జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) :
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
- పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
- CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.
- పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు.
- ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 786 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
- పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు.
- ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు.
- దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
- అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు.
- అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- పెరిగిన సాంకేతిక పరిజ్ఞానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు దండుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడమే మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
- అజ్ఞాత వ్యక్తుల కు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు.
- ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం RSI కృష్ణ ,హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు అజర్ యాకూబ్, లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.
సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి చాలా ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ , CEIR టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్ అజర్ యాకూబ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన
కవిత రామంతపూర్ ఇందిరానగర్లోని చాకలి... ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక కార్యక్రమ క్రతువు నిర్వహించారు.
సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,... పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ కె డి సి... బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్పై సస్పెన్షన్
కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
బెంగాల్లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది.
హుమాయున్ కబీర్... బీహార్ BJP ఎమ్మెల్యే ప్రమోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య
ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
పాట్నా డిసెంబర్ 04:
బీహార్లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,... ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)రూరల్ మండలము చర్లపల్లి, బీర్పూర్ మండలం గోండు గూడెం గ్రామాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా... హైదరాబాద్లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి ఒక 13 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ను కుదిపేసింది. ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ కేసులో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మరియు బాలిక పెద్దమ్మ అరెస్టయ్యారు.
నిందితులు:బండి... MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ &మానిటరింగ్ కమిటీ మరియు సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే... రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్పై ఏసీబీ సోదాలు
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాస్ పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నడుమ ఏసీబీ (ACB) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
సమాచారం ప్రకారం, రంగారెడ్డి... గొల్లపల్లి మండల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన డీఎస్పీ రఘు చందర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా జగిత్యాల డిఎస్పి రఘుచందర్ గొల్లపల్లి కేంద్రంలో నామినేషన్ ఎలక్షన్ కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, సిబ్బందికి తగు సూచనలను సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు... బాలుడిపై వీధి కుక్కల దాడి – స్వప్రేరితంగా కేసు నమోదు చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
హయత్నగర్లో జరిగిన 8 ఏళ్ల మూగబాలుడు ప్రేమచంద్పై వీధికుక్కల దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) స్వప్రేరితంగా కేసు నమోదు చేసింది. గౌరవ ఛైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో SR No.3907/2025 గా నమోదు చేసిన ఈ కేసు ప్రజా భద్రత,... ప్రజా భద్రతకు హోమ్ గార్డుల సేవలు అమూల్యము ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)
రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన హోమ్ గార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా నేడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటడం జరిగింది.
ఈ సందర్భం గా ఎస్పి మాట్లాడుతూ .. శాంతిభద్రత లు, ట్రాఫిక్, క్రైమ్ నివారణ, కమ్యూని టీ పోలీసింగ్, విపత్తు నిర్వహణ... 