జగిత్యాలలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
పట్టణ టౌన్ సీఐ వేణుగోపాల్ ప్రకటన
జగిత్యాలలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
పట్టణ టౌన్ సీఐ వేణుగోపాల్ ప్రకటన
జగిత్యాల/గొల్లపల్లి నవంబర్ 03:
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారంతో ఆదివారం పట్టణంలోని బైపాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ముగ్గురు యువకులు ఓ స్కూటీలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు.
నిందితులైన బాలెపల్లి గ్రామానికి జక్కుల మధు, వెంగళాయిపేటకు చెందిన రాచర్ల వంశీ, కుక్కలగూడురు గ్రామానికి చెందిన నలిమెల వినోద్లను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. తక్కువ ధరకు ఇతర ప్రాంతాల నుండి గంజాయిని తీసుకవచ్చి పట్టణం, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు,రాచర్ల వంశీపై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు అయ్యాయని, నలిమెల వినోదపై గతంలో ఏడు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. గంజాయి తరలించినా, విక్రయించినా, సేవిస్తూ పట్టుబడిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి విక్రయిస్తున్న వారి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి

బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం
.jpg)
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.
