సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
సికింద్రాబాద్ మార్చి 16 (ప్రజామంటలు) :
అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసుల ఉదంతం ఇది..వివరాలు ఇవి.. బేగంపేట పీఎన్టీ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతూ ఓ వ్యక్తి రోడ్డు పై పడిపోయడు. ఎండ తీవ్రత కారణంగా ఎండదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్ సిఐ పాపయ్య వెంటనే అతడిని రోడ్డు పై నుంచి పక్కకు తీసుకువచ్చారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు ఆనంద్, హైదర్ లు అతడికి సీపీఆర్ చేశారు. అతను అపస్మారక స్థితి నుంచి మాములు స్థితికి రాగానే వెంటనే అతన్ని 108 లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో డాక్టర్లు అతడికి ట్రీట్మెంట్ చేసి, సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించడంతో సీపీఆర్ ద్వారా అతన్ని ప్రాణలు కాపాడిగలిగారు . అతడి వద్ద ఉన్న మొబైల్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన సురేష్ (27) గా పోలీసులు గుర్తించారు. అత్యవసర సమయంలో సీపీఆర్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులను అంతా అభినందిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
