జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

On
జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

 
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?

గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

ఎన్నికలు ఏవైనా తాను సంసిద్ధమంటూ రంగంలోకి దిగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈసారి మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ఎందుకు బరిలోకి దిగడం లేదు?
పోటీ చేయడం వద్దనుకున్నారా? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు వేసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇంకా అలక వీడలేదా?.. లేకపోతే ఈ ఎన్నికకు దూరంగా ఉంటే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ లభించిందా? ఇక చాల్లే అనుకుని గౌరవప్రదంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని అనుకుంటున్నారా..? అసలు జీవన్‌రెడ్డి రాజకీయ భవితవ్యయంపై ఇంత చర్చ? ఇన్ని సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి ?సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాక అసలు సిసలు కాంగ్రెస్ వాదిగా ఫోకస్ అయ్యారు జీవన్‌రెడ్డి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పట్ల అంత కమిట్‌మెంట్‌తో ఉన్న వ్యవహరించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి తనకు తాను అర్ధాంతరంగా బయటకొస్తే బాగుండదు కాబట్టి కొనసాగుతున్నారంటున్నారు. పార్టీలో సీనియర్‌మోస్ట్ అయిన ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారంట.
2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు.

తర్వాత సంజీవ్‌కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో మొదలైన లొల్లితో.. పెద్దాయన జీవన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది తయారైంది. సంజీవ్ చేరిక సమయంలోనే జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్ బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనలో మాత్రం ఆ అసంతృప్తి కొనసాగుతూనే ఉందంట.ఆ క్రమంలో తన ప్రత్యర్ధినే పార్టీలో చేర్చుకోవడంతో నొచ్చుకున్న జీవన్‌రెడ్డి .. రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారో? , లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచన తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారో? కాని పొలిటికల్‌గా మనుపటి దూకుడు ప్రదర్శించడం లేదు.

సంజీవ్ ఎపిసోడ్‌తో పార్టీ అధిష్ఠానంతో కూడా గ్యాప్ ఏర్పడినట్లు కనిపిస్తుండటంతో.. మార్చి నెలాఖరుకి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక ఏకంగా రాజకీయాలకే స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అలాంటిదేమీ లేదని.. జీవన్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని అధిష్టానం నుంచి హామీ లభించిదన్న టాక్ కూడా వినిపిస్తుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తాను ఇంతకాలం నమ్ముకున్న పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదనే బాధ జీవన్ రెడ్డిలో ఉందని ఆయన అనుంగ అనుచరులు అంటున్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు.. జగిత్యాల ఎపిసోడ్ ఆయనలో ఆ బాధను పలుమార్లు బయటపెట్టింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్‌పై పోరాటం చేసిన తనకు.. పదేళ్ల తర్వాత అధికారం దక్కాక పెద్దగా సముచిత స్థానం దక్కకపోవడం జీవన్ రెడ్డిని తీవ్రంగా కలిచి వేస్తుందంట.ఈ పరిణామాలే జీవన్ రెడ్డి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. ఆయన సుముఖంగా లేకున్నా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చి ఓటమి మూట గట్టుకున్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా తీసుకుని గెలిస్తే ఓకే.. లేదంటే, ఇక తన పనైపోనట్టే అనేది నిరూపించేందుకే ఎమ్మెల్సీ టిక్కెట్ ను ఆఫర్ చేసి ఉంటారని జీవన్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు అనుమాన పడుతున్నారంట.ఇలాంటి సందేహాలు, అనుమానాలతో పాటు.. పార్టీతో పెరిగిన గ్యాప్, తనకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వంటివన్నీ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్ నిరాకరించేందుకు కారణమయ్యాయంట.

అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దాంతో ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తారన్న ప్రచారం మొదలైంది. మరి పెద్దాయన పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags
Join WhatsApp

More News...

State News  Crime 

పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్

పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్ సికింద్రాబాద్, డిసెంబర్ 10 (ప్రజామంటలు) : వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో 18ఏళ్ల యువతి పవిత్రపై జరిగిన క్రూరహత్య కేసులో నిందితుడు దుక్కా ఉమాశంకర్‌ను వారాసిగూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.   డిసెంబర్ 8న జరిగిన...
Read More...

