తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా? లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?
తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా? లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?
తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా?*
లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2018 నాటికి ఒక కోటి 28 లక్షల గొర్రెలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది దీనికిగాను బడ్జెట్లో 12 వేల కోట్లు కేటాయించడం జరిగింది.
*సబ్సిడీ విధానం*
ప్రభుత్వము 75% ఖర్చును లబ్ధిదారుడు 25% భరిస్తాడు. ప్రభుత్వం అంచనా ప్రకారం రెండు సంవత్సరాల్లో గొర్రెల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ అవుతుందని ఓ అంచనా వీటి మేత కోసం 75% సబ్సిడీ కూడా ఉండేది. అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి సైతం ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని అమలుపరిచింది.
అయితే ఎక్కువ మంది లబ్ధిదారులు కేవలం గొర్రెల కోసం మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరిగింది.
*ఈ పథకానికి అర్హులు*
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సాంప్రదాయ గొర్రెల కాపర్లు, కురుమలు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వము నిర్ణయించింది. మొత్తం 7.61 లక్షల మంది అర్హులైన వారిలో రెండు లక్షల మందికి పైగా సభ్యులు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. *తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య* *ఈ పథకం అమలు చేసింది. ఇతర రాష్ట్రాల నుండి కూడా గొర్రెల కొనుగోలు చేసింది అప్పటి ప్రభుత్వం కాకపోతే లబ్ధిదారుడు స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి గొర్రెలను తీసుకుని వచ్చేవారు. గొర్రెలను తీసుకొని వారు అదే ప్రాంతంలో డాక్టర్లతో కుమ్ముకై గొర్రెలను అక్కడనే కొనుగోలు చేసిన స్థలంలోనే అప్పజెప్పి నగదు పొందిన దాఖలాలు కూడా లేకపోలేదు.
*రెండవ విడత కోసం ఎదురు చూస్తున్న లబ్ది దారులు*
తొలి విడతలో లబ్ధి పొందని లబ్ధిదారులు మరో విడుదల గొర్రెల ధర పెరిగినప్పటికీ 43,500 డిడి లు తీసిన వారు ఎదురుచూపులతో ఉండిపోయారు.వీరి నిరీక్షణ కార్యరూపం దాలుస్తుందా చూడాల్సిందే.
*ఎన్నికల కోడ్ తో నిలిచిన పథకం*
ఎన్నికల కోడ్ రావడంతో అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈ పథకానికి గ్రహణం పట్టింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం రావడం తో ఈ పథకంపై లబ్ధిదారుల్లో ఆశలు అడియాశలుగా మారాయి. ఈ పథకం పైన గుంపెడాశతో ఉన్న నిజమైన లబ్ధిదారులు డీడీలు చెల్లించడానికి డబ్బులు లేకుంటే మిత్తిలకు తెచ్చి డీడీలు చెల్లించిన వారు కూడా లేకపోలేదు.
*ఇంతకు ఈ పథకం కొనసాగేనా?*
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పథకం కొనసాగుతుందా? కొత్త ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేక చేతులెత్తేస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో రెండో విడత గొర్రెల లబ్ధి కోసం డీడీలు చెల్లించిన వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి
కామారెడ్డి డిసెంబర్ 10 (ప్రజా మంటలు):
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్కు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 10వ తరగతి విద్యార్థి ప్రణవ్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు.
జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను... నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం
జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు)స్థానిక ధరూర్ శివారు కరీం నగర్ రోడ్డు లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గత 4 రోజులుగా అత్యంత వైభవవో పేతంగా సాగిపోతున్న మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఉర్రూతలూగిస్తూ సాగిపోతుంది.
కళ్యాణమండపం భక్తులతో కిక్కిరిసిపోయి జనసంద్రం లాగ కనిపిస్తుందని సామాజిక కార్యకర్త తవుటు... గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం
* ఏఐ మార్ఫింగ్తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం
* గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
* ఏఐ మార్ఫింగ్తో ఓటర్లలో అయోమయం
భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి.... ట్రాఫిక్ నిబంధనల పై యమధర్మరాజు అవగాహన : ట్రాఫిక్ పోలీసులతో కలిసిరోడ్డు ప్రమాదాలపై అవేర్నెస్
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) : రోడ్డు ప్రమాదాల పై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివేగం, రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా యమధర్మ రాజు వేషదారితో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులకు అవగాహన కలిగిస్తున్నారు.... చలనచిత్ర రంగ అభివృద్ధికి పూర్తి సహకారం — సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వము పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 రెండో... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
హైదరాబాద్ డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్గా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో... గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే సదరు... పోష్ యాక్ట్–2013పై అవగాహన ర్యాలీ
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు) :
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు కఠినంగా అమలు అవుతున్న పోష్ యాక్ట్–2013 గురించి అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా కమిటీ, యాక్షన్ ఎయిడ్, భరోసా సంయుక్తంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించింది. న్యూ బోయిగూడ నుంచి గాంధీ ఆస్పత్రి ఎదురుగా... రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మోడల్ స్కూల్ నందు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి సందర్శించినారు, మరియు అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి హనుమాన్ చెక్ పోస్ట్ ని కూడా "అవినీతిని నిర్మూలిద్దాం- దేశాన్ని అభివృద్ధి చేద్దాం’’ 1064 టోల్ ఫ్రీ నెంబర్ తో అవినీతికి అడ్డుకట్ట జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 9 (ప్రజా మంటలు)అవినీతి నిరోధక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ అశోక్... ఆదం సంతోష్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్..
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు):
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్, పండ్ల పంపిణీ,... బన్సీలాల్ పేట లో సోనియమ్మ 79వ జన్మదిన వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 09 (ప్రజామంటలు):
సికింద్రాబాద్, బన్సీలాల్పేట్ డివిజన్లోని జబ్బర్ కాంప్లెక్స్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ జాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఐత చిరంజీవి ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు.... 