అనునిత్యం విధులలో ఉండే పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి: జిల్లా జడ్జి నీలిమ
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్థానిక పోలీస్ పరేడ్ మైదానం లో 3వ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ హాజరై క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి నీలిమ మాట్లాడుతూ ..... ఎంతో పని ఒత్తిడితో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ వారికి స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరమని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించవచ్చు అన్నారు. మంచి ఆరోగ్యమే ఒక సంపద మంచి ఆరోగ్యం మనకు లభించాలంటే స్పోర్ట్స్ ద్వారానే వస్తుందని అన్నారు. రాబోయే రోజుల లో జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు మరింత ఉస్తానగా విధులు నిర్వహిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ..... క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్లో పాల్గొనడం/పార్టీసిపేషన్ ముఖ్యమన్నారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీల లో పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందరని అన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. అన్ని క్రీడల్లో హోంగార్డు ఆఫీసర్ నుంచి అధికారుల వరకు మంచి పోటాపోటీ ని ఇస్తూ క్రీడాస్ఫూర్తిని కనబరచాలని అన్నారు. స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్మెంట్ ద్వారా జీవితంలో లక్ష్యాలకు దగ్గరగా చేరుకోగలుగుతమని. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల ఉద్యోగుల్లో టీం వర్క్ అనేది ఏర్పడుతుందని అన్నారు. టీం వర్క్ వల్ల ఎప్పుడు విజయాలే కలుగుతాయని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ అనేది ఇంత విజయవంతం కావడానికి టీం వర్క్ ముఖ్య కారణం అన్నారు. ఈయొక్క పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ఇంత ఘనంగా నిర్వహించడం లో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ, డీఎస్పీలు, మరియు వారి టీం ని జిల్లా ఎస్పీ అభినందించారు. మరియు యొక్క క్రీడా పోటీలను నిర్వహించిన PET లకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం క్రీడా పోటీలలో విజేతలకు జిల్లా జడ్జి శ్రీమతి నీలిమ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలసి ట్రోఫీ లు అందజేశారు.
విజేతలు వీరే!
1.ఓవరాల్ ఛాంపియన్ : DAR -Jagtial.
2 .టగ్ ఆఫ్ ఫర్ విన్నర్ : DAR - Jagtial, రన్నర్స్ : Jagtial sub division
3.వాలీబాల్ విన్నర్స్ : DAR - Jagtial, రన్నర్స్ : Jagtial sub division.
4. క్రికెట్ విన్నర్స్ : DAR-Jagtia , రన్నర్స్ : Metpalli sub division
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రఘుచందర్, రాములు ,రంగా రెడ్డి ,A.O శశికల,DCRB,SB IT CORE ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీ ఖాన్, సి.ఐ లు రాం నరసింహారెడ్డి, వేణుగోపాల్,రవి,కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి ,సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు మరియు ఎస్. ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ
కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్ ) గారి వర్ధంతి జ్ఞాపకం !
- బండ్ల మాధవరావు
(మహమ్మద్ గౌస్ FB నుండి)
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో... ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, నవంబర్ XX (ప్రజా మంటలు):
ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ మరోసారి... ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు
కాగజ్నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్లో హర్షాన్ని కలిగించింది.
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త... న్యూ అశోక్ నగర్లో కార్తీక దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,... చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్ సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్, తదితర అంశాలపై ఎస్బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ... బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత
మియాపూర్/ షాద్ నగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) :
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు బస్తీలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వంపై స్పందన తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి... హైదరాబాద్లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
భారత సరకు రవాణా రంగం భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని, దానికి అనుగుణంగా ఆధునిక నైపుణ్య శక్తి అవసరమని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఎస్టీఐ క్యాంపస్లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్... వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన సదస్సు.
మెట్టుపల్లి నవంబర్ 20(ప్రజా మంటలు దగ్గుల అశోక్)
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్ బాల్య
.... కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం
రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం...
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు గురువారం... మల్లాపూర్లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష
మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర... ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై... తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్
కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
“ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ... 