కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
సిండికేట్కు పొలిటికల్ అండ
గంజాయి తర్వాత ఇదే
కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
-సిండికేట్కు పొలిటికల్ అండ
గంజాయి తర్వాత ఇదే
హైదరాబాద్ జనవరి 24:
కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.
గంజాయి తర్వాత ఇదే..
రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్కావటమే.
ఎక్కువ మత్తు కోసం..
కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్ఏబీ చీఫ్ సందీప్శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్ఏబీ అధికారులు హైదరాబాద్లో దాడులు జరపగా 66 కాంపౌండ్లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.
ముంబయి నుంచి ఎక్కువగా..
రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
సిండికేట్కు పొలిటికల్ అండ..
ఈ కల్తీ కల్లు సిండికేట్కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్నగర్లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.
(వివిధ సమాచార మాధ్యమాల ఆధారంగా)
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా... గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు.
, మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా... మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)
పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 163 బి ఎన్ ఎస్ ఎస్(144 సెక్షన్ అమలు) విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు
జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ... దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత
ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్... ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.
జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి... యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు
న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు):
తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు... నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య .
జగిత్యాల డిసెంబర్ 16(ప్రజా మంటలు)నావల్ల కాంగ్రెస్ పార్టీకి, జీవన్ రెడ్డికి చెడ్డపేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా అన్నారు డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ కొనసాగుతుండగా
ఎమ్మెల్యే సంజయ్తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిమంత్రి అడ్లూరి లక్ష్మణ్... చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్
చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని... గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు.
నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్... తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.
జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.... 