రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

On
రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

రేపటి వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన ధర్మపురి

(రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి జనవరి 09:.. . 
 ధర్మపురి క్షేత్రంలో, వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్చ వాలకు శుక్ర వారం నిర్వహించేందుకై అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ 
 వేడుకలకై వైకుంఠ ద్వార దర్శదార్థం అధిక సంఖ్యలో  భక్తులు రానున్నందున దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు 
బొజ్జా రమేశ శర్మ, అర్చకులు నంబి శ్రీనివాసా చార్య, నేరెళ్ల శ్రీనివాసా చార్య, అర్చకులు, సిబ్బంది సహకారంతో 
ఏర్పాటు గావించారు. శుక్ర వారం ప్రాతః కాలంలో 2.30 గంటల నుండి లక్ష్మి సమేత యోగానంద, ఉగ్ర నారసింహ, శ్రీవెంకటేశ్వర ప్రధానాలయాలలో క్షీరాభిషేకం, 
 నివేదన, 4గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదిక పై స్థానిక దైవాలను ఆసీసుల గావించి, ప్రత్యేక పూజలు, నివేదనలు,  సహస్రనామార్చనలు,  పుష్పవేదికపై ప్రత్యేక పూజలు, సప్త హారతుల సమర్పణ, మంత్రపుష్పం,  వేదఘోష, మహదాశీర్ వచనాలు, ప్రాతఃకాలమున 5 గంటలకు మంగళ వాద్యాల మధ్య ధర్మపురి శ్రీ మ
ఠాధిపతి పరమహంస పరివ్రాజకా చార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామిచే వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారం తెరవడం, 8గంటలకు ఉత్చవ మూర్తుల సేవల ఉరేగింపు కార్యక్రమాల నిర్వహణకై విశేష ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి  నాడు ఔత్సాహిక భక్తులు తమ గోత్రనామాదు లతో స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొనే వారు. 2516 రూపాయలు చెల్లించినచో. భక్తులకు క్షీరాభిషేకం, వైకుంఠ ద్వార విశేష పూజ, కళ్యాణ జరిపించి స్వామి శేష శేష వస్త్రము ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని, 1516 చెల్లిస్తే అభిషేకం విశేష పూజ, కళ్యాణం, 1116 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజ. కళ్యాణం, 516 చెల్లిస్తే క్షీరాభిషేకం, విశేష పూజలు జరిపిస్తామని, స్వయంగా పాల్గొ నజాలని భక్తులకు పోస్టుల ప్రసాదం పంపటమతుందని ఈ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7,00 గంటల నుండి  సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పరమ పవిత్రం - వైకుంఠ ఏకాదశి పర్వ దినం

ప్రతి మాసమందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై గృహస్తులకు బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా, ఉప వాసాద్యాచరణను విధించ బడినది.  ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మైనది కావునే ఏకాదకి హరి వాసరముగా కొనియాడ బడుతున్నది. అందు  దనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా పిలువ బడు తున్నది.  ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 'ముక్కోటి ఏకాదశిగాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక వైకుంఠ ఏకాదశిగాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమున 
 శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థాన ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసికోవడం క్షేత్రంలో అనాదిగా ఆదరిస్తున్న సత్సాంప్రదాయం.

వైభవంగా ధనుర్మాసోత్సవ వేడుకలు ప్రారంభం

శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవ వేడుకలు, వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనుర్రాశిలో 
 ప్రవేశించిన సందర్భంగా సాంప్రదాయ ఆచరణ ప్రకారం శ్రీనృసింహ దేవస్థానంలోని ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మి సమేత నరసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల ఆలయాలలో షోడశోపచార  పూజలు గావించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ,   ఆలయాల అర్చకులు శ్రీనివాసా చార్య, రమణాచార్య, విజయ్, సంతోష్ కుమార్, అశ్విన్, మధు సూదనాచార్య, మూర్తి,  అర్చక పౌరోహితులు దేవాలయాలలో ధనుర్యాసోత్సవ పూజలను నిర్వహించారు. పాశురాన్ని అర్చకులు ప్రవరించారు.

