రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి జనవరి 09:.. .
ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ
వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం,
నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు, సహస్రనామార్చనలు, పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం, వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.
పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం
ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున
శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.
వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం
శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో
ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి, అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.
ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు
ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.
సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు
సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు, జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు.
ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం
దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై సంబంధిత పాశురం గురించి వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ విమానాశ్రయంలో ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు
400 లకు వందలకు పైగా విమాన రాకపోకలు ఆలస్యం, కొన్ని రద్దు.
ఇప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాని డిల్లీ విమానరాకపోకలు
హైదరాబాద్, నవంబర్ 07, ప్రజా మంటలు:
దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) ఈ రోజు మధ్యాహ్నం భారీ సాంకేతిక లోపం (Technical Glitch) సంభవించింది.... చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత
– బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత... హైదరాబాద్లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం ఆది బజార్–2025’
గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్: దివ్య దేవరాజన్
హైదరాబాద్, నవంబర్ 7 ( ప్రజా మంటలు):
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.... ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు
జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు):
రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–... అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్
రాజ్యాంగాన్ని... మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్... ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ
హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు:
ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం... వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది... ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్
సికింద్రాబాద్, నవంబర్07 (ప్రజామంటలు)::రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణలు తక్షణం అమలు చేయాలని ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.మూర్తి డిమాండ్ చేశారు.శుక్రవారం ముషీరాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో హేమలత అధ్యక్షతన జరిగిన యూనియన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రభుత్వ... సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం 150 వసంతాల వందేమాతరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బాన్ని పురస్కరించుకొని స్కూల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ కల్నల్ ఎంఎస్.కుమార్ ను స్కూల్ హెడ్మాస్టర్ సిస్టర్ గ్రేసీ, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఏ.క్రిస్టినా నిర్మల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు... TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ
TV5 CEO D.H.V.S.S.N. Murthy పై సినీనటుడు ధర్మ మహేష్ ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు ఎక్స్టోర్షన్, బ్లాక్మెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. హైకోర్టు మూర్తి క్వాష్ పిటిషన్ను కొట్టివేసి విచారణ కొనసాగించమని ఆదేశించింది. 