అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం. - ధర్మపురి అరవింద్ ఎంపీ,నిజామాబాద్
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు) :
ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని దిశ చైర్మన్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్మన్ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జరిగింది.జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అడ్డూరి లక్ష్మణ్ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డి లతో కలిసి చైర్మన్ కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ శాఖలకు వచ్చే నిధులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు నిస్వార్థపరంగా పనిచేస్తూన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు.
దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన, పరిష్కార విషయాలను 3 మాసాలకు సమీక్షించుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు స్వఛ్చ భారత్ కింద బాత్ రూమ్ లకు ప్రాధాన్యత కల్పిస్తూ కొత్త వాటికి ప్రతిపాదనలు ఇవ్వకుండా మరమ్మతులకు ప్రాధాన్యత కల్పించాలని ఆయన సూచించారు. జగిత్యాల జిల్లాను స్మార్ట్ సిటీలో భాగం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగా సమావేశంలో అమృత్ పథకం , సమగ్ర శిక్ష అభియాన్ నేషనల్ హైవేస్ గ్రామీణ సడక్ యోజన నేషనల్ హెల్త్ మిషన్ ఆవాస్ యోజన సెంట్రల్ ఫండ్ ద్వారా వివిధ రోడ్డు ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం మెట్రిక్ స్కాలర్షిప్లు మల్టీ సెక్యులర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేబర్ డిపార్ట్మెంట్ మైనారిటీ స్కూల్ నేషనల్ లైట్ మిషన్ స్వచ్ఛభారత్ పీఎం సమ్మిది పై రివ్యూ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం అందించే నిధులను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని చైర్మన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు ఆదేశించారు.
స్వచ్చ భారత్ పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఉపాధి హామీ, విద్యుత్ , మిషన్ భగీరథ, జాతీయ రహదారులు,తదితర అంశాలపై సమీక్షించారు.
అనంతరం ముందుగా జిల్లాలోని ఆర్మూర్ మంచిర్యాల ఎన్ 63, జగిత్యాల డివిజన్లో కోరుట్ల మెట్పల్లి జరుగుతున్న నాలుగు వరుసల రోడ్డు పనులను త్వరిగతన చెయ్యాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఈ జి ఎస్ నిధుల కింద జిల్లాలో మంజూరైన రోడ్లు బ్రిడ్జిల్ని దమ్మన్నపేట కాచారం రోడ్డుని పూర్తి చేయాలని తెలిపారు. అమృత పథకం కింద జిల్లాలో మొత్తం జరుగుతున్న ప్రాజెక్టు వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో పీహెచ్ సెంటర్ 70సబ్ సెంటర్ 150 అధికారులు తెలిపారు .త్వరలో దిశ కమిటీ వేసి సభ్యులను నామినేట్ చేస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ,ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని ఎఫ్ సి ఐ ద్వారా జరిగే వడ్ల కొనుగోలు సజావుగా జరిగే విధంగా దృష్టి సారించాలని,జిల్లా అధికారులు మరియు ఎఫ్ సి ఐ అధికారులు సమన్వయంతో పనిచేయాలని,మిగిలిన ధాన్యం నిల్వలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మరియు ఎఫ్ సి ఐ నిబంధనలకు అనుగుణంగా కొనుగోళ్ళు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు.. ఈ కార్యక్రమంలో, డిఆర్డిఓ ,రఘువరన్, మున్సిపల్ చైర్మన్లు, అడువాల జ్యోతి, మోరా హనుమాన్లు , వివిధ జిల్లా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... కొడంగల్పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సభకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ... మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి... జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం
జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు):
విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత
జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్... జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...
జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు):
జగిత్యాల పోలీస్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో... సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు
భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్టౌన్ పోలీస్... 270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం
బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య
బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):
బెంగళూరు నుంచి లండన్కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ... గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం
జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్... నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి
కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు.. ఆటపాటలతో ఉత్సాహం
జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్వామి మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మల్యాల మండలం నూకపల్లిలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయ సన్నిధిలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది వాకర్స్ తమ... ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం : మంత్రి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్లో నిర్వహించిన ధర్మపురి మండల, పట్టణ ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గాల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి మంత్రి... 