రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

On
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి జనవరి 09:.. . 
 ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ 
 వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు 
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో 
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం, 
 నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు,  సహస్రనామార్చనలు,  పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం,  వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి  నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి  సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం

ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది.  ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు  దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది.  ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున 
 శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.

వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం

శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో 
 ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార  పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ,   ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి,  అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.

ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు

 ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో  సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై  బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.

సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు

సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు,  జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య  సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
 బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల  ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు. 

ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం

దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై  సంబంధిత పాశురం గురించి వివరించారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్!

సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్! హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు): సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ నగరంలోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. ఆమెతో పాటు జాగృతి కార్యకర్తలు, హెచ్ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు...
Read More...

“మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

“మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)భారత రత్న , దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ చేయాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు .  అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా,మండల...
Read More...

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ _ఎమ్మెల్యే డా.సంజయ్

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ _ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల నవంబర్ 19(ప్రజా మంటలు)దేశ సమగ్రత కోసం,పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన ఉక్కుమహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ  జయంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిర చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు.ఎమ్మేల్యే మాట్లాడుతూదేశ...
Read More...

శ్రీ సత్య సాయిబాబా శతజయంతి సందర్భంగా పుట్టపర్తికి  ప్రధాని విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా  కలిసిన మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి

శ్రీ సత్య సాయిబాబా శతజయంతి సందర్భంగా పుట్టపర్తికి  ప్రధాని విచ్చేసిన సందర్భంగా మర్యాదపూర్వకంగా  కలిసిన మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పుట్టపర్తి నవంబర్ 19 ( ప్రజా మంటలు)శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవ వేడుకలలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన భారత దేశ   ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.. FCI Ap Director వనగొందివిజయలక్ష్మిబీజేపీ పార్టీ లో కష్టపడి...
Read More...
State News 

అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి

అంత్యక్రియలకు డబ్బులు లేక కొడుకుది దేహంతో 8 గంటలు స్మశానంలో కూర్చున్న తండ్రి స్వచ్ఛంద సేవా సంస్థ సాయం మహబూబ్‌నగర్, నవంబర్ 18 (ప్రజా మంటలు): మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఒక హృదయవిదారక సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. అంత్యక్రియల ఖర్చు కూడా చేయలేని దారిద్య్రం ఒక తండ్రిని 8 గంటలపాటు తన చిన్నారి మృతదేహంతో స్మశానంలోనే కూర్చోబెట్టింది. ఎంతో కష్టాల్లో కుటుంబం ప్రేమ్ నాగర్ ప్రాంతానికి చెందిన బాలరాజ్...
Read More...
National  Crime  State News 

లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్‌జీని ఏపీ ఎన్కౌంటర్‌లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ

లొంగుబాటు ప్రయత్నాల మధ్యే షాక్: మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్‌జీని ఏపీ ఎన్కౌంటర్‌లో హతమార్చినట్టు లడ్డా ధృవీకరణ హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు): మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల మావోయిస్టుల లొంగుబాట్లు వేగం పుంజుకోవడంతో, పైస్థాయి నాయకులకు మాత్రమే ప్రత్యేక రిహాబిలిటేషన్ సదుపాయాలు కల్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విరుద్ధ దిశగా భారీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బతీసే లొంగుబాటు జరగబోతోందని విశ్వసనీయ...
Read More...
National  Comment 

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన  (సిహెచ్.వి. ప్రభాకర్ రావు) బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు...
Read More...
National  State News 

పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు

పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు యశోదా ఆసుపత్రి వైద్య నిపుణుల అరుదైన విజయం
Read More...
Local News  Crime  State News 

సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు

సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో  మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిర్యాదు దారుడిని నుంచి రూఒక లక్ష లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మండల సర్వేయర్ కలువ కిరణ్ కుమార్, చైన్ మెన్ గా పనిచేస్తున్న మేకల వివరాలు...
Read More...
National  State News 

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్‌ సజ్జనార్

హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్‌ సజ్జనార్ “క్రమబద్ధమైన ఆన్‌లైన్‌ వేధింపుల ముఠా పని చేస్తోంది” — మహిళా జర్నలిస్ట్ లు ఫిర్యాదులు స్వీకరించిన సిటీ పోలీస్ కమిషనర్ — వీడియోలు, లింకులు అందించైనా జర్నలిస్టులు హైదరాబాద్‌ నవంబర్ 18 (ప్రజా మంటలు): మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ వి.సి....
Read More...
Local News  State News 

సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి 

సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి  ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం  రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత కుటుంబాల హాజరు హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):   శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుని వెళ్తున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్షత కొనసాగడం బాధాకరమని, సాంఘిక దురాచారాలపై సంఘటితంగా పోరాడాల్సిన       రాష్ట్ర...
Read More...
Local News 

డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు..

డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు.. సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు): డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా , నేరుగా మందులు కొనుక్కొని వేసుకోకూడదని వైద్య నిపుణులు సూచించారు. వరల్డ్ యాంటీబయాటిక్ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి  ప్రసంగించారు వివిధ రోగాల ట్రీట్మెంట్ కు...
Read More...