అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి: జిల్లా జడ్జి నీలిమ
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్థానిక పోలీస్ పరేడ్ మైదానం లో 3వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ హాజరై క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి నీలిమ మాట్లాడుతూ ..... ఎంతో పని ఒత్తిడితో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ వారికి స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరమని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించవచ్చు అన్నారు. మంచి ఆరోగ్యమే ఒక సంపద మంచి ఆరోగ్యం మనకు లభించాలంటే స్పోర్ట్స్ ద్వారానే వస్తుందని అన్నారు. రాబోయే రోజుల లో జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు మరింత ఉస్తానగా విధులు నిర్వహిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ..... క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్లో పాల్గొనడం/పార్టీసిపేషన్ ముఖ్యమన్నారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీల లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందరని అన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. అన్ని క్రీడల్లో హోంగార్డు ఆఫీసర్ నుంచి అధికారుల వరకు మంచి పోటాపోటీ ని ఇస్తూ క్రీడాస్ఫూర్తిని కనబరచాలని అన్నారు. స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్మెంట్ ద్వారా జీవితంలో లక్ష్యాలకు దగ్గరగా చేరుకోగలుగుతమని. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల ఉద్యోగుల్లో టీం వర్క్ అనేది ఏర్పడుతుందని అన్నారు. టీం వర్క్ వల్ల ఎప్పుడు విజయాలే కలుగుతాయని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ అనేది ఇంత విజయవంతం కావడానికి టీం వర్క్ ముఖ్య కారణం అన్నారు. ఈయొక్క పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ఇంత ఘనంగా నిర్వహించడం లో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీలు, మరియు వారి టీం ని జిల్లా ఎస్పీ అభినందించారు. మరియు యొక్క క్రీడా పోటీలను నిర్వహించిన PET లకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం క్రీడా పోటీలలో విజేతలకు జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలసి ట్రోఫీ లు అందజేశారు.
విజేతలు వీరే!
1.ఓవరాల్ ఛాంపియన్ : DAR -Jagtial.
2 .టగ్ ఆఫ్ ఫర్ విన్నర్ : DAR - Jagtial, రన్నర్స్ : Jagtial sub division
3.వాలీబాల్ విన్నర్స్ : DAR - Jagtial, రన్నర్స్ : Jagtial sub division.
4. క్రికెట్ విన్నర్స్ : DAR-Jagtia , రన్నర్స్ : Metpalli sub division
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రఘుచందర్, రాములు ,రంగా రెడ్డి ,A.O శశికల,DCRB,SB IT CORE ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీ ఖాన్, సి.ఐ లు రాం నరసింహారెడ్డి, వేణుగోపాల్,రవి,కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి ,సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు మరియు ఎస్. ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కూచిపూడి నాట్యపోటీల్లో నిత్యాశ్రీకి ద్వితీయ బహుమతి
జగిత్యాల, సెప్టెంబర్ 13(ప్రజా మంటలు):
శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహించిన జిల్లా స్థాయి కూచిపూడి నాట్యపోటీలలో జగిత్యాల నాట్యగురువు శ్రీమతి గుండి యమునకు చెందిన శ్రీ శారదా సిద్ధిరామ నాట్యాలయం విద్యార్థిని చిన్నారి మహాదేవుని నిత్యాశ్రీ ద్వితీయ బహుమతి సాధించింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ... పద్మ చక్ర అవార్డు గ్రహీత ఎల్లాల సరిత గోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందనలు
జగిత్యాల, సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఎల్లాల సరిత గోపాల్ రెడ్డిని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు.
శ్రీ లలిత ఆల్టర్నేటివ్ థెరపీ సెంటర్ ద్వారా ప్రజలకు శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మందులు లేని వైద్య విధానాన్ని అందిస్తూ, సామాజిక సేవలు చేస్తున్నందుకు... తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఫజలుల్లా బేగ్
జగిత్యాల, సెప్టెంబర్ 13( ప్రజా మంటలు) తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి యూ డబ్ల్యూ జె ఎఫ్) జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం జగిత్యాలలోని స్పైసీ హోటల్లో నిర్వహించిన సమావేశంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు ఉర్దూ జర్నలిస్టులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మిర్జా ఫజలుల్లా బేగ్ను తెలంగాణ... గౌరీ ప్రియ కాలనీలో గణేష్ మంటప నిర్మాణ సన్నాహక సమావేశం
కీసర సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు) కుందన్ పల్లి లోని గౌరీ ప్రియ కాలనీలో శనివారం కాలనీలో నూతనంగా గణేష నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆదివారం ఉత్సవ కమిటీ వారు గణేశ ఉత్సవాలు నిర్వహించడానికి గాను సన్నాహక సమావేశం నిర్వహించి ప్రతినిత్యం నిర్వహించే కార్యక్రమాలు గూర్చి చర్చించి విధివిధానాలు ఖరారు... జపాన్లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి మృతి
కేరళ, సెప్టెంబర్ 11:
జపాన్లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి మృతి చెందింది. ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వీ. దేవిక ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
దేవిక మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె... మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి
జగిత్యాల, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):
2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్క్లబ్లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో... సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్-1 అధికారులు
బీహార్లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం
ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్ రాష్ట్రానికి చెందిన గ్రూప్-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని... గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. టౌన్ సిఐ కరుణాకర్.
జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు)
గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి... మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు
మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు):
మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ... *కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
జగిత్యాల, సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్... "ఫెడరల్ బ్యాంక్ "వారిచే మృత్తిక గణపతి ప్రతిమల వితరణ
ఈస్ట్ ఆనంద్ బాగ్ సెప్టెంబర్ 10( ప్రజా మంటలు)మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో గల "ఫెడరల్ బ్యాంక్" శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమకాలీన స్థితికి అనుకూలంగా ప్రకృతి పరిరక్షణ పేరిట మృత్తిక (మట్టి ) గణపతి ప్రతిమలను తమ బ్యాంకు ఖాతాదారులకు వితరణ చేయడానికి శ్రీకారం చుట్టారు.... 