నిమ్స్ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ * లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్
నిమ్స్ లో తన 19వ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ
* లైబ్రరీని ప్రారంభించిన సిటీ పోలీస్ కమిషనర్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు):
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణ తన 19 వ లైబ్రరీని పంజాగుట్టలోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రి రేడియాలజీ అంకాలజీ విభాగంలో ఏర్పాటు చేశారు. మంగళవారం క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి లు ప్రారంభించారు. ఆసుపత్రిలోని అంకాలజీ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న క్యాన్సర్ పేషంట్ల కోసం ఆకర్షణ తాను సొంతంగా సేకరించిన, కొనుగోలు చేసిన 600 పుస్తకాలను ఈ లైబ్రరీలో పెట్టారు. ఈ పుస్తకాల పఠనంలో పేషంట్లు కొంత సాధారణ స్థితికి వస్తారనే ఆశతో ఈ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు ఆకర్షణ తెలిపారు. చిన్న వయస్సులోనే పెద్ద మనసుతో తన పాకెట్ మనీతో పాటు పలు చోట్ల పుస్తకాలను సేకరిస్తూ అనాధ పిల్లలు, స్టూడెంట్స్, పేషంట్ల కోసం ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని సీపీ సీవీ ఆనంద్ ఆకర్షణ ను అభినందించారు. ఇప్పటివరకు ఆకర్షణ ఏర్పాటు చేసిన 19 ఓపెన్ లైబ్రరీల్లో మొత్తం 12605 పుస్తకాలను అందచేసినట్లు ఆకర్షణ తండ్రి సతీష్ తెలిపారు. మెట్రో లైబ్రరీ ప్రాజెక్ట్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభించనున్నామని, ప్రతి మెట్రో స్టేషన్ లో ప్రయాణీకుల కోసం లైబ్రరీలను అందుబాటులో ఉంటాయన్నారు. ఆకర్షణ ఏర్పాటు చేయబోయే 25వ లైబ్రరీ ఓపెనింగ్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ కు వస్తారని తెలిపారు. ప్రధాని ఆహ్వానం మేరకు ఆకర్షణ ఇటీవల జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి న్యూఢిల్లీ వెళ్ళి వచ్చారు. కార్యక్రమంలో రేడియేషన్ అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మోనికా, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
