రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 09:.. .
ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ
వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం,
నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు, సహస్రనామార్చనలు, పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం, వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం
ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున
శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.
వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం
శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో
ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి, అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.
ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు
ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.
సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు
సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు, జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు.
ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం
దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై సంబంధిత పాశురం గురించి వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి - కల్వకుంట్ల కవిత
సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన... హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 28:
హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం... జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక... సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం
హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):
ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.... రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్
జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు)
కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్... బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు):
బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లో... ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.
జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :
జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల... హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు షాక్.. వెంటనే తొలగించాలని సీఎస్కు ఆదేశం
కోర్టు ధిక్కార కేసులో కీలక పరిణామం.. ప్రభుత్వానికి ఇప్పుడు రెండు మార్గాలేనా?
హైదరాబాద్, జూలై 27:
హైదరాబాద్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా (HYDRAA) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని... సుసంపన్నమైన వర్షాల కోసమే శ్రీమత్ విరాట పర్వ సప్తాహం
జగిత్యాల జులై 26 (ప్రజా మంటలు) సనాతనంగా సుసంపర్ణమైన వర్షాల కోసమే మహాభారత అంతర్గత శ్రీమత్ విరాట పర్వసప్తాహం నిర్వహించబడేదని నంబి వేణుగోపాల ఆచార్య తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య చే శ్రీమత్ విరాటపర్వసప్తాహం ప్రారంభమైంది.
ఆగస్టు ఒకటవ తేదీ శనివారం వరకు ఈ కార్యక్రమం... ఒకే ఒక్క మొగాడు మొనగాడు ఎమ్మెల్యే పాయల్ శంకర్..
సెల్యూట్ టు ది లీడర్...
నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విలువ ఇంతా అంతా కాదు అక్షరాల 2278.14 కోట్లు.
అభినవ అపర భగీరథుడు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్.
అదిలాబాద్ జిల్లాకు బాహుబలి లాంటి మెగా నిధుల కేటాయింపు...
రాష్ట్రంలో అదిలాబాదు జిల్లా ఓటర్లే అత్యధిక ప్రభావవంతమైన వారు, తెలివి కలవారు ఒకటి పాయల్... కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు
గుంతకల్ జూలై 26 ( ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ పాత గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ సందర్భంగా వీర జవాన్లు అందరికీ నివాళులర్పించిన గుంతకల్ బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో బిజెపి ఓల్డ్ టౌన్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, బిజెపి సీనియర్ నాయకురాలు మరియు ఎఫ్సీఐ స్టేట్ డైరెక్టర్... గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల సంకల్పం. మిత్ర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం.
జగిత్యాల, జులై 26(ప్రజా మంటలు)
సిరిసిల్ల రాజేంద్ర శర్మ (9348422113)
చేయి చేయి కలుపుదాం సేవ చేయ కదులుదాం... ప్రజల కొరకే మనమంతా ప్రతి నిమిషం బ్రతుకుదాం.. అంటూ శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పూర్వ విద్యార్థులు "మిత్ర ఫౌండేషన్" పేరుతో సేవా సంస్థకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల గీత విద్యాలయంలో విద్యనభ్యసించిన... 