జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు
జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ఎన్నికలు ఏవైనా తాను సంసిద్ధమంటూ రంగంలోకి దిగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈసారి మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ఎందుకు బరిలోకి దిగడం లేదు?
పోటీ చేయడం వద్దనుకున్నారా? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్తో చెట్టాపట్టాలు వేసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇంకా అలక వీడలేదా?.. లేకపోతే ఈ ఎన్నికకు దూరంగా ఉంటే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ లభించిందా? ఇక చాల్లే అనుకుని గౌరవప్రదంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని అనుకుంటున్నారా..? అసలు జీవన్రెడ్డి రాజకీయ భవితవ్యయంపై ఇంత చర్చ? ఇన్ని సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి ?సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి.. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాక అసలు సిసలు కాంగ్రెస్ వాదిగా ఫోకస్ అయ్యారు జీవన్రెడ్డి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పట్ల అంత కమిట్మెంట్తో ఉన్న వ్యవహరించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి తనకు తాను అర్ధాంతరంగా బయటకొస్తే బాగుండదు కాబట్టి కొనసాగుతున్నారంటున్నారు. పార్టీలో సీనియర్మోస్ట్ అయిన ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారంట.
2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీవన్రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు.
తర్వాత సంజీవ్కుమార్ కూడా కాంగ్రెస్లో చేరిపోవడంతో మొదలైన లొల్లితో.. పెద్దాయన జీవన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది తయారైంది. సంజీవ్ చేరిక సమయంలోనే జీవన్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్ బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనలో మాత్రం ఆ అసంతృప్తి కొనసాగుతూనే ఉందంట.ఆ క్రమంలో తన ప్రత్యర్ధినే పార్టీలో చేర్చుకోవడంతో నొచ్చుకున్న జీవన్రెడ్డి .. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారో? , లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచన తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారో? కాని పొలిటికల్గా మనుపటి దూకుడు ప్రదర్శించడం లేదు.
సంజీవ్ ఎపిసోడ్తో పార్టీ అధిష్ఠానంతో కూడా గ్యాప్ ఏర్పడినట్లు కనిపిస్తుండటంతో.. మార్చి నెలాఖరుకి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక ఏకంగా రాజకీయాలకే స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అలాంటిదేమీ లేదని.. జీవన్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని అధిష్టానం నుంచి హామీ లభించిదన్న టాక్ కూడా వినిపిస్తుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తాను ఇంతకాలం నమ్ముకున్న పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదనే బాధ జీవన్ రెడ్డిలో ఉందని ఆయన అనుంగ అనుచరులు అంటున్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు.. జగిత్యాల ఎపిసోడ్ ఆయనలో ఆ బాధను పలుమార్లు బయటపెట్టింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్పై పోరాటం చేసిన తనకు.. పదేళ్ల తర్వాత అధికారం దక్కాక పెద్దగా సముచిత స్థానం దక్కకపోవడం జీవన్ రెడ్డిని తీవ్రంగా కలిచి వేస్తుందంట.ఈ పరిణామాలే జీవన్ రెడ్డి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. ఆయన సుముఖంగా లేకున్నా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చి ఓటమి మూట గట్టుకున్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా తీసుకుని గెలిస్తే ఓకే.. లేదంటే, ఇక తన పనైపోనట్టే అనేది నిరూపించేందుకే ఎమ్మెల్సీ టిక్కెట్ ను ఆఫర్ చేసి ఉంటారని జీవన్రెడ్డితో పాటు ఆయన అనుచరులు అనుమాన పడుతున్నారంట.ఇలాంటి సందేహాలు, అనుమానాలతో పాటు.. పార్టీతో పెరిగిన గ్యాప్, తనకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వంటివన్నీ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్ నిరాకరించేందుకు కారణమయ్యాయంట.
అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దాంతో ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తారన్న ప్రచారం మొదలైంది. మరి పెద్దాయన పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
పంచాయతి ఎన్నికలు -2025 మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు.... బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి... ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...
కొండగట్టు డిసెంబర్ 1(ప్రజా మంటలు)ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం రూపాయలు 40 వేల విలువగల దుస్తువులను కంపెనీ ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్బంగా కంపెనీ ASM రమేష్ కుమార్ , CFA ఏజెంట్ వూటూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కొండగట్టులోని... హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
గాంధీ ఏఆర్టీ సెంటర్ లో అందుబాటులో చక్కటి వైద్యం
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు) : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం,ఎ.ఆర్.టి. సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, అవేర్నెస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి హాజరయ్యారు.
అనంతరం ఎ ఆర్... మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు)
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ... ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ భూమి ప్రభుత్వానికి చెందిన భూమి...అక్రమంగా ఆక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవు.. అని బోర్డుపై పేర్కొన్నారు. సదరు... ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్- కంటోన్మెంట్, డిసెంబర్ 01 ( ప్రజా మంటలు):
ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలు మారేడ్పల్లిలో సోమవారం ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మాజీ మంత్రి గీతారెడ్డి ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ— మహిళా సాధికారతకు ప్రతీక అయిన ఈశ్వరీబాయి 100 ఏళ్ల క్రితమే లింగ వివక్షను ఎదుర్కొంటూ ఉన్నత... ‘భూతశుద్ధి వివాహం’ అంటే ఏమిటి?
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో ‘భూతశుద్ధి వివాహం’ పద్ధతిలో జరిగినట్లు ఈషా సంస్థ వెల్లడించింది. ఈ వార్త బయటకు రావడంతో భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది.
ఈషా నిర్వాహకుల వివరణ ప్రకారం, భూతశుద్ధి వివాహం అనేది... సీనియర్ సిటిజెన్స్ డిమాండ్లు పరిష్కరించాలి. -టాస్కా జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ డిమాండ్లు సత్వరం పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం లోని టాస్కా కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడారు.సీనియర్ సిటిజెన్స్ సమస్యలు పరిష్కారం, సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్... సినీనటి సమంత–రాజ్ నిడిమోరు వివాహం
కోయంబత్తూరులో
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ – లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఇద్దరూ, కుటుంబ సభ్యులు–సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ భూతశుద్ధి వివాహం విధానం ద్వారా... ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు
యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ
సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ... గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
ఉదయం సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18... 