మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు
* కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...
* బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి...
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు):
వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడని చేసేదే చెప్తాడని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఏద్దేవాచేశారు. ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పేరిట తెలంగాణా రాష్టంలోని మహిళలకు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీ, పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఎంతమందికి 2,500/- చొప్పున ఇచ్చారో 500/-రూపాయలకే ఎంతమందికి సిలిండర్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వందేళ్ల తర్వాత కులగణన చేశామని అది తమ గొప్ప అని చెప్పిన మంత్రి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరవై ఏండ్లు ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఏఒక్క లబ్ధిదారునికి బిల్లులు ఇచినట్టు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఎన్నికల సందర్బంలో మహిళా సంఘాలకు ఇచ్చిన అయిదు లక్షలు రుణమాఫీ చేసి వడ్డీలేని ఋణం పది లక్షలు ఇస్తామని మహిళా సంఘాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
బీజేపీ పార్టీ ఎప్పుడు కుల,మత రాజకీయాలు చేయలేదని కుల, మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అందుకే దసరా పండుగకి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి చీరల పంపిణి నిలిపివేసిందని కానీ క్రిస్మస్, రంజాన్ పండుగలకు క్రిస్టియన్లకు ముస్లింలకు మాత్రం గిఫ్టులు ఇచ్చిందన్నారు.
మహిళా సంఘాలకు ఏడు బస్సులిచ్చి ఎడాపెడా ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రజలు మాచేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలే ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడు అన్న మాటలకు నిదర్శనం అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సింది పోయి ఏమి చేయకున్నా అన్ని చేసినట్లు పొగడడం మహిళా సమాజానికి సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ త్యాగాల పార్టీ కాదని వాళ్ళ భోగాల కోసం వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని బలి చేసి మూడు ముక్కలు చేసిందన్నారు. వారు చేసిన పాపం వల్లనే భారతదేశం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాటిని అధిగమించటానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి ఆర్ ఎస్ కండువా కప్పుకోవాలి_ లేదా పార్టీకి రాజీనామా చేయాలి....
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బి ఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి లేదా పార్టీకి రాజీనామా చేయాలనిజగిత్యాల జిల్లా బి ఆర్ ఎస్పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులుకల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జగిత్యాల జిల్లా... రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించి అధికారులు పరిష్కారం చూపాలన్నారు జిల్లా కలెక్టర్
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు.... గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ నవంబర్ 20 (ప్రజా మంటలు)గ్రామాలను అభివ్రుద్ది చేయడమే నా ధ్యేయం అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం నాడుజగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్రంలోనే అత్యధిక... శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో, కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అద్వైత శ్రీ చక్రపీఠం భవాని నగర్ శ్రీ శ్రీ పాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో 27 కుండములు 108 మంది దంపతులు చే విష్ణు సహస్రనామ, మరియు... రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూ ఢిల్లీ నవంబర్ 20:
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు పంపించే బిల్లుల విషయంలో గడువు విధించే అధికారం న్యాయస్థానానికి లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము చేసిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్పై గురువారం వెలువరించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గవర్నర్లు కారణం... బిహార్ సీఎం గా మళ్లీ నితీశ్కుమార్ ప్రమాణ స్వీకారం – 26 మంది మంత్రుల మంత్రివర్గం ప్రమాణం
26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పేర్ల జాబితా చివర్లో
పాట్నా: నవంబర్ 20:
బిహార్లో మరోసారి రాజకీయ పటంలో మార్పులు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీశ్కుమార్ బుధవారం బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 26 మంది మంత్రులు కూడా... శబరిమల యాత్రికులకు కొత్త నిబంధనలు – వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి
హెల్ప్లైన్ నంబర్లు
శబరిమల హెల్ప్లైన్: 14432
ఇతర రాష్ట్రాల భక్తుల కోసం: 04735-14432
పంబ నవంబర్ 20:
శబరిమలలో రోజురోజుకు పెరుగుతున్న అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నియమాలను అమలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. నవంబర్ 24, 2025... జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడింది ఏ ఒక్క సంఘమో అయితే, అది టీయూడబ్ల్యూజే (తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు... జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల పాత్రికేయుడు షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్లోని రెనోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బుధవారం ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు.
షఫీ ఆరోగ్య పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వెంటనే విధినిర్వహణలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. ఆయనకు ... మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ
హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):తె లంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా, లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఈ పథకంపై సీఎం సచివాలయం నుంచి... ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్... డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్... 