దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

On
దేవస్థానంలో వేద పారాయణాలు నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

దేవస్థానంలో వేద పారాయణాలు
నేడు పూర్ణాహుతి... ప్రముఖుల రాక 

 రామ కిష్టయ్య సంగన భట్ల...
   9440595494


సనాతన సాంప్రదాయాల సిరి ధర్మపురి క్షేత్రంలో ... దక్షిణామ్నాయ జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి, విధు శేఖర  స్వామి, ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ మహారణ్యం మురళీధర స్వామి (చెన్నై) వారల దివ్యాశీస్సుల తో జనవరి 18నుండి 24 వరకు సప్తాహ్నిక దీక్షా 
పూర్వకముగా సంపూర్ణ ఋగ్వేద హవనం, సంపూర్ణ సామవేద పారాయణం, విశేషించి, సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులను వేద విధులు సాంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తున్నారు. 
 నిరంతర వేద ఘోషతో, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మపురి క్షేత్రంలో చతుర్వేద పారాయణ సంస్కారాలతో అనాదిగా యజ్ఞ యాగాదులు నిర్వహించ బడిన నేపథ్యం ఉంది.
    ధర్మపురి క్షేత్రంలో దశాబ్దాల తర్వాత 
  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్రము సుభిక్షముగా వుండాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యములో ప్రజలందరు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో,  స్థానిక శాసన సభ్యులు,  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ, హైదరాబాద్ వారి 21 మంది వేదపండితులచే సంపూర్ణ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, సంపూర్ణ ఋగ్వేద హవనము, సంపూర్ణ సామవేద పారాయణము నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో  దేవస్థాన వేదపండితులు, అర్చకులు, పునరుద్ధరణ కమిటీ, అధ్వర్యములో స్థానిక వేదబ్రాహ్మణుల సహాకారముతో  వారం రోజుల పాటు సాంప్రదాయ పద్ధతిలో పారాయణాలు, హోమాలు నిర్వహించారు. విఖ్యాత వేద పండితులు 
 గంగాధర కేదార్ నాథ్ శర్మ ఘనపాఠీ నేతృత్వంలో అంబటి పూడి వేంకట సుబ్రహ్మణ్య శర్మ ఘనపాఠీ, మారేపల్లి చైతన్య కృష్ణ శర్మ,
దహగాం అరుణ్ కుమార్ శర్మ కృష్ణ యజుర్వేద పారాయణ క్రతువులో,  సూర్య నారాయణ శర్మ ఘపపాఠీ నేతృత్వంలో జూనూతుల త్రివేది శర్మ ఘపపాఠీ, నెమ్మాని ప్రకాష శర్మ ఘణపాఠీ, 
తూకుట్ల సత్యం నారాయణ ఘనపాఠీ ఋగ్వేద పారాయణాలు, ముత్యాల శర్మ సామవేదం గావించారు.

ప్రముఖుల భాగస్వామ్యం

అపురూప వేద పారాయణ, హోమాల పూర్ణాహుతి ముగింపు కార్యక్రమాలలో బుధవారం  పరమహంస పరివ్రాజకాచార్య ధర్మపురి శ్రీ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన నున్నారు. దేవస్థాన వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, అర్చకులు శ్రీనివాసా చార్యులు, రమణ, నరసింహ మూర్తి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ చైర్మెన్ ఇందారపు రామన్న, మాజీ దేవస్థాన చైర్మెన్ శ్రీ ఎస్. దినేష్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రెనవేషన్ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Tags

More News...

