బాలికలు అన్ని రంగాలలో రాణించాలి. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
జగిత్యాల ఫిబ్రవరి 8(ప్రజా మంటలు )
బాలికలు అన్ని రంగాలలో రాణించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమ దశాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల క్రీడా పోటీలను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. స్వామి వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుతోపాటు ఆట, పాటలలో కూడా రాణించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం లభించడమే కాకుండా క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన బాలికలకు విద్య, ఉద్యోగాలలో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. దేశానికి క్రీడారంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించిపెట్టిన పీవీ సింధు, సైనా నెహ్వాల్, నికాత్ జరీనా లాంటి మహిళ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఆడపిల్లలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేష్, జిల్లా విద్యాధికారి రాములు, తాసిల్దార్ రామ్మోహన్ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
