మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం - "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"   వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్

On
మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం -

మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం
- "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"  
వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్

హైదరాబాద్ జనవరి 28:
రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను బెషరతుగా విరమించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనల వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు, "తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్" మాజీ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఇటీవల "పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ" (రెడ్ కో) కార్యకలాపాలపై హైదరాబాదులో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడాన్ని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు.
తెలంగాణలోని వివిధ జలాశయాలకు చెందిన మత్స్యకార ప్రతినిధులు, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నాయకుల తో కూడిన ప్రతినిధుల బృందం ఆదివారం నాడు ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పిట్టల రవీందర్ మాట్లాడుతూ గతంలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించిందని అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే సామాజిక మరియు పర్యావరణ సంబంధమైన సమస్యలపై తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను మన్నించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను పక్కకు పెట్టిందని గుర్తుకు చేశారు.

ప్రకృతిలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను మానవ సంక్షేమానికి వినియోగించుకునే విషయంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ రిజర్వాయర్లలో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకాలు తలెత్తే ప్రమాదాన్ని నిలువరించడం కోసం మాత్రమే తాము ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు శ్రీ పిట్టల రవీందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 159 రిజర్వాయర్లలో సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని, ఈ రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల చేపల వేటకు తీవ్రమైన ఆటంకాలు తలెత్తుతాయని, రిజర్వాయర్లలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే సోలార్ ప్లేట్లు జలాశయంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలలో ఆవరించి ఉండటం వల్ల ఆయా ప్రదేశాలలో చేపల వేటను నిషేధిస్తారని, ఈ పరిణామాలు మత్స్యకారుల జీవన స్థితిగతులపైన, ఆదాయ వనరులపైన, సామాజిక భద్రతపైన ప్రతికూల ప్రభావాలను తీవ్రస్థాయిలో చూపిస్తాయని ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన మరియు ప్రజాపాలనను అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించే ఇట్లాంటి ఆలోచనలు ముందుకు తీసుకు రావడం తీవ్ర అభ్యంతరకరమని శ్రీ పిట్టల రవీందర్ ఆక్షేపించారు.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అనేక దేశాలలో నీటిపై తేలే ఆడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదులుగా జలాశయాలకు అనుబంధంగా నిర్మించిన ప్రధాన కాలువల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిల కలుపుతున్నారని ఈ టెక్నాలజీ ఇప్పటికే అనేక దేశాలలో విజయవంతం అయ్యిందని ఇదే పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో కూడా అనుసరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలోని రిజర్వాయర్లకు అనుబంధంగా సుమారు 30 వేల కిలోమీటర్ల పొడవు కలిగిన పంట కాలువలు ప్రధానా నీటి కాలువలు అందుబాటులో ఉన్నాయని, ఈ కాలువలను వినియోగించుకోవడం ద్వారా వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ పిట్టల రవీందర్ సూచించారు. అందువల్ల రాష్ట్రంలోని రిజర్వాయర్లలో చేపల పెంపకం మీద ఆధారపడిన లక్షలాదిమంది మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
"తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విట్టల రవీందర్ తో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాల కనకయ్య ముదిరాజ్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ వేల్పుల సరోజన, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతినిధులు దుద్దెడ గణేష్  ముదిరాజ్, మేడమైన కనకయ్య ముదిరాజ్, లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ ప్రతినిధి అట్ల అనిల్ ముదిరాజ్, ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రతినిధి తోకల రాజేందర్ గంగపుత్ర, తదితరులు కూడా హాజరయ్యారు.

Tags
Join WhatsApp

More News...

అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు 

అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు  జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో ఆర్ద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ వేడుకలు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని కొనసాగించారు భక్తులు...
Read More...

బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు

బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు *  బీర్పూర్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు)మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు ని ఏకగ్రీవంగా ఏనుకున్న బీర్పూర్ మండల సర్పంచులు, ప్రధాన కార్యదర్శి గా ఎల్లమట్ల హరీష్ (బీర్పూర్ సర్పంచ్ ), ఉపాధ్యక్షులు 1 గా బోడ సాగర్ (రంగసాగర్ సర్పంచ్ ),...
Read More...

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ *జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ  సంఘటన లేకుండా ముగిసిన ఏడాది* *మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,–  డ్రగ్స్‌ పై జీరో టాలరెన్స్ విధానం అమలు* *‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ...
Read More...
Local News  State News 

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి  జీవన్ రెడ్డి సూటి ప్రశ్న జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో...
Read More...

పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ….  పోలీస్ సిబ్బంది రోజువారీ...
Read More...
Local News 

పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ

పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్) ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన  గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు  మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో  ఇతర మండల అధికారులు....
Read More...

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు మహబూబ్‌నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్ కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్...
Read More...
National  Crime  State News 

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్...
Read More...
National  State News 

కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్‌ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ

కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్‌ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం): కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి...
Read More...

న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు

న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 (ప్రజా మంటలు): దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మానవ హక్కుల అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పలు సంఘాలు హైకమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున...
Read More...

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత

జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు): యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్‌లోని వాహనంలో...
Read More...