మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం - "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"   వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్

On
మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం -

మత్స్యకారుల భవిష్యత్తుపై మరణ శాసనం
- "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ"  
వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్

హైదరాబాద్ జనవరి 28:
రాష్ట్రంలోని జలాశయాలన్నింటిలో సౌరశక్తి ఆధారంగా నీటిపై తెలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆలోచన రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల భవిష్యత్తుపై మరణ శాసనం అవుతుందని, ఈ ప్రతిపాదనలను బెషరతుగా విరమించుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనల వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు, "తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్" మాజీ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఇటీవల "పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ" (రెడ్ కో) కార్యకలాపాలపై హైదరాబాదులో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడాన్ని "తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు.
తెలంగాణలోని వివిధ జలాశయాలకు చెందిన మత్స్యకార ప్రతినిధులు, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నాయకుల తో కూడిన ప్రతినిధుల బృందం ఆదివారం నాడు ఎన్టీపీసీ రిజర్వాయర్లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పిట్టల రవీందర్ మాట్లాడుతూ గతంలో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన జలాశయాలలో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రతిపాదించిందని అయితే అందువల్ల ఉత్పన్నమయ్యే సామాజిక మరియు పర్యావరణ సంబంధమైన సమస్యలపై తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను మన్నించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను పక్కకు పెట్టిందని గుర్తుకు చేశారు.

ప్రకృతిలో అందుబాటులో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను మానవ సంక్షేమానికి వినియోగించుకునే విషయంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీకి ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ రిజర్వాయర్లలో సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ఆటంకాలు తలెత్తే ప్రమాదాన్ని నిలువరించడం కోసం మాత్రమే తాము ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు శ్రీ పిట్టల రవీందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 159 రిజర్వాయర్లలో సుమారు నాలుగు లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధిని పొందుతున్నారని, ఈ రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మత్స్యకారుల చేపల వేటకు తీవ్రమైన ఆటంకాలు తలెత్తుతాయని, రిజర్వాయర్లలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే సోలార్ ప్లేట్లు జలాశయంలోని అతి ముఖ్యమైన ప్రాంతాలలో ఆవరించి ఉండటం వల్ల ఆయా ప్రదేశాలలో చేపల వేటను నిషేధిస్తారని, ఈ పరిణామాలు మత్స్యకారుల జీవన స్థితిగతులపైన, ఆదాయ వనరులపైన, సామాజిక భద్రతపైన ప్రతికూల ప్రభావాలను తీవ్రస్థాయిలో చూపిస్తాయని ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన మరియు ప్రజాపాలనను అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అత్యధిక జనాభా సంఖ్యను కలిగి ఉన్న మత్స్యకార సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించే ఇట్లాంటి ఆలోచనలు ముందుకు తీసుకు రావడం తీవ్ర అభ్యంతరకరమని శ్రీ పిట్టల రవీందర్ ఆక్షేపించారు.
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అనేక దేశాలలో నీటిపై తేలే ఆడే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదులుగా జలాశయాలకు అనుబంధంగా నిర్మించిన ప్రధాన కాలువల పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిల కలుపుతున్నారని ఈ టెక్నాలజీ ఇప్పటికే అనేక దేశాలలో విజయవంతం అయ్యిందని ఇదే పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో కూడా అనుసరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలోని రిజర్వాయర్లకు అనుబంధంగా సుమారు 30 వేల కిలోమీటర్ల పొడవు కలిగిన పంట కాలువలు ప్రధానా నీటి కాలువలు అందుబాటులో ఉన్నాయని, ఈ కాలువలను వినియోగించుకోవడం ద్వారా వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ పిట్టల రవీందర్ సూచించారు. అందువల్ల రాష్ట్రంలోని రిజర్వాయర్లలో చేపల పెంపకం మీద ఆధారపడిన లక్షలాదిమంది మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలిగించే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
"తెలంగాణ ఫిషరీస్ సొసైటీ" వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ విట్టల రవీందర్ తో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాల కనకయ్య ముదిరాజ్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ వేల్పుల సరోజన, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రతినిధులు దుద్దెడ గణేష్  ముదిరాజ్, మేడమైన కనకయ్య ముదిరాజ్, లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ ప్రతినిధి అట్ల అనిల్ ముదిరాజ్, ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రతినిధి తోకల రాజేందర్ గంగపుత్ర, తదితరులు కూడా హాజరయ్యారు.

Tags

More News...

Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాటి కార్య కార్య క్రమంలో మంచాల రాంగోపాల్, గౌరి శెట్టి రామ్ మూర్తి దేశాయ్, భాశెట్టి లవకుమార్, గౌరి శెట్టి రాజు, ఆలయ అర్చకులు రుద్రంగి...
Read More...
Local News 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 15( ప్రజా మంటలు)               ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)  రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న పశు వైద్యశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పశు...
Read More...
Local News 

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్   

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్     ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లీడ్స్ నిదుల ప్రొసీడింగ్    ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): నిజామాబాదు ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లాడ్స్ నిదుల నుండి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోధుర్ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి 2 లక్షల రూపాయల నిదుల ప్రొసీడింగ్ పత్రాన్ని దేవాలయం కమిటీ...
Read More...
Local News 

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు సమస్యల పరిష్కారానికి సూపరింటెండెంట్ హమీ      *ఆసుపత్రి వద్ద ధర్నా పిలుపు విరమణ సికింద్రాబాద్, సెప్టెంబర్ 15 (ప్రజామంటలు): గాంధీ హాస్పిటల్‌లో నెలకొన్న సమస్యలపై ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పి.వై.ఎల్) ధర్నాకు పిలుపునివ్వగా, సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రతినిధి బృందాన్ని చర్చలకు ఆహ్వానించారు. దీంతో ధర్నాను విరమించిన పి.వై.ఎల్ నాయకులు సోమవారం సూపరింటెండెంట్ తో సమావేశమై 18...
Read More...
Local News 

పాత గొడవల నేపధ్యంలో  హత్య, ఇద్దరికి జీవిత ఖైదు

పాత గొడవల నేపధ్యంలో  హత్య, ఇద్దరికి జీవిత ఖైదు ఒక్కొక్కరికి 7000/- రూపాయల జరిమాన కీలక తీర్పును వెలువరించిన ఎడిజె నారాయణ నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ (అంకం భూమయ్య)   గొల్లపల్లి సెప్టెంబర్ 15 (ప్రజా మంటల):    వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండపల్లి గ్రామానికి చెందిన అంకం మల్లేశం,రాజేశం లు మామ,అల్లుడు  అదే గ్రామానికి తేదీ:20-09-2016...
Read More...
Local News 

గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం (అంకం భూమయ్య) గొల్లపల్లి సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో శ్రీ గాయత్రీమాత పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  శ్రీ విశ్వకర్మ భగవానుని పంచాహ్నిక యజ్ఞ మహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సోమవారం త్వష్టబ్రహ్మ పూజ మంటప పూజలు మరియు సాముహిక విశ్వకర్మ వ్రతం నిర్వహించారు అనంతరం భక్తులకు విశ్వకర్మ సూక్తం తో...
Read More...
Local News 

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది అర్జీదారులతో ఎస్పీ  స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో...
Read More...

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 15: IND vs PAK ఆసియా కప్ మ్యాచ్  తర్వాత భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి నిరాకరించడంతో పాకిస్తాన్ ACCకి నిరసన తెలిపిందిసూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత భారతదేశం తీసుకున్న చర్యలను "క్రీడా స్పూర్తికి వ్యతిరేకం"గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది....
Read More...
National 

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు 

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 15: సుప్రీంకోర్టు ఈ రోజు తన మధ్యంతర ఉత్తర్వుల్లోవక్ఫ్ (సవరణ) చట్టం 2025 పూర్తిగా నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.కానీ, 2025 సవరణ చట్టంలోని కొన్ని కీలకమైన సెక్షన్లను ఇది నిలిపివేసింది. భారత సుప్రీంకోర్టు సోమవారం (సెప్టెంబర్ 15, 2025) మొత్తం వక్ఫ్ (సవరణ) చట్టం, 2025పై స్టే విధించడానికి నిరాకరించింది,...
Read More...
Local News 

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం మెటుపల్లి సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు): పేదింటి మైనారిటీ ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి, కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డా.కల్వకుంట్ల సంజయ్ అండగా నిలిచి,మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వివాహ ఖర్చులకు సహాయం అవసరమని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే డా.సంజయ్ స్పందించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మెట్ పల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ...
Read More...
Local News  State News 

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్   జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు): ఆన్లైన్ తరగతుల ద్వారా సన్నతమై నీటి పరీక్షలో ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియాలో 487 ర్యాంకు సాధించిన అమన్ కాణంకు జగిత్యాల పట్టణం కు చెందిన బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సూరజ్ శివ శంకర్ 10 వేల రూపాయల ఆర్థిక సాయం, అదిలాబాద్ పట్టణము వెళ్లి అందించాడు....
Read More...