దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక
దేవస్థానంలో వేద పారాయణాలు
నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి క్షేత్రంలో ... దక్షిణామ్నాయ జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, విధు శేఖర స్వామి, ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ మహారణ్యం మురళీధర స్వామి (చెన్నై) వారల దివ్యాశీస్సుల తో జనవరి 18నుండి 24 వరకు సప్తాహ్నిక దీక్షా
పూర్వకముగా సంపూర్ణ ఋగ్వేద హవనం, సంపూర్ణ సామవేద పారాయణం, విశేషించి, సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులను వేద విధులు సాంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తున్నారు.
నిరంతర వేద ఘోషతో, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి క్షేత్రంలో చతుర్వేద పారాయణ సంస్కారాలతో అనాదిగా యజ్ఞ యాగాదులు నిర్వహించ బడిన నేపథ్యం ఉంది.
ధర్మపురి క్షేత్రంలో దశాబ్దాల తర్వాత
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్రము సుభిక్షముగా వుండాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యములో ప్రజలందరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో, స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ, హైదరాబాద్ వారి 21 మంది వేదపండితులచే సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, సంపూర్ణ ఋగ్వేద హవనము, సంపూర్ణ సామవేద పారాయణము నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పునరుద్ధరణ కమిటీ, అధ్వర్యములో స్థానిక వేదబ్రాహ్మణుల సహాకారముతో వారం రోజుల పాటు సాంప్రదాయ పద్ధతిలో పారాయణాలు, హోమాలు నిర్వహించారు. విఖ్యాత వేద పండితులు
గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ నేతృత్వంలో అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ,
దహగాం అరుణ్ కుమార్ శర్మ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులో, సూర్య నారాయణ శర్మ ఘపపాఠీ నేతృత్వంలో జూనూతుల త్రివేది శర్మ ఘపపాఠీ, నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ,
తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ ఋగ్వేద పారాయణాలు, ముత్యాల శర్మ సామవేదం గావించారు.
ప్రముఖుల భాగస్వామ్యం
అపురూప వేద పారాయణ, హోమాల పూర్ణాహుతి ముగింపు కార్యక్రమాలలో బుధవారం పరమహంస పరివ్రాజకాచార్య ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన నున్నారు. దేవస్థాన వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, అర్చకులు శ్రీనివాసా చార్యులు, రమణ, నరసింహ మూర్తి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న, మాజీ దేవస్థాన చైర్మెన్ శ్రీ ఎస్. దినేష్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తు రాలేదా..
తలసానిని ప్రశ్నించిన బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ నాయకులు
సికింద్రాబాద్,నవంబర్ 28 (ప్రజా మంటలు):
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ది ఉందని, తమ ప్రయత్నాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకించాల్సిన అవసరం లేదని బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు బీసీల... రాజన్న సిరిసిల్లలో తల్లి–కొడుకు ఆత్మహత్య : కానిస్టేబుల్ అభిలాష్ విషాద మరణం
సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు):
సిరిసిల్ల పట్టణంలోని మానేరు వాగులో తల్లి–కొడుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మహిళ ఆత్మహత్యను తట్టుకోలేక ఆమె కుమారుడు కూడా ప్రాణాలు తీసుకున్న ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.
తల్లి లలిత మానేరు వాగులో దూకి ఆత్మహత్య
సిరిసిల్లలోని మానేరు వాగులో లలిత... తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి, రిజర్వేషన్లను సరిచేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తీవ్రంగా డిమాండ్ చేశారు.
“2019లో 22.78% ఇచ్చి… ఇప్పుడు అదికూడా తగ్గించడం ఏ న్యాయం?” – నిరంజన్ ప్రశ్న
2019... మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు):
మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్... తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్ నర్సయ్యను హతమార్చిన కొడుకు
సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య (46) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట వద్ద జరిగింది.
జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నర్సయ్యను హతమార్చి,... వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్.
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు):
వయో వృద్ధులు (సీనియర్ సిటిజెన్లు ) ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్ కోరారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవల విభాగాన్ని జిల్లా... కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు
కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు):
కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.
బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక
“రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.”
“కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు... స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష
హైదరాబాద్, నవంబర్28 (ప్రజామంటలు):
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై బేగంపేట్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వం వహించారు.
డిసెంబర్... బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు... గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు
గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..
సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) :
పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి... బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే ప్రతిజ్ఞ
మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో (అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్... సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు
.
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు) పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శుక్రవారం కాలభైరవాష్టమి పర్వదినం పురస్కరించుకొని, మాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.
పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ... 