ధర్మపురి గోదావరికి భక్తజన వీరాజనాలు

 ప్రాచీన పుణ్యతీర్థమైన ధర్మపురి క్షేత్రం గురు వారం భక్త జన సంద్రమైంది. ఇటీవలి కాలంలో వచ్చే షష్టి వారాలలో గోదావరి స్నానాలకై భక్తులు ఏటా రావడం పరిపాటియైన క్రమంలో  సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు గోదావరీ నదీస్నానాలకై  బస్సులు, ప్రైవేటు వాహనాలలో తరలి వచ్చారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో మహా సంకల్ప పూజలొనరించి, గోదావరి మాతను ఆర్పించారు. మహిళలు వాయినాలను సమర్పించు కున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాలు ఆచరించి, భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, మొక్కులు తీర్చుకు న్నారు. వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు.

సీతారామాలయంలో ధనుర్మాసోత్సవ వేడుకలు

సీతారామాలయంలో ధనుర్మాస వేడుకలు
ఘనంగా నిర్వహించారు. పావనియైన గోదావరి తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ అధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు గావించారు. వంశ పారంపర్యంగా ఆర్చకులు,  జ్యోతిష్యులు, దివంగత తాడూరి శివరామయ్య ప్రారంభించి, రాష్ట్రేతర ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో 'శిష్య  సాంప్రదాయాన్ని కలిగిన తాడూరి
 బాలకృష్ణ శాస్త్రి కొనసాగించిన ఉత్సవాలను ఏతా ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆలయ అనవాయితి. అర్చకులు రఘునాథ శర్మ, బలరామ శర్మ, మోహన శర్మ, విశ్వనాధ శర్మ ఉష:కాల  ధనుర్మాన ప్రత్యేక పూజాదులను నిర్వహించారు. 

ఆకట్టుకున్న తిరుప్పావై ప్రవచనం

దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, సంస్కృత ఆంధ్ర భాషా పండితులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య నెల రోజులపాటు ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల సందర్భంగా గురువారం ధార్మిక కార్యక్రమంలో తిరుప్పావై  సంబంధిత పాశురం గురించి వివరించారు.

Tags
Join WhatsApp

More News...

National  International   Economy  

ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్‌పై ఎలాంటి ప్రభావం ఎంత?

ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్‌పై ఎలాంటి ప్రభావం ఎంత? ట్రంప్ మళ్ళీ 10 నుండి 15% సుంకాల పెంపు ప్రభావం - ఒక విశ్లేషణ  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ పెంపు నిర్ణయం భారత్‌కు గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) ట్రంప్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలపై విధించదలచుకున్న టారిఫ్‌ను...
Read More...
Local News  State News 

హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్...
Read More...
Local News 

తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం

తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). హైదరాబాద్ 21 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :  నివాస గృహాల ఇంధన అవసరాల కోసం డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్న క్లీన్-టెక్ ఎనర్జీ సంస్థ 'రెంజి’ (Rengy) ప్రైవేట్ లిమిటెడ్'. నేడు (21 ఫిబ్రవరి 2026) తన ప్రతిష్టాత్మక RENGY యాప్‌ను ప్రారంభించింది తెలంగాణ మాజీ మంత్రి...
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్    జగిత్యాల, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు—జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో—ఎమ్మెల్యేను కలిసి...
Read More...
National  Crime  State News 

కర్ణాటక రాజకీయాల్లో సంచలం: బీజేపీ ఎమ్మెల్యే డా చంద్రూలమానీ లంచం కేసులో అరెస్ట్

కర్ణాటక రాజకీయాల్లో సంచలం: బీజేపీ ఎమ్మెల్యే డా చంద్రూలమానీ లంచం కేసులో అరెస్ట్ బెంగళూరు ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు): కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే చంద్రూలమానీ లంచం కేసులో అరెస్టయ్యారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల కేటాయింపుకు గాను రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన...
Read More...
State News 

