అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి: జిల్లా జడ్జి నీలిమ
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్థానిక పోలీస్ పరేడ్ మైదానం లో 3వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ హాజరై క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి నీలిమ మాట్లాడుతూ ..... ఎంతో పని ఒత్తిడితో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ వారికి స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరమని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించవచ్చు అన్నారు. మంచి ఆరోగ్యమే ఒక సంపద మంచి ఆరోగ్యం మనకు లభించాలంటే స్పోర్ట్స్ ద్వారానే వస్తుందని అన్నారు. రాబోయే రోజుల లో జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు మరింత ఉస్తానగా విధులు నిర్వహిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ..... క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్లో పాల్గొనడం/పార్టీసిపేషన్ ముఖ్యమన్నారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీల లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందరని అన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. అన్ని క్రీడల్లో హోంగార్డు ఆఫీసర్ నుంచి అధికారుల వరకు మంచి పోటాపోటీ ని ఇస్తూ క్రీడాస్ఫూర్తిని కనబరచాలని అన్నారు. స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్మెంట్ ద్వారా జీవితంలో లక్ష్యాలకు దగ్గరగా చేరుకోగలుగుతమని. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల ఉద్యోగుల్లో టీం వర్క్ అనేది ఏర్పడుతుందని అన్నారు. టీం వర్క్ వల్ల ఎప్పుడు విజయాలే కలుగుతాయని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ అనేది ఇంత విజయవంతం కావడానికి టీం వర్క్ ముఖ్య కారణం అన్నారు. ఈయొక్క పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ఇంత ఘనంగా నిర్వహించడం లో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీలు, మరియు వారి టీం ని జిల్లా ఎస్పీ అభినందించారు. మరియు యొక్క క్రీడా పోటీలను నిర్వహించిన PET లకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం క్రీడా పోటీలలో విజేతలకు జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలసి ట్రోఫీ లు అందజేశారు.
విజేతలు వీరే!
1.ఓవరాల్ ఛాంపియన్ : DAR -Jagtial.
2 .టగ్ ఆఫ్ ఫర్ విన్నర్ : DAR - Jagtial, రన్నర్స్ : Jagtial sub division
3.వాలీబాల్ విన్నర్స్ : DAR - Jagtial, రన్నర్స్ : Jagtial sub division.
4. క్రికెట్ విన్నర్స్ : DAR-Jagtia , రన్నర్స్ : Metpalli sub division
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రఘుచందర్, రాములు ,రంగా రెడ్డి ,A.O శశికల,DCRB,SB IT CORE ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీ ఖాన్, సి.ఐ లు రాం నరసింహారెడ్డి, వేణుగోపాల్,రవి,కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి ,సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు మరియు ఎస్. ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC
హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):
గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సూచించింది.
బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కమిషన్ హెచ్ఆర్సీ నంబర్ 3034/2026 కింద సుమోటో కేసు నమోదు చేసింది. 2026... బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత
కాంగ్రెస్పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
నిజామాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో... ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) టీజీజెఏసి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర టి జి ఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొని... చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి
గొల్లపల్లి, ఆగస్టు 31 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే చేయూత పెన్షన్లను ఎలాంటి కఠిన నిబంధనలు, షరతులు లేకుండా సరళతరం చేసి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన... గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం
గొల్లపల్లి, ఆగస్టు 31, ప్రజా మంటలు:
గొల్లపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఈ శిబిరాన్ని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్... క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్కు ఎమ్మెల్యే ప్రశంస.!
జగిత్యాల ఆగస్ట్ 31(ప్రజా మంటలు)
ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, గుట్కా, తంబాకు వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దాతల సహకారంతో సమకూర్చిన రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా. సంజయ్ కుమార్... తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు):
తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్ షాపులో పనిచేస్తున్న బిహార్కు చెందిన సైనా ఉల్లా ఖాన్ను నిందితుడిగా... ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.... రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):
జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల... జగిత్యాల బీజేపీలో అసమ్మతి సెగలు
(సిరిసిల్ల రాజేందర్ శర్మ)
జగిత్యాల, ఆగస్టు 29:జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోరుట్ల సమీపంలోని ఓ... తెలుగు భాషా ఫోరం ఆధ్వర్యంలో పద్య పఠన పోటీలు
జగిత్యాల ఆగస్ట్ 29(ప్రజా మంటలు)జిల్లా భాషోపాధ్యాయులు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు ఆయుపట్టు పద్యం. తెలుగు భాషా సొగసుకు శిఖరాగ్రమైన ప్రక్రియ పద్య సాహిత్యం. పై అంశాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా డీఈవో కె.రాము అనుమతి తీసుకుని, తెలుగు భాషా ఫోరం లెటర్ ప్యాడ్... డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
కరీంనగర్, ఆగస్టు 28 (ప్రజా మంటలు):
రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లిన అక్క రోడ్డుపైనే బస్సును ఆపించి రాఖీ కట్టింది.గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజు తిమ్మాపూర్ మండలం రేణికుంట... 