దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

On
దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

దేవస్థానంలో వేద పారాయణాలు
నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

 రామ కిష్టయ్య సంగన భట్ల...
   9440595494


సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి క్షేత్రంలో ... దక్షిణామ్నాయ జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, విధు శేఖర  స్వామి, ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ మహారణ్యం మురళీధర స్వామి (చెన్నై) వారల దివ్యాశీస్సుల తో జనవరి 18నుండి 24 వరకు సప్తాహ్నిక దీక్షా 
పూర్వకముగా సంపూర్ణ ఋగ్వేద హవనం, సంపూర్ణ సామవేద పారాయణం, విశేషించి, సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులను వేద విధులు సాంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తున్నారు. 
 నిరంతర వేద ఘోషతో, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి క్షేత్రంలో చతుర్వేద పారాయణ సంస్కారాలతో అనాదిగా యజ్ఞ యాగాదులు నిర్వహించ బడిన నేపథ్యం ఉంది.
    ధర్మపురి క్షేత్రంలో దశాబ్దాల తర్వాత 
  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్రము సుభిక్షముగా వుండాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యములో ప్రజలందరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో,  స్థానిక శాసన సభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ, హైదరాబాద్ వారి 21 మంది వేదపండితులచే సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, సంపూర్ణ ఋగ్వేద హవనము, సంపూర్ణ సామవేద పారాయణము నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో  దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పునరుద్ధరణ కమిటీ, అధ్వర్యములో స్థానిక వేదబ్రాహ్మణుల సహాకారముతో  వారం రోజుల పాటు సాంప్రదాయ పద్ధతిలో పారాయణాలు, హోమాలు నిర్వహించారు. విఖ్యాత వేద పండితులు 
 గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ నేతృత్వంలో అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ,
దహగాం అరుణ్ కుమార్ శర్మ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులో,  సూర్య నారాయణ శర్మ ఘపపాఠీ నేతృత్వంలో జూనూతుల త్రివేది శర్మ ఘపపాఠీ, నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ, 
తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ ఋగ్వేద పారాయణాలు, ముత్యాల శర్మ సామవేదం గావించారు.

ప్రముఖుల భాగస్వామ్యం

అపురూప వేద పారాయణ, హోమాల పూర్ణాహుతి ముగింపు కార్యక్రమాలలో బుధవారం  పరమహంస పరివ్రాజకాచార్య ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన నున్నారు. దేవస్థాన వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, అర్చకులు శ్రీనివాసా చార్యులు, రమణ, నరసింహ మూర్తి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న, మాజీ దేవస్థాన చైర్మెన్ శ్రీ ఎస్. దినేష్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

National  Crime  State News 

లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్‌జీని ఏపీ ఎన్కౌంటర్‌లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ

లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్‌జీని ఏపీ ఎన్కౌంటర్‌లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు): మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకోవడంతో, పైస్థాయి నాయకులకు మాత్రమే ప్రత్యేక రిహాబిలిటేషన్ సదుపాయాలు కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విరుద్ధ దిశగా భారీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బతీసే లొంగుబాటు జరగబోతోందని విశ్వసనీయ...
Read More...
National  Comment 

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన  (సిహెచ్.వి. ప్రభాకర్ రావు) బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు...
Read More...
National  State News 

పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు

పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు యశోదా ఆసుపత్రి వైద్య నిపుణుల అరుదైన విజయం
Read More...
Local News  Crime  State News 

సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు

సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో  మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిర్యాదు దారుడిని నుంచి రూఒక లక్ష లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మండల సర్వేయర్ కలువ కిరణ్ కుమార్, చైన్ మెన్ గా పనిచేస్తున్న మేకల వివరాలు...
Read More...
National  State News 

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్‌ సజ్జనార్

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్‌ సజ్జనార్ “క్రమబద్ధమైన ఆన్‌లైన్‌ వేధింపుల ముఠా పని చేస్తోంది” — మహిళా జర్నలిస్ట్ లు ఫిర్యాదులు స్వీకరించిన సిటీ పోలీస్ కమిషనర్ — వీడియోలు, లింకులు అందించైనా జర్నలిస్టులు హైదరాబాద్‌ నవంబర్ 18 (ప్రజా మంటలు): మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ వి.సి....
Read More...
Local News  State News 

సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి 

సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి  ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం  రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత కుటుంబాల హాజరు హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):   శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుని వెళ్తున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్షత కొనసాగడం బాధాకరమని, సాంఘిక దురాచారాలపై సంఘటితంగా పోరాడాల్సిన       రాష్ట్ర...
Read More...
Local News 

డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు..

డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు.. సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు): డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా , నేరుగా మందులు కొనుక్కొని వేసుకోకూడదని వైద్య నిపుణులు సూచించారు. వరల్డ్ యాంటీబయాటిక్ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి  ప్రసంగించారు వివిధ రోగాల ట్రీట్మెంట్ కు...
Read More...
Local News 

శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం సందర్శించిన భద్రత ఏర్పాట్లు ను పరిశీలించిన డిఎస్పి,రఘు చందర్ 

శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం సందర్శించిన భద్రత ఏర్పాట్లు ను పరిశీలించిన డిఎస్పి,రఘు చందర్  (అంకం భూమయ్య)  గొల్లపల్లి నవంబర్ 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జునస్వామి   దేవాలయం ను జగిత్యాల డిఎస్పి సందర్శించి రాబోయే ఏడువారాల జాతరకు  జాతర ఏర్పాట్ల  పర్యవేక్షించారు ఆయన వెంట ధర్మపురి సిఐ,రామ్ నరసింహారెడ్డి ఈ సందర్భంగా డిఎస్పి , రఘు చందర్ మాట్లాడుతూ    జాతరకు  తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్ల  ట్రాఫిక్...
Read More...

కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్

కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ   డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్   జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు ,కలెక్టరేట్ సిబ్బంది , విద్యార్థులచే మాదక ద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి  ఒక్కరూ పాటుపడాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ పేర్కొన్నారు.  మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో...
Read More...

అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని   శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయము  లో ఘనంగా   శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.   మంగళ వారం  కార్తీక  మాసం  శుక్ల పక్షం త్రయోదశి  ఉ.  సుప్రభాత సేవ మరియు మూలవిరాట్టుకు అభిషేకములు నిర్వహించారు. భక్తులు...
Read More...

ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన

ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన   జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు- మూఢ విశ్వాసాల పై ప్రజలలో కనిపిస్తున్న మార్పు జగిత్యాల జిల్లా ప్రజల్లో సామాజిక అంశాల పై  చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  తెలిపారు. 2016 నుoడి  జగిత్యాల పోలీస్ కళా బృందం జిల్లా వ్యాప్తంగా...
Read More...

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్‌కౌంటర్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లీ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి. హిడ్మా భార్య, కీలక నాయకులు, PLGA సభ్యుల మరణం. AP ఇంటెలిజెన్స్ ధృవీకరణతో పూర్తి వివరాలు.
Read More...