ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలి ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీధర్ కస్తూరి

On
ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలి  ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీధర్ కస్తూరి

ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలి ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీధర్ కస్తూరి

ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలి
ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీధర్ కస్తూరి

(రామ కిష్టయ్య సంగన భట్ల)
..................................
 విద్యార్థులు బాల్యం నుండే ప్రశ్నించే తత్వం అలవర్చు కావాలని లబ్ద ప్రతిష్టులు, దేశ విదేశాల్లో విఖ్యాతులు, 
ప్రముఖ హృద్రోగ వైద్యులు శ్రీధర్ కస్తూరి సూచించారు. ధర్మపురి క్షేత్రంలోని దశాబ్దాల చరిత్ర గల వాటర్ ట్యాంక్ పక్కన గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ప్రముఖ హృద్రోగ వైద్యులు, ధర్మపురి వాస్తవ్యులు డా. శ్రీధర్ కస్తూరి సుమారు 50 వేల రూపాయల విలువ గల స్మార్ట్ టీవీ మరియు సౌండ్ సిస్టమ్ లను బహుమతిగా అందించి, శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపర్తి విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు విద్యార్థుల సౌకర్యార్థం వీటిని సమకూర్చారు. ఈ సందర్భంగా స్థానికులు డాక్టర్  శ్రీధర్ కస్తూరి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఎలాంటి సందేహాలు కలిగినా, వెంటనే గురువుల వద్ద సందేహ నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. కష్టపడి చదివితే ఉన్నత పదవులు ఉద్యోగాలు లభిస్తాయని, అందుకే ఇష్టపడి చదువాలన్నారు. కేవలం చదువే కాక, మంచి స్నేహంతో సమాజాన్ని అర్థం చేసుకుని, ముందుకు సాగాలని వివరించారు. విద్యార్థులకు ఏ అవసరమున్న తీరుస్తానని, పేద విద్యార్థులకు అండగా ఉంటానని తెలిపారు. విద్యావేత్త, బ్యాంకు అధికారి గుండి విష్ణు ప్రసాద్ తమ సందేశంలో... విద్యార్థులు చదువే కాక అన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, శ్రీధర్  మిత్రబృందం సభ్యులు రాపర్తి నర్సయ్య, శ్రీ గుండి విష్ణు ప్రసాద్, దూస రాజేశ్వర్, సురేందర్, రాపర్తి రాములు, నారాయణా చార్యులు, జక్కు రవీందర్, పాత బాలచందర్ , పాఠశాల ఉపాధ్యాయులు స్వప్న ప్రియ, భాగ్యలక్ష్మి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Tags
Join WhatsApp

More News...

National  Sports 

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన!

ఐసీసీ అవార్డులు గెలుచుకున్న అభిషేక్ శర్మ, స్మృతి మంధాన! ముంబాయి అక్టోబర్ 16: అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు. అభిషేక్ శర్మ మరియు స్మృతి మంధాన సెప్టెంబర్ నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మరియు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు. ఐసిసి...
Read More...
Local News 

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష

చెక్ బౌన్స్ కేసులో గంటా రామ్మోహన్ కు 6 నెలల జైలుశిక్ష మెట్టుపల్లి అక్టోబర్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్): చెక్ బౌన్స్ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన గంటా రామ్మోహన్ కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ మెట్ పల్లి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నారం అరుణ్ కుమార్ తీర్పు వెలువరించారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడటం గమనార్హం. ఫిర్యాదుదారు...
Read More...
Local News 

బిసి బంద్ ను విజయవంతం కొరకు  ముందుకు రండి...

