మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం - "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్
మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం
- "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"
వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్
హైదరాబాద్ జనవరి 28:
రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను బెషరతుగా విరమించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనల వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు, "తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్" మాజీ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఇటీవల "పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ" (రెడ్ కో) కార్యకలాపాలపై హైదరాబాదులో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడాన్ని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు.
తెలంగాణలోని వివిధ జలాశయాలకు చెందిన మత్స్యకార ప్రతినిధులు, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నాయకుల తో కూడిన ప్రతినిధుల బృందం ఆదివారం నాడు ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పిట్టల రవీందర్ మాట్లాడుతూ గతంలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించిందని అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే సామాజిక మరియు పర్యావరణ సంబంధమైన సమస్యలపై తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను మన్నించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను పక్కకు పెట్టిందని గుర్తుకు చేశారు.
ప్రకృతిలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను మానవ సంక్షేమానికి వినియోగించుకునే విషయంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ రిజర్వాయర్లలో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకాలు తలెత్తే ప్రమాదాన్ని నిలువరించడం కోసం మాత్రమే తాము ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు శ్రీ పిట్టల రవీందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 159 రిజర్వాయర్లలో సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని, ఈ రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల చేపల వేటకు తీవ్రమైన ఆటంకాలు తలెత్తుతాయని, రిజర్వాయర్లలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే సోలార్ ప్లేట్లు జలాశయంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలలో ఆవరించి ఉండటం వల్ల ఆయా ప్రదేశాలలో చేపల వేటను నిషేధిస్తారని, ఈ పరిణామాలు మత్స్యకారుల జీవన స్థితిగతులపైన, ఆదాయ వనరులపైన, సామాజిక భద్రతపైన ప్రతికూల ప్రభావాలను తీవ్రస్థాయిలో చూపిస్తాయని ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన మరియు ప్రజాపాలనను అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించే ఇట్లాంటి ఆలోచనలు ముందుకు తీసుకు రావడం తీవ్ర అభ్యంతరకరమని శ్రీ పిట్టల రవీందర్ ఆక్షేపించారు.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అనేక దేశాలలో నీటిపై తేలే ఆడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదులుగా జలాశయాలకు అనుబంధంగా నిర్మించిన ప్రధాన కాలువల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిల కలుపుతున్నారని ఈ టెక్నాలజీ ఇప్పటికే అనేక దేశాలలో విజయవంతం అయ్యిందని ఇదే పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో కూడా అనుసరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలోని రిజర్వాయర్లకు అనుబంధంగా సుమారు 30 వేల కిలోమీటర్ల పొడవు కలిగిన పంట కాలువలు ప్రధానా నీటి కాలువలు అందుబాటులో ఉన్నాయని, ఈ కాలువలను వినియోగించుకోవడం ద్వారా వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ పిట్టల రవీందర్ సూచించారు. అందువల్ల రాష్ట్రంలోని రిజర్వాయర్లలో చేపల పెంపకం మీద ఆధారపడిన లక్షలాదిమంది మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
"తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విట్టల రవీందర్ తో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాల కనకయ్య ముదిరాజ్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ వేల్పుల సరోజన, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతినిధులు దుద్దెడ గణేష్ ముదిరాజ్, మేడమైన కనకయ్య ముదిరాజ్, లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ ప్రతినిధి అట్ల అనిల్ ముదిరాజ్, ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రతినిధి తోకల రాజేందర్ గంగపుత్ర, తదితరులు కూడా హాజరయ్యారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గుజరాత్లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి
వడోదరా / గుజరాత్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
గుజరాత్లో Special Intensive Revision (SIR) కార్యక్రమం క్రమంలో Booth Level Officers (BLO) మరియు BLO అసిస్టెంట్లపై భారీ పని ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడిలోనే వడోదరాలో BLO అసిస్టెంట్ ఉషాబెన్ ఇంద్రసింగ్ సోలంకీ విధి నిర్వహణలో మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో... అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం
న్యూ ఢిల్లీ, నవంబర్ 22 (ప్రజా మంటలు):
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో దేశంలోని సివిల్ న్యూక్లియర్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడాన్ని ప్రతిపాదించే బిల్లు ప్రధానంగా నిలుస్తోంది.
అదేవిధంగా, చండీగఢ్పై రాష్ట్రపతికి నేరుగా చట్టాలు, నిబంధనలు రూపొందించే అధికారం... అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవులు, కళాకారులలో అందెశ్రీ పేరు ఎన్నటికీ చెరిగిపోదని, రాష్ట్ర చరిత్రలో ఆయన స్థానం శాశ్వతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన అందెశ్రీ స్మారక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వజ్రాలపై దశాబ్దాలు చర్చించినా కోహినూర్కు పోటీ లేకపోయినట్టే,... జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం
జగిత్యాల, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి వర్గీయుడైన, గాజంగి నందయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్లో నందయ్యను ఘనంగా సన్మానించారు.... తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన
హైదరాబాద్ నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది.
ఇక్కడ తెలంగాణ కొత్తగా ప్రకటించిన DCC అధ్యక్షుల జాబితా ను సులభంగా చదవగల టేబుల్ ఫార్మాట్లో అందిస్తున్నాను:
తెలంగాణ – జిల్లావారీ... ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లో నేడు ఆదివారం ఉదయం భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో బీజేపీ నాయకులు, జిల్లా యువజన శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి... బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి
ఇబ్రహీంపట్నం నవంబర్ 22 (ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెని ప్రసాద్(38) s/o చెని చిన్న దేవయ్య కుమారుడు బీపీతో మెదడు లో నరాలు చితికి పోవడంతో గత నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో లో చేర్పించారు.ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో నిన్న రాత్రి... గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు
గౌహతి నవంబర్ 22:
భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు... అమీర్పేట్లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం..
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
అమీర్పేట్ డివిజన్లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని... కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని... కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్
కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్
పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... కోటీ రూపాయల భూమిని ₹16 లక్షలకు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన రైతులు
సంగారెడ్డి నవంబర్ 22,(ప్రజా మంటలు):సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ నోటీసులు అందజేయడానికి వచ్చిన అధికారులను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారు.
భూసేకరణ నోటీసులు అందించడానికి వచ్చిన అధికారులు
ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణం కోసం ఎకరాకు... 