జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

On
జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

 
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?

గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

ఎన్నికలు ఏవైనా తాను సంసిద్ధమంటూ రంగంలోకి దిగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈసారి మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ఎందుకు బరిలోకి దిగడం లేదు?
పోటీ చేయడం వద్దనుకున్నారా? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు వేసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇంకా అలక వీడలేదా?.. లేకపోతే ఈ ఎన్నికకు దూరంగా ఉంటే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ లభించిందా? ఇక చాల్లే అనుకుని గౌరవప్రదంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని అనుకుంటున్నారా..? అసలు జీవన్‌రెడ్డి రాజకీయ భవితవ్యయంపై ఇంత చర్చ? ఇన్ని సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి ?సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాక అసలు సిసలు కాంగ్రెస్ వాదిగా ఫోకస్ అయ్యారు జీవన్‌రెడ్డి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పట్ల అంత కమిట్‌మెంట్‌తో ఉన్న వ్యవహరించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి తనకు తాను అర్ధాంతరంగా బయటకొస్తే బాగుండదు కాబట్టి కొనసాగుతున్నారంటున్నారు. పార్టీలో సీనియర్‌మోస్ట్ అయిన ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారంట.
2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు.

తర్వాత సంజీవ్‌కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో మొదలైన లొల్లితో.. పెద్దాయన జీవన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది తయారైంది. సంజీవ్ చేరిక సమయంలోనే జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్ బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనలో మాత్రం ఆ అసంతృప్తి కొనసాగుతూనే ఉందంట.ఆ క్రమంలో తన ప్రత్యర్ధినే పార్టీలో చేర్చుకోవడంతో నొచ్చుకున్న జీవన్‌రెడ్డి .. రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారో? , లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచన తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారో? కాని పొలిటికల్‌గా మనుపటి దూకుడు ప్రదర్శించడం లేదు.

సంజీవ్ ఎపిసోడ్‌తో పార్టీ అధిష్ఠానంతో కూడా గ్యాప్ ఏర్పడినట్లు కనిపిస్తుండటంతో.. మార్చి నెలాఖరుకి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక ఏకంగా రాజకీయాలకే స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అలాంటిదేమీ లేదని.. జీవన్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని అధిష్టానం నుంచి హామీ లభించిదన్న టాక్ కూడా వినిపిస్తుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తాను ఇంతకాలం నమ్ముకున్న పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదనే బాధ జీవన్ రెడ్డిలో ఉందని ఆయన అనుంగ అనుచరులు అంటున్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు.. జగిత్యాల ఎపిసోడ్ ఆయనలో ఆ బాధను పలుమార్లు బయటపెట్టింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్‌పై పోరాటం చేసిన తనకు.. పదేళ్ల తర్వాత అధికారం దక్కాక పెద్దగా సముచిత స్థానం దక్కకపోవడం జీవన్ రెడ్డిని తీవ్రంగా కలిచి వేస్తుందంట.ఈ పరిణామాలే జీవన్ రెడ్డి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. ఆయన సుముఖంగా లేకున్నా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చి ఓటమి మూట గట్టుకున్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా తీసుకుని గెలిస్తే ఓకే.. లేదంటే, ఇక తన పనైపోనట్టే అనేది నిరూపించేందుకే ఎమ్మెల్సీ టిక్కెట్ ను ఆఫర్ చేసి ఉంటారని జీవన్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు అనుమాన పడుతున్నారంట.ఇలాంటి సందేహాలు, అనుమానాలతో పాటు.. పార్టీతో పెరిగిన గ్యాప్, తనకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వంటివన్నీ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్ నిరాకరించేందుకు కారణమయ్యాయంట.

అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దాంతో ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తారన్న ప్రచారం మొదలైంది. మరి పెద్దాయన పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags
Join WhatsApp

More News...

ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం 

ఘనంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభం  జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు  మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించి వివిధ పుష్పాలతో మాలలు అల్లి అలంకరించారు .సాయంత్రం మొదటి పాశురం సామూహికంగా...
Read More...

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్

గ్రామపంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ మద్దతు తో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన జిల్లా అధ్యక్షులు మాజీ జెడ్పి చైర్పర్సన్ జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గం లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లను సన్మానించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......
Read More...

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్     ధర్మపురి డిసెంబర్ 16 (ప్రజా మంటలు) నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం  మీడియాతో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గత 10 సంవత్సరాలలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందుంచుతాననిఅబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మీ ప్రభుత్వం అన్నారు. , మీ నాయకత్వమే., సంక్షేమ శాఖ మంత్రిగా...
Read More...

మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 16( ప్రజా మంటలు)   పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు  163  బి  ఎన్ ఎస్ ఎస్(144  సెక్షన్ అమలు)  విజయోత్సవ  ర్యాలీలు, ఊరేగింపులకు  అనుమతి లేదు జిల్లాలో జరగనున్న  మూడవ   విడత  గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ...
Read More...
Local News  Crime 

దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత

దళితుల భూమిని ఆక్రమించి, దారి మూసివేత ఎల్కతుర్తి డిసెంబర్ 16 (ప్రజా మంటలు):  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని దండేపల్లి, దగ్గువారి పల్లె మధ్య ఉన్న డిబిఎం 20 ఎస్సారెస్పీ కాలువ ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ, దళితుల పొలాలకు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూరారం గ్రామానికి చెందిన బచ్చు శ్రీనివాస్...
Read More...

ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

ఈనెల 21 న జాతీయ లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోండి  జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ ఈనెల 21న జాతీయ మెగా లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వి నియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని సూచించారు.  జిల్లాలో సుమారు 18 యేళ్ళనుంచి కేసులు నమోదు అయి...
Read More...
State News 

యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు

యంగ్ ఇండియా స్కూల్, IIM హైదరాబాద్, కేంద్రీయ–నవోదయ విద్యాలయాలపై కీలక చర్చలు న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ప్రజా మంటలు): తెలంగాణలో విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు...
Read More...

నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య .

నేను జీవన్ రెడ్డికి నమ్మిన బంటును  జీవన్ రెడ్డికు చెడ్డ పేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా..జగిత్యాల డిసిసి అధ్యక్షుడు ...గాజంగి నందయ్య . జగిత్యాల డిసెంబర్ 16(ప్రజా మంటలు)నావల్ల కాంగ్రెస్ పార్టీకి, జీవన్ రెడ్డికి చెడ్డపేరు వస్తే అర్ధగంటలో రాజీనామా చేస్తా అన్నారు డిసిసి అధ్యక్షులు  నందయ్య జగిత్యాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ కొనసాగుతుండగా ఎమ్మెల్యే సంజయ్‌తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిమంత్రి అడ్లూరి లక్ష్మణ్...
Read More...
Local News 

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్ చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని...
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత  సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్‌ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు. నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్...
Read More...

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.  జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై  ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు....
Read More...

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను...
Read More...