జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు

On
జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు

 

జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ మొత్తాలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న ఆలస్యం పై ప్రైవేట్ కళాశాలల నిరసన రెండో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌ను కొనసాగిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించిన అధ్యాపకులు మరియు సిబ్బంది ప్రభుత్వం తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్‌లు విడుదల చేయాలని, విద్యార్థుల విద్య కొనసాగింపుకు అవసరమైన ఆర్థిక భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమంలో రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ కొక్కుల రాజేందర్, నలంద డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి. సురేష్, ఎన్‌ఎస్‌వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపు మునిందర్ రెడ్డి, మల్లికార్జున్ తో పాటు వివిధ కళాశాలల అధ్యాపకులు మరియు సిబ్బంది భారీ ఎత్తున పాల్గొన్నారు.

ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులు మాట్లాడుతూ, “స్కాలర్షిప్ నిధులు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల కళాశాలలు కూడా ఆర్థికంగా నష్టపోతున్నాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, నిరసన మరింత ఉధృతం అవుతుంది” అని హెచ్చరించారు.

Join WhatsApp

More News...

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు 

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో  గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు  ఇబ్రహీంపట్నం నవంబర్ 4 (ప్రజా మంటలు: దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ–ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రతిరోజు ప్రయాణించే వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతుండడంతో, స్థానిక నాయకులు ముందడుగు వేసి శ్రమదానానికి దిగారు. అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేకపోవడంతో, వర్షకొండ...
Read More...

: “పాము పగ పట్టిందా?” — గొల్లపల్లి మండలంలో నెల రోజుల్లోనే ఏడుసార్లు పాము కాటు వేసిన యువకుడు!

: “పాము పగ పట్టిందా?” — గొల్లపల్లి మండలంలో నెల రోజుల్లోనే ఏడుసార్లు పాము కాటు వేసిన యువకుడు! (అంకం భూమయ్య) గొల్లపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు):పల్లెల్లో పెద్దలు తరచుగా “పాము పగ పడుతది” అని చెప్పే మాటను చాలామంది మూఢనమ్మకం అంటారు. కానీ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ మాటలో నిజం ఉందేమో అనే సందేహం కలిగిస్తోంది. నెల రోజుల్లోనే 7 సార్లు...
Read More...

బిసి ల రిజర్వేషన్ల కోసం జాక్ నాయకుల వినతి

బిసి ల రిజర్వేషన్ల కోసం జాక్ నాయకుల వినతి జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ నేతలు అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) నాయకులు మాట్లాడుతూ బీసీ హక్కుల సాధనకు కేంద్ర...
Read More...
National 

బిలాస్ పూర్ వద్ద రైళ్ల డీ : 6గురి మృతి

బిలాస్ పూర్ వద్ద రైళ్ల డీ : 6గురి మృతి బిలాస్‌పూర్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 04:చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం కోర్బా ప్యాసింజర్ రైలు నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 6మంది మృతి చెందగా, 25మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు రైల్వే బోగీలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు....
Read More...

నిరుపేద కుటుంబానికి ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆర్థిక చేయూత

నిరుపేద కుటుంబానికి ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆర్థిక చేయూత    జగిత్యాల నవంబర్ 4 (ప్రజా మంటలు ) పట్టణానికి చెందిన మార రమేష్ ధర్మపత్ని మార వసంత లుచిన్న కిరాణం దుకాణం నడిపిస్తూ కిరాయికి ఉంటున్నారు.  ఈ సందర్భంగా వారి సంపాదన అంతంత మాత్రమే ఇల్లు లేదు, జాగా లేదు, చేతిలో చిల్లిగవ్వ లేదని, రమేష్ గత ఆరు నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతూ...
Read More...
Local News 

నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ చేయూత – రూ.47,969 ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ చేయూత – రూ.47,969 ఆర్థిక సహాయం జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని పురానిపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ గారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. మార రమేష్ మరియు ఆయన భార్య మార వసంత చిన్న కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ఉన్న రమేష్...
Read More...

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య జగిత్యాల నవంబర్ 04 (ప్రజా మంటలు)::జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో సోమవారం మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి గారిని కలసిన వీఆర్ఏలు (Village Revenue Assistants) తమ వ్యవస్థను పునరుద్ధరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ...
Read More...
Local News 

ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా మెట్టుపల్లి నవంబర్ 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తా వద్ద ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టే విషయంలో పోలీసులకు, విద్యార్థి...
Read More...

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు    జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ మొత్తాలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న ఆలస్యం పై ప్రైవేట్ కళాశాలల నిరసన రెండో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌ను కొనసాగిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక...
Read More...

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు విశాఖపట్నం నవంబర్ 04: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఘటన వెలుగుచూసింది. సమాచారం ప్రకారం, అక్కడ ఉపాధ్యాయురాలైన ఒక వ్యక్తి సెల్ ఫోన్‌తో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్ల నొక్కించుకోవడం వీడియో చిత్రంగా తీసుకోవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. విద్యార్థులు విద్యాబుద్ధిని మరియు ఆస్తిత్వ పరిరక్షణ పరంపరను...
Read More...

విశాఖలో స్వల్ప భూకంపం

విశాఖలో స్వల్ప భూకంపం గాజువాక నుంచి భీమిలీ వరకు ప్రభావం విశాఖపట్నం, నవంబర్ 4:సముద్ర తీర నగరమైన విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం నమోదైంది. సమాచారం ప్రకారం, ఉదయం 4 గంటల నుండి 4.30 గంటల మధ్య కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంపం ప్రభావం గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ,...
Read More...

విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం

విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం చెన్నై, నవంబర్ 4:తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత తలపతి విజయ్ నేతృత్వంలో పార్టీ శ్రేణుల్లో నూతన మార్పులు మొదలయ్యాయి. ఇటీవల వెలుస్వామీపురం రోడ్‌షోలో ఏర్పడిన గందరగోళం అనంతరం, పార్టీకి ప్రత్యేకంగా ప్రజా సభల నియంత్రణ కోసం “థొండర్ అరి” (Thondar Ani) అనే వాలంటీర్స్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ ఈ...
Read More...