22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

బై-నంబర్లు ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తాం.. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన

On
22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

 

హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కోర్ అర్బన్‌ (CURE) ప్రాంత పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ, కోర్టు కేసుల కారణంగా కొన్ని సర్వే నంబర్లలోని మొత్తం భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలిపారు. “ఏదైనా కారణంగా మీ భూమి 22-ఏలో చేరి ఉంటే, కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవు. కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను పక్కనపెట్టి మిగిలిన భూములకు బై-నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని సీఎం స్పష్టం చేశారు.

కూకట్‌పల్లిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి

కూకట్‌పల్లి ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి శ్రీధర్‌బాబును సీఎం కోరారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణతో పాటు పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అవసరమైన పరిశ్రమలను తీసుకురావాలని సూచించారు.

గత ప్రభుత్వ పాలనతో ప్రస్తుత ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ఏవీ నిలిపివేయలేదని, అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.

రాష్ట్రంలో 3.28 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి, విద్య కోసం వెళ్లేవారు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

మహిళా సంఘాలకు ప్రాధాన్యం

ఆర్టీసీకి ఇప్పటికే రూ.12 వేల కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించి రూ.2,500 కోట్ల వడ్డీ చెల్లించామని చెప్పారు. మహిళా సంఘాల పేరిట 1,000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చామని తెలిపారు.

అలాగే 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం కల్పించామని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో మూడున్నర ఎకరాల స్థలంలో ఇందిరా మహిళా బజార్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం

ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువైన 11 ఎకరాల భూమిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.

నగరంలో నిరుపేదలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే వారికి సొంత ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదల కోసం నిర్మించే ఇళ్లకు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని మంత్రులకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

పేదల సొంతింటి కల నెరవేర్చుతాం

పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నూటికి నూరు శాతం అండగా ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు. తొలి విడతలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్న పేదలకు ఇళ్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన పేదలకు కూడా మంచి ఇళ్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

గతంలో ఒక పని కోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రజల సౌలభ్యం కోసం సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు.

“మీ అభివృద్ధి కోసం నిలబడతాను. పది మందికి మేలు చేయాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాను. మంచి చేయడానికి చిత్తశుద్ధి, మంచి ఆలోచన అవసరం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు రోజుకు 18 గంటలు పనిచేసే శక్తిని దేవుడు ఇచ్చారు. అందుకు ప్రజలు ఆశీర్వదించాలి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.

Tags
Join WhatsApp

More News...

State News 

22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి    హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ...
Read More...
Local News 

ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ వేడుక

ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ వేడుక రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో  చిలుకమర్రి పరాంకుశాచార్య  సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/-  భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.    ఈ సందర్భంగా...
Read More...
Local News 

హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ

హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.    అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త...
Read More...
Local News 

పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు  తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత 

పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు  తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత  జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని...
Read More...
Local News 

ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి 

ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి  జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు...
Read More...
Local News 

పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు 

పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు     జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార...
Read More...
Local News 

వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు

వెల్గటూర్‌లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,...
Read More...
State News 

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 13: హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్...
Read More...
Local News  Crime 

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్ 

బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్     బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:  జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా...
Read More...
Local News 

కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

 కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జగిత్యాల  ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు, జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు.  600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు....
Read More...
Local News  State News 

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు): అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్...
Read More...
Local News 

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక టౌన్‌హాల్‌ నుంచి తహసీల్‌ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌...
Read More...