రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

On
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి జనవరి 09:.. . 
 ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ 
 వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు 
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో 
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం, 
 నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు,  సహస్రనామార్చనలు,  పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం,  వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి  నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి  సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం

ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది.  ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు  దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది.  ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున 
 శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.

వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం

శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో 
 ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార  పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ,   ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి,  అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.

ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు

 ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో  సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై  బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.

సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు

సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు,  జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య  సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
 బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల  ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు. 

ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం

దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై  సంబంధిత పాశురం గురించి వివరించారు.

Tags
Join WhatsApp

More News...

మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్

మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ మధిర నవంబర్ 24 (ప్రజా మంటలు): మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పని చేస్తున్న కె. చందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ఏసీబీ బృందం చందర్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ➤ భవన కార్మికుడు మృతి – ఇన్సూరెన్స్ మొత్తం బిల్లు కోసం...
Read More...

ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు...
Read More...

బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.

బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం  రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.    జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దగ్గరకు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రీయ లోకల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి...
Read More...

న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఐ  హైదరాబాద్ నవంబర్ 24(ప్రజా మంటలు)జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ  అనారోగ్యంతో  బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి...
Read More...

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌లో సంచలన వివరాలు వెల్లడి?

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌లో సంచలన వివరాలు వెల్లడి? హైదరాబాద్ నవంబర్ 24 (ప్రజా మంటలు): ఐబొమ్మ బెట్టింగ్ వెబ్‌సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రవి (ఐబొమ్మ రవి) అరెస్ట్ అనంతరం ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవిది చిన్నప్పటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ అని విచారణ అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడేందుకు తన స్నేహితుల ఫేక్ ఐడెంటిటీ కార్డులను వినియోగించినట్లు...
Read More...
Local News  Crime 

పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు 

పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):   బుగ్గారం మండలంలోని గోపులాపూర్ పల్లె ప్రక్రుతి వనం గంజాయి తో పట్టు బడ్డ యువకులు ఏ1 సురజ్ కుమార్,సం18  ఏ2. రాహుల్ కుమార్,బీహార్ రాష్ట్రం చెందిన  ఇద్దరు యువకులు  గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరీ వద్ద 60 గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని ఎన్డిపిఎస్ సెక్షన్...
Read More...
Local News 

గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించుకోవాలి 

గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించుకోవాలి  సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించు కోవాలని సికింద్రాబాద్‌డివిజన్‌సీనియర్‌సూపరింటెండెంట్, ఐపీఓఎస్‌అధికారిణి అనన్యప్రియ కోరారు. ఈమేరకు గాంధీ సూపరింటెండెంట్‌ప్రొఫెసర్‌వాణిని సోమవారం కలిసి పోస్టల్‌శాఖ అందిస్తున్న పోస్టల్‌ఖాతాలు, లైఫ్‌ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన తదితర సేవలను వివరించారు. ఎక్కువ వడ్డీ ఇచ్చే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్‌శాఖ అని పేర్కొన్నారు....
Read More...
Local News 

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న  ఆవుల సాయవ్వ

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న  ఆవుల సాయవ్వ   ఇందిరమ్మ ఇళ్లు గృహం ప్రవేశం చేసిన రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్,కలెక్టర్ సత్యప్రసాద్ (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 24  (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో బెస్తపల్లె వాడలో ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి, సోమవారం గృహప్రవేశం చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్...
Read More...
Local News 

గాంధీలో యాంటీ మైక్రోబయల్ పై అవగాహన 

గాంధీలో యాంటీ మైక్రోబయల్ పై అవగాహన  సికింద్రాబాద్,  నవంబర్ 24 (ప్రజా మంటలు):: గాంధీ మెడికల్ కాలేజ్‌, గాంధీ ఆసుపత్రి మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారం (WAAW) సోమవారంతో  ముగిసింది. నవంబర్‌ 18 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాయి.   ఈ సందర్భంగా సోమవారం 2024 బ్యాచ్‌ అండర్‌గ్రాడ్యుయేట్లు యాంటిబయాటిక్స్‌ సరైన వినియోగంపై స్కిట్‌...
Read More...
Local News 

రోడ్డుపైనే అక్రమ నిర్మాణం... ప్రజావాణిలో ఫిర్యాదు

రోడ్డుపైనే అక్రమ నిర్మాణం... ప్రజావాణిలో ఫిర్యాదు సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజా మంటలు): బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోలాక్పూర్ లో ఓ ఇంటి యజమాని( 6-4-43/1) ప్రధాన రహదారిని ఆక్రమించుకొని ఇంటి ముందు ఇనుప మెట్లను నిర్మించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం GHMC బేగంపేట డిప్యూటీ కమిషనర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇక్కడున్న నల్ల...
Read More...
Local News 

శరణఘోషలతో వంగరలో అయ్యప్ప స్వాముల సందడి

శరణఘోషలతో వంగరలో అయ్యప్ప స్వాముల సందడి అమలా కొండాల్ రెడ్డి దంపతుల సంప్రదాయ అయ్యప్ప పడిపూజ
Read More...

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్ 

ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్     జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసిన జగిత్యాల ఎలెక్ట్రికల్ డి ఈ  గా నూతనంగా నియామకం అయిన గంగారామ్ ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి శ్రీరామ్ భిక్షపతి దుమాల రాజ్ కుమార్...
Read More...