రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

On
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి జనవరి 09:.. . 
 ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ 
 వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు 
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో 
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం, 
 నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు,  సహస్రనామార్చనలు,  పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం,  వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి  నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి  సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం

ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది.  ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు  దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది.  ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున 
 శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.

వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం

శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో 
 ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార  పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ,   ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి,  అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.

ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు

 ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో  సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై  బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.

సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు

సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు,  జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య  సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
 బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల  ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు. 

ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం

దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై  సంబంధిత పాశురం గురించి వివరించారు.

Tags
Join WhatsApp

More News...

24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

24 గంటల్లో దారిదోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు జగిత్యాల నవంబర్ 30 (ప్రజా మంటలు)దారి దోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అరెస్ట్‌ చేసినట్లు    డీఎస్పీ రఘు చందర్‌ తెలిపారు.. శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్టణ శివారులోని గాంధీ నగర్ వద్ద  ... మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి  జగిత్యాల శివారులో గాంధీనగర్ వద్ద డీసీఎం వ్యాన్‌ పార్క్...
Read More...

కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

కొండగట్టు షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్    కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు)శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో మల్యాల మండలం కొండగట్టులోని సుమారు 30 దుకాణాలు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగగా ఆదివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదానికి జరిగిన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయం కటుంబానికి...
Read More...
Local News  Crime 

దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట 

దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున మల్లన్న పేట  దొంగ మల్లన్న జాతర బెట్టింగ్ టోకెన్స్ ద్వారా గ్యాంబ్లింగ్ (అందర్ బహార్) ఆట నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి  అతని వద్దనుండి నుండి 4000 నగదు తొ పాటు మూడు బెట్టింగ్ టోకన్ స్వాధీనం చేసుకుని కేసు...
Read More...
National  State News  International  

కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్‌లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు

 కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్‌లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు స్టాక్‌టన్ (కేలిఫోర్నియా), నవంబర్ 30: అమెరికా కేలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్‌టన్ నగరంలో ఉన్న ఒక బ్యాంక్వెట్ హాల్‌లో, శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నాలుగు మంది మృతి, పది మంది గాయపడిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటనపై సాన్ జోక్విన్ కౌంటీ శెరీఫ్ కార్యాలయం అత్యవసర ప్రకటన...
Read More...
Local News 

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు

కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు కరీంనగర్, నవంబర్ 30 (ప్రజా మంటలు): కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేడు నగరంలోని పలువురు ప్రముఖులను, వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు రాజకీయ నేతలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. అంజన్ కుమార్‌ను కలిసిన వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,...
Read More...
State News 

జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం

జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25న నిజామాబాద్‌లో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి చేశారు — మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్–హన్మకొండ, నల్గొండ, మెదక్,...
Read More...
State News 

కొండగట్టు అగ్నిప్రమాదంపై కల్వకుంట్ల కవిత ఆందోళన

కొండగట్టు అగ్నిప్రమాదంపై కల్వకుంట్ల కవిత ఆందోళన హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు): కొండగట్టు బస్టాండ్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 35 దుకాణాలు దగ్ధమై, చిరువ్యాపారులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్న విషయం మనసును కలచివేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క జాతర సందర్భంలో భక్తుల రద్దీ దృష్ట్యా పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన బొమ్మలు,...
Read More...
Local News  State News 

జగిత్యాల కొండగట్టు అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి, ప్రజాప్రతినిధులు

జగిత్యాల కొండగట్టు అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి, ప్రజాప్రతినిధులు కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో, బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈరోజు దగ్ధమైన దుకాణాల వద్ద సందర్శించారు. బాధిత...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు దుస్తుల  పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు దుస్తుల  పంపిణీ సికింద్రాబాద్,  నవంబర్ 30 (ప్రజా మంటలు):  హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న సంచార జాతులు మరియు నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ అండగా నిలిచింది. వారిని గుర్తించి, వారికి అవసరమైన దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లను ఆదివారం పంపిణీ చేశారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి  అవసరమైన ఔషధాలను అందించారు. ప్రమాదాలకు గురైన వారికి...
Read More...
Local News  Spiritual  

లక్ష్మీపూర్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తవింశతి వార్షికోత్సవం

లక్ష్మీపూర్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయ సప్తవింశతి వార్షికోత్సవం పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్పరసన్ దావ వసంత సురేష్ జగిత్యాల రూరల్, నవంబర్ 30 (ప్రజా మంటలు): జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన 27వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
Read More...
State News 

పవర్ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు – ప్రభుత్వ విధానాలకే వ్యతిరేకం: కొప్పుల ఈశ్వర్

పవర్ ప్రాజెక్టులకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు – ప్రభుత్వ విధానాలకే వ్యతిరేకం: కొప్పుల ఈశ్వర్ జగిత్యాల (రూరల్), నవంబర్ 30 (ప్రజా మంటలు): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న విద్యుత్ విధానాలు, పెరుగుతున్న ఖర్చులు మరియు భారీ అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఇటీవల...
Read More...
State News 

కొండగట్టు భారీ అగ్నిప్రమాదం – కోట్లలో ఆస్తి నష్టం, 30 కుటుంబాల జీవితం చిద్రమ్

కొండగట్టు భారీ అగ్నిప్రమాదం – కోట్లలో ఆస్తి నష్టం, 30 కుటుంబాల జీవితం చిద్రమ్ కేంద్ర మంత్రి సంజయ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ లో సంప్రదింపు మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ₹5 వేల ఆర్థిక సహాయం కొండగట్టు, నవంబర్ 30 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వద్ద నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఘోర అగ్నిప్రమాదం...
Read More...