వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

On
వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు

(రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)

 తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. జనవరి 10న శుక్ర వారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ ఉత్సవ వేడుకలకై, వైకుంఠ ద్వార దర్శనార్ధం, భక్తులు రానున్నందున దేవాలయాలను, వైకుంఠ ద్వారాన్ని వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమైనారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండి తులు బొజ్జా రమేశ్ శర్మ ఆచార్యత్వంలో,  అర్చకులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

క్షేత్ర ప్రాధాన్యత

 అవిభక్త జిల్లా కేంద్రమైన కరీంనగర్ కు  ఉత్తరాన 71 కి.మీ, నూతన జిల్లా కేంద్రమైన జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కి.మీ. దూరాన, శ్రీలక్ష్మీనరసింహ, శ్రీరామలింగేశ్వర మందిరాలు, మసీదు పక్కపక్కనే కలిగి, చర్చిలూ నిర్మితాలై, వైష్ణవ, శైవ, ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా, సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, పవిత్ర గోదావరి తీరాన ఉంది క్షేత్రరాజం. దక్షిణ భారతావని లోనే అతి పెద్దదైన కోనేరు, అపురూపమైన యమ ధర్మ రాజాలయం, తైమూర్త్య నిలయంగా, వివిధ ఆలయాలు, వైవిధ్యములైన కుండములతో విరాజిల్లుతున్నది సనాతన పుణ్యతీర్థం.

ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు

శ్రీయోగానంద, ఉగ్రనారసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర, శ్రీవేణుగోపాల, యమధర్మరాజ, శ్రీఆంజనేయ ఆలయాలు దేవస్థానం అధీనంలో ఉండగా, సత్యవతి, మహాలక్ష్మి, సంతోషి మాత, గౌతమేశ్వర, శ్రీరామ, దత్తాత్రేయ, మహాలక్ష్మీ, దుర్గ,  భక్తాంజనేయ, మార్కండేయ,  అక్కపెల్లి రాజేశ్వర, శ్రీసాయి బాలాజీ, అయ్యప్ప, సీతా రామచంద్ర (లక్ష్మీ నరసింహ కాలనీ) ఆలయాలూ, పలు శివ పంచాయతనాలు, బ్రహ్మ పుష్కరిణి, శ్వేతవరాహ తీర్ధం, సత్యవతి, బ్రహ్మ, వశిష్ట, పాల కుండాలు వాటివాటి  ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.

        IMG-20250107-WA0349

 "ధనురాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశీ తిథౌ: త్రిం షత్ కోటి సురై: సాకం, బ్రహ్మ వైకుంఠ మాగత:" అసురుల హింసలకు తాళలేని సురులు, తమ కష్టాలను వైకుంఠ నాధునికి విన్నవింప వేడుకోగా, సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్య దినాన వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహా విష్ణువు దివ్య దర్శనం గావించారు. ఈ నేపథ్యంలో భక్తులు ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో వైకుంఠ ద్వారం నుండి స్వామి వారలను దర్శించు కోవడం ఆనవాయితీ. శుక్రవారం ప్రాత: కాలము (ఉదయాత్ పూర్వం) 2:30 గం.లకు శ్రీలక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు విశేష క్షీరాభిషేకములు, నివేదన వేదమంత్ర పుషములు,  అనంతరం ప్రాతఃకాలమున 4.00 గంటలకు వైకుంఠ ద్వారము ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేయించి ముప్పురు స్వాములకు ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు, వివేదనలు, హారతులు, మంత్ర పుష్పం, వేదఘోష, మహదాశీర్వచనములు, 5.00 గం.లకు మంగళ వాయిద్యముల మధ్యన, వేద మంత్రములతో ధర్మపురి శ్రీ మఠం  మఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరమహంస పరి వ్రాజకాచార్యులు సచ్చితానంద సరస్వతి మహా స్వాముల కరకమలములచే వైకుంఠ ద్వారము తెరిచే కార్యక్రమాలు, 7గంటల నుండి 11వరకు శేషప్ప కళా వేదిక పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలి,  రాజ గోపురములకు, అన్ని ఆలయములకు విద్యుత్ దీపాలంకరణ, పూలదండలతో అలంకరణ చేశారు. స్థానిక పోలీస్ శాఖ వారి సహ కారంతో పోలీస్ బందోబస్తు, అవసరమగు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఎసి, ఈఓ సంకటాల శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ ఆచార్యత్వంలో, అర్చకులు, సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

వైకుంఠ ద్వార దర్శన పూజ, ద్వారాన్ని తెరవ నున్న ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతీ స్వామి,  ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రమణ, భానుప్రసాద్, కవిత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించి ఇప్పటికే ఆహ్వానాలు పలికారు.