బిసి బంద్ ను విజయవంతం కొరకు  ముందుకు రండి... పద్మశాలి మండల కార్యదర్శి అంకం భూమయ్య    గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని గొల్లపల్లి మండల పద్మశాలి కార్యదర్శి అంకం భూమయ్య  పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల 18వ...
Read More...
Local News 

తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

తహసిల్దార్ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):    గొల్లపెల్లి మండలం లోని తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, జిల్లా కలెక్టర్ నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తు ను శూన్యంగా  పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.    మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు
Read More...
Local News 

గొల్లపల్లిలో పోషణ మాసం కార్యక్రమం 

గొల్లపల్లిలో పోషణ మాసం కార్యక్రమం  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 16 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలంలో మండల స్థాయి పోషణ మాసం  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ వీరలక్ష్మి  మాట్లాడుతూ, గర్భిణీ బాలింతలు, పిల్లలు సమతుల్య ఆహారం తీసుకోవాలని ,తక్కువ ఖర్చుతో,ఎక్కువ పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలని  సూచించారు  మరియు తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు మొలకెత్తిన ప్రతి...
Read More...
State News 

అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు - మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్

అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు -  మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్ కొండా సురేఖ–OSD వివాదం: ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి పేర్లు చర్చలోకి హైదరాబాద్‌ అక్టోబర్ 16: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె వ్యక్తిగత ఓఎస్‌డీ సుమంత్‌పై వచ్చిన బెదిరింపు, అవినీతి ఆరోపణలతో ప్రారంభమైన వివాదం ఇప్పుడు మంత్రివర్గ స్థాయికి చేరింది. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులను బెదిరించాడనే ఫిర్యాదుతో సుమంత్‌ను ప్రభుత్వంసస్పెండ్‌...
Read More...
Local News 

ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ

ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాలలో బీసీ(JAC) నాయకులు రోడ్లపై నిరసన కార్యక్రమం*   జగిత్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు  బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో  జరిగింది  జగిత్యాల పట్టణంలో బీసీ నాయకులు తమకు రావలసిన హక్కులని రావాలని రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లు పాస్ చేసింది కాబట్టి ఇప్పుడు మరియు...
Read More...
State News 

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా?

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా? మంత్రి కొండ సురేఖ చుట్టూ రాజకీయ కలకలం — OSD తొలగింపు, అరెస్ట్ వివాదం, మంత్రివర్గ భవిష్యత్తు ప్రశ్నార్థకం హైదరాబాద్ అక్టోబర్ 16: హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో మంత్రి కొండ సురేఖ చుట్టూ వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా ఆమె కార్యాలయానికి చెందిన OSD (అఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ను ప్రభుత్వం తొలగించడమే...
Read More...
National 

బీహార్ లో కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం

బీహార్ లో  కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం పాట్నా అక్టోబర్ 16: ₹78.7 లక్షల విలువైన మద్యం, ₹37.14 కోట్ల విలువైన వస్తువులు, ఎన్నిక ప్రకటన తర్వాత 221 అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్లు బీహార్ రాష్ట ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ధనబలాన్ని అరికట్టడానికి, బుధవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు మొత్తం ₹1.284 కోట్ల విలువైన మద్యం, నగదు,...
Read More...
State News 

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించే యత్నాలు షురూ OSD సుమంత్ కై పోలీసుల గాలింపు ఇదంతా రెడ్డి వర్గం కుట్రగా సురేఖ ఆరోపణ  హైదరాబాద్ అక్టోబర్ 16 (ప్రజా మంటలు)::  మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి, OSD సుమంత్ కొరకు వెదకడానికి చేసిన ప్రయత్నం అధికార పార్టీలో దుమారం...
Read More...
State News 

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ బి.ఆర్‌. గవాయి  మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈ నెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. హైదరాబాద్‌ జిల్లా ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర...
Read More...
Local News 

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు): మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాందిఅవుతుంది అను ఐ సి డి ఎస్ సి డి పి ఓ వాణిశ్రీ  అన్నారు.జిల్లాలోని ధర్మపురి ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి వాణిశ్రీ  ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు బుధవారం రోజున సారంగపూర్ రైతు వేదికలో ఘనంగా...
Read More...