా వేసి అనూహ్య పరిణామాలలో ఏ. రేవంత్ రెడ్డిని నియమించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోవడంతో ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం కోల్పోయారు జీవన్ రెడ్డి.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టి. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. రైతులు, నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇతర అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. నిజామాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక స్థానం నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఏఐసీసీ భావించింది. చివరికి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రెండు లిస్టులలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం నిజామాబాద్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అనుకున్న స్థాయి నుంచి ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితికి నెట్టివేయడం జీవన్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

 మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లలో పెండింగ్ లో కాంగ్రెస్ టికెట్లు

 ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరిగ్గా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచడం విశేషం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముందున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్తోమత దృష్ట్యా జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. 29 మార్చి 2025 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నందున మంత్రి పదవి ఇవ్వడంలో సాంకేతిక అవరోధం ఉండదు. ఎమ్మెల్సీ లకు కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీ కూడా.

 

నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్) లు తమ అభ్యర్థులుగా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరు ఇద్దరూ మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో పాటు ముత్యాల సునీల్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరు ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వైద్యురాలు డా. కవితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్. రమణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎల్. రమణ ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.     

 

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే  జనరల్ క్యాటగిరీ లో మిగిలినవి 11 సీట్లు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం కోసం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో చల్లా వంశీచంద్ రెడ్డి (మహబూబ్ నగర్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్గొండ), డా. జి. రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి) నలుగురు రెడ్డీలకు టికెట్లు ఇచ్చింది. బలరాం నాయక్ (మహబూబాబాద్ - ఎస్టీ), డా. మల్లు రవి (నాగర్ కర్నూల్ - ఎస్సీ), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి - ఎస్సీ)బీసీ అభ్యర్థులు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), దానం నాగేందర్ (సికింద్రాబాద్) లకు టికెట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ), హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.

 

Tags
Join WhatsApp

More News...

State News 

ఇండిగో సీఈఓ కు dgca నోటీస్

ఇండిగో సీఈఓ కు dgca నోటీస్ న్యూ ఢిల్లీ డిసెంబర్ 06; ఇండిగో flights ఆలస్యాలు, క్రూ కొరత, ప్రయాణీకుల అసౌకర్యంపై దేశవ్యాప్తంగా వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, డీజీసీఏ నేరంగా ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. “మీపై తగిన అమలు చర్య ఎందుకు ప్రారంభించకూడదు?” అనే ప్రశ్నకు సంబంధించి, ఎల్బర్స్ 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని...
Read More...
National  Sports 

IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్‌కు ఘన విజయం, సిరీస్‌ కైవసం

IND vs SA: జైస్వాల్ తొలి వన్డే సెంచరీ – భారత్‌కు ఘన విజయం, సిరీస్‌ కైవసం విశాఖపట్నం డిసెంబర్ 06:   టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వన్డేల్లో తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో బోచ్ బౌలింగ్‌లో సింగిల్ తీసుకుని శతకం పూర్తి చేశాడు. ఆరంభంలో రోహిత్ శర్మ (75) వేగంగా రాణించినా మహరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కోహ్లీ (33*)తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు....
Read More...
State News 

తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ను దేశంలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి నల్లగొండ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే వరి ఉత్పత్తి, శాంతి భద్రతలు, విద్య, వైద్య రంగం, మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచిందని తెలిపారు. ఇందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే :జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ జగిత్యాల డిసెంబర్ 06 (ప్రజా మంటలు): వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సిన భాద్యత పిల్లలదే  నని  విస్మరిస్తే జైలు శిక్ష జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయో వృద్ధుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల నిరాధరణ కేసులను విచారించారు. జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట...
Read More...
Local News 

తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి

తులగంగవ్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళి మెటుపల్లి డిసెంబర్ 06:మెట్పల్లి అంబేద్కర్ పార్క్‌లో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా తుల గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ కుమార్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.
Read More...
Local News 

గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు

గ్రామాల్లో కోతుల బెడద నివారించే అభ్యర్థులనే గెలిపించండి : తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం పిలుపు సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు): తెలంగాణ గ్రామాలను వేధిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించగల అభ్యర్థులనే రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (జై కిసాన్) విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్  ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ప్రెస్‌ మీట్‌ లో ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను...
Read More...

రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  

రాయికల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి   రాయికల్ డిసెంబర్ 6(ప్రజా మంటలు)*గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి*    అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం         రాయికల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి ఈ...
Read More...
Local News 

అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన...
Read More...
Local News 

డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*

 డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు* ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ ) ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు...
Read More...
Local News  State News 

కరీంనగర్‌లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి 

కరీంనగర్‌లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి  కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి...
Read More...
Local News  State News 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్

జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్‌ ను...
Read More...