పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి అశోక్ కుమార్

జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు )
పిల్లల భద్రతే మాకు ముఖ్యం రోడ్డు ప్రమాద నివారణ లో అందరూ భాగస్వాములు కావాలి
స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే జారిచేయబడిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలని ఎస్పీ అన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల లో బాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల ఫిట్నెస్,స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలకు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా లో రోడ్డు ప్రమాదల నివారనే లక్ష్యంగా స్కూల్స్ బస్ డ్రైవర్స్ కి ట్రాఫిక్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నరు. చాలా వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. స్కూల్ బస్సుల్లో ప్రయాణించే వారిలో చిన్న పిల్లలే ఉంటారు కాబట్టి వారి పట్ల చాలా జాగ్రత్త వహించాలని సూచించారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. పిల్లలని స్కూల్ కి తీసుకొని వచ్చేటప్పుడు, ఇంటికి తీసుకొని వెళ్లే క్రమంలో బస్సు హెల్పర్ వెనుక ముందు చూసుకొన్నాకనే వారిని దించాలి, పిల్లలు రోడ్డు దాటవలసివస్తే హెల్పర్ తప్పక దాటించాలని సూచించారు. బస్ కి సంబంధించి అన్ని వాహన పత్రాలు కల్గివుండాలని, బస్సు సరైన కండిషన్ లో ఉందో లేదో ముందే జాగ్రత్తపడాలని, బస్సు బ్రేక్, లైట్స్, ఇండికేటర్స్, పార్కింగ్ లైట్స్ మరియు వైపర్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చూసుకోవాలని సూచించారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ఎన్నో కుటుంబాలు బస్సు డ్రైవర్ల మీద చాలా నమ్మకంతో తమతమ పిల్లలని స్కూల్స్ కి బస్సుల్లో పంపిస్తున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఈ సంధర్బంగా తెలియజేశారు. ఎవరైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించక పోతే వారిపై చట్టపరమైన చర్యలు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లో నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై పోలీస్ , ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ పలు స్కూల్ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా అని స్వయంగా పరిశీలించి పాటించని వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, DTO శ్రీనివాస్, RI వేణు, ఎస్సైలు సుధాకర్, మల్లేశం, గీత, రవాణా శాఖ అధికారులు, స్కూల్ వ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రావు,పోలీస్ సిబ్బంది , స్కూల్ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సత్యసాయి జిల్లా 16 జనవరి (ప్రజా మంటలు) :
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు)
భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు)
మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్... రాయికల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు) పట్టణంలోని స్థానిక వి ఎస్ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ
రాయికల్ మున్సిపల్ ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఆశించిన అభివృద్ధి జరగలేదు. ప్రజలకు కనీస అవసరాలైన వీధి... తపస్ రాష్ట్ర అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి"
జగిత్యాల జనవరి 16 ( ప్రజా మంటలు)
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఓ డ్నాల రాజశేఖర్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణిప్రవీణ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి మరియు నూతనంగా ఎన్నికైన తపస్... పోపా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు)పట్టణంలో స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి అఫీషియల్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో రాయికల్ మాజీ మునిసిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు,రాష్ర్ట... బీద, మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి
జగిత్యాల, జనవరి 16 (ప్రజా మంటలు):
బీద మరియు మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో, పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా... సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ఆంధ్ర నుండి హైదరాబాద్ వచ్చే వాహనాలకు దారి మళ్లింపు. - జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నల్గొండ 16 జనవరి (ప్రజా మంటలు) :
సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకేసారి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే నేపథ్యంలో, నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై... జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు.
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన వోడ్నా ల రాజశేఖర్ .ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించారు జగిత్యాల... ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము
నిజామాబాద్ జనవరి 15 (ప్రజా మంటలు) నిజామాబాద్ లోని బ్రహ్మపురిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. .ప్రతి ఏట సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు . రథము చక్రం గుడి నుండి బయలుదేరి గాజులపేట, పెద్ద బజారు, మీదుగా ఆలయం చేరుకుంది .... జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు) జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీరయ్య ,అక్క మహంకాళి మాతకు కుల బాంధవులు గురువారం బోనాల సమర్పించారు .కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామివారికి బోనాలను నివేదించారు.
పిల్లాపాపలతో పాటు పశుసంపద ,గొర్రెలు, మేకలు,పాడిపంటలతో చల్లంగా ఉండాలని మొక్కుకున్నారు .ఒగ్గు కళాకారుల డోలు చప్పులతో ఆలయానికి... తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం, భారత ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల సత్వర పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్... 