Tags

More News...

Local News 

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత సారంగాపూర్ జూన్ 30 (ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన పెంబట్ల కురుమ సంఘం సభ్యులు.    సారంగాపూర్ మండల పెంబట్ల గ్రామంలో బీరయ్య గుడి అభివృద్ధి పనుల నిమిత్తం సిజిఎఫ్ నిధులు 12 లక్షలు మంజూరు కాగా పెంబట్ల కుర్మ సంఘ సభ్యులకు 12ఈ...
Read More...
Local News 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం. 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.  (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జూన్ 30: క్యాన్సర్ వ్యాధితో  బాధపడుతున్న ఓ నిరుపేద  బాలుడి వైద్య ఖర్చులకోసం ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.13 లక్షలు విరాళాలు అందించి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, గూడూరు గ్రామానికి చెందిన మద్దిరాల మనోహర్, సరిత దంపతుల  కుమారుడు రిత్విక్...
Read More...
Local News 

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ జూన్ 30(  ప్రజా మంటలు    ) మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12 లక్షల 48 వేల రూపాయల విలువగల చెక్కులను,31 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 31 లక్షల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ...
Read More...
Local News 

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా విద్యాధికారి రాము,

 మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా విద్యాధికారి రాము, గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు): ఉద్యోగ విరమణ పదవికి మాత్రమే పదవి విరమణ అనంతరం సేవా కార్యక్రమాలు చేయవచ్చని జిల్లా విద్యాధికారి రాము అన్నారు గొల్లపల్లి మండల కేంద్రంలో భూస జమునా దేవి గెజిటెడ్ హెడ్మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట ఇన్చార్జ్ మండల విద్యాధికారి గొల్లపల్లి, ఉద్యోగ విరమణ సన్మాన...
Read More...
Local News 

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు):  కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో  ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య కు ప్రయత్నించిన ఘటన సోమవారం ధర్మపురి పట్టణంలో కలకలం రేపింది వ్యక్తి ఆత్మహత్యయత్నానికి సంబందించిన సమాచారం అందుకున్న ధర్మపురి పోలీస్ సీఐ  రామ్ నర్సింహా రెడ్డి హుటాహుటిన తన సిబ్బంది తో...
Read More...
Local News 

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి  ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి  జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం శాంతి యుత దీక్షలు చేపట్టారు.  తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఈ దీక్షా శిబిరాన్ని తెలంగాణ ఉద్యమ జెఎసి నాయకులు చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్...
Read More...
Local News 

వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన గొల్లపల్లి జూన్ 30  (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్,మహాత్మా జ్యోతిభ పూలే పాఠశాలనను రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సతీమణి కాంతా కుమారి  సందర్శించారు. పాఠశాలలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి మరియు నాయకులతో కలిసి మంత్రి సతీమణి...
Read More...
Local News 

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు)పట్టణ 35వ వార్డు లో 13 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  భజన మందిరం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయటం జరిగింది.ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి.తడి పొడి చెత్త వేరు...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.    జగిత్యాల జూన్ 30( ప్రజా మంటలు)               ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ బి.సత్య...
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జగిత్యాల జూన్ 30    (   ప్రజా మంటలు) అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యమని  జిల్లా   ఎస్పీ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల...
Read More...
Local News 

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు)జిల్లా కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం లోషెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జగిత్యాల జిల్లా ఆద్వర్యం లో అదనపు కలెక్టర్ బీఎస్ లత  అధ్యక్షతనఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు  పై పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల జూన్ 30(ప్రజా మంటలు) పట్టణములోని శ్రీ వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. .అనంతరం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.,ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ...
Read More...