స్కూల్ విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు SA-II పరీక్షలు

 స్కూల్ విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు SA-II పరీక్షలు హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి, తరగతులు 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-II (SA-II) పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి 20, 2026 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరీక్షల టైమ్‌టేబుల్‌ను SCERT విడుదల చేసింది.ఏప్రిల్ 10,...
Read More...
Local News  Crime 

ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద మృతి

ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద మృతి ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు-దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాశెట్టి గణేష్‌కు చెందిన వ్యవసాయ భూమిలో ఎర్రోళ్ల లింబాద్రి (51), తండ్రి గంగారం, నివాసం మొగిలిపేట (మల్లాపూర్ మండలం) మృతదేహం లభ్యమైంది. మృతుడి తలకు తీవ్ర గాయాలు ఉండటంతో...
Read More...
National  Comment  International   Economy  

ట్రేడ్ లేదా ట్రాప్? జపాన్ మార్కెట్లలో ‘టకైచి ప్రభావం’పై పెట్టుబడిదారుల సందేహాలు

ట్రేడ్ లేదా ట్రాప్? జపాన్ మార్కెట్లలో ‘టకైచి ప్రభావం’పై పెట్టుబడిదారుల సందేహాలు టోక్యో ఫిబ్రవరి 21:  జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో సానయే టకైచి ఘన విజయం సాధించడంతో, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకాయి. ముఖ్యంగా నిక్కీ 225 సూచీ ఒక్క వారంలోనే సుమారు 5 శాతం పెరగడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళన కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు...
Read More...
National  State News 

జాతీయ స్థాయిలో ‘ఏఐ కౌన్సిల్’, ప్రత్యేక ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ ఏర్పాటు చేయాలి.— ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

జాతీయ స్థాయిలో ‘ఏఐ కౌన్సిల్’, ప్రత్యేక ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ ఏర్పాటు చేయాలి.— ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు): కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో ప్రత్యేకంగా ఒక “ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అలాగే జాతీయ...
Read More...
National  International   Economy  

అమెరికా సుప్రీం కోర్ట్ షాక్ – ట్రంప్ టారిఫ్ యుద్ధం కొత్త మలుపు

అమెరికా సుప్రీం కోర్ట్ షాక్ – ట్రంప్ టారిఫ్ యుద్ధం కొత్త మలుపు వసూలు చేసిన టారిఫ్ నిధులు తిరిగి ఇచ్చేయాలా? హైదరాబాద్ ఫిబ్రవరి 21:    అమెరికా వాణిజ్య విధానాల్లో కీలక మలుపుగా, అమెరికా సుప్రీం కోర్ట్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్‌లకు చట్టపరమైన బ్రేక్ వేసింది. జాతీయ భద్రత పేరుతో దిగుమతులపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ఏకపక్షంగా వినియోగించలేడని కోర్ట్ స్పష్టం చేసింది. ఇది...
Read More...
State News 

ఇంటర్మీడియట్ బోర్డు ను ముట్టడించిన జాగృతి విద్యార్థి నాయకులు 

ఇంటర్మీడియట్ బోర్డు ను ముట్టడించిన జాగృతి విద్యార్థి నాయకులు  హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు): నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు.అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు కొమ్ముకాస్తూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విద్యార్థి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు....
Read More...
Local News 

బిసి రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే   జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి

బిసి రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే   జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి జగిత్యాల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు)    స్థానిక సంస్థలలో  రిజర్వేషన్ల తర్వాతనే  జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలకు వెళ్ళాలి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బీసీ నాయకులు అన్నారు . రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బిసిలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి, 42% రిజర్వేషన్లను కల్పించకుండానే సర్పంచ్...
Read More...