దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

On
దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

దేవస్థానంలో వేద పారాయణాలు
నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

 రామ కిష్టయ్య సంగన భట్ల...
   9440595494


సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి క్షేత్రంలో ... దక్షిణామ్నాయ జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, విధు శేఖర  స్వామి, ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ మహారణ్యం మురళీధర స్వామి (చెన్నై) వారల దివ్యాశీస్సుల తో జనవరి 18నుండి 24 వరకు సప్తాహ్నిక దీక్షా 
పూర్వకముగా సంపూర్ణ ఋగ్వేద హవనం, సంపూర్ణ సామవేద పారాయణం, విశేషించి, సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులను వేద విధులు సాంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తున్నారు. 
 నిరంతర వేద ఘోషతో, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి క్షేత్రంలో చతుర్వేద పారాయణ సంస్కారాలతో అనాదిగా యజ్ఞ యాగాదులు నిర్వహించ బడిన నేపథ్యం ఉంది.
    ధర్మపురి క్షేత్రంలో దశాబ్దాల తర్వాత 
  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్రము సుభిక్షముగా వుండాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యములో ప్రజలందరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో,  స్థానిక శాసన సభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ, హైదరాబాద్ వారి 21 మంది వేదపండితులచే సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, సంపూర్ణ ఋగ్వేద హవనము, సంపూర్ణ సామవేద పారాయణము నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో  దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పునరుద్ధరణ కమిటీ, అధ్వర్యములో స్థానిక వేదబ్రాహ్మణుల సహాకారముతో  వారం రోజుల పాటు సాంప్రదాయ పద్ధతిలో పారాయణాలు, హోమాలు నిర్వహించారు. విఖ్యాత వేద పండితులు 
 గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ నేతృత్వంలో అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ,
దహగాం అరుణ్ కుమార్ శర్మ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులో,  సూర్య నారాయణ శర్మ ఘపపాఠీ నేతృత్వంలో జూనూతుల త్రివేది శర్మ ఘపపాఠీ, నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ, 
తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ ఋగ్వేద పారాయణాలు, ముత్యాల శర్మ సామవేదం గావించారు.

ప్రముఖుల భాగస్వామ్యం

అపురూప వేద పారాయణ, హోమాల పూర్ణాహుతి ముగింపు కార్యక్రమాలలో బుధవారం  పరమహంస పరివ్రాజకాచార్య ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన నున్నారు. దేవస్థాన వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, అర్చకులు శ్రీనివాసా చార్యులు, రమణ, నరసింహ మూర్తి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న, మాజీ దేవస్థాన చైర్మెన్ శ్రీ ఎస్. దినేష్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు

ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు   జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణము లోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు....
Read More...

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు)ఎన్నికలు నిర్వహణకు 900 మంది పోలీస్ లతో  పటిష్ట బందోబస్తు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో...
Read More...

దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం

దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్‌లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు...
Read More...
Local News 

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను...
Read More...
Local News  State News 

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్ జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే తాను ఏం చేయలేనన్నారు. ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని,...
Read More...
National  International   Crime 

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది. యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత

మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే...
Read More...

 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్

 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్   జగిత్యాల ఫిబ్రవరి 9 (ప్రజా మంటలు)ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికలు  నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది....
Read More...
Local News 

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల...
Read More...
National  Filmi News 

మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ

మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ చెన్నై – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): TVK పార్టీ నాయకుడు దలపతి నటించిన ‘జననాయకన్’ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును చిత్ర బృందం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. ఇంతవరకు ఉన్న ఈ చిత్ర సెన్సార్ పై ఉన్న సందేహాలను...
Read More...
National  International  

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్ న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చర్చల అనంతరం,...
Read More...