దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక
దేవస్థానంలో వేద పారాయణాలు
నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి క్షేత్రంలో ... దక్షిణామ్నాయ జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, విధు శేఖర స్వామి, ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ మహారణ్యం మురళీధర స్వామి (చెన్నై) వారల దివ్యాశీస్సుల తో జనవరి 18నుండి 24 వరకు సప్తాహ్నిక దీక్షా
పూర్వకముగా సంపూర్ణ ఋగ్వేద హవనం, సంపూర్ణ సామవేద పారాయణం, విశేషించి, సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులను వేద విధులు సాంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తున్నారు.
నిరంతర వేద ఘోషతో, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి క్షేత్రంలో చతుర్వేద పారాయణ సంస్కారాలతో అనాదిగా యజ్ఞ యాగాదులు నిర్వహించ బడిన నేపథ్యం ఉంది.
ధర్మపురి క్షేత్రంలో దశాబ్దాల తర్వాత
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్రము సుభిక్షముగా వుండాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యములో ప్రజలందరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో, స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ, హైదరాబాద్ వారి 21 మంది వేదపండితులచే సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, సంపూర్ణ ఋగ్వేద హవనము, సంపూర్ణ సామవేద పారాయణము నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పునరుద్ధరణ కమిటీ, అధ్వర్యములో స్థానిక వేదబ్రాహ్మణుల సహాకారముతో వారం రోజుల పాటు సాంప్రదాయ పద్ధతిలో పారాయణాలు, హోమాలు నిర్వహించారు. విఖ్యాత వేద పండితులు
గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ నేతృత్వంలో అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ,
దహగాం అరుణ్ కుమార్ శర్మ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులో, సూర్య నారాయణ శర్మ ఘపపాఠీ నేతృత్వంలో జూనూతుల త్రివేది శర్మ ఘపపాఠీ, నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ,
తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ ఋగ్వేద పారాయణాలు, ముత్యాల శర్మ సామవేదం గావించారు.
ప్రముఖుల భాగస్వామ్యం
అపురూప వేద పారాయణ, హోమాల పూర్ణాహుతి ముగింపు కార్యక్రమాలలో బుధవారం పరమహంస పరివ్రాజకాచార్య ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన నున్నారు. దేవస్థాన వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, అర్చకులు శ్రీనివాసా చార్యులు, రమణ, నరసింహ మూర్తి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న, మాజీ దేవస్థాన చైర్మెన్ శ్రీ ఎస్. దినేష్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి దావ వసంత సురేష్
జగిత్యాల జులై 23( ప్రజా మంటలు) పట్టణం 37 ,38 వార్డ్ లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలను... తమిళనాడు లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు
చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ... NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం: ఎం.కె. స్టాలిన్
:చెన్నై ,జులై 22:
“న్యాయం, NEET రెండూ కలసి ఉండలేవు. NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం” అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అన్నారు.తమిళనాడులో బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు NEETను వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. NEET నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ పలుమార్లు... ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):
బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలుప్రతినిధుల... ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జులై 22 (ప్రజా మంటలు):
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. “బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆమె అన్నారు. ఈ... సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జులై 22 (ప్రజా మంటలు)
ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి, అవసరమైన అన్ని చర్యలను 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ చైర్ పర్సన్ బి. సత్యప్రసాద్... రజక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర
జగిత్యాల జూలై 22 (ప్రజా మంటలు)
రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర బుధవారం మధ్యాహ్నం గంటలకు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జగిత్యాల రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం కావడంతో ప్రతి ఏటా నిర్వహించే వీరమ్మ బోనాల పండుగ సందర్భంగా మడలేశ్వర స్వామి వారి భారీ విగ్రహం... ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం... ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు
హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర... శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాశివునికి జల అభిషేకం
జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మహా శివునికి భక్తుల స్వహస్తాలతో రుద్ర నమక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఆలయంలోని మహాశివునికి ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించి మహా శివునికి సమృద్ధిగా వర్షాలు... సంసార సముద్రం నుండి రక్షించడానికి పరమాత్మ అవతరించాడు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి
జగిత్యాల జూలై 19(ప్రజా మంటలు) సంసారం అనే సముద్రము నుండి మనను రక్షించడానికి పరమాత్మ అవతరించాడని ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస పరివ్రా జకాచార్యులు శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ శ్రీ శ్రీ త్రీదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
జిల్లా కేంద్రంలోని... 