వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

On
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)

 తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో,  అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

క్షేత్ర ప్రాధాన్యత

 అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు  ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.

ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు

శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ,  భక్తాంజనేయ, మార్కండేయ,  అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి  ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

        IMG-20250107-WA0349

 "ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు,  అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం  మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి,  రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి,  ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.

Tags
Join WhatsApp

More News...

State News 

కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు గుంటూరు నవంబర్ 09 (ప్రజా మంటలు): మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిలవడానికి కంచి పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...

25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్...
Read More...
Local News 

జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం

జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం జగిత్యాల నవంబర్ 09 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ శ్రీమతి మద్దెల సరోజన గారు సాహిత్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె ప్రతిభ, కృషి, కవితా వైభవానికి ఇది గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ...
Read More...

మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట

మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట జగిత్యాల నవంబర్ 9 ( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో   ఆంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి, విగ్రహాల పున: ప్రతిష్ట సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ర సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్ ఉదయం...
Read More...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా...
Read More...
Local News  State News 

ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం

ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు): రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్ లో వాహనంలో సంచరిస్తూ వివిధ ప్రాంతాలలో ఫుట్ పాత్ ల మీద ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ తమ 288 వ వారం అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా వారికి ఫుడ్డు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందచేశారు....
Read More...
State News 

గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం

గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం రాష్ర్టంలోని 200 మంది పీజీ వైద్య విద్యార్థుల హాజరు సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు):    గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచింగ్‌ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్‌ అకాడెమిక్‌ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని విద్యార్థులకు...
Read More...
State News 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు): తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను...
Read More...
National 

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన : పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ...
Read More...
Local News  State News 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం  సికింద్రాబాద్ లో భారీ శాంతి ర్యాలీ సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజా మంటలు):  ఛత్తీస్‌గఢ్‌ జోహార్ పార్టీ నేత అమిత్ భగేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సింధీ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. భగేల్ సింధీ సమాజాన్ని "పాకిస్తానీలు"గా అభివర్ణించడం, వారి ఆరాధ్యదేవుడైన భగవాన్ ఝూలేలాల్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సమాజం తీవ్రంగా స్పందించింది....
Read More...

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్

బీహార్ సమస్తీపూర్‌లో రోడ్డుపై VVPAT పర్చీలు — ఇద్దరు సిబ్బంది సస్పెండ్ సమస్తీపూర్ (బీహార్), నవంబర్ 9: బీహార్ ఎన్నికల సమయంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలోని సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారిపై భారీ సంఖ్యలో VVPAT పర్చీలు (ఓటు స్లిప్స్) పడివున్నాయి. ఈ సంఘటన బయటపడటంతో ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి, రెండు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసింది. సమాచారం ప్రకారం, ఈ...
Read More...

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్

భారత దేశంలో ఎవ్వరూ అహిందువులు కాదు” — ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ సంఘ్ అధికారానికి కాదు, సమాజ సేవకే పనిచేస్తుంది బెంగళూరు, నవంబర్ 9:రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే అని వ్యాఖ్యానించారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా ఇదే నేలలో పుట్టిన హిందూ పూర్వీకుల సంతతులు అని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన “100...
Read More...