జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్
జగిత్యాల, నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి అక్రమ కబ్జా ఆరోపణలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఈ వివాదంపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
70 ఏళ్లుగా సాగుతున్న వివాదం – “అధికారుల నిర్లక్ష్యమే మూలం”
వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వసంత సురేష్ గారు, ఈ భూమి విషయంపై గత 70 ఏళ్లుగా వివాదం కొనసాగుతోందని, కానీ అధికారుల నిర్లక్ష్యం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి చెందిన వందల కోట్ల విలువైన భూమి వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
“జగిత్యాల పట్టణంలోని 138 సర్వే నెంబరు భూమి పరిస్థితి చూస్తే తలా పాపం చెరో పిడికెడు అన్నట్టుగా ఉంది. ప్రతి దశలో ఏదో ఒక లోపం, ప్రతి ఫైల్లో ఏదో ఒక అనుమానం, ప్రతి నిర్ణయంలో అధికార అనాసక్తి కనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు ఎవరు?
“ఈ భూమిపై అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఏ విభాగం?”
“మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?”
“ప్రభుత్వ భూమిని వ్యక్తులకు ధారాదత్తం చేసే సమయంలో నిబంధనలు ఎలా ఉల్లంఘించారు?”
“ఈ వ్యవహారం మొత్తం కిబాల్స్ (Kibale) డాక్యుమెంట్స్ చుట్టూనే తిరుగుతోంది. వాటిని పూర్తి స్థాయిలో ట్రాన్స్లేట్ చేయించి వాస్తవాలు ఏమిటో ప్రజలకు వెల్లడిస్తాం” అని ఆయన తెలిపారు.
అక్రమాలు నిరూపితమైతే భూమి స్వాధీనం చేసుకోవాలి – బాధ్యులపై చర్యలు
“విచారణలో భూ ఆక్రమణ, అక్రమాలు నిరూపితమైతే భూమిని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. నిబంధనలను అతిక్రమించిన అధికారులు, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.”
అలాగే ఈ వ్యవహారం ఇక్కడితో మూడిపోదని, అవసరమైతే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి, వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
వసంత గారు మాట్లాడుతూ, “ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలనే కేసీఆర్ గారి స్ఫూర్తితోనే BRS తరఫున ఈ పోరాటం చేస్తున్నాం” అన్నారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఏ రాజకీయ వర్గానికీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, BRS నాయకులు శీలం ప్రవీణ్, నాచుపెల్లి రెడ్డి అనురాధ, నక్క గంగాధర్, రిజ్వాన్, నీలి ప్రతాప్, గంగిపెల్లి వేణుమాధవ్, గాజుల శ్రీనివాస్, మధుకర్, ప్రణయ్, భగవాన్ రాజ్, కోటగిరి మోహన్, నవదీప్, జవీద్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గారి సహకారంతో బ్లూ ఓషన్ కంపెనీ నిర్వహించనున్న మెగా జాబ్ మేళా (మహిళలకు) కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
10వ తరగతి విద్యార్హత తో ,18 నుండి 35 వయస్సు కలిగి ఉన్న... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు... ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి అదనపు కలెక్టర్లు స్వీకరించారు
ఈ సందర్భంగా వారు... రెడ్ ఫోర్ట్. వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా?
రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా? ఉగ్ర హెచ్చరికలకా సూచన?
ఢిల్లీ పేలుళ్లు ఘటనపై ప్రత్యేక విశ్లేషణ
న్యూ ఢిల్లీ నవంబర్ 10 (ప్రత్యేక ప్రతినిధి):
భారత రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న పేలుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతోంది.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్రంగా... మహాకాళి టెంపుల్ లో కార్తీక మాస సోమవారం వేడుకలు
మహిళ భక్తులకు వాయినాలు *ఆలయ ఆవరణలో ఆకాశదీపం, హరికథ
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) :
కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం ఆకాశదీపం వెలిగించి, మహిళ భక్తులకు వాయినాలు అందచేశారు. కార్తీక మాస... గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) :
వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్(రిటైర్డ్) ఈ. రాఘవరావు (91)వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం అత్తాపూర్ లో కన్నుమూశారు. గతంలో ఆయన చేసిన డిక్లరేషన్ ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చి, అనాటమీ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు.
వైద్య విద్యార్థుల పరిశోధనల... రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి
మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గర అశోక్):
TSAT Network మరియు TSGHMA సంయుక్తంగా నిర్వహించిన *జగిత్యాల జిల్లా స్థాయి* పోటీల్లో మెటుపల్లి మండలం వెల్లుల్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి *గొర్ల శ్రీచరణ్* ఉపన్యాసం [బాలవక్త] పోటీలో *ప్రథమ స్థానం లో గెలిచి "రాష్ట్ర స్థాయి" పోటీలకు ఎంపిక అయినారు.
వ్యాసరచన... టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
ప్రధాన కార్యదర్శిగా జోరిగే శ్రీనివాస్
మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జగిత్యాల జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర... గొల్లపల్లి మండలంలో గంజాయి పట్టుకొన్న ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామ శివారులో బాలస్తీ గణేష్ సం 23 వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వాస్తవ్యుడు గంజాయి తరలిస్తుండగా పట్టు పడ్డ యువకుని వద్ద నుండి 80 గ్రాముల గంజాయి స్వాదిన పరుచుకొని ఎన్డిపిఎస్ చట్టం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు
ఎస్ఐ... లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు)
తెలంగాణ ఉద్యమంలో 2003 సంవత్సరంలో కరీంనగర్ లో తెలంగాణ సభలో పరిచయము మా మధ్య స్నేహాన్ని వికసింపజేసి నేటి వరకు నిరంతరంగా కొనసాగింది .అందెశ్రీ గొల్లపల్లి మండలం కేంద్రంలో 2005వ సంవత్సరంలో పుస్తకావిష్కరణ సభలో ఆవిష్కర్తగా అలాగే 2022వ సంవత్సరంలో గాయం గేయమైన వేళ సభలో... జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్
జగిత్యాల, నవంబర్ 10 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి అక్రమ కబ్జా ఆరోపణలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఈ వివాదంపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు... ఫరీదాబాద్లో ఇమామ్ ఇంటి నుండి 50 బస్తాల పేలుడు పదార్థం స్వాధీనం
పికప్ వాహనంలో పేలుడు బస్తాలు తరలింపువివరాలు వెల్లడించడానికి పోలీసుల నిరాకరణఫరీదాబాద్ (హర్యానా) నవంబర్ 10: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో సోమవారం పోలీసుల సర్చ్ ఆపరేషన్ భారీ రహస్యం బయటపెట్టింది. ఒక ఇమామ్ నివాసంలో 50 బస్తాల పేలుడు పదార్థం లభ్యమవడంతో మొత్తం ప్రాంతంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఇమామ్ ఇంటికి ఆతంకవాది ముజమ్మిల్... 