కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

సిండికేట్‌కు పొలిటికల్​ అండ

On
కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

గంజాయి తర్వాత ఇదే

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
-సిండికేట్‌కు పొలిటికల్​ అండ

గంజాయి తర్వాత ఇదే

హైదరాబాద్ జనవరి 24:

 కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్​ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్​ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్​ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్​ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ ​అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ ​శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.

గంజాయి తర్వాత ఇదే..

రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్​గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్​కావటమే.

ఎక్కువ మత్తు కోసం..

కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్​ఏబీ చీఫ్ సందీప్​శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్‌లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్​ఏబీ అధికారులు హైదరాబాద్​లో దాడులు జరపగా 66 కాంపౌండ్‌లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.

ముంబయి నుంచి ఎక్కువగా..

రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్‌ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్‌కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్​డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సిండికేట్‌కు పొలిటికల్​ అండ..

ఈ కల్తీ కల్లు సిండికేట్​కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్​నగర్​లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.

(వివిధ సమాచార మాధ్యమాల ఆధారంగా)

Tags

More News...

Local News 

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం యొక్క ధ్యేయం-మంత్రి అడ్లూరి గొల్లపల్లి జూన్ 29 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో  కళ్యాణ లక్ష్మి షాది ముబారక్  సీఎం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతులుగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వృద్ధుల మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా...
Read More...
Local News 

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి

అమిత్ షా కు స్వాగతం పలికిన మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ జూన్ 29 (ప్రజా మంటలు): నిజామాబాదు లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం నిమిత్తము కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ఆదివారం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చారు.  బేగంపేట్ ఎయిర్ పోర్ట్ పోర్టులో విమానం దిగిన అమిత్ షా కు అభివాదం చేసిన మాజీ మంత్రి, NDMA వైస్ ప్రెసిడెంట్ మర్రి శశిధర్...
Read More...
Local News 

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం

చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సమావేశం సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): సికింద్రాబాద్ చిలకలగూడ లోని కట్టమైసమ్మ ఆలయ హక్కుదారుల సర్వసభ్య సమావేశం ఆదివారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఆషాడ బోనాల ఉత్సవాల నేపద్యంలో భక్తుల సౌకర్యార్థమై చేయాల్సిన ఏర్పాట్లు, తదితర అంశాలపై హక్కుదారులు చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఏడాది ఆలయ హక్కుదారులు అమ్మవారికి తొలిబోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది....
Read More...
Local News 

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి

ముల్కనూరులో ఘనంగా కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39 వ వర్ధంతి భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) : ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సహకారోద్యమానికి ప్రాణం పోసిన కీ.శే. ఏ.కె. విశ్వనాథ రెడ్డి 39వ వర్ధంతిని ఆదివారం ఉదయం సంఘ ఆవరణలో శ్రద్ధాంజలుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సంఘ ప్రస్తుత అధ్యక్షులు ఎ. ప్రవీణ్ రెడ్డి...
Read More...
Local News 

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

విశ్వకర్మ సంఘం పోచమ్మ బోనాల్లో పాల్గొని బోనమెత్తిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి    జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు) పట్టణం విశ్వకర్మ సంఘం వారి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మహిళలతో కలిసి డప్పు చప్పుల్ల మధ్యలో బోనం ఎత్తుకున్న, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పోచమ్మ...
Read More...
Local News 

"స్నేహమనే బంధానికి వేదిక అయిన విశ్వశాంతి సమ్మేళనం"

భీమదేవరపల్లి, జూన్ 29 (ప్రజామంటలు) :    ముల్కనూర్ లోని విశ్వశాంతి విద్యాలయం 2010-11 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఒక ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మళ్లీ ఒకచోట చేరి గురువుల పట్ల కృతజ్ఞతలు తెలిపి, మిత్రుల మధ్య మధురానుభూతులు పంచుకున్నారు. “గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః...” శ్లోకంతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో, జీవితానికి మార్గదర్శకులైన...
Read More...
Local News 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి 

శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా చేద్దాం - దక్కన్ మానవ సేవాసమతి  సికింద్రాబాద్, జూన్ 29 (ప్రజామంటలు): జూలై 13, 14న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని, అందుకు ప్రభుత్వ అధికారులు,పార్టీలకతీతంగా నాయకులు,భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి కోరింది.ఈ మేరకు వారు ఆదివారం మహంకాళి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ అధ్యక్షతన...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు స్వెటర్లు మందుల పంపిణీ సికింద్రాబాద్,  జూన్ 29 (ప్రజా మంటలు): హైదరాబాద్ రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు ఆదివారం పద్మారావు నగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు, స్వేటర్లు పంపిణి చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్నవారికి ఔషదాలు కూడ అందచేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు  డాక్టర్. వై....
Read More...
Local News  State News 

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు 

ఇజ్రాయిల్ మృతుడి కడసారి చూపు కోసం ఎదురుచూపు  మృతదేహం తరలింపు ప్రక్రియలో పురోగతి - మరో రెండు రోజుల్లో ఇజ్రాయిల్ నుంచి ఇండియాకు చేరనున్న మృతదేహం  జగిత్యాల జూన్ 29 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణానికి చెందిన రేవెల్ల రవీందర్ (57) ఈ నెల 16న ఇజ్రాయిల్‌లో గుండె సంబంధిత అనారోగ్యంతో మరణించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న...
Read More...
Local News 

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ

మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్  జూన్ 29 (ప్రజా మంటలు): మహంకాళి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదయ్య ఎక్స్ రోడ్ ఫుట్ పాత్  పై పడి ఉన్న దాదాపు 45 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఎలాంటి వివరాలు...
Read More...
Local News  State News 

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక

జూలై 01వ తేదీన బాస్కెట్ బాల్ జూనియర్ జట్ల ఎంపిక (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జూన్ 28 (ప్రజా మంటలు) :  జూలై 1 వ తేదీసాయంత్రం 5:30గంటలకు స్ధానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం లో జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించబడునని అసోసియేషన్ కార్యదర్శి డా. వేణు గోపాల్ రెడ్డి...
Read More...
Local News  State News 

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి.

భారతదేశంలో వెలుగొందిన తెలుగు నేత పి.వి.నరసింహారావు - నేడు పి.వి.104 వ జయంతి. జగిత్యాల 28 జూన్ (ప్రజా మంటలు) :  భారత ప్రధానమంత్రిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పాములపర్తి వేంకట నరసింహారావు గారి నూట నాల్గవ జయంతి సందర్భంగా రాయికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అందించిన ప్రత్యేక కథనం. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని...
Read More...