నగరానికి నిజాం కట్టడాల ప్రతిభా సాక్ష్యం

సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ శోధన ఫలితం

On
నగరానికి నిజాం కట్టడాల ప్రతిభా సాక్ష్యం

రామ కిష్టయ్య సంగన భట్ల

(సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9440595494)
..
“వరంగల్‌ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే నూతన ఆవిష్కృత కాఫీ టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకర మవుతుందని,  చారిత్రక అంశాలపై ఒక పౌర సంబంధాల అధికారి ఇంత విలువైన కృషి చేయడం నిజంగా అభినందనీయమైన విషయం.”  అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రచించిన JEWELS OF ASAF JAHI’S – The Glory of Warangal అనే కాఫీ టేబుల్ బుక్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వేర్వేరు కార్యక్రమాల్లో ఆవిష్కరించారు. డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని సి.ఎస్ ఛాంబర్‌లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్. ప్రియాంక కూడా హాజరయ్యారు. అనంతరం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు.IMG-20251113-WA0002

ఈ సందర్భంగా సి.ఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ, వరంగల్ చరిత్ర, నిజాం కాలపు వారసత్వం, అసఫ్‌జాహీ వంశపు నిర్మాణ వైభవం అన్నీ కలగలసిన ఈ పుస్తకం తెలంగాణ చరిత్రలో విలువైన మార్గదర్శక గ్రంథంగా నిలుస్తుందని అభినందించారు.

రచయిత కన్నెకంటి వెంకట రమణ మాట్లాడుతూ, “వరంగల్ అనగానే కాకతీయుల వైభవం, వేయి స్థంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం వెంటనే మనకు గుర్తొస్తాయి. కానీ అదే నగరంలో కాజిపేట నుండి మామునూర్ వరకు నిజాం నవాబులు నిర్మించిన ఎన్నో అద్భుత భవనాలు, కళాత్మక కట్టడాలు, ఆధునికతకు మార్గదర్శకమైన నిర్మాణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు” అని వివరించారు.

ఈ పుస్తకంలో వరంగల్ కేంద్రంగా ఏర్పడిన అసఫ్ జాహీ పాలనా విభాగమైన “వరంగల్ సుబా” చరిత్ర, అందులో భాగమైన ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ప్రాంతాల పరిపాలన, అక్కడి సుబేదారుల వివరాలు, వారి ప్రత్యేకతలతో పాటు అరుదైన పత్రాధారాలు సమగ్రంగా పొందుపరిచారు. ఆ కాలపు పాలనా శైలి, నిర్మాణ శిల్పం, సామాజిక–సాంస్కృతిక పరిణామాలు, నిజాం యుగపు హెరిటేజ్ భవనాల ఫోటోలు ఈ గ్రంథాన్ని అరుదైన చరిత్ర పత్రంగా నిలిపాయి.

నిజాం కాలంలో నిర్మితమైన కాజిపేట రైల్వే స్టేషన్, ప్రస్తుత మిషన్ భగీరథ పథకానికి మూలమైన ధర్మసాగర్ ఫిల్టర్ బెడ్, పలు కోటలు, ప్రభుత్వ భవనాలు, మసీదులు, విద్యాసంస్థలు ఈ గ్రంథంలో విశదీకరించబడ్డాయి. ప్రతి చిత్రానికి వెనుక చరిత్రాత్మక నేపథ్యం, ఆ కాలపు శైలీ సౌందర్యం వివరించబడింది.

JEWELS OF ASAF JAHI’S – The Glory of Warangal పుస్తకం కేవలం చిత్రసంపుటం మాత్రమే కాదు — అది వరంగల్ నగర చరిత్రలో మానవ కృషి, కళ, సాంస్కృతిక పరిపుష్టి, నిర్మాణ వారసత్వం ప్రతిబింబించే విలువైన గ్రంథం. చరిత్రాభిమానులు, విద్యార్థులు, పరిశోధకులు, వారసత్వ సంరక్షణకారులు అందరికీ ఇది ప్రేరణగా నిలుస్తుందని సి.ఎస్‌, డీజీపీలు అభిప్రాయపడ్డారు.

చారిత్రక అవగాహనను విస్తరించి, నిజాం యుగపు నిర్మాణ సంపదను వెలికితీస్తూ, వరంగల్ నగర మహిమాన్విత చరిత్రను కొత్త దృక్కోణంలో పరిచయం చేసిన ఈ గ్రంథం తెలంగాణ సంస్కృతి, వారసత్వ గాధలో చిరస్మరణీయంగా నిలవనుంది.

Join WhatsApp

More News...

