జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు
జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ఎన్నికలు ఏవైనా తాను సంసిద్ధమంటూ రంగంలోకి దిగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈసారి మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ఎందుకు బరిలోకి దిగడం లేదు?
పోటీ చేయడం వద్దనుకున్నారా? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్తో చెట్టాపట్టాలు వేసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇంకా అలక వీడలేదా?.. లేకపోతే ఈ ఎన్నికకు దూరంగా ఉంటే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ లభించిందా? ఇక చాల్లే అనుకుని గౌరవప్రదంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని అనుకుంటున్నారా..? అసలు జీవన్రెడ్డి రాజకీయ భవితవ్యయంపై ఇంత చర్చ? ఇన్ని సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి ?సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి.. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాక అసలు సిసలు కాంగ్రెస్ వాదిగా ఫోకస్ అయ్యారు జీవన్రెడ్డి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పట్ల అంత కమిట్మెంట్తో ఉన్న వ్యవహరించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి తనకు తాను అర్ధాంతరంగా బయటకొస్తే బాగుండదు కాబట్టి కొనసాగుతున్నారంటున్నారు. పార్టీలో సీనియర్మోస్ట్ అయిన ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారంట.
2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీవన్రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు.
తర్వాత సంజీవ్కుమార్ కూడా కాంగ్రెస్లో చేరిపోవడంతో మొదలైన లొల్లితో.. పెద్దాయన జీవన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది తయారైంది. సంజీవ్ చేరిక సమయంలోనే జీవన్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్ బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనలో మాత్రం ఆ అసంతృప్తి కొనసాగుతూనే ఉందంట.ఆ క్రమంలో తన ప్రత్యర్ధినే పార్టీలో చేర్చుకోవడంతో నొచ్చుకున్న జీవన్రెడ్డి .. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారో? , లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచన తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారో? కాని పొలిటికల్గా మనుపటి దూకుడు ప్రదర్శించడం లేదు.
సంజీవ్ ఎపిసోడ్తో పార్టీ అధిష్ఠానంతో కూడా గ్యాప్ ఏర్పడినట్లు కనిపిస్తుండటంతో.. మార్చి నెలాఖరుకి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక ఏకంగా రాజకీయాలకే స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అలాంటిదేమీ లేదని.. జీవన్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని అధిష్టానం నుంచి హామీ లభించిదన్న టాక్ కూడా వినిపిస్తుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తాను ఇంతకాలం నమ్ముకున్న పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదనే బాధ జీవన్ రెడ్డిలో ఉందని ఆయన అనుంగ అనుచరులు అంటున్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు.. జగిత్యాల ఎపిసోడ్ ఆయనలో ఆ బాధను పలుమార్లు బయటపెట్టింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్పై పోరాటం చేసిన తనకు.. పదేళ్ల తర్వాత అధికారం దక్కాక పెద్దగా సముచిత స్థానం దక్కకపోవడం జీవన్ రెడ్డిని తీవ్రంగా కలిచి వేస్తుందంట.ఈ పరిణామాలే జీవన్ రెడ్డి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. ఆయన సుముఖంగా లేకున్నా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చి ఓటమి మూట గట్టుకున్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా తీసుకుని గెలిస్తే ఓకే.. లేదంటే, ఇక తన పనైపోనట్టే అనేది నిరూపించేందుకే ఎమ్మెల్సీ టిక్కెట్ ను ఆఫర్ చేసి ఉంటారని జీవన్రెడ్డితో పాటు ఆయన అనుచరులు అనుమాన పడుతున్నారంట.ఇలాంటి సందేహాలు, అనుమానాలతో పాటు.. పార్టీతో పెరిగిన గ్యాప్, తనకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వంటివన్నీ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్ నిరాకరించేందుకు కారణమయ్యాయంట.
అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దాంతో ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తారన్న ప్రచారం మొదలైంది. మరి పెద్దాయన పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీడ్ బిల్లు–2025 పై రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహిస్తున్న టీడీఎఫ్ జైకిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సీడ్ బిల్–2025 పై రైతులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆన్లైన్ కాన్ఫరెన్స్ లు, వెబినార్ ల ద్వారా తీసుకున్న అభిప్రాయాల నివేదికను గురువారం కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ... దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థగా సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రెజిమెంటల్ బజార్లో జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల హైస్కూల్ 175వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు 175 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరో ఐఏఎస్, ఐపీఎస్,... అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రభుత్వ ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టికెట్ రేట్లు పెంచడానికి సరైన ఆధారాలు, సమగ్ర కారణాలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం చట్టానికి... నాన్బెయిలబుల్ వారెంట్ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న కొండా సురేఖపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం కావడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ వివరణ... రోడ్డు భద్రతపై యమధర్మరాజుగా అవగాహన
సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :
హైదరాబాద్ సిటీ కమిషనర్ వి.సీ. సజ్జనార్ పర్యవేక్షణలో, ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో బేగంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్ సిగ్నల్, బోయిన్పల్లి జంక్షన్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు.
సర్వేజనా ఫౌండేషన్,కిమ్స్ సన్షైన్ ఆస్పత్రుల సీఈఓ డా. గురవా రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్... మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్?
హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐకి “పనిష్మెంట్ ట్రాన్స్ఫర్” విధించడంపై పెద్ద వివాదం మొదలైంది. వేకెన్సీ రిజర్వ్ పేరుతో సీఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ను ట్రాన్స్ఫర్ చేయించేందుకు మంత్రి ప్రభావం చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం జరిగింది?మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... అమెరికాకు 20-పాయింట్ల సవరించిన శాంతి ప్రతిపాదన అందజేసిన ఉక్రెయిన్
లండన్ డిసెంబర్ 11 :
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం, యుద్ధం ముగింపుకు దోహదపడే 20 పాయింట్ల శాంతి ప్రతిపాదనను సవరించి అమెరికాకు అందజేశారు.
ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రతిపాదనలో కొత్త ఆలోచనలు, ముఖ్యంగా ఆక్రమిత... హబ్సిపూర్ గ్రామంలో బిజెపి అభ్యర్థికి ప్రచారం నిర్వహించిన బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల రూరల్ మండల్ హబ్సిపూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ..
భారతీయ జనతా పార్టీ బలపరిచిన
ఈ... ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్ నిర్వహణ పూర్తి *జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
కోరుట్ల /మెట్పల్లి /మేడిపల్లి డిసెంబర్ 11 ( ప్రజా మంటలు)మొదటి విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
మేడిపల్లి మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామం, భీమారం మండల కేంద్రంలోని కమ్మరిపేట, కోరుట్ల మండలంలోని మెట్... ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు)
గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఓట్ల... బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకి 9వ షెడ్యూల్ లో చేర్చాలి: జీవన్ రెడ్డి
జగిత్యాల, డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే, రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, 50% రిజర్వేషన్ పరిమితిని అధిగమించడానికి ఇదే మార్గమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనలతో బలహీన... ముత్తారం సర్పంచ్ గా ఉరడి భారతి జైపాల్ రెడ్డి విజయం
అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తా - ఊరడి భారతి 