మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు
* కాంగ్రెస్ అంటే మహిళలని మోసం చేయడమే...
* బీజేపీ నాయకురాలు ఎం. రాజేశ్వరి...
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు):
వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు అన్ని తప్పుల తడక అని కాంగ్రెస్ అంటే మహిళాభివృద్ధి కాదని మహిళలను మోసం చేయడమే కాంగ్రెస్ విధానం అని బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు.
ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడని చేసేదే చెప్తాడని మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఏద్దేవాచేశారు. ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పేరిట తెలంగాణా రాష్టంలోని మహిళలకు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీ, పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఎంతమందికి 2,500/- చొప్పున ఇచ్చారో 500/-రూపాయలకే ఎంతమందికి సిలిండర్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వందేళ్ల తర్వాత కులగణన చేశామని అది తమ గొప్ప అని చెప్పిన మంత్రి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అరవై ఏండ్లు ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఏఒక్క లబ్ధిదారునికి బిల్లులు ఇచినట్టు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఎన్నికల సందర్బంలో మహిళా సంఘాలకు ఇచ్చిన అయిదు లక్షలు రుణమాఫీ చేసి వడ్డీలేని ఋణం పది లక్షలు ఇస్తామని మహిళా సంఘాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
బీజేపీ పార్టీ ఎప్పుడు కుల,మత రాజకీయాలు చేయలేదని కుల, మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అందుకే దసరా పండుగకి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి చీరల పంపిణి నిలిపివేసిందని కానీ క్రిస్మస్, రంజాన్ పండుగలకు క్రిస్టియన్లకు ముస్లింలకు మాత్రం గిఫ్టులు ఇచ్చిందన్నారు.
మహిళా సంఘాలకు ఏడు బస్సులిచ్చి ఎడాపెడా ప్రచారం చేసుకుంటుందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రజలు మాచేతిలో మోసపోవాలని కోరుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలే ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తాడు అన్న మాటలకు నిదర్శనం అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అయిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సింది పోయి ఏమి చేయకున్నా అన్ని చేసినట్లు పొగడడం మహిళా సమాజానికి సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ త్యాగాల పార్టీ కాదని వాళ్ళ భోగాల కోసం వాళ్ల స్వార్థం కోసం దేశాన్ని బలి చేసి మూడు ముక్కలు చేసిందన్నారు. వారు చేసిన పాపం వల్లనే భారతదేశం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాటిని అధిగమించటానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - విజయలక్ష్మి
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్పర్సన్గా, క్యాబినెట్ మంత్రి హోదాతో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు.
తనకు ఈ బాధ్యతలు... త్రాగునీటి సమస్య పై ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
గుంతకల్ సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు)ప్రజా సమస్యల పైన స్థానిక గుంతకల్ ఆర్డీవో కి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు ఈ సంవత్సరం తక్కువ వర్షం నమోదు కావడం వలన పట్టణంలో దాదాపుగా వారానికి ఒకసారి నీళ్లు వదలడం జరుగుతుంది. అందువలన పట్టణ ప్రజలు తాగడానికి మరియు వాడుకోవడానికి నీళ్ల కోసం చాలా... జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాపై మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
జగిత్యాల, సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్, వాహనాల రిపేర్లు, పండుగల ఏర్పాట్లు, వాహనాల కొనుగోళ్లు, పాత బిల్లుల చెల్లింపులు తదితర అంశాల్లో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఎజెండాలో పొందుపరిచిన... జగిత్యాల బీజేపీలో ముదిరిన అంతర్గత విభేదాలు
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
జగిత్యాల జిల్లా బీజేపీలో చాలాకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ పోరుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల రహస్య సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన... బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు):
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన ఈ మేరకు... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ, నలంద డిగ్రీ... కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా?
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూ ప్రజల కోసం పోరాడుతున్నది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నవీన్ ఆచారి అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వహించడం లేదంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా,... గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC
హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):
గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సూచించింది.
బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కమిషన్ హెచ్ఆర్సీ నంబర్ 3034/2026 కింద సుమోటో కేసు నమోదు చేసింది. 2026... బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత
కాంగ్రెస్పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
నిజామాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో... ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) టీజీజెఏసి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర టి జి ఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొని... చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి
గొల్లపల్లి, ఆగస్టు 31 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే చేయూత పెన్షన్లను ఎలాంటి కఠిన నిబంధనలు, షరతులు లేకుండా సరళతరం చేసి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన... గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం
గొల్లపల్లి, ఆగస్టు 31, ప్రజా మంటలు:
గొల్లపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఈ శిబిరాన్ని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్... 