వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

On
వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన
 ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, రథోత్సవం సందర్భంగా దేవస్థాన  పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ  ఆచార్యత్వంలో మద్యాహ్నం 3 గంటలకు ముందుగా వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో దేవస్థానం ముందు భాగాన, సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంచిన మూడు రథాలపై శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర స్వాములను ఆసీనుల గావించి బలిహరణం, అష్టదిక్పాలకుల పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పరచిన క్యూలైన్ల ద్వారా అశేష భక్తులు, రథాలపైకి నిచ్చెనల ద్వారా వెళ్ళి రథా రూఢులైన స్థానిక దైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదమంత్ర ఘోషలు, మంగళ వాద్యాలు, జయజయ ధ్వనాల మధ్య దేవ స్థానంనుండి ఇసుకస్థంభం మీదుగా పురపాలక సంఘ కూడలి వద్ద గల నంది విగ్రహం వరకు నారసింహ, వేంకటేశ్వర, రామలింగేశ్వర రథాలను వరుసగా నిలిపి భక్తజనం అనుసరించగా, రథాలను ఊరేగించగా ముత్తయిదువులు రోడుకిరు వైపులా నిలిచి మంగళ హారతులు పట్టారు. IMG_20250319_204903

స్థానిక ప్రముఖులతో కలిసి రథారూడు లయిన స్వామి దర్శనం చేసుకొని కంకణాలు కట్టు కున్నారు. సిఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
ఈఓ శ్రీనివాస్,  చైర్మన్ రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్, అసిస్టెంట్ శ్రీనివాస్ రథాల ముందుండిమార్గ నిర్దేశనం చేయగా నంది విగ్రహ కూడలి వద్దకు అశేష భక్త జనం తోడురాగా వూరేగి తిరిగి వచ్చారు.
 అనంతరం దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలొనరించి గోదావరికి ఊరేగింపుగా వెళ్ళి చక్రతీర్ధ మంగళ స్నానాలు ఆచరించారు. చక్రతీర్ధం అనంతరం రాత్రి మధ్వా చారి రాం కిషన్ గృహంలో
 విందు భోజనం ఆరగించి, తిరిగి దేవస్థానానికి చేరుకున్నారు. ధర్మపురి సి ఐ
రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్, అధిక సంఖ్యలో పోలీసులు, సిబ్బంది ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు.

Tags
Join WhatsApp

More News...

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు): తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు. కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం...
Read More...
Local News  State News 

రేపు హుస్నాబాద్‌లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ

రేపు హుస్నాబాద్‌లో భారీ కాంగ్రెస్ బహిరంగ సభ హుస్నాబాద్, డిసెంబర్ 3, 2025 (ప్రజా మంటలు): హుస్నాబాద్ పట్టణం మరో భారీ కాంగ్రెస్ శక్తి ప్రదర్శనకు సాక్ష్యమవుతోంది. బుధవారం (03-12-2025) జరుగనున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. సీఎం హోదాలో మొదటిసారి హుస్నాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి, ఏమిస్టారో అని సామాన్యులే...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ

గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ సికింద్రాబాద్,  డిసెంబర్ 02 (ప్రజా మంటలు): స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల మాజీ గవర్నర్ డా. మర్రి చెన్నారెడ్డి  29వ వర్ధంతిని మంగళవారం బన్సీలాల్ పేట డివిజన్ లో   ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.బిజెపి నాయకులు...
Read More...

సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము  దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,  మల్యాల డిసెంబర్ 2 ( ప్రజా మంటలు)సరియైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేస్తాము అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  తెలిపారు. కొడిమ్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు

గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు (అంకం భూమయ్య) గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):  పంచాయతి ఎన్నికలు -2025  మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు....
Read More...
Local News 

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు. ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం  అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ  గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు  తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి...
Read More...

ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...

ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...   కొండగట్టు డిసెంబర్ 1(ప్రజా    మంటలు)ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో  కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం రూపాయలు 40 వేల విలువగల  దుస్తువులను  కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్బంగా కంపెనీ ASM రమేష్ కుమార్ , CFA ఏజెంట్ వూటూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కొండగట్టులోని...
Read More...
Local News  State News 

హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి 

హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి  గాంధీ ఏఆర్‌టీ సెంటర్ లో అందుబాటులో  చక్కటి వైద్యం సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు) :  ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం,ఎ.ఆర్.టి. సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, అవేర్నెస్  నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి హాజరయ్యారు. అనంతరం ఎ ఆర్...
Read More...

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు)   మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR  అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి జిల్లా పరిధిలో  పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136  మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత. సెల్ ఫోన్  పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది

ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని  ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందిన భూమి...అక్రమంగా ఆక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవు.. అని బోర్డుపై పేర్కొన్నారు. సదరు...
Read More...
Local News  State News 

ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్

ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్- కంటోన్మెంట్, డిసెం‍బర్ 01 ( ప్రజా మంటలు): ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలు మారేడ్‌పల్లిలో సోమవారం ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మాజీ మంత్రి గీతారెడ్డి ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ— మహిళా సాధికారతకు ప్రతీక అయిన ఈశ్వరీబాయి 100 ఏళ్ల క్రితమే లింగ వివక్షను ఎదుర్కొంటూ ఉన్నత...
Read More...

‘భూతశుద్ధి వివాహం’ అంటే ఏమిటి?

 ‘భూతశుద్ధి వివాహం’  అంటే ఏమిటి? హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు): సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్‌లోని లింగభైరవి ఆలయంలో ‘భూతశుద్ధి వివాహం’ పద్ధతిలో జరిగినట్లు ఈషా సంస్థ వెల్లడించింది. ఈ వార్త బయటకు రావడంతో భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఈషా నిర్వాహకుల వివరణ ప్రకారం, భూతశుద్ధి వివాహం అనేది...
Read More...