వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
క్షేత్ర ప్రాధాన్యత
అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.
ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు
శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ, భక్తాంజనేయ, మార్కండేయ, అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

"ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు, అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి, రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి, ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షునికి వివాహ వార్షికోత్సవ శుభకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జిఓలు
కరీంనగర్ ఫిబ్రవరి 22 ( ప్రజా మంటలు)సన్మానించిన జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి. కరీంనగర్ లో ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మరియు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ వివాహ వార్షికోత్సవం సందర్బంగా జగిత్యాల టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి అధ్వర్యంలో... దేవాదుల భూసేకరణకు జూన్ 2లోపు ₹600 కోట్లు –రేవంత్ రెడ్డి
ములుగు జిల్లా (ప్రజా మంటలు):ములుగు జిల్లాలోని జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం (JCRDLIS)లో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు ₹600 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోపు అన్ని అంచనాలను ప్రభుత్వ ఆమోదానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దేవాదుల పంప్... మల్యాల వరద కాలువలో కారు పడి తిర్మణి రమణ మృతి – పెగడపల్లిలో విషాదం
జగిత్యాల జిల్లా (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెగడపల్లి మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ తిర్మణి రమణ మల్యాల వరద కాలువలో కారుతో సహా మృతిచెందిన స్థితిలో కనిపించారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... భీమ్రాజుపల్లి ఉపసర్పంచ్ భర్తను పరామర్శించిన మంత్రి సతీమణి కాంతా కుమారి
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):గొల్లపల్లి మండలంలోని భీమ్రాజుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొమ్మెన రాజమ్మ భర్త బొమ్మన భీమయ్య అనారోగ్యానికి గురికావడంతో, విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కాంతా కుమారి భీమయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆర్థిక సాయం అందించారు.... పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థికి ₹5,000 ఆర్థిక చేయూత
గొల్లపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):
ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి అజ్మీరా రాజేశ్వరి సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చదువు మరియు క్రీడలపై అపార ఆసక్తితో కృషి చేస్తున్న రాజేశ్వరి, హైదరాబాద్లోని Koti Women's College లో... అనాథపీలలకు ఆర్థిక సహాయం అందించిన సూరజ్ శివశంకర్
జగిత్యాల, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):
అనారోగ్య కారణాలతో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో అనాధలైన పిల్లలకు రూ.12,000 ఆర్థిక సహాయం అందించి సామాజిక సేవకులు మానవత్వాన్ని చాటారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకులు సూరజ్ శివ శంకర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ సహాయాన్ని అందించారు.
పెద్దపల్లి మండలం కొత్తపెళ్లి గ్రామానికి... ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా
జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు);
నిరుపేద ఓసీ (ఓపెన్ కేటగిరీ) – ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ప్రజల రాజ్యాంగ, చట్టబద్ధ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఓసీ (ఎస్డబ్ల్యూఏఎఫ్) ఇతర కులాల సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య – ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ మహా... నిరాశ్రయుల కోసం 295వ అన్నదాన కార్యక్రమం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలో నిరాశ్రయులు, అనాథలు, సంచారజాతుల కోసం ఆదివారం 295వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతినెల రెండవ, నాల్గవ ఆదివారాల్లో జరిగే ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు రహదారులపై అవసరమైన వారికి ఆహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డా.... వాట్సాప్ నంబర్ 8712441912 - సత్వర విద్యుత్ సేవలకు వాట్సాప్ చాట్ బాట్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తన వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది.
ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా... ట్రంప్ గ్లోబల్ టారిఫ్ 15%: భారత్పై ఎలాంటి ప్రభావం ఎంత?
ట్రంప్ మళ్ళీ 10 నుండి 15% సుంకాల పెంపు ప్రభావం - ఒక విశ్లేషణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ పెంపు నిర్ణయం భారత్కు గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) ట్రంప్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలపై విధించదలచుకున్న టారిఫ్ను... హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్... తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 21 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :
నివాస గృహాల ఇంధన అవసరాల కోసం డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందిస్తున్న క్లీన్-టెక్ ఎనర్జీ సంస్థ 'రెంజి’ (Rengy) ప్రైవేట్ లిమిటెడ్'.
నేడు (21 ఫిబ్రవరి 2026) తన ప్రతిష్టాత్మక RENGY యాప్ను ప్రారంభించింది తెలంగాణ మాజీ మంత్రి... 