మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు
* కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...
* బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి...
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు):
వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడని చేసేదే చెప్తాడని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఏద్దేవాచేశారు. ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పేరిట తెలంగాణా రాష్టంలోని మహిళలకు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీ, పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఎంతమందికి 2,500/- చొప్పున ఇచ్చారో 500/-రూపాయలకే ఎంతమందికి సిలిండర్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వందేళ్ల తర్వాత కులగణన చేశామని అది తమ గొప్ప అని చెప్పిన మంత్రి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరవై ఏండ్లు ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఏఒక్క లబ్ధిదారునికి బిల్లులు ఇచినట్టు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఎన్నికల సందర్బంలో మహిళా సంఘాలకు ఇచ్చిన అయిదు లక్షలు రుణమాఫీ చేసి వడ్డీలేని ఋణం పది లక్షలు ఇస్తామని మహిళా సంఘాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
బీజేపీ పార్టీ ఎప్పుడు కుల,మత రాజకీయాలు చేయలేదని కుల, మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అందుకే దసరా పండుగకి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి చీరల పంపిణి నిలిపివేసిందని కానీ క్రిస్మస్, రంజాన్ పండుగలకు క్రిస్టియన్లకు ముస్లింలకు మాత్రం గిఫ్టులు ఇచ్చిందన్నారు.
మహిళా సంఘాలకు ఏడు బస్సులిచ్చి ఎడాపెడా ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రజలు మాచేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలే ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడు అన్న మాటలకు నిదర్శనం అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సింది పోయి ఏమి చేయకున్నా అన్ని చేసినట్లు పొగడడం మహిళా సమాజానికి సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ త్యాగాల పార్టీ కాదని వాళ్ళ భోగాల కోసం వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని బలి చేసి మూడు ముక్కలు చేసిందన్నారు. వారు చేసిన పాపం వల్లనే భారతదేశం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాటిని అధిగమించటానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల జనవరి 4( ప్రజా మంటలు)
స్థానిక సంస్థల్లో ఆదిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, డీ సీ సీ అధ్యక్షుడు గాజంగి... ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, అనాథలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దుస్తులు, ఔషధాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రుగ్మతులతో బాధపడుతున్న వారికి మందులు అందించడంతో పాటు ప్రమాదాలకు గురైన వారికి ప్రాథమిక చికిత్స చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్... బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):
ప్రధానమంత్రి సంసద్ మహోత్సవం 2025–26లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేరణతో, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ మహా క్రీడోత్సవం కింద బన్సీలాల్పేట్ డివిజన్లో క్రీడా రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు.
డివిజన్ బీజేపీ అధ్యక్షులు రామంచ మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ... మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ పలువురికి గాయాలు
మెట్టుపల్లి, జనవరి 4 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు మరియు తవేరా వాహనం ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు.
మెట్టుపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 16 UC 3599) ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటలకు మేడిపల్లి... నిరుపేద కుటుంబానికి వైద్య సాయం... 4 లక్షల ఎల్ ఓ సి అందజేత...
చిగురుమామిడి జనవరి 4 (ప్రజా మంటలు):
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వంశీ (18) అనే యువకుడు గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయక పోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న
స్థానిక... వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా?
— సిహెచ్. వి. ప్రభాకర్ రావు
వెనిజులా పై అమెరికా చేసిన సైనిక–భద్రతా చర్యలు, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బలవంతంగా అమెరికాకు తీసుకెళ్లి క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రమాదకర మలుపుగా మారింది. ఇది ఒక సాధారణ “చట్ట అమలు చర్య” కాదు; ఒక సార్వభౌమ దేశంపై... బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)పట్టణంలోని సావిత్రిబాయి పూలే పార్కులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బిఆర్ఎస్ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా తొలి జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* బిఆర్ఎస్ హయంలో బడుగు బలహీన వర్గాలకు... రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సి ఎస్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర... డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు
జగిత్యాల జనవరి 3 ( ప్రజా మంటలు)జగిత్యాల ముద్దుబిడ్డ డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది.
హైదరాబాదులో నిర్వహించిన 22వ అప్రస్కాన్ 20 25 అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో జగిత్యాలకు చెందిన డాక్టర్ అభినవ్... కోరుట్ల పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో తనిఖీలు.. జరిమానాలు విధించిన మున్సిపల్ అధికారులు
కోరుట్ల జనవరి 3 (ప్రజా మంటలు)
పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు పట్టణంలో గల రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత పాటించని, మరియు సింగిల్... అభయాంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థల సమావేశం
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు) వివిధ ధార్మిక సంస్థల సమావేశము అభయాంజనేయ స్వామి టెంపుల్ అరవింద నగర్ లో జరిగింది దీనిలో భూమి, నీరు,వాయువు అగ్ని ఆకాశము పంచభూతాలను కాపాడుతూ పర్యావరణo అసమతౌల్యం వల్ల జరిగే నష్టాలను అధిగమించుటకు పర్యావరణ సమస్యలను అధిగమించుటకు అందరూ అన్ని దేవాలయాలలో సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయం ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కొండగట్టు, జనవరి 3 (ప్రజా మంటలు):
ఆంజనేయ స్వామి దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కొండగట్టులో టిటిడి సహకారంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ... 