కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి కళ్యాణం కమనీయం

అశేష భక్తజనం మధ్యలో కన్నుల పండుగగా కళ్యాణం 

On
కొత్తకొండ కోరమీసాల వీరభద్రస్వామి కళ్యాణం కమనీయం

పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్త దంపతులు

భీమదేవరపల్లి జనవరి 10 (ప్రజామంటలు) :

ఉత్తర తెలంగాణలో ప్రసిద్ది గాంచిన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలవైన వీరభద్రుడి జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం భద్ర‌కాళీ సమేత వీరభధ్రుడి కళ్యాణంతో అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్తకొండ కోర మీసాల వీరభద్రుడి కళ్యాణం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరంలో శుక్రవారం రాత్రి కన్నులపండువగా నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమయ్యయి. తొలుత ఆలయంలో ధ్వజారోహణం నిర్వహించి వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవ మూర్తులను పల్లకిలో తీసుకుని వచ్చి కళ్యాణ మండపంలో అందంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా సతీసమేతంగా హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించగా ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ధ్యాన మండపంలో ఏర్పాట్లు చేయగా వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ దేవతామూర్తుల అర్చకులు కళ్యాణ ఘట్టం పూర్తి చేశారు. దీంతో భక్తులు ఆ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకుని పులకరించిపోయారు. భద్రకాళీ, వీరభద్రస్వామి వారి ప్రాశస్థ్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. దీంతో ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నం సతీమణి మంజుల, మామ పెద్ది వెంకట నారాయణ గౌడ్, వెంకటాపూర్ ఎంపీడీవో లంకపల్లి భాస్కర్, సిఐ పులి రమేష్, ఎస్సైలు సాయిబాబు, దివ్య, డైరెక్టర్స్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

వ్యవసాయ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి పాల్గొన్న మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్

వ్యవసాయ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి పాల్గొన్న మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ జగిత్యాల డిసెంబర్ 24 (ప్రజా మంటలు)ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ కళాశాల పొలాస లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శాసన సభ్యులు డా సంజయ్ కుమార్ .ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య జిల్లా కాంగ్రెస్...
Read More...
Local News 

ఇటిక్యాల గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి – జీవన్‌రెడ్డి

ఇటిక్యాల గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి – జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు): ఇందిరా భవన్‌లో ఇటిక్యాల గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయడం ఇటిక్యాల...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon
Read More...

అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు 

అంగరంగ వైభవంగా కలియుగ దైవం కల్యాణ వేడుకలు  జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాసాంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ వేడుకలు మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని కొనసాగించారు భక్తులు...
Read More...

బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు

బీర్పూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఏకగ్రీవం_అధ్యక్షులుగా తుంగూరు సర్పంచ్ రాజగోపాల్ రావు *  బీర్పూర్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు)మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు గా తుంగూర్ గ్రామ సర్పంచ్ అర్షకోట రాజగోపాల్ రావు ని ఏకగ్రీవంగా ఏనుకున్న బీర్పూర్ మండల సర్పంచులు, ప్రధాన కార్యదర్శి గా ఎల్లమట్ల హరీష్ (బీర్పూర్ సర్పంచ్ ), ఉపాధ్యక్షులు 1 గా బోడ సాగర్ (రంగసాగర్ సర్పంచ్ ),...
Read More...

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ *జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ  సంఘటన లేకుండా ముగిసిన ఏడాది* *మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,–  డ్రగ్స్‌ పై జీరో టాలరెన్స్ విధానం అమలు* *‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ...
Read More...
Local News  State News 

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి  జీవన్ రెడ్డి సూటి ప్రశ్న జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో...
Read More...

పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు) పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ….  పోలీస్ సిబ్బంది రోజువారీ...
Read More...
Local News 

పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ

పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్) ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన  గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు  మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో  ఇతర మండల అధికారులు....
Read More...

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్‌పై ACB సోదాలు మహబూబ్‌నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్ కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్...
Read More...
National  Crime  State News 

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు

ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్‌, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్...
Read More...