మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు
* కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...
* బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి...
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు):
వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడని చేసేదే చెప్తాడని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఏద్దేవాచేశారు. ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పేరిట తెలంగాణా రాష్టంలోని మహిళలకు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీ, పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఎంతమందికి 2,500/- చొప్పున ఇచ్చారో 500/-రూపాయలకే ఎంతమందికి సిలిండర్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వందేళ్ల తర్వాత కులగణన చేశామని అది తమ గొప్ప అని చెప్పిన మంత్రి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరవై ఏండ్లు ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఏఒక్క లబ్ధిదారునికి బిల్లులు ఇచినట్టు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఎన్నికల సందర్బంలో మహిళా సంఘాలకు ఇచ్చిన అయిదు లక్షలు రుణమాఫీ చేసి వడ్డీలేని ఋణం పది లక్షలు ఇస్తామని మహిళా సంఘాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
బీజేపీ పార్టీ ఎప్పుడు కుల,మత రాజకీయాలు చేయలేదని కుల, మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అందుకే దసరా పండుగకి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి చీరల పంపిణి నిలిపివేసిందని కానీ క్రిస్మస్, రంజాన్ పండుగలకు క్రిస్టియన్లకు ముస్లింలకు మాత్రం గిఫ్టులు ఇచ్చిందన్నారు.
మహిళా సంఘాలకు ఏడు బస్సులిచ్చి ఎడాపెడా ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రజలు మాచేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలే ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడు అన్న మాటలకు నిదర్శనం అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సింది పోయి ఏమి చేయకున్నా అన్ని చేసినట్లు పొగడడం మహిళా సమాజానికి సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ త్యాగాల పార్టీ కాదని వాళ్ళ భోగాల కోసం వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని బలి చేసి మూడు ముక్కలు చేసిందన్నారు. వారు చేసిన పాపం వల్లనే భారతదేశం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాటిని అధిగమించటానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి... మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న?
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీఎల్జీఏ నెంబర్–1 కమాండర్గా పేరొందిన బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోనున్నారనే ప్రచారం భద్రతా వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. భారీ ఆయుధాలతో పాటు అనుచరులతో కలిసి లొంగిపోవచ్చనే సమాచారం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.... బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి
ఢాకా జనవరి 01:
భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జయశంకర్ బంగ్లాదేశ్కు అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సంతాప సందేశాన్ని కూడా అందజేశారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ నాయకత్వంతో... అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు?
న్యూ ఢిల్లీ జనవరి 01:
దేశ రాజకీయ–ఆర్థిక వేదికపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అడానీ గ్రూప్కు వ్యతిరేకంగా అంబానీ, టాటా వర్గాలు సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం జాతీయ స్థాయిలో సంచలనం... జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్... ఉత్తమ సేవ పథకాల కి ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్... గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్... కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*
2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం
కల్వకుర్తి జనవరి 01 (ప్రజా మంటలు):
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రసన్న (40) అనే... పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ
జగిత్యాల జనవరి 1( ప్రజా మంటలు)
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో... ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ జనవరి 1 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,మండల... 