జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు
జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ఎన్నికలు ఏవైనా తాను సంసిద్ధమంటూ రంగంలోకి దిగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈసారి మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ఎందుకు బరిలోకి దిగడం లేదు?
పోటీ చేయడం వద్దనుకున్నారా? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్తో చెట్టాపట్టాలు వేసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇంకా అలక వీడలేదా?.. లేకపోతే ఈ ఎన్నికకు దూరంగా ఉంటే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ లభించిందా? ఇక చాల్లే అనుకుని గౌరవప్రదంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని అనుకుంటున్నారా..? అసలు జీవన్రెడ్డి రాజకీయ భవితవ్యయంపై ఇంత చర్చ? ఇన్ని సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి ?సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి.. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాక అసలు సిసలు కాంగ్రెస్ వాదిగా ఫోకస్ అయ్యారు జీవన్రెడ్డి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పట్ల అంత కమిట్మెంట్తో ఉన్న వ్యవహరించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి తనకు తాను అర్ధాంతరంగా బయటకొస్తే బాగుండదు కాబట్టి కొనసాగుతున్నారంటున్నారు. పార్టీలో సీనియర్మోస్ట్ అయిన ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారంట.
2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీవన్రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు.
తర్వాత సంజీవ్కుమార్ కూడా కాంగ్రెస్లో చేరిపోవడంతో మొదలైన లొల్లితో.. పెద్దాయన జీవన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది తయారైంది. సంజీవ్ చేరిక సమయంలోనే జీవన్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్ బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనలో మాత్రం ఆ అసంతృప్తి కొనసాగుతూనే ఉందంట.ఆ క్రమంలో తన ప్రత్యర్ధినే పార్టీలో చేర్చుకోవడంతో నొచ్చుకున్న జీవన్రెడ్డి .. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారో? , లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచన తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారో? కాని పొలిటికల్గా మనుపటి దూకుడు ప్రదర్శించడం లేదు.
సంజీవ్ ఎపిసోడ్తో పార్టీ అధిష్ఠానంతో కూడా గ్యాప్ ఏర్పడినట్లు కనిపిస్తుండటంతో.. మార్చి నెలాఖరుకి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక ఏకంగా రాజకీయాలకే స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అలాంటిదేమీ లేదని.. జీవన్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని అధిష్టానం నుంచి హామీ లభించిదన్న టాక్ కూడా వినిపిస్తుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తాను ఇంతకాలం నమ్ముకున్న పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదనే బాధ జీవన్ రెడ్డిలో ఉందని ఆయన అనుంగ అనుచరులు అంటున్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు.. జగిత్యాల ఎపిసోడ్ ఆయనలో ఆ బాధను పలుమార్లు బయటపెట్టింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్పై పోరాటం చేసిన తనకు.. పదేళ్ల తర్వాత అధికారం దక్కాక పెద్దగా సముచిత స్థానం దక్కకపోవడం జీవన్ రెడ్డిని తీవ్రంగా కలిచి వేస్తుందంట.ఈ పరిణామాలే జీవన్ రెడ్డి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. ఆయన సుముఖంగా లేకున్నా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చి ఓటమి మూట గట్టుకున్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా తీసుకుని గెలిస్తే ఓకే.. లేదంటే, ఇక తన పనైపోనట్టే అనేది నిరూపించేందుకే ఎమ్మెల్సీ టిక్కెట్ ను ఆఫర్ చేసి ఉంటారని జీవన్రెడ్డితో పాటు ఆయన అనుచరులు అనుమాన పడుతున్నారంట.ఇలాంటి సందేహాలు, అనుమానాలతో పాటు.. పార్టీతో పెరిగిన గ్యాప్, తనకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వంటివన్నీ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్ నిరాకరించేందుకు కారణమయ్యాయంట.
అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దాంతో ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తారన్న ప్రచారం మొదలైంది. మరి పెద్దాయన పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కొండగట్టు జనవరి 2 (ప్రజా మంటలు)1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్... రాష్ట్ర మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు
జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)నూతన సంవత్సరం 2026 పురస్కరించుకొని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్తెలంగాణ రాష్ట్ర మంత్రులకు పొన్నం ప్రభాకర్ కి, అడ్లూరి లక్ష్మణ్ మరియు శ్రీధర్ బాబులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్యతో ప్రత్యక్షంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు... హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన పట్టణ సిఐ కరుణాకర్
జగిత్యాల జనవరి 2 (ప్రజా మంటలు)పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్యను జగిత్యాల పట్టణానికి చెందిన బాసోజి శ్రీనివాస్ ఇతని కొడుకు వేణు, చారి లు కలిసి డిసెంబర్ 31 న దాడి చేసి హత్య చేసినట్టు పట్టణ సిఐ కరుణాకర్ శుక్రవారం మీడియాతో వివరాలు తెలిపారు .
మృతుడు అంజయ్యకు నిందితుడు శ్రీనివాస్... వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి -జిల్లా రవాణా అధికారి యం. శ్రీనివాస్
జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు)జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవల సందర్భంగా జగిత్యాల జిల్లా రవాణా అధికారి యం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సీట్ బెల్ట్ పై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు
ఈ సందర్భంగా సీట్ బెల్ట్ ధరించిన వారిని గులాబీ పువ్వు... కరీంనగర్ మున్సిపల్ కౌన్సిల్ పై ఎంఐఎం జెండా ఎగురవేస్తాము నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పిలుపు
జగిత్యాల, జనవరి 02(ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎంఐఎం పార్టీదే మాత్రమే సూపర్ పవర్ అని, ఎంఐఎం మద్దతు లేనిదే ఆకు కూడా కదలదని, రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో ఎంఐఎం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా శ్రమించాలని, హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే, యూత్... రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్, జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త కాసుగుంటి సుధాకర్ రావు మృతికి ఘనంగా శ్రద్ధాంజలి
జగిత్యాల జనవరి 2 ( ప్రజా మంటలు)
రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ మరియు జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ఆవరణలో .....శుక్రవారం ఉదయం 11 గంటలకు విద్యావేత్త జగిత్యాల క్లబ్ మరియు రోటరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు కాసుగంటి సుధాకర్ రావు మృతి పట్ల సంతాప సమావేశం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూల... మెడిసిన్ అప్డేట్- 2026 లో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురణ. జగిత్యాల వైద్యుడికి దక్కిన అరుదైన అవకాశం.
జగిత్యాల. జనవరి 2( ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ భీమనాతిని శంకర్ కు అరుదైన అవకాశం దక్కింది. మెడిసిన్ అప్డేట్ - 2026 వైద్య గ్రంథంలో డాక్టర్ శంకర్ వ్యాసం ప్రచురితమైంది.
వైద్య రంగంలో కొత్త కొత్త అంశాలు, ఆవిష్కరణలతో ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలోని జేపీ బ్రదర్స్... మూసీ పునరుజ్జీవానికి వేగం – మార్చి నాటికి టెండర్లు, త్వరలో పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 02 (ప్రజా మంటలు):
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లశాసన సభలో చెప్పారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి, కాలుష్య నివారణ, శుద్ధి నీటి ప్రవాహం... కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరు – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నేత కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే పార్టీని ఎవ్వరూ కాపాడలేరని ఆమె స్పష్టం చేశారు. శాసనమండలి ఆవరణలో పాత్రికేయులతో మాట్లాడుతూ, కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు.
కేసీఆర్ సభకు హాజరై ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోతే... కౌన్సిల్లో మాట్లాడి రాజీనామా ఆమోదింప చేసుకుంటా – కవిత
హైదరాబాద్, జనవరి 02 (ప్రజా మంటలు):
తాను చేసిన రాజీనామాను కౌన్సిల్లో మాట్లాడిన తర్వాతే ఆమోదింప చేయించుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3న రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు దాన్ని ఆమోదించలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఛైర్మన్ను కోరనున్నట్లు... తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి... 