National  Local News  State News  Spiritual  

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి

అపర ఏకాదశి.- వైశాఖ బహుళ ఏకాదశి   (రామ కిష్టయ్య సంగన భట్ల...      9440595494) వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి, జలకృత ఏకాదశి, అజల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఏడాదిలో పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి ప్రత్యేకతను కల్పిస్తూ... ఏడాది పొడవునా ఉండే ఒకో ఏకాదశికి ఒకో పేరు పెట్టడం జరిగింది....
Read More...
Local News 

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

తాట్లవాయి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు రాయికల్ మే 22 :   తాట్లవాయి గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన పంచముఖ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా, మండల పూజ కార్యక్రమం నిర్వహించారు.రాయికల్ మండల తాజా మాజీ ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేంధర్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజుతో పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించి 41 వ రోజు అయినందున హనుమాన్...
Read More...
Local News 

భూకబ్జాదారులపై గాంధీనగర్  పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు

భూకబ్జాదారులపై గాంధీనగర్  పీఎస్ లో కాంగ్రెస్ నేత ఫిర్యాదు సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట డివిజన్ లోని పలు ప్రభుత్వ భూములను కొందరు కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై రెవిన్యూ అధికారులకు ఫిర్యాదుచేస్తే, తనపై దాడికి ప్రయత్నించారని డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి ఆరోపించారు. ఐడీహెచ్ కాలనీలోని ప్రభుత్వానికి చెందిన ఆలయ భూమిని కొందరు కబ్జాకు యత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే...
Read More...
Local News 

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

తార్నాక లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ మే22 (ప్రజామంటలు):   హనుమాన్ జయంతి వేడుకలను తార్నాక లోని గణపతి దేవాలయంలో గురువారం  బండ శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆంజనేయుని ప్రత్యేక పూజ లో ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి భగవంతుడు...
Read More...
Local News 

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి.

జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో  గెలుపే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పని చేయాలి. త్వరలో డివిజన్ల వారిగా పాదయాత్రలు  *ఎంపీ అనిల్ కుమార్, ఆదం సంతోష్ వెల్లడి.. సికింద్రాబాద్ మే 22 (ప్రజామంటలు) : రాబోవు జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జీ అదం సంతోష్ కుమార్ లు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంచార్జ్...
Read More...
Local News 

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు 

శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు  గొల్లపల్లి మే 22 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని దమ్మన్నపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన 16 వ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కీ.శే పాదం...
Read More...
Local News 

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సికింద్రాబాద్ మే 22(ప్రజా మంటలు):: సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ డివిజన్ ఏసిపిగా సి సి ఎస్  నుంచి బదిలీ పై వచ్చిన కె శశాంక్ రెడ్డి గురువారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు.  1995 బ్యాచ్ కు చెందిన శశాంక్ రెడ్డి గతంలో మారేడుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా, పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా...
Read More...
Local News 

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్

భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్                                                                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల, మే-22(ప్రజా మంటలు)    మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.  గురువారం జిల్లాకలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా...
Read More...
Local News 

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

త్వరితగతంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల మే 22 (ప్రజా మంటలు)    ఎమ్మెల్యే క్వార్టర్లో మున్సిపల్ అధికారులతో జగిత్యాల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్   జగిత్యాల పట్టణంలో వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  అభివృద్ధి పనుల పురోగతి పై చర్చించారు, వివిధ కారణాలతో ఆగిపోయిన అభివృద్ధి పనులకు తిరిగి...
Read More...
Local News 

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ

హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో అర్ధరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ సూచనలు చేస్తున్న జిల్లా ఎస్పీ                                           సిరిసిల్ల . రాజేంద్ర శర్మ  మల్యాల మే 22 ( ప్రజా మంటలు)    కొండగట్టు  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం అర్థరాత్రి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు...
Read More...
Local News 

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ  జయంతి వేడుకలు                                                   సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల మే 22( ప్రజా మంటలు)    భాగ్యరెడ్డి వర్మ  జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ ప్రధాన  కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు  భాగ్యరెడ్డివర్మ  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ... దళిత ఉద్యమానికి పునాదులు వేసిన ప్రముఖ...
Read More...
Local News 

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్ మే 21 (ప్రజామంటలు) : టెక్నాలజీ రంగంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలంరాయి చౌరస్తాలోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వర్దంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే...
Read More...