మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు
* కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...
* బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి...
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు):
వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడని చేసేదే చెప్తాడని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఏద్దేవాచేశారు. ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పేరిట తెలంగాణా రాష్టంలోని మహిళలకు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీ, పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఎంతమందికి 2,500/- చొప్పున ఇచ్చారో 500/-రూపాయలకే ఎంతమందికి సిలిండర్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వందేళ్ల తర్వాత కులగణన చేశామని అది తమ గొప్ప అని చెప్పిన మంత్రి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరవై ఏండ్లు ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఏఒక్క లబ్ధిదారునికి బిల్లులు ఇచినట్టు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఎన్నికల సందర్బంలో మహిళా సంఘాలకు ఇచ్చిన అయిదు లక్షలు రుణమాఫీ చేసి వడ్డీలేని ఋణం పది లక్షలు ఇస్తామని మహిళా సంఘాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
బీజేపీ పార్టీ ఎప్పుడు కుల,మత రాజకీయాలు చేయలేదని కుల, మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అందుకే దసరా పండుగకి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి చీరల పంపిణి నిలిపివేసిందని కానీ క్రిస్మస్, రంజాన్ పండుగలకు క్రిస్టియన్లకు ముస్లింలకు మాత్రం గిఫ్టులు ఇచ్చిందన్నారు.
మహిళా సంఘాలకు ఏడు బస్సులిచ్చి ఎడాపెడా ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రజలు మాచేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలే ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడు అన్న మాటలకు నిదర్శనం అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సింది పోయి ఏమి చేయకున్నా అన్ని చేసినట్లు పొగడడం మహిళా సమాజానికి సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ త్యాగాల పార్టీ కాదని వాళ్ళ భోగాల కోసం వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని బలి చేసి మూడు ముక్కలు చేసిందన్నారు. వారు చేసిన పాపం వల్లనే భారతదేశం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాటిని అధిగమించటానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట... వైకుంఠ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
నాంపల్లిలోని రామ్ ప్రతాప్ పిట్టి భవన్లో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి బాలాజీ మందిరంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఉత్సవాల్లో మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గోడిసెల రాజేశం గౌడ్ పాల్గొన్నారు. ఆగస్టు 25 నుంచి 30వ... వేతన చెల్లింపులో జాప్యంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ఫారమ్–16 జారీ, జాప్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు
హైదరాబాద్ ఆగస్ట్ 28 (ప్రజా మంటలు):
ఉద్యోగికి సకాలంలో వేతనం చెల్లించకపోవడం, ఆదాయపు పన్నుకు సంబంధించిన పత్రాలు అందించడంలో జాప్యం చేయడం మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశమేనని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.... అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ
జగిత్యాల ఆగస్టు 28(ప్రజా మంటలు)శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణలో గల తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించారు. దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణాల అనంతరం హోమము నిర్వహించారు. .
నూతన యజ్ఞోపవీత ధారణ అనంతరం సభాపతి తిగుళ్ళ విశ్వనాథ శర్మ ఉపాకర్మ ప్రత్యేకత... గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ వేడుకలు
జగిత్యాల ఆగస్టు 28 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీ రామాలయంలో విద్యానగర్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాకర్మ ఘనంగా నిర్వహించారు. హోమము తర్పణాలు నిర్వహించి నూతన యజ్ఞోపవీత ధారణ చేశారు.
కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కొలిచాల రవీందర్ వైదిక క్రతువు అన్యారంభట్ల నారాయణ... సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు) రక్షాబంధన్ పండుగ శ్రావణమాసం పౌర్ణమిలో జరుపుకుంటాము. వైదికంగా జంధ్యాల పౌర్ణమిగా దీనినే రాఖీ పౌర్ణమి గా భావిస్తారు. రాఖీ పౌర్ణమి కి ప్రత్యేక విశిష్టత ఉంది. సోదరీలు తమ సోదరులకు రక్షాబంధనం చేసి తమ ఆత్మీయతను ఆవిష్కరిస్తారు.
పౌర్ణమి శుక్రవారం ఉన్నప్పటికీ తక్కువ సమయం ఉండడం అదేవిధంగా... ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్.
జగిత్యాల, ఆగస్టు 27( ప్రజా మంటలు) ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కృషి పట్టుదల ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్ అన్నారు.వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని రూరల్ సీఐ సుధాకర్ సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ... మౌంట్ కార్మెల్ హైస్కూల్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 27(ప్రజా మంటలు)
ధరూర్ లోని *మౌంట్ కార్మెల్ హైస్కూల్* లో రక్ష బంధన్ వేడుకలు అత్యంత ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో పాఠశాల యాజమాన్యం నిర్వహించారుఈ సందర్భంగా పాఠశాల బాలికలు పాఠశాలలోని బాలురకి రాఖీలు కట్టి *నువ్వు నాకూ రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష* అని నినదించారు.
పాఠశాల... ఘనంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసునీ కళ్యాణం జగిత్యాల ఆగస్టు 26 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం వైభవో పెతంగా ఘనంగా జరిగింది .ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకొని స్వాములను దర్శించుకున్నారు. కళ్యాణానికి వందలాది మంది భక్తులు హాజరైనారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ, నిర్వాహకులు అన్న ప్రసాదం అందించారు.... మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎంఎస్ ఆర్ డి ఎఫ్) ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటే కార్యక్రమం
సారంగాపూర్ 26(ప్రజా మంటలు)పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సారంగాపూర్ రంగపేట గ్రామంలో మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎం ఆర్ ఎస్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన 200 మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, విజయవంతంగా ముగిసింది. ఈ హరిత యజ్ఞంలో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు... జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: సీఎం రేవంత్రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 26 (ప్రజా మంటలు):
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన... కవి సాయంత్రం ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ
సికింద్రాబాద్, ఆగస్ట్ 25 ( ప్రజా మంటలు):
మారుతున్న యాంత్రిక జీవన విధానం వల్ల తెలుగు భాష నిరాదరణకు గురి అవుతున్న సందర్భంలో కవి సాయంత్రం వంటి సాహిత్య సంస్థల కార్యక్రమాలు చూస్తుంటే తెలుగు భాషకు, సాహిత్యానికి పూర్వవైభవం రానున్నదని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
జనజాగృతి సంస్థలో... 