నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?
నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?
- ఇప్పటికే నలుగురు రెడ్డీలకు టికెట్లు-సామాజిక సమీకరణాలే జీవన్ రెడ్డి టికెట్ కు అడ్డంకి
హైదరాబాద్ మార్చ్ 25 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :
2019 మార్చిలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో గల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన టి. జీవన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్, బీజేపీ లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం టి. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా ప్రకటించే దశలో వాయిదా వేసి అనూహ్య పరిణామాలలో ఏ. రేవంత్ రెడ్డిని నియమించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోవడంతో ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం కోల్పోయారు జీవన్ రెడ్డి.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టి. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. రైతులు, నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇతర అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. నిజామాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక స్థానం నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఏఐసీసీ భావించింది. చివరికి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రెండు లిస్టులలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం నిజామాబాద్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అనుకున్న స్థాయి నుంచి ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితికి నెట్టివేయడం జీవన్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లలో పెండింగ్ లో కాంగ్రెస్ టికెట్లు
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరిగ్గా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచడం విశేషం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముందున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్తోమత దృష్ట్యా జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. 29 మార్చి 2025 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నందున మంత్రి పదవి ఇవ్వడంలో సాంకేతిక అవరోధం ఉండదు. ఎమ్మెల్సీ లకు కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీ కూడా.
నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్) లు తమ అభ్యర్థులుగా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరు ఇద్దరూ మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో పాటు ముత్యాల సునీల్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరు ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వైద్యురాలు డా. కవితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్. రమణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎల్. రమణ ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే జనరల్ క్యాటగిరీ లో మిగిలినవి 11 సీట్లు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం కోసం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో చల్లా వంశీచంద్ రెడ్డి (మహబూబ్ నగర్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్గొండ), డా. జి. రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి) నలుగురు రెడ్డీలకు టికెట్లు ఇచ్చింది. బలరాం నాయక్ (మహబూబాబాద్ - ఎస్టీ), డా. మల్లు రవి (నాగర్ కర్నూల్ - ఎస్సీ), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి - ఎస్సీ), బీసీ అభ్యర్థులు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), దానం నాగేందర్ (సికింద్రాబాద్) లకు టికెట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ), హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.
More News...
<%- node_title %>
<%- node_title %>
"చల్ ఉరుకుండ్రి..! వాస్తవ కథనం
అల్లే రమేష్.సిరిసిల్ల :సెల్: 9030391963.
కుర్చిలకుసోనిబాపు సోచైస్తుండు.ఇంతాజేసిన వంగుతలేరు.ఎంత మర్శిపోధమన్నా కోడి కండ్ల ముందే మెదులుతుంది.బాపు గిట్ల జేస్తుండేదని కిందోల్లంతా మాడుపు మొకాం పెట్టుకున్నారు. ఎన్నిజేయల్నో అన్ని జేసిన ఇగ ఇప్పుడు ఏం జేయలే...అసలే ముంగిట పెద్దుర్ల్ల జాతరలు ఉ ఉన్నాయీ బాపు మనుసుల లేదు.ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.ఇంతట్ల చేయికింది ఉత్తయ్యి ఉరుకుంటొచ్చిండు. బాపు
మునుపటి... వంగర పోలీస్ స్టేషన్లో ఏసీపీ వార్షిక తనిఖీలు
స్వాగతం పలికిన ఎస్సై దివ్య పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి : ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలో మూడో విడత జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు మండల ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటరు... గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్దవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్_ 7 మండలాల్లోని 144 గ్రామాలు, 1276 వార్డులకు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ నేటితో ముగింపు
రాయికల్ డిసెంబర్ 2 (ప్రజా మంటలు)-నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల... కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వం చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ జగిత్యాల హోల్ సేల్ అండ్ కిరాణా వర్తక సంఘం
కొండగట్టు డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)
ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి దురదృష్టకర సంఘటన బాధాకరమైన విషయమని మాకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని మేము అందజేసిన నగదు ద్వారా మళ్లీ చిరు వ్యాపారాన్ని కొనసాగించుకొని వారి జీవితాలను ముందుకు సాగించుకునే ప్రక్రియ కు తోడ్పడాలని కోరుకుంటూ ప్రజలంతా ఆన్లైన్ వ్యాపారాలను ప్రోత్సహించకుండా... రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ నియామకం
మెట్ పెల్లి డిసెంబర్ 2(ప్రజా మంటలు)(సౌడాల కమలాకర్)
రెడ్ కో జిల్లా మేనేజర్ గా దురిశెట్టి మనోహర్ ను ప్రభుత్వం నియమించింది. కాగా
ఈ పదవిలో అతను ఏడాదికాలం పాటు కొనసాగుతారు. విద్యుత్ సంస్థలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన అనుభవం, వినియోగదారులు, రైతులతో విస్తృత పరిచయాలు ఉండటం వల్ల హరిత ఇంధన ఉత్పత్తి... Sanchar Saathi తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్పై వివాదం — మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ
న్యూ ఢిల్లీ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
భారత ప్రభుత్వం 2026 మార్చి నుంచి మార్కెట్లో అమ్మకానికి వచ్చే అన్ని స్మార్ట్ఫోన్లలో Sanchar Saathi యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలని టెలికం శాఖ (DoT) ఇచ్చిన తాజా ఆదేశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. వినియోగదారుల గోప్యత, డిజిటల్ ఫ్రీడమ్, ఫోన్ కంపెనీల విధానాలు వంటి... పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి
నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం(డిసెంబర్ 2వ తేదీ )
--డాక్టర్. వై. సంజీవ కుమార్, ఫౌండర్ & ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్. 9393613555,9493613555.
సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో... తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు.
కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం... రేపు హుస్నాబాద్లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ
హుస్నాబాద్, డిసెంబర్ 3, 2025 (ప్రజా మంటలు):
హుస్నాబాద్ పట్టణం మరో భారీ కాంగ్రెస్ శక్తి ప్రదర్శనకు సాక్ష్యమవుతోంది. బుధవారం (03-12-2025) జరుగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
సీఎం హోదాలో మొదటిసారి హుస్నాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి, ఏమిస్టారో అని సామాన్యులే... గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ
సికింద్రాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతిని మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.బిజెపి నాయకులు... సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము దొంగల మర్రి చెక్పోస్ట్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
,
మల్యాల డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా... 