నేరం చేస్తే శిక్ష తప్పదు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, _ ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92 మందికి జైలు శిక్షలు, జరిమానాలు
జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)
నేర నియంత్రణలో, న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు.ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్ వరకు) కాలంలో, జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 83 కేసుల్లో తీర్పులు వెలువడగా, వాటిలో 92 మంది నేరస్తులకు జైలు శిక్షలు మరియు జరిమానాలు విధించబడ్డాయని ఎస్పి వివరించారు.
న్యాయస్థానాల ద్వారా విధించబడిన జైలు శిక్షల వివరాలు
హత్య కేసు లో 20 మంది నిoదితులకు జీవిత జీవిత ఖైదు
వివిద కేసులో జైలు శిక్షల వివరాలు
20 సంవత్సరాల జైలు శిక్ష 05 మంది నిoదితులు.
10 సంవత్సరాల జైలు శిక్ష 05 మంది నిoదితులు.
7 సంవత్సరాల జైలు శిక్ష 09 మంది నిoదితులు.
5 సంవత్సరాల జైలు శిక్ష 03 మంది నిoదితులు.
4 సంవత్సరాల జైలు శిక్ష 01మంది నిoదితులు.
3 సంవత్సరాల జైలు శిక్ష 08 మంది నిoదితులు.
2 సంవత్సరాల జైలు శిక్ష 09 మంది నిoదితులు.
1 సంవత్సరాల జైలు శిక్ష 06 మంది నిoదితులు.
Below One Year 26 మంది నిoదితులు.
ఎస్పీ మాట్లాడుతూ —"సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు. పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణ జరిపి న్యాయ నిరూపణతో శిక్షలు పడేలా చేస్తున్నాం. క్షణికావేశంలో చేసిన నేరాలకైనా న్యాయశిక్ష తప్పదు. అందరూ చట్టానికి లోబడేలా ప్రవర్తించాలి," అని అన్నారు.
జిల్లాలో మహిళలపై నేరాలు, మద్యం, గంజాయి, దొంగతనాలు, మోసపూరిత ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, కేసులు త్వరితగతిన దర్యాప్తు చేసి, కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా ప్రాసిక్యూషన్ అధికారులు, సీఐలు, ఎస్ఐలు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా కేసుల పురోగతిని సమీక్షిస్తూ, తీర్పులు శిక్షల రూపంలో రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు పోలీసుల పట్ల నమ్మకం ఉంచి చట్టం పాటించేలా సహకరించాలని పిలుపునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షర్హులేనని, జైలు శిక్ష,, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయోవృద్దుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు.
శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్దుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పత్రిక లను... అదానీ గ్రూపుకు ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు?
వాషింగ్టన్ అక్టోబర్ 25:
వాషింగ్టన్ పోస్ట్, నిన్న ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ కథనం ద్వారా, అదానీ గ్రూపు సంస్థలకు 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించి, భారత ప్రజలను ఆశ్చర్య పరిచింది. దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా, రాజకీయ పార్టీ లతో పాటు,ఆర్థికసంస్థలు, వ్యవస్థాగత పెట్టుబడిదారులలో సంచలన ప్రకంపనలు సృష్టించింది.
అమెరికాలో అదానీ... జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు
హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమర వీరుల ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే... జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత
డిచ్ పల్లి అక్టోబర్ 25:
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు.
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్లాస్టిక్ బ్యాగ్ లు నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతాం- ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు)
పట్టణ పరిశుభ్రత అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్న తరుణంలో ప్లాస్టిక్ బ్యాగులు నివారించకుంటే అనారోగ్యం తప్పదని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఆపి - రోటరీ క్లబ్
ఈ... తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత
ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు.
1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది.
ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు... అత్యంత ప్రాధాన్యత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి మున్సిపల్ కమిషనర్లకు ఎమ్మెల్యే డా సంజయ్ ఆదేశం
జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల, రాయికల్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పట్టణ మెప్మా కార్యాలయం లో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి... నేరం చేస్తే శిక్ష తప్పదు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, _ ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92 మందికి జైలు శిక్షలు, జరిమానాలు
జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)
నేర నియంత్రణలో, న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు.ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్ వరకు) కాలంలో, జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 83 కేసుల్లో తీర్పులు వెలువడగా, వాటిలో 92 మంది... నేరెళ్లలో పేకాట ఆడుతున్నారని పట్టుకొన్న పోలీసులు
ధర్మపురి అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
ధర్మపురి మం. నేరెళ్ల గ్రామంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడి, లక్ష 16 వేల నగదు స్వాధీనం చేసుకొని, 5 గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై జగిత్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ధర్మపురి పోలీసులు... లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు
మంచిర్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
బెజ్జూర్ పిఎసిఎస్ లో పనిచేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్ను రెన్యువల్ చేసేందుకు, సహకార అధికారి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, తప్పనిసరి అయి, రెండు విడుదలగా ఇచ్చేందుకు రూ. 8 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో రూ. 2 లక్షలు,మొదటి విడత డబ్బులు ఇచ్చేందుకు మాజీ సీఈవో... వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత
చారిత్రాత్మక మాగ్నోలియా చెట్లు నరికి వేయబడ్డాయా?
వాషింగ్టన్ అక్టోబర్ 25:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కొత్త వైట్హౌస్ బాల్రూమ్ నిర్మాణ ప్రాజెక్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, వైట్హౌస్ ఈస్ట్ వింగ్ పూర్తిగా కూల్చివేయబడింది. ఈ నిర్మాణ పనుల నేపథ్యంలో కనీసం ఆరు చెట్లు తొలగించబడ్డాయి. వీటిలో 1940ల... సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయింపు
చిన్నారెడ్డి, దివ్యలను సన్మానించిన లబ్దిదారులు సీఎం ప్రజావాణిలో 229 దరఖాస్తులు హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ శుక్రవారం ప్రజా భవన్ లో... 