బస్సు మిస్సయి...బతికిపోయిన నేవీ ఆఫీసర్..
అద్దాల పగల కొట్టుకొని బయట పడ్డ మరో యువకుడు
అద్దాల పగల కొట్టుకొని బయట పడ్డ హిందూపూర్ కు చెందిన వేణుగోపాల్ రెడ్డీ
సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు) :
కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సికింద్రాబాద్ కు చెందిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అదృష్టవశాత్తుగా తప్పించుకోగలిగారు. వివరాలు ఇవి..
సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన సోమయ్య కుమారుడు తరుణ్ కుమార్ బెంగళూర్ లో నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ గా పని చేస్తున్నాడు. దీపావళి సెలవులకు ఇటీవల సికింద్రాబాద్ లోని తమ ఇంటికి వచ్చిన తరుణ్ కుమార్(27) తిరిగి బెంగళూర్ వెళ్ళడానికి వేమూరి కావేరి బస్సులో టికెట్ నెంబర్ యూ2 బుక్ చేసుకున్నాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద బెంగళూర్ బస్సు ఎక్కాల్సి ఉంది. అయితే శంషాబాద్ లో తనకు కొంత పని ఉందని, అక్కడే తాను బస్సును క్యాచ్ చేసి ఎక్కుతానని బస్సు డ్రైవర్ కు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 11 గంటల 20 నిమిషాలకు కావేరి బస్సు శంషాబాద్ కు చేరుకుంది. తన పని ఇంకా పూర్తి కాలేదని, తాను ఇప్పడు రాలేనని, వేరే బస్సులో వెళ్తానని డ్రైవర్ కు తరుణ్ కుమార్ చెప్పాడు. ఆ తర్వాత 40 నిమిషాలకు వేరే బస్సు ఎక్కిన తరుణ్ బెంగళూర్ వెళ్ళిపోయాడు.
తాను ఎక్కాల్సిన బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది చనిపోయినట్లు ఆ తర్వాత వార్త తెలుసుకున్న తరుణ్ తీవ్ర ఆందోళన చెందాడు. తనది బస్సు ఫ్రంట్ సీటు యూ2 అని, తాను బస్సు ఎక్కి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని , ఆ దేవుడి దయ వలన బస్సు మిస్సయి, ప్రాణాలు దక్కాయని, అంతా మంచే జరిగిందని తరుణ్ బెంగళూర్ నుంచి ఫోన్ లో మాట్లాడుతూ అన్నారు. నేవీలో పనిచేస్తున్నందున తాను ఫొటో ఇవ్వలేనన్నారు.
బస్సు అద్దాలు పగల కొట్టుకొని, బయట పడిన వేణుగోపాల్ రెడ్డి.....
ప్యారడైజ్ వద్ద బస్సు ఎక్కిన అనంతపూర్ సత్యసాయి జిల్లా హిందూపురం కు చెందిన మూలింటి వేణుగోపాల్ రెడ్డి (25) బస్సు ప్రమాదానికి గురైన సమయంలో భారీ శబ్దానికి నిద్ర నుంచి లేచి బస్సు వెనక ఉన్న అద్దాన్ని పగలకొట్టి, బయట దూకి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఆయన శుక్రవారం సాయంత్రం ఫోన్ లో మాట్లాడుతూ..బిజినెస్ పనిమీద గత మంగళవారం ఉదయం హైదరాబాద్ కు వచ్చానని, తిరుగు ప్రయాణంలో ఇలా జరిగిందని భయంకరమైన తన అనుభవాన్ని చెప్పాడు. బస్సులో తన సీటు నెంబర్ యూ21 అని, ఇది బస్సు వెనకాల ఉంటుందన్నారు. బస్సు ముందు భాగంలో మంటలు ఎగిసిపడటంతో ముందు కూర్చున్న ఎవరూ కూడ తప్పించుకోలేకోయారని చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అంతా గాఢ నిద్రలో ఉన్నామన్నారు. బస్సులో నుంచి దూకిన తర్వాత అంబులెన్స్ కు ఫోన్ చేస్తే వెంటనే రాలేదని, వేరే వ్యక్తితో కలసి మరో వాహనంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని, మెల్లిగా హిందూపురం కు చేరుకున్నానని పేర్కొన్నారు. అంతా ఆదేవుడి దయ వలన పెను ప్రమాదం నుంచి బయట పడ్డానని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ
వారం రోజుల పాటు ప్రత్యేక ఆధ్వాత్మిక కార్యక్రమాలు
సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజామంటలు) :
సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాసనగర్ లో శ్రీగిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్దరణ పూర్వక మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్బంగా ఆలయంలో శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ఉత్వవానుజ్ఞ,... పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల అక్టోబర్ 24(ప్రజా మంటలు) జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ మండల విద్యాధికారులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జిల్లా, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థల ) బి. రాజ
పదో... రైతుల పట్ల ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదు అరుగాలం పండించిన పంట దళారుల పాలు అయ్యే పరిస్థితి._ జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు) మండలం మోరపల్లి గ్రామంలో పర్యటించిన తొలి జెడ్పి ఛైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్
