చదువులో టాపర్… జీవితంలో ఓడిపోయింది! కన్నీటి సముద్రంలో వంగర గురుకులం

కరిగిపోయిన కన్న తల్లిదండ్రుల కలలు  * నిన్న ఫోన్‌లో మాట్లాడింది… ఈరోజు శవపేటికలో..  

On
చదువులో టాపర్… జీవితంలో ఓడిపోయింది!  కన్నీటి సముద్రంలో వంగర గురుకులం

ఇంత తెలివైన అమ్మాయి ఎందుకిలా…” చదువులో టాపర్   * గురుకులంలో కుదుపేసిన ఆత్మహత్య ఘటన 

చదువులో టాపర్… జీవితంలో ఓడిపోయింది!

* కన్నీటి సముద్రంలో వంగర గురుకులం

* కరిగిపోయిన కన్న తల్లిదండ్రుల కలలు 

* నిన్న ఫోన్‌లో మాట్లాడింది… ఈరోజు శవపేటికలో..    
 
* “ఇంత తెలివైన అమ్మాయి ఎందుకిలా…” చదువులో టాపర్  

* గురుకులంలో కుదుపేసిన ఆత్మహత్య ఘటన 


భీమదేవరపల్లి, అక్టోబర్ 24 (ప్రజామంటలు) :

హనుమకొండ జిల్లా వంగర మండలంలోని పీవీ నర్సింహరావు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. వివరాల ప్రకారం, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వనం తిరుపతి, మమత దంపతుల కుమార్తె వనం గాయత్రి (15) గత నాలుగేళ్లుగా వంగర గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. ప్రస్తుతం పదో తరగతిలో చదువుతున్న ఆమె స్కూల్ లీడర్‌గా ఉండి, చదువులో ప్రతిభ చూపిస్తూ టాపర్‌గా పేరుపొందింది. గత వారం జ్వరంతో బాధపడడంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న గాయత్రి ఆరోగ్యం మెరుగుపడడంతో బుధవారం సాయంత్రం పాఠశాలకు తిరిగి చేరుకుంది. సాధారణంగా వ్యవహరించిన ఆమె గురువారంనాడు తరగతులకు హాజరైంది. కానీ శుక్రవారం ఉదయం తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత కొన్ని గంటలకే, ఉదయం 9.30 ప్రాంతంలో, పాఠశాల ప్రార్థన అనంతరం డార్మిటరీ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే సహ విద్యార్థులు, సిబ్బంది చెబుతున్న మేరకు ఆమె ఇటీవల కొంత మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. పాఠశాల సిబ్బంది ఈ విషయాన్ని గమనించి వెంటనే వంగర పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై దివ్య సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాణాల సేకరణతో పాటు డార్మిటరీలోని సీసీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు ఆవేదనతో ఆవిసిపోయారు. సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఎస్సై దివ్య తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Spiritual  

ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ

ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ రెండవ రోజు  ప్రత్యేక ఆధ్వాత్మిక కార్యక్రమాలు సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) : సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాసనగర్ లో శ్రీగిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్దరణ పూర్వక మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయంలోని యాగశాల ద్వారతోరణధ్వజ కుమారాధన, ప్రాతరారాధన,...
Read More...
National  State News 

“సావర్కర్‌ను పిల్లలకు నేర్పించమని బీజేపీ కోరినంత మాత్రాన మేము చేయం” —కేరళ విద్యాశాఖ మంత్రి

“సావర్కర్‌ను పిల్లలకు నేర్పించమని బీజేపీ కోరినంత మాత్రాన మేము చేయం” —కేరళ విద్యాశాఖ మంత్రి తిరువనంతపురం, అక్టోబర్ 25:కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివంకుట్టి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. సురేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించారు. సురేంద్రన్ ఇటీవల ఇచ్చిన ప్రకటనలో “కేరళ పాఠశాలల్లో వీర సావర్కర్ గురించి విద్యార్థులకు పాఠాలు బోధించాలని” సూచించారు. దీనికి ప్రతిగా మంత్రి శివంకుట్టి మాట్లాడుతూ, “కేరళ పాఠ్య ప్రణాళికను రాజకీయ ఒత్తిడులకు...
Read More...
Local News 

ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారులు

ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారులు సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్  స్కూల్‌లో శనివారం ఆరెంజ్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు పాల్గొని ఆనందంగా ఆరెంజ్ డే ను సెలబ్రేట్‌ చేశారు. పిల్లలు ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరించి, ఆరెంజ్‌ బెలూన్లు, పండ్లు, స్నాక్స్ తో స్కూల్‌ను...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు): వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షర్హులేనని, జైలు శిక్ష,, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయోవృద్దుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్దుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పత్రిక లను...
Read More...

అదానీ గ్రూపుకు ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు?

అదానీ గ్రూపుకు  ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు? వాషింగ్టన్ అక్టోబర్ 25: వాషింగ్టన్ పోస్ట్, నిన్న ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ కథనం ద్వారా, అదానీ గ్రూపు సంస్థలకు 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించి, భారత ప్రజలను ఆశ్చర్య పరిచింది. దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా, రాజకీయ పార్టీ లతో పాటు,ఆర్థికసంస్థలు, వ్యవస్థాగత పెట్టుబడిదారులలో సంచలన ప్రకంపనలు సృష్టించింది. అమెరికాలో అదానీ...
Read More...

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమర వీరుల ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే...
Read More...
Local News  State News 

జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత

జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత డిచ్ పల్లి అక్టోబర్ 25: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద  తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.
Read More...
Local News 

ప్లాస్టిక్ బ్యాగ్ లు నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతాం- ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

ప్లాస్టిక్ బ్యాగ్ లు నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతాం- ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్       జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు) పట్టణ పరిశుభ్రత అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్న తరుణంలో ప్లాస్టిక్ బ్యాగులు నివారించకుంటే అనారోగ్యం తప్పదని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు    ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఆపి - రోటరీ క్లబ్ ఈ...
Read More...

తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత 

తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత  ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు. 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అమరుల కుటుంబాలకు,  తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
Read More...
Local News 

అత్యంత ప్రాధాన్యత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి మున్సిపల్ కమిషనర్లకు ఎమ్మెల్యే డా సంజయ్ ఆదేశం

అత్యంత ప్రాధాన్యత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి మున్సిపల్ కమిషనర్లకు ఎమ్మెల్యే డా సంజయ్ ఆదేశం    జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల, రాయికల్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పట్టణ మెప్మా కార్యాలయం లో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి...
Read More...
Local News 

నేరం చేస్తే శిక్ష తప్పదు  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  _ ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92  మందికి జైలు శిక్షలు, జరిమానాలు

నేరం చేస్తే శిక్ష తప్పదు  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  _ ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92  మందికి జైలు శిక్షలు, జరిమానాలు జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) నేర నియంత్రణలో, న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  తెలిపారు.ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్ వరకు) కాలంలో, జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 83 కేసుల్లో తీర్పులు వెలువడగా, వాటిలో 92 మంది...
Read More...
Local News  Crime 

నేరెళ్లలో పేకాట ఆడుతున్నారని పట్టుకొన్న పోలీసులు

నేరెళ్లలో పేకాట ఆడుతున్నారని పట్టుకొన్న పోలీసులు ధర్మపురి అక్టోబర్ 25 (ప్రజా మంటలు): ధర్మపురి మం. నేరెళ్ల గ్రామంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడి, లక్ష 16 వేల నగదు స్వాధీనం చేసుకొని, 5 గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై జగిత్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ధర్మపురి పోలీసులు...
Read More...