జిల్లా కలెక్టర్ మరియు ఉద్యోగుల పై దాడిని ఖండించిన జెఎసి చైర్మన్ మారం జగదీశ్వర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు)
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐ.ఏ.ఎస్ మరియు కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి మరియు ఇతర అధికారులపై లగిచర్ల గ్రామంలో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు జగిత్యాల జిల్లా సముదాయము లో జే.ఏ.సీ ఆద్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరసన తెలుపడం జరిగింది.
తదుపరి జగిత్యాల కు విచ్చేసిన తెలంగాణ ఉద్యోగ జెఎసి చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ..... వికారాబాద్ కలెక్టర్ మరియు సిబ్బందిపై జరిగిన దాడి చాలా బాధాకరమని, ప్రభుత్వం ద్వారా ఫార్మా కంపెని కొరకు భూసేకరణ కొరకు వెళ్లిన ఉద్యోగులపై దాడి చేయడం చాలా బాధాకరమని ఇట్టి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలిపినారు.
ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి దిగడం వలన ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తాయి కనుక ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే దోషులను శిక్షించాలని కోరినారు.
టిఎన్జిఓ జిల్లా కార్యదర్షి మిర్యాల నాగేందర్ రెడ్డి, ట్రెసా అద్యక్షులు యం.డి. వకీల్, పెన్షనర్ల సంఘం హరి అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏఒ హన్మంతరావు, పిఆర్టియు అద్యక్షులు బోయిన్పల్లి అనందరావు, టిజిఒ సహద్యక్షులు రవిబాబులు మాట్లాడుతూ.... వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై మరియు రెవెన్యూ ఉద్యోగులపై జరిగిన దాడి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని మరియు ఉద్యోగుల భద్రత ను ప్రశ్నించే విధంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకు పోవడమే కాకుండా, ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించడం జరుగుతుంది ఇట్టి చర్యను ఖండించినారు.
ఇట్టి కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓస్ మరియు జే.ఏ.సీ తరఫున కరీంనగర్ అద్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాగి శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు, టిజిఒ జిల్లా కార్యదర్షి మామిడి రమేష్ టీఎన్జీవో నాయకులు అమరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, షాహిద్ బాబు, రవిచంద్ర, రవీందర్, మహమూద్, రాజశేఖర్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, హరి ప్రసాద్, భువనేశ్వర్, కుమారస్వామి, సురేందర్, భాస్కర్, శ్రీనివాస్, మురళి, చంద్రిక, మమత, శైలజ, విజయలక్మి, అర్చన, నాగరాజు, సురేందర్ నాయక్, పూర్ణచందర్, ఆనంద్,రవి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రయ్య, ముజాహిద్ ఖాన్, అరుణ, అజీం, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ వేడుక
రాయికల్ ఆగస్టు 15 (ప్రజా మంటలు)రాయికల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చిలుకమర్రి పరాంకుశాచార్య సంస్మరణ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమంలో పరాంకుశ ఆచార్య తనయుడు అడ్వకేట్ మదన్మోహన్ రాయికల్ సరస్వతి శిశు మందిర్ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1,11,111/- భవన నిర్మాణ కమిటీకి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా... హరిహరాలయంలో మాతలచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం ఉంజల్ సేవ
జగిత్యాల ఆగస్టు 14లోక కళ్యాణార్థం పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ సామూహిక పారాయణం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు.
అంతకుముందు గణపతి గౌరీ దేవతల పంచామృత అభిషేకము నిర్వహించి శ్రీ లలిత అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో షోడశ ఉపచార పూజలు నిర్వహించారు. శ్రీ సూక్త... పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప పెన్షన్లు ఇవ్వడం లేదు తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు)రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్లకు పలుమార్లు దరఖాస్తులు తీసుకోవడమే తప్ప ఇవ్వడం లేదని ఆరోపించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయిందని... ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
జగిత్యాల ఆగస్టు 14 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీతా కార్మికులకు ఇచ్చిన హామీల అమలు చేయాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సుయాత్ర చేరుకుంది. జగిత్యాల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ బస్సు... పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివునికి పంచామృత అభిషేకాలు
జగిత్యాల ఆగస్ట్ 13( ప్రజా మంటలు)పవిత్రమైన శ్రావణమాసాన్ని పురస్కరించుకొని పరమశివుని మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ప్రతి ఏటా లాగే శ్రావణమాసం సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయపద్ధంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తొలుతగా గణపతి ఉపనిషత్తులతో గణపతి పూజ, అనంతరం నారాయణ ఉపనిషత్తులతో శ్రీ సీతారామచంద్రుల పరివార... వెల్గటూర్లో 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు
వెల్గటూర్, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యం,... హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13:
హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమురం భీమ్... బీర్ పూర్ లో ఎసిబి దాడులు - రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన గిర్ధావర్
బీర్ పూర్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, ప్రజా మంటలు, ఆగస్ట్ 13:
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.లంచం తీసుకుంటున్న రెవెన్యూ శాఖ గిర్ధావర్ రాహుల్ ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా... కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జగిత్యాల ఆగస్టు 13 : ప్రతినిధి, ప్రజా మంటలు,
జగిత్యాల పట్టణంలోనీ కరీంనగర్ డైరీ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురు వారం తనిఖీలు చేశారు. 600 ఐస్ క్రీములు ఏప్రిల్ మాసంలోని తేదీ తయారీ ఉండగా ఫ్రీజర్ సరిగా పనిచేయక ఐస్ క్రీములు ఫంగస్ తో పాటు మెల్ట్ కావటంతో డైరీ నిర్వాహకులను ప్రశ్నించారు.... అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి
జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్... హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జగిత్యాలలో ఘనంగా తిరంగా ర్యాలీ
జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
జగిత్యాల పట్టణంలోని స్థానిక టౌన్హాల్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్... అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్, ఆగస్టు 13 (ప్రజా మంటలు):
అప్పుల బాధతో నిజామాబాద్లో ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నరేష్ (38), భార్య మేఘన (34), పిల్లలు అయాన్ష్ (9), మిథున్ (7)తో కలిసి నివసిస్తున్నాడు.... 