సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
సికింద్రాబాద్ మార్చి 16 (ప్రజామంటలు) :
అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసుల ఉదంతం ఇది..వివరాలు ఇవి.. బేగంపేట పీఎన్టీ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతూ ఓ వ్యక్తి రోడ్డు పై పడిపోయడు. ఎండ తీవ్రత కారణంగా ఎండదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్ సిఐ పాపయ్య వెంటనే అతడిని రోడ్డు పై నుంచి పక్కకు తీసుకువచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ఆనంద్, హైదర్ లు అతడికి సీపీఆర్ చేశారు. అతను అపస్మారక స్థితి నుంచి మాములు స్థితికి రాగానే వెంటనే అతన్ని 108 లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో డాక్టర్లు అతడికి ట్రీట్మెంట్ చేసి, సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించడంతో సీపీఆర్ ద్వారా అతన్ని ప్రాణలు కాపాడిగలిగారు . అతడి వద్ద ఉన్న మొబైల్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన సురేష్ (27) గా పోలీసులు గుర్తించారు. అత్యవసర సమయంలో సీపీఆర్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులను అంతా అభినందిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
