వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
క్షేత్ర ప్రాధాన్యత
అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.
ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు
శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ, భక్తాంజనేయ, మార్కండేయ, అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.
"ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు, అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి, రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి, ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
