కాంగ్రెస్ పార్టీ పేదవారికి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుంది

On
కాంగ్రెస్ పార్టీ పేదవారికి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుంది

 

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)

కాంగ్రెస్ పార్టీ పేదవారికి,అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా కష్టపడాలని వక్తలు పేర్కొన్నారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పైన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆదివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ....

రాష్ట్రంలో ఎంత మంది పేదవారు ఉన్నారు,అర్హులైన ఎంత మంది పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి,వంటి తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని,ఇట్టి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేది నుండి ప్రారంభంకావడం జరుగుతుందని, అధికారులె నేరుగా ఇంటి ఇంటికి వచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించడం జరుగుతుందని,ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలను ఇవ్వాలని,దాని వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందనీ,కాంగ్రెస్ పార్టీ పేదవారికి,అట్టడుగువర్గాల వారికి అండగా ఉంటుందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా మనం కష్టపడాలని,ప్రతి కార్యకర్త కష్టసుఖాలో వారికి తోడుగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.

అనంతరం రాష్ట్రంలో విద్యార్థులకు కాస్మొటిక్ మరియు మెస్ చార్జీలు పెంచిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

కొండగట్టు అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్య ఆరోపణలను ఖండించిన ముత్యం శంకర్ గౌడ్

కొండగట్టు అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్య ఆరోపణలను ఖండించిన ముత్యం శంకర్ గౌడ్ కొండగట్టు, జనవరి 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ అభివృద్ధి విషయంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ అన్నారు. కొండగట్టు ఆలయ వై జంక్షన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ,కొండగట్టు గుడికి వచ్చే...
Read More...

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో  టీఎన్జీవోల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం 

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో  టీఎన్జీవోల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం  జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు)టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ మరియు ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని గార్ల ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈనాటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన మెట్‌పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన మెట్‌పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు జగిత్యాల జనవరి 05 (ప్రజా మంటలు): మెట్‌పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కోర్టు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా నిర్వహించారు....
Read More...
State News 

మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల సమస్యలపై చర్చలు

మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల సమస్యలపై చర్చలు హైదరాబాద్ జనవరి 05  (ప్రజా మంటలు): మాజీ శాసనసభ్యులు మరియు మాజీ శాసనమండలి సభ్యుల సంఘం సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులకు సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలు, అలాగే సంఘానికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, మాజీ ప్రజాప్రతినిధుల సంక్షేమం, ప్రజాహితానికి...
Read More...

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి    జగిత్యాల జనవరి 4( ప్రజా మంటలు) స్థానిక సంస్థల్లో ఆదిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.    జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, డీ సీ సీ అధ్యక్షుడు గాజంగి...
Read More...
Local News 

ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ

ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ సికింద్రాబాద్,  జనవరి 04 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, అనాథలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దుస్తులు, ఔషధాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రుగ్మతులతో బాధపడుతున్న వారికి మందులు అందించడంతో పాటు ప్రమాదాలకు గురైన వారికి ప్రాథమిక చికిత్స చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్...
Read More...

బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం

బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):  ప్రధానమంత్రి సంసద్ మహోత్సవం 2025–26లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేరణతో, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ మహా క్రీడోత్సవం కింద బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో క్రీడా రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. డివిజన్ బీజేపీ అధ్యక్షులు రామంచ మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ...
Read More...

మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ పలువురికి గాయాలు

మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ  పలువురికి గాయాలు మెట్టుపల్లి, జనవరి 4 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు మరియు తవేరా వాహనం ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. మెట్టుపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 16 UC 3599) ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటలకు మేడిపల్లి...
Read More...

నిరుపేద కుటుంబానికి వైద్య సాయం...  4 లక్షల ఎల్ ఓ సి అందజేత...

నిరుపేద కుటుంబానికి వైద్య సాయం...  4 లక్షల ఎల్ ఓ సి అందజేత...   చిగురుమామిడి జనవరి 4 (ప్రజా మంటలు):   చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వంశీ (18) అనే యువకుడు గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయక పోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న స్థానిక...
Read More...
Comment  International  

వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా?

వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా? — సిహెచ్. వి. ప్రభాకర్ రావు     వెనిజులా పై అమెరికా చేసిన సైనిక–భద్రతా చర్యలు, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బలవంతంగా అమెరికాకు తీసుకెళ్లి క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రమాదకర మలుపుగా మారింది. ఇది ఒక సాధారణ “చట్ట అమలు చర్య” కాదు; ఒక సార్వభౌమ దేశంపై...
Read More...

బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్ 

బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్        జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)పట్టణంలోని సావిత్రిబాయి పూలే పార్కులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బిఆర్ఎస్ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా తొలి జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* బిఆర్ఎస్ హయంలో బడుగు బలహీన వర్గాలకు...
Read More...

రాష్ట్ర మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు

రాష్ట్ర మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సి ఎస్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. మంత్రివర్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ టీఎన్జీవో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర...
Read More...