ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం
గొల్లపల్లి సెప్టెంబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గోస్కుల జలందర్, మాజీ జడ్పీటీసీ బిఆర్ఎస్ పార్టీ గొల్లపల్లి మండల అధ్యక్షులు పూల మాలతో నివాళ్లు అర్పించి సేవలను స్మరించారు.అంబేద్కర్ దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శాల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలని కార్యక్రమం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నామని నల్ల శ్యామ్ తెలిపారు.అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే పీడిత వర్గాలు బానిసలుగా మిగిలిపోయేవారని అన్నారు.కార్యక్రమం ముఖ్య అతిథి జలందర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ అనేక వివక్షలకు గురైనా మొక్కవోని సంకల్పంతో విద్య అనే ఆయుధం ద్వారా దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని కొనియాడారు. ప్రస్తుత రోజుల్లో విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆనాటి కాలంలో లండన్ వెళ్లి బారిస్టర్ చదవడం ఆయన పట్టుదలకు సాక్షి గా ఉందన్నారు. కేవలం దళితుల రిజర్వేషన్స్ కాకుండా అందరికి అవకాశాలు కల్పించారు. ఆ విధంగా తాను గ్రామ స్థాయి పదవినుంచి జిల్లా పరిషత్ పదవి చేపట్టానని అన్నారు. నిన్న బీసీ రిజర్వేషన్స్ కూడా అంబేద్కర్ కల్పించిన అవకాశం అని అన్నారు.
కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అని నల్ల శ్యామ్ ని అభినందించారు.కార్యక్రమంలో మద్దెలనారాయణ, ఆనంతుల కాంతారావు ఎడిటర్ తెలంగాణ శక్తి, ద్యావర సంజీవరాజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మేనేని రవీందర్ రావు, మనం జిల్లా స్థాపర్,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, విజన్ ఆంధ్ర జిల్లా స్థాపర్, గొల్లపల్లి మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్ తదితర అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
