ముగిసిన సింగపూర్ పర్యటన - దావోస్ బయలుదేరిన రేవంత్ బృందం
ముగిసిన సింగపూర్ పర్యటన - దావోస్ బయలుదేరిన రేవంత్ బృందం
సింగపూర్ జనవరి 20:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్య స్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటనకు బయల్దేరుతోంది.
చివరి రోజున ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులతో కూడిన బృందం సింగపూర్ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. 
ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్ డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్ తదితరులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి తెలంగాణలో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు.
హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.
సింగపూర్ నుంచి సీఎం గారితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు దావోస్ కు బయల్దేరనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక: గెలిచింది సంజయ్ వర్గమా? లేక రేవంత్ రాజకీయ పంతమా?
జగిత్యాల రాజకీయాల్లో సంచలన మార్పు: కొత్త సమీకరణలు ?
(ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం)
జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక కావడం కేవలం స్థానిక పదవి మార్పు కాదు. ఇది కాంగ్రెస్ లోపలి శక్తి సమీకరణాల్లో ఒక కీలక మలుపు.
బయటికి చూస్తే ఇది👉 సంజయ్ కుమార్ వర్గ విజయం... బ్రేకింగ్ న్యూస్: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నిక
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సమిండ్ల వాణి ఎన్నికఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం పట్టు సాధించింది
▪️ మాజీ మంత్రి వర్గానికి మొండిచేయి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
▪️ వైస్ చైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన చాంద్ పాషా ఎంపిక▪️ మాజీ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్కు నిరాశ▪️ గాజుల... కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర
కరీంనగర్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చివరి నిమిషంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 66 డివిజన్లలో
భారతీయ జనతా... రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్కేనా?
రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని వింత, కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి..రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏకంకవలనే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తోంది. అధిక సంఖ్యలో సీట్లు గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి వారు... భారత్ పేరు ప్రస్తావించని తారిక్ రెహ్మాన్ – సమతుల్య విదేశాంగ విధాన సంకేతాలు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 16:
బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత, ప్రధాని-నియమితుడిగా బాధ్యతలు స్వీకరించనున్న Tarique Rahman తన తొలి మీడియా సమావేశంలో దేశ విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తన ప్రభుత్వం ఏ ఒక్క దేశం పక్షాన నిలిచే విధానాన్ని కాకుండా, “బంగ్లాదేశ్ ప్రయోజనాలే కేంద్రంగా... దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రంగుల వివాదం – భక్తుల విశ్వాసాలపై దాడేనా?
భక్తుల విశ్వాసాలపై దాడేనా?
–(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి పొందిన ఈ ఆలయంలో మహాశివరాత్రి జాతర... జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: ఛైర్పర్సన్ పీఠం చుట్టూ శక్తి–సమీకరణల రాజకీయ క్రీడ
మూడు కుర్చీకాటగా పదవి రాజకీయాలు
జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇక స్థానిక పరిమితుల్లో లేవు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో ముడిపడి, ఇవి రాష్ట్ర స్థాయి అధికార కేంద్రాల వరకూ చేరాయి. ముఖ్యంగా మున్సిపల్ ఛైర్పర్సన్ ఎంపిక ఒక్క పదవిగా కాకుండా, ఇద్దరు కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా... పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
కౌన్సిలర్లుగా గెలిచిన సమీండ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లను చైర్పర్సన్ అభ్యర్థులుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. వీరికి కాంగ్రెస్ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 30... జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి
(అంకం భూమయ్య)
జగిత్యాల ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో పట్టపగలు జరిగిన హత్య కలకలం రేపింది. జగిత్యాల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ డైరీ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.
జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా... రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
పాలేరు రిజర్వాయర్లో ఘోర ప్రమాదం: ఖమ్మం, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్లోకి దూసుకువెళ్లడంతో, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు బొగ్గుల శ్రీనివాస్ (49) నీట... తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కవిత... ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు
జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)
ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు
ఈసందర్భంగా... 