రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 09:.. .
ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ
వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం,
నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు, సహస్రనామార్చనలు, పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం, వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం
ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున
శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.
వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం
శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో
ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి, అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.
ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు
ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.
సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు
సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు, జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు.
ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం
దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై సంబంధిత పాశురం గురించి వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..? ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.
జగిత్యాల, జనవరి 24 (ప్రజా మంటలు)
40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు.
శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్,... టీ-హబ్ స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
టీ-హబ్ను పూర్తిగా స్టార్టప్ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు... నోబెల్ శాంతి బహుమతి నిర్లక్ష్యమే గ్రీన్ల్యాండ్ అంశంపై వ్యాఖ్యలకు కారణమా?
అమెరికా రాజకీయాల్లో మరో వివాదాస్పద ప్రకటన
వాషింగ్టన్ జనవరి 24:
గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న గత వ్యాఖ్యల వెనుక కారణం నోబెల్ శాంతి బహుమతి అందకపోవడంపై అసంతృప్తినేనని అమెరికా మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తాను అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు... నాంపల్లి ఎగ్జిబిషన్కు ఎవరూ రావొద్దు: సీపీ సజ్జనార్
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
నాంపల్లి ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో ప్రజలు **నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్)**కు రావద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు స్పష్టంగా సూచించారు. ఈరోజు నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నీచర్ షోరూమ్ గోదాంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.... మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి?
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతూ, తెలంగాణ జాగృతి పార్టీ చీఫ్ కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తుద నిర్ణయం తీసుకున్నారు. స్థానిక రాజకీయాల్లో తన ఉనికిని ఘాటుగా చాటేందుకు, పార్టీ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనుంది.
పార్టీకి శాశ్వత గుర్తింపుగా సింహం గుర్తును ప్రజల్లో... పంటల ధర నిర్ణయ అధికారం రైతులకే ఉండాలి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):పంటల ధరలను నిర్ణయించే అధికారం రైతులకే ఉండాలని, మార్కెట్లో జరిగే మోసాలను నియంత్రించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్పష్టం చేశారు.శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ శాఖ రిటైర్డ్ అధికారుల సంఘం రాష్ట్ర... ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవా తత్పరుడు కాసుగంటి సుధాకర్ రావు సేవలు నేటి తరానికి స్ఫూర్తి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 24 (ప్రజా మంటలు)ప్రముఖ విద్యావేత్త,సామాజిక వేత్త,పారిశ్రామిక వేత్త సరస్వతీ శిశు మందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాల ఛైర్మెన్ కాసుగంటి సుధాకర్ రావు ప్రథమ మాసికం( సంస్మరణ ) కార్యక్రమానికి ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ పద్మనాయక కళ్యాణ మండపానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఎందరో... నాంపల్లి రోడ్లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నాంపల్లి రోడ్లోని ఓ బహుళ అంతస్తుల ఫర్నిచర్ షాప్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫర్నిచర్ షాప్కు చెందిన సెల్లార్లో ముందుగా అగ్ని... అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్, జనవరి 24:
శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా, విజయమిత్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ’. ‘అతి ప్రేమ భయానకం’ అనే క్యాప్షన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను శుక్రవారం ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా విడుదల చేశారు.... బడ్జెట్ పార్లమెంట్ 28 నుండి, సమావేశాలకు ముందు రోజు అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ జనవరి 24 (ప్రజా మంటలు):
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 27న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సంప్రదాయం ప్రకారం, సమావేశాలు ప్రారంభమయ్యే ముందు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరపనుంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు రెండు దశలుగా ఏప్రిల్... ఫిబ్రవరి 3 నుంచి ప్రజల కోసం రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్
న్యూఢిల్లీ జనవరి 24, (ప్రజా మంటలు):ఢిల్లీ వాసులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధ అమృత్ ఉద్యాన్ (Amrit Udyan) ఫిబ్రవరి 3 నుంచి సాధారణ ప్రజల సందర్శనకు తెరవనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యాన్ మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
ప్రతి ఏడాది... గ్రీన్ల్యాండ్ సంక్షోభం ప్రభావం డాలర్ కుదేలు… భారత్లో ₹1.56 లక్షలకు చేరిన బంగారం ధర
లండన్ / న్యూఢిల్లీ జనవరి 24(ప్రజా మంటలు):
గ్రీన్ల్యాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, యూరోపియన్ దేశాలపై టారిఫ్ హెచ్చరికలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని పెంచాయి.
ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు పరుగులు తీయడంతో బంగారం ధరలు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత అత్యుత్తమ... 