సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం

On
సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం

IMG_20241226_115626సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం - బెన్ఫిట్ షోలపై సంక్రాంతికి ఓ నిర్ణయం తెలంగా ప్రధానంగా సినిమాలు రావాలు. టూరిజం పెంచాలి
 

హైదరాబాద్ డిసెంబర్ 26:

సినిమా పెద్దలతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సుహృద్భావ వాతావరణంలో ముగిసిన సమావేశం. ఎవరి వాదనలు వారు చెప్పుకొన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని సిఎం, సినిమా ఇండస్ట్రీకి సహకరించాలని సిని పెద్దలు  కోరారు. బెంఫిట్ షోల విషయంలో సంక్రాంతి వరకు నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తుంది.

బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌(సీసీసీ)లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిని ప్రముఖులు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ సీసీసీకి చేరుకున్నారు. అలాగే దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట సైతం వచ్చారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ, మైత్రీ రవి, నవీన్,దిల్ రాజ్ నేతృత్వంలో మెుత్తం 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు..

, సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు 

టాలీవుడ్‌ ప్రముఖులతో చర్చల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొన్ని ప్రతిపాదనలు చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో సినీ పరిశ్రమ సహకరించాలని ఆయన కోరారు. సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణానికి వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తెలంగాణ చేపట్టిన కులగణన సర్వేలోనూ సినీ హీరోలు పాల్గొనాలని ఆయన చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని, బెనిఫిట్‌ షోలు, స్పెషల్ టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా చర్చించిన అంశాలు

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన టాలీవుడ్ ప్రముఖులు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనతో ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్‌తో మాట్లాడుతున్నారు. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు వంటి అంశాలపైనా చర్చసాగుతోంది. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీటవేసే సినిమాలకు ప్రోత్సాహకాలపైనా చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు అంశంపైనా ప్రధానంగా చర్చ సాగుతోంది.


 

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు

గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): గోర్ బంజారా సమాజానికి చెందిన రెండు వందల ఏళ్ల జనజీవన సంఘర్షణ, చరిత్రను తొలిసారిగా నవలరూపంలో తీసుకురావడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ రచించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక...
Read More...
Local News  State News 

పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు

పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ సచివాలయంలో వరుసగా కీలక భేటీలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం, శాసనసభ్యుల ఆరోగ్య పథకం అమలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సవివరంగా చర్చించారు. మొదటిగా పురపాలక పరిపాలనా శాఖ...
Read More...

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్ జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు)    జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఫిబ్రవరి  మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం ఈ...
Read More...

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్          జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) దావ వసంత సురేష్ శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు దావ వసంత సురేష్  మాట్లాడుతూ....మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య...
Read More...

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని...
Read More...
Local News 

పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్

పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్ జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మారలేదని చెబుతున్నట్లయితే, రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సవాల్ విసిరారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్యలు...
Read More...

నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు

నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు మక్తల్ డిసెంబర్ 20 (ప్రజా మంటలు): నలభై సంవత్సరాలుగా గ్రామస్తుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న వనజమ్మ కుటుంబానికే ఆ గ్రామ సర్పంచ్ పదవిని కట్టబెట్టడం విశేషం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఈ కుటుంబ సభ్యులే బాధ్యతలు చేపట్టుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఐక్యతతో ముందుకు...
Read More...

Today's cartoon

Today's cartoon Today's Cartoon
Read More...
Local News 

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.      

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.       జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం 2024...
Read More...

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్ 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్  కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు): కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్‌తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి...
Read More...

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన...
Read More...