వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు
(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
క్షేత్ర ప్రాధాన్యత
అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.
ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు
శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ, భక్తాంజనేయ, మార్కండేయ, అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

"ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు, అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి, రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి, ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
TPUS జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నిక కావడంతో, నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డా.... ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల. డిసెంబర్ 28, (ప్రజా మంటలు):
ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. టీచర్స్ భవన్లో పీఆర్టీయూటీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి... ఆమనగల్లో జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత
నగర్ కర్నూలు, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
నగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జనావాసాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆమన్ గల్... మెట్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి, ఒకరి పరిస్థితి విషమం
మెటుపల్లి డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా... గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు
సికింద్రాబాద్, డిసెంబర్ 27 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మెట్రో స్టేషన్, ఎంసీహెచ్ బస్ షెల్టర్ ప్రాంతాల్లో అక్రమంగా పార్కింగ్ చేసిన 12 వాహనాలకు ఫైన్ వేసి, అక్కడి నుంచి తొలగించారు. అలాగే ఏండ్ల తరబడిగా గాంధీ మెట్రో స్టేషన్, ఆసుపత్రి మెయిన్ గేట్, ఫుట్ పాత్ ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఉన్న యాచకులను
3... డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు హనుమండ్ల జయశ్రీ వినతి
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన మౌలిక... పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు
నాగర్ కర్నూల్, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆమె, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
వట్టెం రిజర్వాయర్,... జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు... అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు)అర్బన్ మండల అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ నుజగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ... అల్లిపూర్ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపిన తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి... అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భక్తి పాటను, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
భక్తి పాట రూపకల్పనలో కీలకంగా పనిచేసిన... సారంగాపూర్లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్
సారంగాపూర్, డిసెంబర్ 27 – ప్రజా మంటలు:
సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలోజు వేణుగోపాల్ – శోభ దంపతులను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ... 