పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి అశోక్ కుమార్

జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు )
పిల్లల భద్రతే మాకు ముఖ్యం రోడ్డు ప్రమాద నివారణ లో అందరూ భాగస్వాములు కావాలి
స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే జారిచేయబడిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలని ఎస్పీ అన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల లో బాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల ఫిట్నెస్,స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలకు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా లో రోడ్డు ప్రమాదల నివారనే లక్ష్యంగా స్కూల్స్ బస్ డ్రైవర్స్ కి ట్రాఫిక్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నరు. చాలా వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. స్కూల్ బస్సుల్లో ప్రయాణించే వారిలో చిన్న పిల్లలే ఉంటారు కాబట్టి వారి పట్ల చాలా జాగ్రత్త వహించాలని సూచించారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. పిల్లలని స్కూల్ కి తీసుకొని వచ్చేటప్పుడు, ఇంటికి తీసుకొని వెళ్లే క్రమంలో బస్సు హెల్పర్ వెనుక ముందు చూసుకొన్నాకనే వారిని దించాలి, పిల్లలు రోడ్డు దాటవలసివస్తే హెల్పర్ తప్పక దాటించాలని సూచించారు. బస్ కి సంబంధించి అన్ని వాహన పత్రాలు కల్గివుండాలని, బస్సు సరైన కండిషన్ లో ఉందో లేదో ముందే జాగ్రత్తపడాలని, బస్సు బ్రేక్, లైట్స్, ఇండికేటర్స్, పార్కింగ్ లైట్స్ మరియు వైపర్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చూసుకోవాలని సూచించారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ఎన్నో కుటుంబాలు బస్సు డ్రైవర్ల మీద చాలా నమ్మకంతో తమతమ పిల్లలని స్కూల్స్ కి బస్సుల్లో పంపిస్తున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఈ సంధర్బంగా తెలియజేశారు. ఎవరైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించక పోతే వారిపై చట్టపరమైన చర్యలు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లో నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై పోలీస్ , ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ పలు స్కూల్ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా అని స్వయంగా పరిశీలించి పాటించని వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, DTO శ్రీనివాస్, RI వేణు, ఎస్సైలు సుధాకర్, మల్లేశం, గీత, రవాణా శాఖ అధికారులు, స్కూల్ వ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రావు,పోలీస్ సిబ్బంది , స్కూల్ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం
సూర్యాపేట, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): సూర్యాపేట–ఖమ్మం 365వ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న వోల్వో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు... పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి
కోరుట్ల, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన చిలువేరి మహేష్ గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెలకు... చర్లపల్లిలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ
జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికుడు, ఉద్యమకారుడు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు.
చర్లపల్లి గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగించగల వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని... గొల్లకోటలో సింహాచలం జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల ఆర్థిక సాయం
వెల్గటూర్/గొల్లపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోటకు చెందిన బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రూ.21.36 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
ఇటీవల అకాల మరణం చెందిన జగన్ చిత్రపటానికి నివాళులర్పించిన కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులను... ఘనంగా శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేశ నిమజ్జన శోభాయాత్ర
కీసర సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ నిమజ్జన కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. బ్యాండు మేళ తాళాలతో ప్రత్యేక వాహనంపై స్వామివారిని ఉపస్థితి చేసి శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు.
కోలాటాలతో భజనలతో శోభాయాత్రగా తటకానికి తరలించి నిమజ్జనం నిర్వహించారు. ఐదు రోజులపాటు... నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా ప్రతినిధి, ( ప్రజా మంటలు) సెప్టెంబర్ 19:
గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో... వర్ష కొండలో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు,
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో పెద్ద చెరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను తహసిల్దార్ వరప్రసాద్,ఎస్ఐ నవీన్ పరిశీలించినరు,
గంగమ్మ గుడి కట్టపైన నుండి చిన్న గణపతులు నిమజ్జనం, గంగపుత్ర సంఘ భవనం వద్ద నుండి పెద్ద గణపతులు నిమగ్నం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నట్లు... మహాత్మ జ్యోతిరావ్ ఫూలే స్కూల్ ని ఆకష్మిక తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి.-ఆర్. అజయ్ కుమార్
మెట్టుపల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
మెట్ పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఛైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్, శనివారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే బాలుర హాస్టల్, బీర్పూర్ ఎట్ మెట్ పల్లిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న కిచెన్, బాత్రూం,... చేనేత కార్మికులందరికీ ‘చేయూత’ పెన్షన్ వర్తింపజేయాలి : ఎల్ రమణ
హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన ప్రతి కార్మికుడికి ‘చేయూత’ పెన్షన్ పథకం వర్తించేలా అర్హత ప్రమాణాలను విస్తరించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు... రేవంత్రెడ్డికి సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మాజీ మంత్రి జీవన్రెడ్డి
పాలన చేతగాక.. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్
హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి గుణపాఠం
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు, ఆరు గ్యారంటీల అమలు వంటి... కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్
కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):
కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్... రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం
కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు)::
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు... 