బాలికలు అన్ని రంగాలలో రాణించాలి. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
జగిత్యాల ఫిబ్రవరి 8(ప్రజా మంటలు )
బాలికలు అన్ని రంగాలలో రాణించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బేటి బచావో బేటి పడావో కార్యక్రమ దశాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల క్రీడా పోటీలను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. స్వామి వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుతోపాటు ఆట, పాటలలో కూడా రాణించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం లభించడమే కాకుండా క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన బాలికలకు విద్య, ఉద్యోగాలలో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. దేశానికి క్రీడారంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించిపెట్టిన పీవీ సింధు, సైనా నెహ్వాల్, నికాత్ జరీనా లాంటి మహిళ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఆడపిల్లలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేష్, జిల్లా విద్యాధికారి రాములు, తాసిల్దార్ రామ్మోహన్ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
