సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం

On
సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం

IMG_20241226_115626సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం తెలంగా ప్రధానంగా సినిమాలు రావాలు. టూరిజం పెంచాలి
 

హైదరాబాద్ డిసెంబర్ 26:

సినిమా పెద్దలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సుహృద్భావ వాతావరణంలో ముగిసిన సమావేశం. ఎవరి వాదనలు వారు చెప్పుకొన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని సిఎం, సినిమా ఇండస్ట్రీకి సహకరించాలని సిని పెద్దలు  కోరారు. బెంఫిట్ షోల విషయంలో సంక్రాంతి వరకు నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తుంది.

బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌(సీసీసీ)లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిని ప్రముఖులు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ సీసీసీకి చేరుకున్నారు. అలాగే దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట సైతం వచ్చారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ, మైత్రీ రవి, నవీన్,దిల్ రాజ్ నేతృత్వంలో మెుత్తం 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు..

, సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు 

టాలీవుడ్‌ ప్రముఖులతో చర్చల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొన్ని ప్రతిపాదనలు చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో సినీ పరిశ్రమ సహకరించాలని ఆయన కోరారు. సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణానికి వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తెలంగాణ చేపట్టిన కులగణన సర్వేలోనూ సినీ హీరోలు పాల్గొనాలని ఆయన చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని, బెనిఫిట్‌ షోలు, స్పెషల్ టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా చర్చించిన అంశాలు

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన టాలీవుడ్ ప్రముఖులు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనతో ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్‌తో మాట్లాడుతున్నారు. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు వంటి అంశాలపైనా చర్చసాగుతోంది. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీటవేసే సినిమాలకు ప్రోత్సాహకాలపైనా చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు అంశంపైనా ప్రధానంగా చర్చ సాగుతోంది.


 

Tags
Join WhatsApp

More News...

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి    జగిత్యాల డిసెంబర్ 26(ప్రజా మంటలు)రూరల్ మండల్ తక్కళ్లపెళ్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కచ్చు ముని రాజు , వార్డ్ సభ్యులు నరపాక రాజేష్ ,నాయకులు వడ్లూరి హరీష్, విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణిప్రవీణ్ ని స్వగృహంలో మర్యాదపూర్వక కలువగా వారిని శాలువతో...
Read More...

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్        జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు) భారతీయ నాగరిక విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన  మృతి చెందారు. విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు. జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు...
Read More...

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు): విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష...
Read More...
National  State News 

ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం

 ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం అహ్మదాబాద్ డిసెంబర్ 26: గుజరాత్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాకు సమీప ప్రాంతమే భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత సుమారు 3.8 నుంచి 4.2గా నమోదైంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం...
Read More...
Local News  State News 

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్‌రావు(80)  అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మాజీ...
Read More...
Local News  Crime  State News 

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు నంద్యాల డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి...
Read More...

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ.. . ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు) శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2...
Read More...

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి  -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్    జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక...
Read More...
Local News  Crime 

ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు)  : మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్‌పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన...
Read More...
Local News  State News 

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు): వచ్చే ఏడాది జరగనున్న ఎస్‌ఐఆర్‌, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):  నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన...
Read More...
Crime  State News 

కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం

కర్ణాటక బస్సు ప్రమాదంలో 17 మంది సజీవదహనం బెంగళూరు డిసెంబర్ 25: కర్ణాటకలో ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 1:30–2:00 గంటల మధ్య చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలో ప్రయాణికులతో ఉన్న బస్సు మంటల్లో చిక్కడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. అధికారులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read More...