రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

On
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి జనవరి 09:.. . 
 ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ 
 వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు 
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో 
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం, 
 నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు,  సహస్రనామార్చనలు,  పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం,  వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి  నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి  సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం

ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది.  ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు  దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది.  ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున 
 శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.

వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం

శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో 
 ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార  పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ,   ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి,  అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.

ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు

 ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో  సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై  బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.

సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు

సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు,  జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య  సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
 బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల  ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు. 

ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం

దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై  సంబంధిత పాశురం గురించి వివరించారు.

Tags

More News...

Local News  State News 

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ పక్కదారి పట్టిన నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ సికింద్రాబాద్  జూలై 09 (ప్రజా మంటలు): ఆషాడ బోనాల జాతరను ఆయా ఆలయాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఆయా ఆలయాలకు అందించే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈమేరకు ఇటీవల బన్సీలాల్ పేట డివిజన్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి బోనాల జాతర చెక్కులు...
Read More...
Local News  State News 

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల, జులై 08 (ప్రజా మంటలు) : కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర...
Read More...
Local News 

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ

పద్మారావునగర్ లో  శ్రీసాయి ధన్వంతరీ సేవ సికింద్రాబాద్, జూలై 08 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి వ్యాధి నివారణ ఆశ్రమ్ లో జరుగుతున్న శ్రీసాయి సప్తాహం లో భాగంగా మంగళవారం శ్రీసాయి ధన్వంతరీ సేవ ను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా సద్గురు శ్రీశ్రీసాయి కుమార్ జీ  సాయిబాబా సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ్ లో...
Read More...
Local News 

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థాన హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. మే 14 నుంచి జూలై 7 వరకు హుండీల ద్వారా భక్తులు సమర్పించిన మొత్తం కానుకలు రూ 87,24,602 ఆదాయం వచ్చిందని  ఆలయ ఈవో పి.మహేందర్ గౌడ్ తెలిపారు. జనరల్ హుండీల ద్వారా రూ86,18, 047 ఆదాయం...
Read More...
Local News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం  సికింద్రాబాద్ జూలై 08 (ప్రజామంటలు): అమెరికా లో ఆగస్ట్ నెలలో నిర్వహించే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ 25 వసంతాల సెలబ్రేషన్స్ కు రావాలని టీడీఎఫ్ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వాన లేఖ అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్న టీడీఎఫ్ ను మంత్రి...
Read More...
National  Local News  State News 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  జూలై 17న నిర్వహించబోయే రైల్ రోకో ట్రైలర్ మాత్రమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పి జీవో ఇప్పించాలి -  న్యూ ఢిల్లీ జూలై 08:...
Read More...
Local News 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ 

పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్  .మెట్ పల్లి జులై 7 ( ప్రజా మంటలు) మెట్ పల్లి మండలం పెద్దపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్  ఆకస్మిక తనిఖీ చేశారు.. పాఠశాల పరిసరాలు,తరగతి గదులను పరిశీలించారు..   పాఠశాల విద్యార్థులు హాజరు వివరాలు తెలుసుకున్నారు.   విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన సీజనల్...
Read More...
Local News 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్    మేడిపల్లి/ భీమారం జులై 7 (ప్రజా మంటలు)   పలు అభివృధి నిర్మాణాల సీసీ రోడ్స్ డబుల్ రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , తో కలిసి పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి భీమారం...
Read More...
Local News 

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం   జగిత్యాల జులై 17 ( ప్రజా మంటలు) ఆషాడ మాసం పురస్కరించుకొని పట్టణంలోని పద్మశాలి కిట్టి పార్టీ సభ్యులు స్థానిక ఉమా శంకర్ గార్డెన్స్ లో మెహందీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో అలరించారు. అనంతరం అల్పాహారంతో కార్యక్రమం ముగిసిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు.
Read More...
Local News 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్          జగిత్యాల జులై 7 ( ప్రజా మంటలు)జిల్లా లో జరుగు రోడ్డు ప్రమాదాల నివారణకు    జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  , అదనపు కలెక్టర్ లత  ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత  కమిటీ సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎస్పీ   మాట్లాడుతూ ...  రోడ్డు ప్రమాదాల నివారణకు...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జులై 7 (ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 మంది   అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో...
Read More...
Local News  State News 

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలి కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ జూలై 07: ఇటీవల కాలంలో వరుసగా జరుగుతోన్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయని,విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారని,కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని. క్రమేణ వృత్తి...
Read More...