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి  : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి  : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     ఎన్నికలు నిర్వహణకు 843  మంది పోలీస్ లతో  పటిష్ట బందోబస్తు.జగిత్యాల/కోరుట్ల మెట్పల్లి,డిసెంబర్ 10(ప్రజా మంటలు) జిల్లాలో జరుగుతున్న మొదటి విడత  గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  అన్నారు. బుధవారం బీమారం ,కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ

శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ (అంకం భూమయ్య) గొల్లపల్లి, డిసెంబర్ 10 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (దొంగ మల్లన్న) జాతర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ బుధవారం ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి కూడా స్వామి వారిని దర్శించుకుని...
Read More...

మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి

మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి    రాయికల్ డిసెంబర్ 10 ( ప్రజా మంటలు)మండలములోని మహితాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజనాల సుందరి-జయానందం గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో రాయికల్...
Read More...
Local News 

కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత

కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత కొండగట్టు డిసెంబర్ 10 –(ప్రజా మంటలు): కొండగట్టుకు రోజు వారీ జీవనోపాధి కోసం వచ్చి చిన్న దుకాణాల ద్వారా బొమ్మలు, గాజులు, పిల్లల ఆట వస్తువులు అమ్ముకునే కుటుంబాలు కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యులు...
Read More...

రోడ్డు విస్తరణ గూర్చి తమ వినతిని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేసిన డా బోగ శ్రావణి

రోడ్డు విస్తరణ గూర్చి తమ వినతిని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేసిన డా బోగ శ్రావణి జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు)నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి కి గతంలో జగిత్యాల నియోజకవర్గం లోని జగిత్యాల రురల్ మండల్ అనంతరం గ్రామంలోని లో లెవెల్ బ్రిడ్జ్ వర్షాకాలంలో ప్రజలు తీవ్ర  ఇబ్బంది పడడం, నిత్యం ప్రమాదాలు జరగడం మరియు జగిత్యాల్ అర్బన్ మండల్ అంబారిపేట్ రోడ్డు విస్తరణ మరియు రైల్వే...
Read More...

బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి  డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి   డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ   తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు,) బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలని శృంగేరీ శారద పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని  స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో మహాభారత ప్రవచన మహాయజ్ఞం 5...
Read More...

మొదటి విడత 11వ తేదీన  జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్

మొదటి విడత 11వ తేదీన  జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ మేడిపల్లి/ కథలాపూర్/ మల్లాపూర్ /ఇబ్రహీంపట్నం డిసెంబర్ 10(ప్రజా మంటలు   )    మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్ మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల  డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్   పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది బాధ్యతల పంపిణీ, లాజిస్టిక్స్ ఎన్నికల మెటీరియల్ను   జిల్లా కలెక్టర్...
Read More...

కేంద్ర మంత్రులు గడ్కరీ,  అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్ పలు సమస్యలపై విన్నపాలు సానుకూలంగా స్పందించిన మంత్రులు

కేంద్ర మంత్రులు గడ్కరీ,  అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్  పలు సమస్యలపై విన్నపాలు  సానుకూలంగా స్పందించిన మంత్రులు ఢిల్లీ డిసెంబర్ 10 (ప్రజా మంటలు) (S. వేణు గోపాల్)  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను  వేర్వేరుగా కలిశారు.  ఈ సందర్భంగా నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు.  కేంద్ర రైల్వే శాఖ...
Read More...
Local News  Crime 

స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి

స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి కామారెడ్డి డిసెంబర్ 10 (ప్రజా మంటలు): కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 10వ తరగతి విద్యార్థి ప్రణవ్‌ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను...
Read More...

నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం

నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం   జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు)స్థానిక ధరూర్ శివారు కరీం నగర్ రోడ్డు లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గత 4 రోజులుగా  అత్యంత వైభవవో పేతంగా  సాగిపోతున్న మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఉర్రూతలూగిస్తూ సాగిపోతుంది. కళ్యాణమండపం భక్తులతో కిక్కిరిసిపోయి  జనసంద్రం లాగ కనిపిస్తుందని  సామాజిక కార్యకర్త తవుటు...
Read More...
Local News 

గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ

గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం * ఏఐ మార్ఫింగ్‌తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం * గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ * ఏఐ మార్ఫింగ్‌తో ఓటర్లలో అయోమయం భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) : మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి....
Read More...