వసంత మాట్లాడుతూ
పేదల అభివృద్ధిని, సంక్షేమం కాంక్షించాల్సిన ముఖ్యమంత్రి కి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల కనీసం సోయి లేకపోవడం విచారకరం అన్నారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం
సగటున... సతారా జిల్లా ఫల్టన్లో యువ డాక్టర్ ఆత్మహత్య — ఇద్దరు పోలీసులపై అత్యాచార ఆరోపణలు
“భద్రత ఇచ్చే పోలీసులే అత్యాచారం చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి?”ముంబై, అక్టోబర్ 24:మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫల్టన్ పట్టణంలో 28 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె తన చేతిపై రాసిన ఆత్మహత్యా గమనికలో ఇద్దరు పోలీసు అధికారులపై లైంగిక వేధింపులు, మానసిక హింస ఆరోపణలు చేశారు.డాక్టర్ చేతిలో... అమెరికా ట్రేడ్ డీల్పై తొందరేమీ లేదు: పీయూష్ గోయల్ స్పష్టం
న్యూ ఢిల్లీ, అక్టోబర్ 24:
భారత్ ఎలాంటి ట్రేడ్ డీల్ (వ్యాపార ఒప్పందం) విషయంలోనూ తొందరపాటు లేదా ఒత్తిడికి లోనవ్వదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు
జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిన “బెర్లిన్ గ్లోబల్ డైలాగ్” సదస్సులో మాట్లాడిన ఆయన, “భారతదేశం ఏ దేశం ఒత్తిడికీ తలవంచదు. మేము డెడ్లైన్ కింద... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు
హైదరాబాద్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో... బస్సు మిస్సయి...బతికిపోయిన నేవీ ఆఫీసర్..
అద్దాల పగల కొట్టుకొని బయట పడ్డ హిందూపూర్ కు చెందిన వేణుగోపాల్ రెడ్డీ
సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు) :
కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సికింద్రాబాద్ కు చెందిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అదృష్టవశాత్తుగా తప్పించుకోగలిగారు. వివరాలు ఇవి..సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన సోమయ్య కుమారుడు... బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి — వారంలోనే భారీ పతనం!
వారంలో ₹9500 తగ్గుదల
హైదరాబాద్, అక్టోబర్ 24:దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా భారీగా పడిపోయాయి. ఒకే రోజు వ్యవధిలో బంగారం రూ.1,836 తగ్గగా, వెండి ధర రూ.4,417 తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు కొంతవరకు ఆందోళనకు గురవుతున్నారు.
ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా గణాంకాల ప్రకారం, 24 అక్టోబర్... తక్కలపల్లి, గుల్లపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు) మండలం తక్కల పల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 12 లక్షల 60 వేలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, గుల్లపేట గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 22 లక్షల 20 వేలతో సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి
ఈ... పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు) *సామ సత్యనారాయణ* పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద 15th ఫైనాన్స్ నిధులలు 40 లక్షలతో సెంట్రల్ లైటింగ్ మరమ్మత్తులు వెహికల్ మౌంటెడ్ స్కై లిఫ్ట్ లాడార్ ను శుక్రవారం ప్రారంభించి,అనంతరం
చింతకుంట... రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన జగిత్యాల ఎస్ఎం అకాడమీ విద్యార్థులు
జగిత్యాల అక్టోబర్ 24 ( ప్రజా మంటలు)స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలలో జగిత్యాలకు చెందిన గోపు మణిదీప్ రెడ్డి బిడిగే అభిరామ్ మరియు మోక్షప్రద అండర్ 17 విభాగంలో అత్యంత ప్రతిభ కనబరచి నవంబర్ నెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.... శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం
జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు) శుక్రవారం.రోజున ఉదయం. శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవాసమితి, ఆధ్వర్యంలో. సొంత నివాసం లేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే. దహన సంస్కాలకు.,. ఆర్థిక సహాయం తో పాటు. నిత్యవసర కిరాణం సరుకులు, అందించడం, కొరకు, మన జగిత్యాల జిల్లాలో ఒక స్వచ్ఛంద సేవా .
ఇట్టి... 