కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

సిండికేట్‌కు పొలిటికల్​ అండ

On
కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

గంజాయి తర్వాత ఇదే

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
-సిండికేట్‌కు పొలిటికల్​ అండ

గంజాయి తర్వాత ఇదే

హైదరాబాద్ జనవరి 24:

 కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్​ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్​ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్​ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్​ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ ​అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ ​శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.

గంజాయి తర్వాత ఇదే..

రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్​గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్​కావటమే.

ఎక్కువ మత్తు కోసం..

కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్​ఏబీ చీఫ్ సందీప్​శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్‌లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్​ఏబీ అధికారులు హైదరాబాద్​లో దాడులు జరపగా 66 కాంపౌండ్‌లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.

ముంబయి నుంచి ఎక్కువగా..

రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్‌ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్‌కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్​డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సిండికేట్‌కు పొలిటికల్​ అండ..

ఈ కల్తీ కల్లు సిండికేట్​కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్​నగర్​లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.

(వివిధ సమాచార మాధ్యమాల ఆధారంగా)

Tags
Join WhatsApp

More News...

Spiritual  

నేటి నుండి శ్రీ శైలం లో మల్లికార్జునుని బ్రహ్మోత్సవాలు

నేటి నుండి శ్రీ శైలం లో మల్లికార్జునుని బ్రహ్మోత్సవాలు శ్రీశైలం ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు): కేంద్ర  శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ వాహన సేవలు,...
Read More...
National 

విజయ్ అసెంబ్లీ ఎంట్రీ: చెన్నై నుంచే బరిలోకి దిగితే డీఎంకే–ఏఐఏడీఎంకేకు ఎంత ముప్పు?

విజయ్ అసెంబ్లీ ఎంట్రీ: చెన్నై నుంచే బరిలోకి దిగితే డీఎంకే–ఏఐఏడీఎంకేకు ఎంత ముప్పు? చెన్నై ఫిబ్రవరి 08 (ప్రజా మంటల - ప్రత్యేక ప్రతినిధి):: తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ కేవలం కొత్త పార్టీ నేతగానే కాదు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కదిలించే ఫ్యాక్టర్గా మారుతున్నారు. తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీ ద్వారా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విజయ్, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న...
Read More...
International  

రష్యా–అమెరికా మధ్య $12 ట్రిలియన్ ఆర్థిక ఒప్పందాలు?

రష్యా–అమెరికా మధ్య $12 ట్రిలియన్ ఆర్థిక ఒప్పందాలు? ఉక్రెయిన్‌ను పక్కన పెట్టి డీల్ చేస్తున్నారని జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు అబుదాబిలో విఫలమైన శాంతి చర్చలు అబుదాబి ఫిబ్రవరి 08: అబుదాబిలో ఇటీవల నిర్వహించిన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపుకు సంబంధించిన చర్చలు ఎలాంటి స్పష్టమైన ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ చర్చలు విఫలమైన కొద్ది రోజులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు....
Read More...

తాత, నానమ్మ లను గెంటేసిన మనుమడు

తాత, నానమ్మ లను గెంటేసిన మనుమడు .                        జగిత్యాల     ఫిబ్రవరి 7(ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన రాయి భీమయ్య (85),రాయి గంగరాజు( 80)అనే వృద్ధ తాత, నానమ్మ లను మనుమడు శివ కుమార్ కొట్టి ఇంట్లోంచి గెంటి వేయగా జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. ...
Read More...

శ్రీ శ్రీనివాసఆంజనేయ భవాని శంకర ఆలయంలో ఘనంగా పూర్ణాహుతి

శ్రీ శ్రీనివాసఆంజనేయ భవాని శంకర ఆలయంలో ఘనంగా పూర్ణాహుతి జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాసాం జనేయ, భవాని, శంకర దేవాలయం లో వార్షికోత్సవాల్లో భాగంగా  మూడవరోజు పూర్ణాహుతి స్థాపిత దేవత ప్రధాన కలశ ఉద్వాసన మహా అన్నదాన ప్రసాద వితరణ, సాయంత్రం పురవీధులలో స్వామివార్ల శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈనాటి కార్యక్రమంలో ఆలయ ఫౌండర్,...
Read More...

పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డా బోగ శ్రావణి

పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డా బోగ శ్రావణి జగిత్యాల ఫిబ్రవరి 7 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  జగిత్యాల మున్సిపల్ 36వ వార్డ్ అభ్యర్థి పుల్ల సుమలత-హరీష్ ,21వ జగ్గుల శిరీష కి మద్దతుగా స్థానిక అన్నపూర్ణ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొని పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి...
Read More...
Local News 

రాయికల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: తాటిపర్తి జీవన్ రెడ్డి

రాయికల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: తాటిపర్తి జీవన్ రెడ్డి రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ ప్రాంతాల్లో అనూహ్యమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్ల పాటు కాంగ్రెస్ జెండాను విడువకుండా కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో...
Read More...

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకే ఓటు: కొప్పుల ఈశ్వర్

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకే ఓటు: కొప్పుల ఈశ్వర్ రామగుండం, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు): రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 48, 9, 39, 11, 43, 42, 13, 55, 57 డివిజన్లలో నిర్వహించిన ప్రచారంలో బీఆర్‌ఎస్ ఇంచార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగురవేస్తాం: దావ వసంత సురేష్

రాయికల్ పట్టణంపై గులాబీ జెండా ఎగురవేస్తాం: దావ వసంత సురేష్ రాయికల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 5, 10, 11, 12 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం...
Read More...
Local News  Filmi News 

సారంగాపూర్ ఫారెస్టులో ఫోక్ సాంగ్ షూటింగ్ సందడి

సారంగాపూర్ ఫారెస్టులో ఫోక్ సాంగ్ షూటింగ్ సందడి జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని అటవీ ప్రాంతం శనివారం రోజంతా ఫోక్ పాట చిత్రీకరణతో కళకళలాడింది. స్థానిక ప్రజల జీవనశైలిని, గ్రామీణ భావోద్వేగాలను ప్రతిబింబించే ‘కడదాకా తోడుంటనే’ అనే ఫోక్ సాంగ్ షూటింగ్ భారీ ఆసక్తి నడుమ సాగింది. ఈ పాటను బొమ్మరిల్లు ఫోక్స్ యూట్యూబ్ ఛానల్...
Read More...
Crime  State News 

దళిత విద్యార్థినులకు పురుగుల అన్నం! ఆస్పత్రిలో 40 మంది విద్యార్థినులు

దళిత విద్యార్థినులకు పురుగుల అన్నం! ఆస్పత్రిలో 40 మంది విద్యార్థినులు మంచిర్యాల ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో భోజనం చేసిన సుమారు 40 మంది దళిత విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. ఒక్కసారిగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హాస్టల్‌లో కలకలం రేగింది....
Read More...
National  State News 

ఉచిత రేషన్‌కు గుడ్‌బై? నగదు బదిలీ విధానానికి కేంద్రం సిద్ధం

ఉచిత రేషన్‌కు గుడ్‌బై? నగదు బదిలీ విధానానికి కేంద్రం సిద్ధం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా కోట్లాది పేదలకు ఉచిత రేషన్ రూపంలో బియ్యం, గోధుమలను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించకుండా, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ...
Read More...