కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
సిండికేట్కు పొలిటికల్ అండ
గంజాయి తర్వాత ఇదే
కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
-సిండికేట్కు పొలిటికల్ అండ
గంజాయి తర్వాత ఇదే
హైదరాబాద్ జనవరి 24:
కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.
గంజాయి తర్వాత ఇదే..
రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్కావటమే.
ఎక్కువ మత్తు కోసం..
కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్ఏబీ చీఫ్ సందీప్శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్ఏబీ అధికారులు హైదరాబాద్లో దాడులు జరపగా 66 కాంపౌండ్లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.
ముంబయి నుంచి ఎక్కువగా..
రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
సిండికేట్కు పొలిటికల్ అండ..
ఈ కల్తీ కల్లు సిండికేట్కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్నగర్లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.
(వివిధ సమాచార మాధ్యమాల ఆధారంగా)
More News...
<%- node_title %>
<%- node_title %>
అవినీతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది - కేరళ ప్రజలకు కవిత విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని సూచిస్తూ, పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమికి మద్దతు తెలపాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన... సాగునీటి తక్షణ విడుదలకు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమీషన్ అధ్యక్షులు జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో, ఈ రోజు కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.సంగారెడ్డి జిల్లాలోని ఘనపూర్ అనికట్ కింద సాగుచేస్తున్న రైతులకు సాగునీరు విడుదల కాకపోవడంపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 20,000 ఎకరాల్లో సాగు... ఉపాధి హామీ పథకంపై కేంద్రంపై కవిత తీవ్ర విమర్శలు – పని దినాల కోతపై ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామీణ పేదలకు కీలకంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలపై కక్షపూరిత... రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు నందయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి
జగిత్యాల ఏప్రిల్ 7 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ని వారి కార్యాలయం లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య గార్ల తో కలిసిన జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి ఈ... జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోమరోసారి ఏసీబీ దాడులు
జగిత్యాల, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. సుమారు 14 మంది అధికారులతో కూడిన బృందం కార్యాలయంలోని అన్ని విభాగాల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇది రెండవసారి .
సోదాల సందర్భంగా కార్యాలయ సిబ్బంది మొబైల్
గత... జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక
హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.ఇటీవల అక్రిడిటేషన్ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అందిన... విమానంలో ‘మేడే’ అలర్ట్… లక్నో ఎయిర్పోర్ట్లో అత్యవసర పరిస్థితి
న్యూ డిల్లీ ఏప్రిల్ 05 :
Air India Express కు చెందిన ఒక విమానంలో పొగ అనుమానం రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. బాగ్డోగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తున్న IX 1523 విమానం సోమవారం సాయంత్రం అత్యవసరంగా చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCSIA), లక్నోలో ల్యాండ్ చేయబడింది.సుమారు సాయంత్రం... బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.
ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి... మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా... జ్ఞాన స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
.జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరి చరణ్ రావు మాట్లాడుతూ... సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ
""
జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని సామాజిక సమరసతా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో గల మోచి సంఘంలో సంఘ నాయకుల సమక్షంలో సంతు రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరించి క్యాలెండర్ తో పాటు అతని బోధనలతో కూడిన పుస్తకాన్ని కూడా సభ్యులందరికీ పంచటం... సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా... 