అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం. - ధర్మపురి అరవింద్ ఎంపీ,నిజామాబాద్

On
అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం. - ధర్మపురి అరవింద్ ఎంపీ,నిజామాబాద్

 (సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).                                                                                                       జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు) : 

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని దిశ చైర్మన్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు.

గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్మన్ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జరిగింది.జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అడ్డూరి లక్ష్మణ్ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డి లతో కలిసి చైర్మన్ కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ శాఖలకు వచ్చే నిధులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిస్వార్థపరంగా పనిచేస్తూన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు.

దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన, పరిష్కార విషయాలను 3 మాసాలకు సమీక్షించుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు స్వఛ్చ భారత్ కింద బాత్ రూమ్ లకు ప్రాధాన్యత కల్పిస్తూ కొత్త వాటికి ప్రతిపాదనలు ఇవ్వకుండా మరమ్మతులకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన సూచించారు. జగిత్యాల జిల్లాను స్మార్ట్ సిటీలో భాగం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇందులో భాగంగా సమావేశంలో అమృత్ పథకం , సమగ్ర శిక్ష అభియాన్ నేషనల్ హైవేస్ గ్రామీణ సడక్ యోజన నేషనల్ హెల్త్ మిషన్ ఆవాస్ యోజన సెంట్రల్ ఫండ్ ద్వారా వివిధ రోడ్డు ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం మెట్రిక్ స్కాలర్షిప్లు మల్టీ సెక్యులర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేబర్ డిపార్ట్మెంట్ మైనారిటీ స్కూల్ నేషనల్ లైట్ మిషన్ స్వచ్ఛభారత్ పీఎం సమ్మిది పై రివ్యూ చేయడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వం అందించే నిధులను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని చైర్మన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు ఆదేశించారు.

స్వచ్చ భారత్ పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఉపాధి హామీ, విద్యుత్ , మిషన్ భగీరథ, జాతీయ రహదారులు,తదితర అంశాలపై సమీక్షించారు.

అనంతరం ముందుగా జిల్లాలోని ఆర్మూర్ మంచిర్యాల ఎన్ 63, జగిత్యాల డివిజన్లో కోరుట్ల మెట్పల్లి జరుగుతున్న నాలుగు వరుసల రోడ్డు పనులను త్వరిగతన చెయ్యాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఈ జి ఎస్ నిధుల కింద జిల్లాలో మంజూరైన రోడ్లు బ్రిడ్జిల్ని దమ్మన్నపేట కాచారం రోడ్డుని పూర్తి చేయాలని తెలిపారు. అమృత పథకం కింద జిల్లాలో మొత్తం జరుగుతున్న ప్రాజెక్టు వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో పీహెచ్ సెంటర్ 70సబ్ సెంటర్ 150 అధికారులు తెలిపారు .త్వరలో దిశ కమిటీ వేసి సభ్యులను నామినేట్ చేస్తామని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ,ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ఎఫ్ సి ఐ ద్వారా జరిగే వడ్ల కొనుగోలు సజావుగా జరిగే విధంగా దృష్టి సారించాలని,జిల్లా అధికారులు మరియు ఎఫ్ సి ఐ అధికారులు సమన్వయంతో పనిచేయాలని,మిగిలిన ధాన్యం నిల్వలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మరియు ఎఫ్ సి ఐ నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్ళు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు..                                                                                                                          ఈ కార్యక్రమంలో, డిఆర్డిఓ ,రఘువరన్, మున్సిపల్ చైర్మన్లు, అడువాల జ్యోతి, మోరా హనుమాన్లు , వివిధ జిల్లా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  International  

ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని

ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని న్యూ డిల్లీ అక్టోబర్ 22 ప్రఖ్యాత హిందీ పండితురాలు, లండన్‌ SOAS విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కా ఓర్సినికి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో, మంగళవారం సాయంత్రం, ప్రవేశం నిరాకరించబడింది. చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ, భారత వలస అధికారులు ఆమెను “డిపోర్ట్” చేస్తున్నట్టు మాత్రమే తెలిపారు. ఓర్సిని భారత సాహిత్యం, హిందీ భాషపై విస్తృత పరిశోధనలు...
Read More...
Local News  State News 

ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక

ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక విశాఖపట్నం అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర జిల్లాలకు ‘ఆరెంజ్’, అంతర్రాష్ట్ర జిల్లాలకు ‘ఎల్లో’ అలెర్ట్‌లు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తక్కువ వాయు పీడన...
Read More...
National  International  

అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

అమెరికా వ్యవసాయ రంగంలో  కూలీల కొరత సమస్య ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై దాడుల తీవ్ర ప్రభావం న్యూయార్క్ అక్టోబర్ 22: అమెరికాలో వ్యవసాయ రంగం తీవ్రమైన కూలీల కొరతను ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన వలసదారులపై దాడులు, దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తి వ్యవస్థలను కుదిపేశాయి. అమెరికా కార్మిక శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, వలస నియంత్రణ చర్యల వల్ల...
Read More...
Local News 

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్ సికింద్రాబాద్,  అక్టోబర్ 21 (ప్రజా మంటలు):   హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఇండ్ల ముందు ఫ్లవర్ పెటల్స్ ( పూల రేకులు)  తో ముగ్గులు వేసిన మహిళలు అందులో దీపాలు పెట్టి అందంగా తీర్చిదిద్దారు. చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాల్చి సంబరాలు
Read More...
Local News 

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ. పెన్షనర్ల  సమస్యలను  ప్రభుత్వం పరిష్కరించాలి.                     -పెన్షనర్ల ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం.              జగిత్యాల అక్టోబర్ 21: పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం  ఇంకా జాప్యం చేయక వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ  అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా...
Read More...

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు ముజఫర్ పూర్ (బీహార్) అక్టోబర్ 22: బీహార్ ముఖ్యమంత్రి, జెడీయూ అధినేత నితీశ్ కుమార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ముజఫ్ఫర్‌పూర్ జిల్లా మీనాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల సభలో ఆయన చేసిన ఒక చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, 75 ఏళ్ల నితీశ్ కుమార్, బీజేపీ అభ్యర్థి రామ నిషాద్కు మాల వేసేందుకు...
Read More...
Spiritual   State News 

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్‌

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్‌ హైదరాబాద్ అక్టోబర్ 21 (ప్రజా మంటలు):  హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మంగళవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. “భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం...
Read More...
National  State News 

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం

ఉద్ధయనిధి దీపావళి శుభాకాంక్షలపై బీజేపీ రాజకీయ ఆగ్రహం చెన్నై అక్టోబర్ 21:తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉద్ధయనిధి స్టాలిన్ చేసిన దీపావళి శుభాకాంక్షల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఒక పబ్లిక్ కార్యక్రమంలో ఉద్ధయనిధి మాట్లాడుతూ – “విశ్వాసం ఉన్న వారికే హ్యాపీ దీపావళి” అని చెప్పినందుకు హిందూ సంస్థలు మరియు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ...
Read More...
National  Sports  International  

ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు

ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మొహ్సిన్ నఖ్వీకి భారీ షాక్ – BCCIకి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మద్దతు న్యూ ఢిల్లీ అక్టోబర్ 21: ఆసియా కప్ 2025 ట్రోఫీపై BCCI మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. భారత జట్టు టోర్నమెంట్ గెలిచినప్పటికీ, ఇప్పటివరకు ట్రోఫీ అందించలేదు. ఈ నిర్ణయం ఇప్పుడు ICC సమావేశంలో తీసుకోబడనుంది. PCB చీఫ్ మరియు ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ,...
Read More...
National  International  

రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక

రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగితే భారతపై భారీ సుంకాలు – ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్ అక్టోబర్ 21: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతదేశంపై కఠిన హెచ్చరిక జారీ చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై 155 శాతం వరకు భారీ టారిఫ్‌లు విధిస్తామని ఆయన ప్రకటించారు. ఫ్లోరిడా పర్యటన ముగించుకుని జర్నలిస్టులతో మాట్లాడిన ట్రంప్,“మోదీతో మాట్లాడాను. ఆయన రష్యా చమురు కొనడం ఆపుతానని...
Read More...
Local News 

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు

ఫుట్ పాత్ నిరాశ్రయుల మద్య దీపావళి పండుగ వేడుకలు సికింద్రాబాద్, అక్టోబర్ 21 (ప్రజామంటలు) : పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ నిర్వాహకులు సిటీలోని ఫుట్ పాత్ లపై దుర్బర జీవితం గడుపుతున్న నిరాశ్రయుల మద్య దీపావళి వేడుకలను నిర్వహించారు. దీపావళి పండుగను నిరాశ్రయులు, అనాథల మధ్య ప్రత్యేకంగా జరిపి వారికి ఆనందం పంచారు. నగరంలోని రోడ్ల పక్కన, వారితో కలిసి దీపాలు వెలిగిస్తూ...
Read More...
Local News 

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్

డాక్టరేట్ పొందిన జిల్లా ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్ సత్యప్రసాద్ (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 21 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని రాఘవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం, స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దాడి,మల్లేష్ బొటనీ విభాగం లో ఇథనోమిడిసినల్ ప్లాంట్స్ పై పరిశోధన చేసినందుకు  గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య...
Read More...