జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్

On
 జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్

జగిత్యాల, నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి అక్రమ కబ్జా ఆరోపణలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఈ వివాదంపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

70 ఏళ్లుగా సాగుతున్న వివాదం – “అధికారుల నిర్లక్ష్యమే మూలం”

వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వసంత సురేష్ గారు, ఈ భూమి విషయంపై గత 70 ఏళ్లుగా వివాదం కొనసాగుతోందని, కానీ అధికారుల నిర్లక్ష్యం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి చెందిన వందల కోట్ల విలువైన భూమి వ్యక్తుల చేతుల్లో బందీ అయిపోయిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

“జగిత్యాల పట్టణంలోని 138 సర్వే నెంబరు భూమి పరిస్థితి చూస్తే తలా పాపం చెరో పిడికెడు అన్నట్టుగా ఉంది. ప్రతి దశలో ఏదో ఒక లోపం, ప్రతి ఫైల్‌లో ఏదో ఒక అనుమానం, ప్రతి నిర్ణయంలో అధికార అనాసక్తి కనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు ఎవరు? 

“ఈ భూమిపై అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఏ విభాగం?”

“మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?”

“ప్రభుత్వ భూమిని వ్యక్తులకు ధారాదత్తం చేసే సమయంలో నిబంధనలు ఎలా ఉల్లంఘించారు?”

“ఈ వ్యవహారం మొత్తం కిబాల్స్ (Kibale) డాక్యుమెంట్స్ చుట్టూనే తిరుగుతోంది. వాటిని పూర్తి స్థాయిలో ట్రాన్స్‌లేట్ చేయించి వాస్తవాలు ఏమిటో ప్రజలకు వెల్లడిస్తాం” అని ఆయన తెలిపారు.IMG-20251110-WA0033

అక్రమాలు నిరూపితమైతే భూమి స్వాధీనం చేసుకోవాలి – బాధ్యులపై చర్యలు

“విచారణలో భూ ఆక్రమణ, అక్రమాలు నిరూపితమైతే భూమిని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. నిబంధనలను అతిక్రమించిన అధికారులు, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.”

అలాగే ఈ వ్యవహారం ఇక్కడితో మూడిపోదని, అవసరమైతే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి, వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

వసంత గారు మాట్లాడుతూ, “ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలనే కేసీఆర్ గారి స్ఫూర్తితోనే BRS తరఫున ఈ పోరాటం చేస్తున్నాం” అన్నారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడడం ఏ రాజకీయ వర్గానికీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, BRS నాయకులు శీలం ప్రవీణ్, నాచుపెల్లి రెడ్డి అనురాధ, నక్క గంగాధర్, రిజ్వాన్, నీలి ప్రతాప్, గంగిపెల్లి వేణుమాధవ్, గాజుల శ్రీనివాస్, మధుకర్, ప్రణయ్, భగవాన్ రాజ్, కోటగిరి మోహన్, నవదీప్, జవీద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

Local News 

గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత

గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) : వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్(రిటైర్డ్) ఈ. రాఘవరావు (91)వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం అత్తాపూర్ లో కన్నుమూశారు. గతంలో ఆయన చేసిన డిక్లరేషన్ ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చి, అనాటమీ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు. వైద్య విద్యార్థుల పరిశోధనల...
Read More...
Local News 

రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి

రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గర అశోక్): TSAT Network మరియు TSGHMA సంయుక్తంగా  నిర్వహించిన *జగిత్యాల జిల్లా స్థాయి* పోటీల్లో మెటుపల్లి మండలం వెల్లుల్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి *గొర్ల  శ్రీచరణ్* ఉపన్యాసం [బాలవక్త] పోటీలో  *ప్రథమ స్థానం లో గెలిచి "రాష్ట్ర స్థాయి" పోటీలకు ఎంపిక అయినారు. వ్యాసరచన...
Read More...
Local News 

టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.   ప్రధాన కార్యదర్శిగా జోరిగే శ్రీనివాస్  మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జగిత్యాల జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర...
Read More...
Local News  Crime 

గొల్లపల్లి మండలంలో గంజాయి పట్టుకొన్న ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి 

గొల్లపల్లి మండలంలో గంజాయి పట్టుకొన్న ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామ శివారులో బాలస్తీ గణేష్ సం 23   వెల్గటూర్ మండలం స్తంభంపల్లి  వాస్తవ్యుడు గంజాయి తరలిస్తుండగా పట్టు పడ్డ యువకుని వద్ద నుండి 80 గ్రాముల గంజాయి స్వాదిన పరుచుకొని  ఎన్డిపిఎస్ చట్టం  కేసు నమోదు చేసి విచారణ  చేపడుతున్నట్లు ఎస్ఐ...
Read More...
Local News 

లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు 

లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు  (అంకం భూమయ్య)  గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు)    తెలంగాణ ఉద్యమంలో 2003 సంవత్సరంలో కరీంనగర్ లో తెలంగాణ సభలో పరిచయము మా మధ్య స్నేహాన్ని వికసింపజేసి నేటి వరకు నిరంతరంగా కొనసాగింది .అందెశ్రీ గొల్లపల్లి మండలం కేంద్రంలో 2005వ సంవత్సరంలో  పుస్తకావిష్కరణ సభలో ఆవిష్కర్తగా అలాగే 2022వ సంవత్సరంలో గాయం గేయమైన వేళ సభలో...
Read More...
Local News  State News 

 జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్

 జగిత్యాల భూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరపండి: దావ వసంత సురేష్ జగిత్యాల, నవంబర్ 10 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి అక్రమ కబ్జా ఆరోపణలు మరోసారి తెరమీదకొచ్చాయి. ఈ వివాదంపై తక్షణమే పారదర్శక విచారణ జరపాలని జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు...
Read More...
National  Crime  State News 

ఫరీదాబాద్‌లో ఇమామ్ ఇంటి నుండి 50 బస్తాల పేలుడు పదార్థం స్వాధీనం

ఫరీదాబాద్‌లో ఇమామ్ ఇంటి నుండి 50 బస్తాల పేలుడు పదార్థం స్వాధీనం పికప్ వాహనంలో పేలుడు బస్తాలు తరలింపువివరాలు వెల్లడించడానికి పోలీసుల నిరాకరణఫరీదాబాద్ (హర్యానా) నవంబర్ 10: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో సోమవారం పోలీసుల సర్చ్ ఆపరేషన్ భారీ రహస్యం బయటపెట్టింది. ఒక ఇమామ్ నివాసంలో 50 బస్తాల పేలుడు పదార్థం లభ్యమవడంతో మొత్తం ప్రాంతంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఇమామ్ ఇంటికి ఆతంకవాది ముజమ్మిల్...
Read More...
National  State News 

కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీలో కలకలం

కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీలో కలకలం “ప్రభుత్వం స్థిరంగానే ఉంది” — సిద్ధరామయ్య ధీమా!డీకే శివకుమార్ లెక్కలు మారుతున్నాయా?న్యూఢిల్లీ, నవంబర్ 10:కర్ణాటకలో గత కొంతకాలంగా సీఎం మార్పుపై ఊహాగానాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. నవంబర్‌లోనే మార్పు జరుగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతుండగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు ఢిల్లీ–బెంగళూరు మార్గంలో బిజీగా తిరుగుతున్న...
Read More...
National  State News 

అసోం లోని #Draft: Add Your Titleఉదాల్గురిలో 10,000 మందికి పైగా సంతాల్ విద్యార్థుల ర్యాలీ

అసోం లోని #Draft: Add Your Titleఉదాల్గురిలో 10,000 మందికి పైగా సంతాల్ విద్యార్థుల ర్యాలీ గౌహతి అస్సాం నవంబర్ 10: ఉదాల్గురిలో సోమవారం భారీ ఎత్తున జరిగిన సంతాల్ సమాజ ర్యాలీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆల్ సంతాల్ స్టూడెంట్స్ యూనియన్ (ASSU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ నిరసన ప్రదర్శనలో 10,000 మందికి పైగా ప్రజలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. మోన్పూర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరం...
Read More...

ANM ట్రైనింగ్ స్కూల్‌లో ట్రైనర్ యువతి ఆత్మహత్య?

ANM ట్రైనింగ్ స్కూల్‌లో ట్రైనర్ యువతి  ఆత్మహత్య? పాట్నాలో 25 ఏళ్ల టీచర్ అనుమానాస్పద మృతి పట్నా నవంబర్ 10: పట్నాలోని ప్రైవేట్ ANM ట్రైనింగ్ స్కూల్‌లో సోమవారం ఉదయం ఓ యువతి టీచర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఫస్ట్ ఫ్లోర్ గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో లభించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....
Read More...

హార్ట్ స్ట్రోక్‌తో బాత్ రూంలోనే అందెశ్రీ మృతి?

హార్ట్ స్ట్రోక్‌తో బాత్ రూంలోనే అందెశ్రీ మృతి? హార్ట్ స్ట్రోక్‌తో గాంధీ ఆసుపత్రిలో అందెశ్రీ మృతి హైదరాబాద్, నవంబర్ 10:హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో అందెశ్రీ (వయసు సుమారు 45 సంవత్సరాలు) హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఉదయం 7:20 గంటలకు కుటుంబ సభ్యులు అందెశ్రీని గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు, కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు....
Read More...
State News 

అందెశ్రీ మరణానికి జగిత్యాల ప్రముఖుల నివాళి

అందెశ్రీ  మరణానికి జగిత్యాల ప్రముఖుల నివాళి   జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమంలోని శక్తివంతమైన స్వరమైన డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల తెలంగాణ నాయకులు, ప్రజాప్రతినిధులు గాఢంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. “తెలంగాణ సాహిత్య లోకానికి అందెశ్రీ అకాల మరణం తీరని లోటు....
Read More...