నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?
నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?
- ఇప్పటికే నలుగురు రెడ్డీలకు టికెట్లు-సామాజిక సమీకరణాలే జీవన్ రెడ్డి టికెట్ కు అడ్డంకి
హైదరాబాద్ మార్చ్ 25 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :
2019 మార్చిలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో గల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన టి. జీవన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్, బీజేపీ లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం టి. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా ప్రకటించే దశలో వాయిదా వేసి అనూహ్య పరిణామాలలో ఏ. రేవంత్ రెడ్డిని నియమించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోవడంతో ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం కోల్పోయారు జీవన్ రెడ్డి.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టి. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. రైతులు, నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇతర అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. నిజామాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక స్థానం నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఏఐసీసీ భావించింది. చివరికి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రెండు లిస్టులలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం నిజామాబాద్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అనుకున్న స్థాయి నుంచి ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితికి నెట్టివేయడం జీవన్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లలో పెండింగ్ లో కాంగ్రెస్ టికెట్లు
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరిగ్గా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచడం విశేషం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముందున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్తోమత దృష్ట్యా జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. 29 మార్చి 2025 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నందున మంత్రి పదవి ఇవ్వడంలో సాంకేతిక అవరోధం ఉండదు. ఎమ్మెల్సీ లకు కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీ కూడా.
నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్) లు తమ అభ్యర్థులుగా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరు ఇద్దరూ మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో పాటు ముత్యాల సునీల్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరు ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వైద్యురాలు డా. కవితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్. రమణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎల్. రమణ ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే జనరల్ క్యాటగిరీ లో మిగిలినవి 11 సీట్లు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం కోసం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో చల్లా వంశీచంద్ రెడ్డి (మహబూబ్ నగర్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్గొండ), డా. జి. రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి) నలుగురు రెడ్డీలకు టికెట్లు ఇచ్చింది. బలరాం నాయక్ (మహబూబాబాద్ - ఎస్టీ), డా. మల్లు రవి (నాగర్ కర్నూల్ - ఎస్సీ), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి - ఎస్సీ), బీసీ అభ్యర్థులు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), దానం నాగేందర్ (సికింద్రాబాద్) లకు టికెట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ), హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.
More News...
<%- node_title %>
<%- node_title %>
అమీర్ పేట మైత్రీవనం చౌరస్తాలో అగ్ని ప్రమాదం – 60 మంది విద్యార్థులు సురక్షితం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
నగరంలోని హైదరాబాద్ అమీర్పేట మైత్రీవనం చౌరస్తాలో ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
కోచింగ్ సెంటర్లో మంటలు
ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు... ట్యాంక్ బండ్ పై ఫూలే విగ్రహ పనుల పరిశీలించిన కవిత–
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
ట్యాంక్ బండ్పై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు.
అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి
రెండున్నరేళ్లుగా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి... డీఎండీకే – డీఎంకే కూటమి: రాజకీయ లెక్కలు ఏమిటి?
చెన్నై ఫిబ్రవరి 20:
తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది.డీఎండీకే అధికార పార్టీ అయిన డీఎంకే కూటమిలో చేరింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల వరకు డీఎండీకే ఏ కూటమిలో చేరుతుందో స్పష్టత లేకుండా ఉంది. అధికార పార్టీ వైపు వెళ్తుందా? లేక ప్రతిపక్ష కూటమిలో చేరుతుందా? అనే సందేహాలు... నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
చెన్నై, ఫిబ్రవరి 19:
నీట్–ఎస్ఎస్ 2024–25 ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువడింది. కౌన్సెలింగ్కు నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత ఖాళీ సీట్లు ఉన్నాయనే కారణంతో అదనపు మాప్-అప్ కౌన్సెలింగ్కు అనుమతి ఇవ్వడం సరికాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం... రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్మ్యాప్పై జాతీయ నేతలతో చర్చ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తెలంగాణ అభివృద్ధి దిశను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ప్రతినిధి బృందం మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీలను కలిసి తెలంగాణ... బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)::
బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పార్టీని లోపల నుంచే పీడిస్తున్న వారు ఇకనైనా పార్టీని విడిచిపెట్టాలని అన్నారు.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఎదిగిందని పేర్కొన్న అర్వింద్, దక్షిణ తెలంగాణలో పార్టీని మరింత... నూతన కౌన్సిలర్లను సత్కరించిన మెట్పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు
మెట్పల్లి, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన నూతన కౌన్సిలర్లను మెట్పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మార్గదర్శకత్వంలో, కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్... మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ లకు బీసీ సంఘం వారిచే ఘనంగా సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు)
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్ లను బీసీ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోగురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శి ముసి పట్ల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ, బిసిల సమస్యలపై దృష్టిసారించి చేతి వృత్తుల వారికి ఉపాధి... హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
హనుమకొండ చెరబండ రాజు నగర్లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది.
SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్పర్సన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో మధ్యంతర... బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్జెట్కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ / కోల్కతా ఫిబ్రవరి 19:
భద్రతా రుసుములు, ఎయిర్స్పేస్ వినియోగానికి సంబంధించిన బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్జెట్ విమానాలు బంగ్లాదేశ్ గగనతలాన్ని వినియోగించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో కోల్కతా నుంచి ఈశాన్య భారత రాష్ట్రాలకు వెళ్లే కొన్ని విమానాలు పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
ప్రధానంగా కోల్కతా–గువాహటి, కోల్కతా–ఇంఫాల్ వంటి రూట్లలో... ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు
అమరావతి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, ఇందాపూర్ డెయిరీ పూర్తిగా చంద్రబాబుకు చెందినదేనని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను ప్రజల ముందుంచుతూ, నిజాలు బయటకు వచ్చాక ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు.
హెరిటేజ్... జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ నూతన చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఫిబ్రవరి 19 ( ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ని,అదనపు కలెక్టర్ బి ఎస్ లత,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రాజ గౌడ్ ని వారి ఛాంబర్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి... 