వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన
ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, రథోత్సవం సందర్భంగా దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ ఆచార్యత్వంలో మద్యాహ్నం 3 గంటలకు ముందుగా వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో దేవస్థానం ముందు భాగాన, సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంచిన మూడు రథాలపై శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర స్వాములను ఆసీనుల గావించి బలిహరణం, అష్టదిక్పాలకుల పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పరచిన క్యూలైన్ల ద్వారా అశేష భక్తులు, రథాలపైకి నిచ్చెనల ద్వారా వెళ్ళి రథా రూఢులైన స్థానిక దైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదమంత్ర ఘోషలు, మంగళ వాద్యాలు, జయజయ ధ్వనాల మధ్య దేవ స్థానంనుండి ఇసుకస్థంభం మీదుగా పురపాలక సంఘ కూడలి వద్ద గల నంది విగ్రహం వరకు నారసింహ, వేంకటేశ్వర, రామలింగేశ్వర రథాలను వరుసగా నిలిపి భక్తజనం అనుసరించగా, రథాలను ఊరేగించగా ముత్తయిదువులు రోడుకిరు వైపులా నిలిచి మంగళ హారతులు పట్టారు. 
స్థానిక ప్రముఖులతో కలిసి రథారూడు లయిన స్వామి దర్శనం చేసుకొని కంకణాలు కట్టు కున్నారు. సిఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
ఈఓ శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్, అసిస్టెంట్ శ్రీనివాస్ రథాల ముందుండిమార్గ నిర్దేశనం చేయగా నంది విగ్రహ కూడలి వద్దకు అశేష భక్త జనం తోడురాగా వూరేగి తిరిగి వచ్చారు.
అనంతరం దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలొనరించి గోదావరికి ఊరేగింపుగా వెళ్ళి చక్రతీర్ధ మంగళ స్నానాలు ఆచరించారు. చక్రతీర్ధం అనంతరం రాత్రి మధ్వా చారి రాం కిషన్ గృహంలో
విందు భోజనం ఆరగించి, తిరిగి దేవస్థానానికి చేరుకున్నారు. ధర్మపురి సి ఐ
రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్, అధిక సంఖ్యలో పోలీసులు, సిబ్బంది ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: జి. రాజేశం గౌడ్
హైదరాబాద్, జనవరి 18 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1985–1990 మధ్యకాలంలో ఎన్టీఆర్ దూరదృష్టి, ప్రజాహిత పాలనతో న్యాయవ్యవస్థలో సంస్కరణలు, మహిళలకు... నిజాంపేట్ లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
సికింద్రాబాద్, జనవరి 18 ( ప్రజా మంటలు):
దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ లో ఆదివారం పలువురు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నిజాంపేట్ అధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..బీసీ, ఎస్సీ,ఎస్టీలకు రాజకీయ అవకాశాలు... స్వర్గీయ ఎన్టీరామారావు 30వ వర్ధంతి.. నివాళి అర్పించిన ఎన్టీఆర్ అభిమానులు
గొల్లపల్లి జనవరి 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం కేంద్రంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు, వేసి అభిమానులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ రాష్ట్ర సెల్ ఉపాధ్యక్షులు ఓరగంటి భార్గవ్, మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్, బడుగు బలహీన వర్గాల నాయకుడుగానిరుపేద గుండెల్లో దేవుడిగా ఉన్నారని అన్నారు.
నాడు పేద ప్రజల... ఎన్నికల హామీల అమలే ప్రజాప్రభుత్వ లక్ష్యం – గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
చిగురుమామిడి, జనవరి 18 (ప్రజా మంటలు):
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారని చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహలక్ష్మి, గృహ జ్యోతి వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని... ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3.83 కోట్ల నిధుల విడుదల
ఇబ్రహీంపట్నం జనవరి 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్)
నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణం పనుల పరశీలన మండల బీజేపీ అధ్యక్షులు బాయి లింగారెడ్డి ఇబ్రహీంపట్నం నుండి ఫకీర్ కొండాపూర్ వరకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్యో జన కింద విడుదల ఐనా 3.83 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఈ... జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – అసత్య ఆరోపణలకు ప్రజలే సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
విమర్శించే ముందు గతాన్ని గుర్తుంచుకోవాలి
ఉద్దేశపూర్వక ఆరోపణలు, హింసా రాజకీయాలు వద్దు
జగిత్యాలకు అత్యధిక నిధులు – అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల మోతే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల అభివృద్ధి కోసం... జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం _తుంగూరు సర్పంచ్ కు సన్మానం
జగిత్యాల జనవరి 18 జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం విద్యానగర్లోని ఎడ్ల అంగడి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తంగూరి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్రావుకు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.
ఈ సందర్భంగా... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ...
సికింద్రాబాద్, జనవరి 18( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న అబాగ్యులు, నిరాశ్రయులు, సంచారజాతులను గుర్తించి స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలోని అత్యంత పేద వర్గాల జీవన పరిస్థితులకు కొంతైనా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్... అన్నపూర్ణ సేవా సమితి వారి అన్న ప్రసాదం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ
జగిత్యాల జనవరి 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం విద్యా నగర్ ఎడ్లంగడి సమీపంలో ని, శ్రీ సీతా రామాంజనేయ దేవాలయం లో, అన్నపూర్ణ సేవాసమితి, వారు అన్న ప్రసాద వితరణ ఈ ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరై అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ... తప్పిపోయిన యువకుడు ఆత్మహత్య – బట్టపల్లి శివారులో మృతదేహం లభ్యం
గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన మంద నరేష్ (35) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం భార్యతో కిరాణా షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన నరేష్ తిరిగి ఇంటికి రాలేదు.
కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా... డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణ పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
జగిత్యాల జనవరి 18 ( ప్రజా మంటలు)జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో *“Arrive Alive”* రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (6వ రోజు) *“Drunk and Drive – Zero Tolerance Day”* పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా... ఖమ్మం ఏదులాపురంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు రూ.362 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు.
ఆసుపత్రి, మార్కెట్ యార్డు, నర్సింగ్ కాలేజీ
కూసుమంచిలో ... 