కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
సిండికేట్కు పొలిటికల్ అండ
గంజాయి తర్వాత ఇదే
కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు
-సిండికేట్కు పొలిటికల్ అండ
గంజాయి తర్వాత ఇదే
హైదరాబాద్ జనవరి 24:
కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.
గంజాయి తర్వాత ఇదే..
రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్కావటమే.
ఎక్కువ మత్తు కోసం..
కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్ఏబీ చీఫ్ సందీప్శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్ఏబీ అధికారులు హైదరాబాద్లో దాడులు జరపగా 66 కాంపౌండ్లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.
ముంబయి నుంచి ఎక్కువగా..
రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
సిండికేట్కు పొలిటికల్ అండ..
ఈ కల్తీ కల్లు సిండికేట్కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్నగర్లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.
(వివిధ సమాచార మాధ్యమాల ఆధారంగా)
More News...
<%- node_title %>
<%- node_title %>
మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా... జ్ఞాన స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
.జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరి చరణ్ రావు మాట్లాడుతూ... సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ
""
జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని సామాజిక సమరసతా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో గల మోచి సంఘంలో సంఘ నాయకుల సమక్షంలో సంతు రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరించి క్యాలెండర్ తో పాటు అతని బోధనలతో కూడిన పుస్తకాన్ని కూడా సభ్యులందరికీ పంచటం... సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా... జగిత్యాలలో నిజామాబాద్ రోడ్ పై వంతెన పనులు – ట్రాఫిక్ మళ్లింపు అమలు
జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేలో హ్యాంగౌట్ హోటల్ సమీపంలో వంతెన నిర్మాణ పనులు ఏప్రిల్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు పోలీసులు మార్గ మళ్లింపులు అమలు చేస్తున్నారు.ముఖ్య మార్పులు ఇలా ఉన్నాయి:జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్లే RTC బస్సులు,... గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు
గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
బుగ్గారం మండలానికి చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్ ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ... ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఒంటరితనం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జంబుక ఆశన్న (78), తండ్రి గంగారం, ఎస్సీ మాల వర్గానికి చెందినవాడు.ఆశన్న గతంలో గ్రామ సుంకరి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2025... బాబు జగ్జీవన్ సేవలు చిరస్మరనీయం -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెటుపల్లి ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
బాబు జాగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరనీయం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. బార్ అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి
కార్మికుల... ప్రజా ప్రతినిధుల శిక్షణ బుగ్గారంలోనే పెట్టాలి - చుక్క శ్రీలత
బుగ్గారం, ఏప్రిల్ 05(ప్రజా మంటలు):బుగ్గారం మండల కేంద్రాన్ని పక్కనబెట్టి శేఖల్లలో వార్డ్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల వార్డ్ సభ్యులు హాజరు కావాల్సిన ఈ శిక్షణను దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.“ఇది... సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం - తెలంగాణ జాగృతి హెచ్చరిక
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
హైదరాబాద్లో తెలంగాణ జాగృతి, hms కార్మిక సంఘం ఇతర స.మతాలతో కలిసి, నిర్వహించిన “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి సంస్థపై ప్రభుత్వ వైఖరిని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల నియామకాలపై విచారణ పేరుతో ఒత్తిడి చేయడం కంటే, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్... మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా? డిసిసి అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీని వదిలి వెళ్లేవారా అని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య జీవన్ రెడ్డిని ఉద్దేశించి
జిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై విమర్శల అస్త్రాలు ఎక్కు పెట్టారు.కాంగ్రెస్... 2047 నాటికి తెలంగాణ టెక్స్టైల్ రాజధాని గా అభివృద్ధి - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి.
(సిరిసిల్ల .రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 03 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.
టెక్స్టైల్ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని సృష్టించడంలో... 