స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం మెటుపల్లి జన సమితి

On
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం  మెటుపల్లి  జన సమితి

మెట్ పల్లిలో జరిగిన ఉమ్మడి జిల్లాల సమావేశం


మెట్ పల్లి / జగిత్యాల జూన్ 28 (ప్రజా మంటలు):: 

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పార్టీ పక్షాన పోటీ చేస్తామని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు తేల్చి చెప్పారు.

 రాష్ట్ర పరిశీలకుల పర్యవేక్షణలో శనివారం మెట్ పల్లి లోని కంతి మోహన్ రెడ్డి స్వగృహంలో గల పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. పార్టీ పక్షాన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తో అలయన్స్ లో గానీ, ఒంటరిగా గానీ పోటీ చేయడానికి సిద్దం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన తో పాటు గత పదేండ్ల నిరంకుశ పాలనలో కూడా ఉద్యమ కారులుగా తెలంగాణ జన సమితి పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేసిన తీరును వివరించారు. 
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పోటీ చేసి తప్పకుండా గెలవబోయే స్థానాల వివరాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులకు ఆయా జిల్లాల అధ్యక్షులు వివరించారు. ఎంపిటిసి, జడ్పీటిసి, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయడమేనని నిర్ణయించారు.

 స్థానికంగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమయస్పూర్తితో పోరాటం చేస్తున్న పార్టీ నేతలను, కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి పార్టీ ఎన్నికల సన్నాహక సబ్ కమిటీ నాయకులు కుంట్ల ధర్మార్జున్, గోపగాని శంకర్ రావు, కంతి మోహన్ రెడ్డి, నిజ్జన రమేష్, రాష్ట్ర నాయకులు ముక్కెర రాజు, సర్దార్ వినోద్ కుమార్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, బొజ్జ కనకయ్య, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ ఆరేపల్లి విజయ్ కుమార్, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు అరికెళ్ల స్రవంతి, కరీంనగర్ జిల్లా కన్వీనర్ మోర గణేష్, కరీంనగర్ జిల్లా యువజన సమితి అధ్యక్షులు కర్రే సతీష్ యాదవ్, జగిత్యాల జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్, నాయకులు కాట దశరథ రెడ్డి, ఏశాల గంగారెడ్డి, కంతి రమేష్, శనిగరపు అశోక్, వన్నెల శశి కుమార్, మ్యాన సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి    జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు) పట్టణం విశ్వకర్మ సంఘం వారి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మహిళలతో కలిసి డప్పు చప్పుల్ల మధ్యలో బోనం ఎత్తుకున్న, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ...
Read More...
Local News 

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) :    ముల్కనూర్ లోని విశ్వశాంతి విద్యాలయం 2010-11 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఒక ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మళ్లీ ఒకచోట చేరి గురువుల పట్ల కృతజ్ఞతలు తెలిపి, మిత్రుల మధ్య మధురానుభూతులు పంచుకున్నారు. “గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః...” శ్లోకంతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో, జీవితానికి మార్గదర్శకులైన...
Read More...
Local News 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి  సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): జూలై 13, 14న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని, అందుకు ప్రభుత్వ అధికారులు,పార్టీలకతీతంగా నాయకులు,భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి కోరింది.ఈ మేరకు వారు ఆదివారం మహంకాళి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ అధ్యక్షతన...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ సికింద్రాబాద్,  జూన్ 29 (ప్రజా మంటలు): హైదరాబాద్ రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు ఆదివారం పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు, స్వేటర్లు పంపిణి చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్నవారికి ఔషదాలు కూడ అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు  డాక్టర్. వై....
Read More...
Local News  State News 

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు 

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు  మృతదేహం తరలింపు ప్రక్రియలో పురోగతి - మరో రెండు రోజుల్లో ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు చేరనున్న మృతదేహం  జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్ (57) ఈ నెల 16న ఇజ్రాయిల్‌లో గుండె సంబంధిత అనారోగ్యంతో మరణించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న...
Read More...
Local News 

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్  జూన్ 29 (ప్రజా మంటలు): మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదయ్య ఎక్స్ రోడ్ ఫుట్ పాత్  పై పడి ఉన్న దాదాపు 45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఎలాంటి వివరాలు...
Read More...
Local News  State News 

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జూన్ 28 (ప్రజా మంటలు) :  జూలై 1 వ తేదీసాయంత్రం 5:30గంటలకు స్ధానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం లో జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించబడునని అసోసియేషన్ కార్యదర్శి డా. వేణు గోపాల్ రెడ్డి...
Read More...
Local News  State News 

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి. జగిత్యాల 28 జూన్ (ప్రజా మంటలు) :  భారత ప్రధానమంత్రిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పాములపర్తి వేంకట నరసింహారావు గారి నూట నాల్గవ జయంతి సందర్భంగా రాయికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన ప్రత్యేక కథనం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని...
Read More...
Local News  State News 

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

విద్యార్థులు, ప్రజల జీవితాలతో రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలు చెలగాటం - జగిత్యాల తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల, జూన్ 28 (ప్రజా మంటలు) : టోల్ ఛార్జిల పేరుతో కేంద్రం, బస్ పాస్, బస్ ఛార్జిలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని జగిత్యాల జిల్లా జెడ్పి తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. పెంచిన బస్ పాస్,...
Read More...
Local News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ కృషి చేయాలి:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ జగిత్యాల జోన్ 28 (ప్రజా మంటలు)  కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని జిల్లా ఎస్పి ఈ...
Read More...
Local News 

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము 

జూలై 3 న ఇండియన్, క్రిస్టియన్ భక్తి దినోత్సవము  సికింద్రాబాద్ జూన్ 28 (ప్రజా మంటలు): యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి జీవించి, సువార్త పరిచర్య చేసిన 12 మంది శిష్యలలో ఒకరైన పరిశుద్ద తోమా గారు క్రీస్తు శకం 52లో మన బారతదేశానికి వచ్చారని, తమిళనాడు సెయింట్ థామస్ చర్చి ప్రారంబించి అనేకులను క్రైస్తవులయ్యారని పలురు వక్తలు అన్నారు.శనివారం సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్...
Read More...
Local News 

గ్రీన్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారుల సందడి

గ్రీన్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారుల సందడి సికింద్రాబాద్ జూన్ 28 (ప్రజామంటలు): గ్రీన్ డే ను పురస్కరించుకొని శనివారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్బంగా నర్సరీ,ఎల్కేజీ,యూకేజీ విద్యార్థులు ఉత్సాహంగా గ్రీన్ డ్రస్సులు ధరించి, వివిద గ్రీన్ పండ్ల రూపాలు, పక్షుల డ్రెస్ లతో అలరించారు. కలర్స్ గుర్తింపు, గ్రీన్ వెజిటేబుల్స్,గ్రీన్ ఎన్విరాన్మెంట్ పై ఈసందర్బంగా...
Read More...