గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గత బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది - విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మారం జనవరి 15:
ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్లో ఉండాల్సిన నీటి సామర్థ్యం కంటే తక్కువ నీటి నిల్వ ఉందని,దీని వలన పంట సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి విన్నవించారు .
విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రిజర్వాయర్ ను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు..*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధర్మారం మండలంలోని మేడారం చెరువుకు గొప్ప చరిత్ర ఉందని,గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో చెరువును రిజర్వాయర్ గా మార్చి, పైప్ లైన్ ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట కు హరీష్ రావు నీటిని తరలించడం జరిగిందని,అయినప్పటికీ ఇక్కడి బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజప్రతినిధులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
ఇక్కడి ప్రాంత రైతాంగానికి నీటి అవసరం ఎంత ఉంది,నీళ్ళ వాట ఎంత వంటి వాటిని గత పాలకులు పట్టించుకోలేదని,గత పాలకులు చేసిన నిర్వాకం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని,ధర్మపురి తలపున గోదావరి ఉన్న,ధర్మారం మండలంలో మేడారం రిజర్వాయర్ ఉన్న ఇక్కడి రైతంగానికి సాగు నీరు అందించే విషయంలో గత పాలకులు పూర్తిగా విఫలం అయ్యారని,నేను స్వయంగా ఈ విషయాన్ని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని,వారు వెంటనే స్పందించి గోదావరిలో ఒక టీఏంసి నీటినీ విడుదల చేయడం జరిగిందని తెలిపారు,
మేడారం రిజర్వాయర్ ను కూడా ఈ రోజు నింపడం జరుగుతుందని,త్వరలోనే ధర్మపురి నియోజకవర్గంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఉంటుందని,వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంత ఇరిగేషన్ పైన ఒక రివ్యూను ఏర్పాటు చేసి సాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)