రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 09:.. .
ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ
వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం,
నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు, సహస్రనామార్చనలు, పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం, వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం
ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున
శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.
వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం
శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో
ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి, అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.
ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు
ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.
సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు
సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు, జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు.
ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం
దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై సంబంధిత పాశురం గురించి వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అగ్ని ప్రమాద బాధితులు
కొండగట్టు జనవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో గతంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా బొమ్మల వ్యాపారుల దుకాణాలు కాలిపోగా నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల యజమానులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విద్యుత్ శాఖ తరపున ఆర్థిక సహాయం అందించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, కిషన్ రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
వెల్గటూర్ జనవరి 10 (ప్రజా మంటలు) జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్
మండలంలోని కిషన్రావు పేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడం వలన ముందస్తుగా ఘనంగా సంక్రాంత్రి సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులు, తోరణాలతో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. ... బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డు అనుదీప్ ఐఏఎస్కు ప్రదానం
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల్లోంచి ఎంపిక చేసిన యంగ్ అచీవర్స్ అవార్డును ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసి అయిన అనుదీప్ దురిశెట్టి, ప్రజాజీవన రంగంలో విశిష్ట సేవలందించినందుకు పబ్లిక్ లైఫ్ కేటగిరీలో ఈ పురస్కారానికి... ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో... జాగృతి ఖతార్ చైర్పర్సన్కు నారీ శక్తి సమ్మాన్ అవార్డు
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులు, ప్రవాసులకు విశేష సేవలందిస్తున్న జాగృతి ఖతార్ అడ్వైజరీ చైర్పర్సన్ నందిని అబ్బగౌని ప్రతిష్టాత్మక నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఖతార్లోని భారతీయ దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం దోహా నగరంలోని ఐసీసీ అశోకా హాల్... ఆదర్శ అటవీశాఖాధికారి అశోక్ రావు.
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు) ఆదర్శ జిల్లా అటవీశాఖ అధికారిగా పూసాల అశోక్ రావు పేరొందారని టీ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ సమావేశ మందిరంలో వయో వృద్ధుల చట్టం పై అవగాహన సదస్సు, రిటైర్డ్ జిల్లా ఆటవీ శాఖ అధికారి 65 వ
ఈ... విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల జనవరి 10 ( ప్రజా మంటలు)విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తానని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలో 36 42 43 వార్డులలో 1 కోటి 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ
పట్టణంలో... కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల జనవరి 10 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను... వాసవి మాతా ఆలయంలో ఘనంగా లక్ష్మీ గణపతి హవనం
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో వాసవి మాత ఆలయంలో శనివారం లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారూ .ఆలయంలో కొద్ది రోజుల్లో నూతనంగా కృష్ణ శిలతో కూడిన బ్రహ్మసూత్ర శివలింగం, మేధా దక్షిణామూర్తి, వాసవి మాత ,శక్తి గణపతి, దాసాంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్టించరున్నారు. దీనికిగాను నాందిగా శ్రీ లక్ష్మీ... వనపర్తి జిల్లాలో ఏసీబీకి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి
వనపర్తి, జనవరి 10 (ప్రజా మంటలు):
వనపర్తి జిల్లాలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి బారిన పడటం కలకలం రేపింది. పౌర సరఫరాల శాఖ వనపర్తి జిల్లా మేనేజర్ కుంభ జగన్మోహన్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. సీఎంఆర్ (Custom Milled Rice) కేటాయింపు పేరుతో మిల్లు యజమానిని లంచం కోరిన కేసులో ఆయనను ఏసీబీ... దావోస్ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 10 (ప్రజా మంటలు):
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా... ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్లో కలకలం
లండన్ / అంతర్జాతీయ మార్కెట్లు జనవరి 10:
2026 సంవత్సరంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తొలి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. కమోడిటీ ఇండెక్స్లలో జరిగే వార్షిక పునఃసంఘటన (Index Rebalancing) కారణంగా బంగారం, వెండిలో $10 బిలియన్లకు పైగా విలువైన అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు... 