రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

On
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి జనవరి 09:.. . 
 ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ 
 వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు 
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో 
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం, 
 నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు,  సహస్రనామార్చనలు,  పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం,  వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి  నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి  సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం

ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది.  ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు  దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది.  ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున 
 శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.

వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం

శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో 
 ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార  పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ,   ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి,  అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.

ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు

 ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో  సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై  బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.

సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు

సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు,  జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య  సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
 బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల  ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు. 

ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం

దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై  సంబంధిత పాశురం గురించి వివరించారు.

Tags
Join WhatsApp

More News...

National  Filmi News 

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది. ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల...
Read More...
Crime 

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు   గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో...
Read More...
Local News 

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు  సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు. మహాత్మ జ్యోతిరావు పూలే  ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.     ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి
Read More...
Local News 

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..   రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ...
Read More...
Local News 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన...
Read More...
State News 

దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన కోనేరుపల్లె గ్రామం

దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన కోనేరుపల్లె గ్రామం   చొప్పదండి, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు): చొప్పదండి మండలంలోని కోనేరుపల్లె గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు “క్రీడా మిత్ర పంచాయతీ” ప్రణాళికలో భాగంగా యువతను క్రీడల వైపు మళ్లించే దిశగా చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది.క్వాలిటీ...
Read More...
Local News  State News 

జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం

జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని,...
Read More...
State News 

బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక

బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం...
Read More...
State News 

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు   హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని...
Read More...
Local News 

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.రియల్ ఎస్టేట్...
Read More...
Local News 

జగిత్యాలలో మహిళా చైతన్య బైక్ ర్యాలీ.

జగిత్యాలలో మహిళా చైతన్య బైక్ ర్యాలీ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 10 ఏప్రిల్ ( ప్రజా మంటలు ) :  భారతీయ సంస్కృతిని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని హిందూ మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఉద్దేశించి పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలో మహిళలు బైక్...
Read More...