జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) :
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
- పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
- CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.
- పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు.
- ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 786 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
- పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు.
- ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు.
- దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
- అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు.
- అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
- అజ్ఞాత వ్యక్తుల కు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు.
- ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం RSI కృష్ణ ,హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు అజర్ యాకూబ్, లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.
సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి చాలా ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్ అజర్ యాకూబ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రోడ్డు భద్రతకు ప్రాధాన్యత – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు.
యూసుఫ్గూడలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవింగ్పై... మండలాలు–జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి కమిషన్ :ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
👇
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్ను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కమిషన్ ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదికను అసెంబ్లీ ముందు... గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఆర్ట్స్ ఎగ్జిబిషన్ గొప్ప కళాఖండాల కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. కళాకారుల ప్రతిభ స్లాఘనీయమని ఆయన కొనియాడారు.
సోమవారం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని డా. చిన్నారెడ్డి ప్రారంభించారు.... డీఏ ప్రకటన కంటితుడుపు చర్యే
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన డీఏ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్) అధ్యక్షుడు వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు.
సోమవారం బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజేటీఎఫ్ కోశాధికారి ఘనపురం దేవేందర్, రాష్ట్ర నాయకులు ఎస్.కే. మస్తాన్తో కలిసి మాట్లాడారు.
2023... మాజీ మంత్రి తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి : కోట నీలిమ
సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు ):
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. తలసాని అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.
తలసాని వ్యాఖ్యలకు నిరసనగా బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.... సీతాఫల్మండిలో సంక్రాంతి ముగ్గుల సంబరాలు
సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజామంటలు):
భారతీయ జనతా పార్టీ సీతాఫల్మండి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు రాచమల్ల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు కనికట్ల హరి, మాజీ అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు మాట్లాడుతూ… ప్రజలు ముగ్గులు, పిండి వంటకాలు, పతంగులతో పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారని తెలిపారు.
ముఖ్య అతిథిగా... గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం
సికింద్రాబాద్, జనవరి 12 ( ప్రజా మంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యంత హైరిస్క్ శస్ర్త చికిత్సను చేసిన వైద్యులు రోగి ప్రాణాలను కాపాడారు. వివరాలు ఇవి..ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (56) గత 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 6న అర్ధరాత్రి గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. రోగికి గుండె సంబంధిత... లక్ష్మణ్ కుమార్ ప్రశ్నలకు జాబితాతో సమాధా నం ఇచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, జనవరి 12 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ప్రెస్మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన హయాంలో ధర్మపురి మున్సిపాలిటీ ఏర్పాటు, డబుల్ రోడ్లు, హైవే అభివృద్ధి, ఇంటర్నల్ రోడ్లు, బ్రిడ్జిల... TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
జిల్లా: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు వోడ్నాల రాజశేఖర్ రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వోడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై అంకితభావంతో పనిచేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం... మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులుగా బీర్పూర్ తిరుపతి
గొల్లపల్లి జనవరి 12 (ప్రజా మంటలు):
బుగ్గారం మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నికలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ సమక్షంలో సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి.మండలంలోనీ సర్పంచులు సమావేశమై మండల ఫోరం అధ్యక్షులుగా సర్పంచ్ బీర్ పూర్ తిరుపతి... ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి
ఇబ్రహీంపట్నం జనవరి 12(ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి హిందూ సేన ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకట్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా
ఈ... 