చిలుకూరి ఆలయ అర్చకునిపై దాడిపట్ల భక్తుల ఆందోళన
జగిత్యాల ఫిబ్రవరి 11( ప్రజా మంటలు )
చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీమడేలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆలయం ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారదిశర్మ పాల్గొని మాట్లాడుతూ భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధాన కర్తగా ఉండే ఆలయ అర్చకుని పై భౌతిక దాడి నిర్వహించడం శో చనీయమని అన్నారు అర్చకో హరిస్సాక్షాత్ అని భక్తులు నమ్ముతారని అలాంటి అర్చకుని పై కఠినమైనటువంటి పదజాలాన్ని వాడుతూ రామరాజ్య స్థాపనకు మాతో కలిసి రావాలని వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన గుంపుతో చిలుకూరు బాలాజీ అర్చకుని పై ఒత్తిడి తీసుకురావడం ఖండిస్తున్నామన్నారు. మునుముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము ఇటువంటి వారిని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు. రామరాజ్యంలో రాముడు దుష్టసంహారం మాత్రమే చేసినట్లు పురాణాలు చెబుతున్నాయని అన్నారు. అలాంటి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పేరిట రాజ్యస్థాపన చేస్తాము అని గుంపుగా అర్చకుని నివాసమునకు వచ్చి తమకు సహకరించాలని అర్చకుని పై ఒత్తిడి తీసుకురావడం క్షమించరాని నేరమని అన్నారు. ఇతరుల లాగా అర్చకుడు తన పైన దాడికి ప్రతి దాడి చేయడం జరగదని కానీ అర్చకుని మనసు బాధ చెందుతే దాని ప్రభావం సంబంధిత వ్యక్తుల పై ప్రతికూల ప్రభావం ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి సదరు సంఘటన పై స్పందించి ఫోన్ ద్వారా ఆలయ అర్చకునితో మాట్లాడి మనోధైర్యం కలిగేలాగా హామీ ఇవ్వడముపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)