ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్

On
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి - డీటీఓ శ్రీనివాస్

సూర్య గ్లోబల్ పాఠశాలలో  జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
జగిత్యాల జనవరి 09: 
జగిత్యాల జిల్లా కే౦ద్రం లోని సూర్య గ్లోబల్ పాఠశాలలో జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లడుతూ జిబ్రాక్రాసింగ్ భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియామాలు, ప్రాంతీయ చిత్రాలు చిన్నారులు చాలా బాగా చిత్రీకరించి, అవగాహన కల్పించడం ఆనందదాయకమన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ S.I . మల్లేష్ మాట్లడుతూ హెల్మెట్ ధరించడం గురించి మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవడం , మద్యం త్రాగి బండి నడపడం వలన జరిగే ప్రమాదాలను గురించి | తెలుపుతూ, ట్రాఫిక్ నియామాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపు తున్న వారిని అభినందించాలన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించాలన్నారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు, కుటుంబ సభ్యులు తమ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందన్నారు. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిం చారు.  ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని, అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని చెప్పారు. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు. ఈ విషయాలను ప్రతి వాహనదారులు గమనించాలని సూచించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు పూలు అందించి అభినందించారు. పాఠశాల డ్రైవర్ లకు హెల్మెట్ లను బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో చిత్రాలను ప్రదర్శించిన చిన్నారులను మరియు అధ్యాపక బృందాన్ని
అభినందించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై మల్లేశం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, డైరక్టర్స్ హరిచరణ్ రావు, మౌనికరావు, రజిత, అసిస్టెంట్  వెహికల్ ఇన్స్పెక్టర్లు రామారావు, ప్రమీల, అభిలాష్, రియాజ్, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  International   Crime 

హాంకాంగ్ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి

హాంకాంగ్ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం – 13 మంది మృతి    హాంకాంగ్ నవంబర్ 26: హాంకాంగ్ నగరంలోని ఒక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో జరిగిన భయంకర అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాదం భవనం 10వ అంతస్తులో ప్రారంభమై క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించింది. రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించి చిక్కుకున్నవారిని బయటకు...
Read More...
Local News 

జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం

జగిత్యాలలో BRS దీక్ష దివస్ సన్నాహక సమావేశం జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న జరగనున్న దీక్ష దివస్ కార్యక్రమం సందర్భంగా సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ...
Read More...
Local News  State News 

బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై  కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు

బీసీలకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ – రిజర్వేషన్లపై  కవిత ఆరోపణలు, తీవ్ర విమర్శలు హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలను ఉద్దేశపూర్వకంగా మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణనలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కలు చూపించడంతో బీసీ రిజర్వేషన్లు భారీగా తగ్గిపోయాయని కవిత...
Read More...
Local News  Crime 

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు – ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీలు

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు – ఇబ్రహీంపట్నంలో వాహన తనిఖీలు ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 (ప్రజా మంటలు దగ్గుల అశోక్) స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో భాగంగా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గండి హనుమాన్ చెక్‌పోస్ట్‌లో బుధవారం నుంచి పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ మాట్లాడుతూ—ఎలాంటి సరైన...
Read More...
Local News  Spiritual  

స్కందగిరి  ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి

స్కందగిరి  ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి సికింద్రాబాద్  నవంబర్ 26 (ప్రజా మంటలు ) సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారి సన్నిధిలో తమ...
Read More...
Local News  State News 

నవంబర్ 28న జగిత్యాలలో వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు

నవంబర్ 28న జగిత్యాలలో వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు జగిత్యాల, నవంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (పాత బస్ స్టాండ్)లో ఈ నెల నవంబర్ 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వృద్ధుల కోసం ప్రత్యేక జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలు, కన్సల్టేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా...
Read More...
Local News 

కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి

కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి రాయికల్ నవంబర్ 26 (ప్రజా మంటలు): రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత 5–6 రోజులుగా వడ్లు తూకం జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రైతులు మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. జీవన్ రెడ్డి స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి...
Read More...
National  State News 

VIT యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం – క్యాంపస్‌లో ఉద్రిక్తత

VIT యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం – క్యాంపస్‌లో ఉద్రిక్తత సిహోర్ (భోపాల్) నవంబర్ 26 (ప్రజా మంటలు):  మధ్యప్రదేశ్ లోని సిహోర్ లో ఉన్న VIT యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు మంగళవారం రాత్రి తీవ్రరూపం దాల్చాయి. హాస్టల్ సౌకర్యాలు, ఫీజు సమస్యలు, క్యాంపస్‌ నియమావళిపై విద్యార్థుల అసంతృప్తి ఒక్కసారిగా ఉధృతమై, పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయటకు వచ్చి నిరసనలు చేపట్టారు. కొంతమంది విద్యార్థులు కోపోద్రిక్తులై వస్తువులు...
Read More...

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు  రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు,...
Read More...

ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు): సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి అలియాస్ “ఐబొమ్మ రవి”కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. రవిని గత వారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. సోమవారం పోలీసు కస్టడీ గడువు ముగియడంతో అతన్ని కోర్టులో హాజరుపరచగా, జ్యూడిషియల్ రిమాండ్‌కు ఆదేశాలు...
Read More...

ఎన్నికల ప్రవర్తన నియమావలికి లోబడి విధులు నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ఎన్నికల ప్రవర్తన నియమావలికి లోబడి విధులు నిర్వహించాలి  -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్       జగిత్యాల నవంబర్ 26( ప్రజా మంటలు) ఎన్నికల ప్రవర్తన నియమాలికి లోబడి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మీ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరియు నామినేషన్ పత్రాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం...
Read More...

కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో పోలీస్ కళాబృందం అవగాహన

కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో పోలీస్ కళాబృందం అవగాహన (అంకం భూమయ్య) గొల్లపల్లి, నవంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ ఉదయ్‌కుమార్ ముందుండి చేపట్టారు. పోలీస్ కళాబృందం విద్యార్థులకు పోలీసు చట్టాలు, షీ టీమ్...
Read More...