వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
క్షేత్ర ప్రాధాన్యత
అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.
ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు
శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ, భక్తాంజనేయ, మార్కండేయ, అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

"ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు, అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి, రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి, ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
జగిత్యాల: జూలై 29 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు రాజేష్కు జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుడికి ₹6,500 జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.అదేవిధంగా బాధిత... నంది మేడారం పంప్హౌస్లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం
కరీంనగర్, జూలై 29 (ప్రజా మంటలు):
కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలుఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్హౌస్లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల... కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలుకొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు):
గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,... పదోన్నతి పొందిన ఎస్.ఐ వెంకటేశ్వర్లకు ఎస్పీ శుభాకాంక్షలు
జగిత్యాల జూలై 29 ( ప్రజా మంటలు)టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించి ఎస్.ఐ గా పదోన్నతి పొందిన వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెంకటేశ్వర్లుకు ఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.... చదువునే ఆయుధంగా మలుచుకొని ఉన్నత స్థితికి ఎదగాలి. జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్.
జగిత్యాల, జులై 29(ప్రజా మంటలు) చదువునే ఆయుధంగా మలుచుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ కమిటీ చైర్మన్, అదనపు కలెక్టర్ బి. రాజాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని... నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి - కల్వకుంట్ల కవిత
సిరిసిల్ల జూలై 28(ప్రజా మంటలు):సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన పోలీసుల దాష్టీకం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితుడు గంధం గోపాల్ కుటుంబాన్ని, ఇతర బాధితులను పరామర్శించిన ఆమె, గత ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ కోరారు. ఘటనకు బాధ్యులైన... హైద్రా గొప్ప పని చెస్తుంది - దాని చీఫ్ ను మార్చెదె లేదు - పీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 28:
హైడ్రా (HYDRA) వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అక్రమ నిర్మాణాలు, చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. హైడ్రా ప్రభుత్వ తీసుకొచ్చిన అత్యంత పెద్ద పరిపాలనా సంస్కరణల్లో ఒకటని పేర్కొన్నారు.సీఎం... జగిత్యాల వైద్య రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థ అభివృద్ధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మల్యే డా. సంహ పాల్గొని, జిల్లా వైద్య రంగానికి సంబంధించిన పలు కీలక... సినీ నటి పావలా శ్యామల కన్నుమూత.. తెలుగు చిత్రసీమలో విషాదం
హైదరాబాద్, జూలై 28 (ప్రజా మంటలు):
ప్రముఖ సీనియర్ సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (73) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురికావడంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.... రైతు బజార్ లోనే కూరగాయల విక్రయాలు జరపాలి. టౌన్ సిఐ కరుణాకర్
జగిత్యాల జూలై 27 (ప్రజా మంటలు)
కూరగాయలు విక్రయించే రైతులు రైతు బజార్ లోపలే తమ కూరగాయలను విక్రయించాలని టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. రైతు బజార్ ఎదుట రహదారికి రెండు వైపులా కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రజల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం టౌన్ సిఐ కరుణాకర్ ట్రాఫిక్... బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు):
బోర్నపల్లి–జగన్నాథ్పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ను హైదరాబాద్లో... ఎల్ నినో తో ఆందోళనలో ఉన్న రైతులను ఎరువుల బ్లాక్ మార్కెట్తో మరింత దోచుకుంటున్న ప్రభుత్వం. - దావ వసంత సురేష్.
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348422113.
జగిత్యాల 27 జూలై (ప్రజా మంటలు) :
జిల్లాలోని రైతులు యూరియా డిఏపి మరియు ఇతర ఎరువులు అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన జగిత్యాల... 