Local News 

జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు...
Read More...
Local News 

జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్ )నవంబర్ 13 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు. 🎓 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు...
Read More...
State News 

ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్

ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్ RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్ హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు): హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు. 🔹 2021...
Read More...
State News 

నగరానికి నిజాం కట్టడాల ప్రతిభా సాక్ష్యం

నగరానికి నిజాం కట్టడాల ప్రతిభా సాక్ష్యం రామ కిష్టయ్య సంగన భట్ల (సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9440595494)..“వరంగల్‌ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే నూతన ఆవిష్కృత కాఫీ టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకర మవుతుందని,  చారిత్రక అంశాలపై ఒక పౌర సంబంధాల అధికారి ఇంత విలువైన కృషి చేయడం నిజంగా అభినందనీయమైన...
Read More...

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి,వార్డు లో 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్     ఎమ్మెల్యే మాట్లాడుతూ  కేంద్రం 2300 మద్దతు ధర ప్రకటించినా...
Read More...

వైద్యుడు సేవా బావముతోనే రాణిస్తాడు  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

వైద్యుడు సేవా బావముతోనే రాణిస్తాడు  ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  జగిత్యాల నవంబర్ 13(ప్రజా  మంటలు)వైద్యుడు సేవా భావము తోనే రాణిస్తాడు అన్నారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మోని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ మొదటి సంవత్సరం లో ఉత్తమ పలితాలు సాధించి డిస్టింగ్షన్ లో పాసైన విద్యార్థులను ప్రశంసా పత్రాలు...
Read More...

శ్రీ శ్రీనివాసంజనేయ భవాని శంకర దేవాలయం లో త్రయానిక  ఏక కుండాత్మక ,దేవాలయ సంప్రోక్షణ పూజా కార్యక్రమం..

శ్రీ శ్రీనివాసంజనేయ భవాని శంకర దేవాలయం లో త్రయానిక  ఏక కుండాత్మక ,దేవాలయ సంప్రోక్షణ పూజా కార్యక్రమం.. జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాసంజనేయ భవాని శంకర దేవాలయం లో త్రయానిక ఏక కుండాత్మక దేవాలయ సంప్రోక్షణ, మరియు నూతన ఉత్సవ మూర్తుల ప్రతిష్టా మహోత్సవం సందర్బంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు. ఉత్సవ మూర్తులను స్థానిక వైశ్య భవన్ నుండీ మేళ తాళాలతో, మహిళలు మంగళహారతులతో స్వామివారి...
Read More...
Filmi News  State News 

సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ

సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మహిళల భద్రత కోసం గళం వినిపిస్తున్న సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ! హైదరాబాద్‌, నవంబర్ 12 (ప్రజా మంటలు): మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై తన స్వరం వినిపిస్తూ ఎప్పుడూ ముందుండే సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు....
Read More...

ఢిల్లీ కారు పేలుడును ఉగ్రవాద దాడిగా ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ కారు పేలుడును ఉగ్రవాద దాడిగా ప్రకటించిన కేంద్రం ఢిల్లీ కారు పేలుడు ఉగ్రదాడి – ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రం అధికారిక ప్రకటన న్యూ ఢిల్లీ నవంబర్ 12 (ప్రజామంటలు): దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం నాడు జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సమావేశం అనంతరం,...
Read More...
Local News  State News 

అంగన్వాడీ చిన్నారుల మధ్య స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని జన్మదిన వేడుకలు

అంగన్వాడీ చిన్నారుల మధ్య స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని జన్మదిన వేడుకలు అంగన్వాడీ విద్యార్థులకు ఆటవస్తువుల పంపిణీ    సికింద్రాబాద్,నవంబర్ 12 (ప్రజామంటలు):      సికింద్రాబాద్ పరిధిలో రాణిగంజ్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం  చిన్నారుల మధ్యలో స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమారి. ఓ.పావని జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులకు ఇష్టమైన వివిధ రకాల తినుబండారాలను, ఆటవస్తువులను  అందజేశారు. ఈ కార్యక్రమములో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరిత, ప్రెసిడెంట్ వై....
Read More...
Local News  State News 

పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి..   : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి

పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి..   : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) : పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా...
Read More...
Local News  Crime  State News 

తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత మరింత బలోపేతం :: మీడియా తో టెలికాం అదనపు డీజీ 

తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత మరింత బలోపేతం :: మీడియా తో టెలికాం అదనపు డీజీ  సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగదారుల డిజిటల్ భద్రత బలోపేతం చేస్తూ పౌరుల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని టెలికాం అదనపు డీజీ నాగేష్ రావు తెలిపారు. బుధవారం సీటీవోలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు పొగొట్టుకున్న,...
Read More...