సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది

- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

On
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది

ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం

సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

- ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం

వేములవాడ, నవంబర్ 03:

రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారములని, సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తున్నదనీ  వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. 

వేములవాడ పట్టణంలో మల్లారం రోడ్డులో జవహర్ లాల్ నెహ్రూ  బీఈడీ కాలేజీలో ఆదివారం నాడు ఈశ్వర గారి ముక్తేశ్వరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కథా సంపుటి, వ్యాస సంపుటీ, ఆధ్యాత్మిక గ్రంథాల పోటీలలో విజేతలుగా నిలిచిన సాహితీ వేత్తల పురస్కారాల ప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

వేములవాడ ప్రాంతంలోని రచయితలు ప్రముఖ రచయితలుగా ఎదిగారని,  తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన హనుమాజీపేటకు చెందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలను హైదరాబాదులోని రవీంద్రభారతిలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల ఘనంగా నిర్వహించినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డితో సహా , న్యాయమూర్తి జింబో మంగారి రాజేందర్ తదితరులు  తెలుగు సాహిత్యంలో ఉద్దండలుగా ఎదిగారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.IMG-20241103-WA0014

వేములవాడలో పలు విద్యాసంస్థలను నెలకొల్పిన ప్రముఖ విద్యావేత్త ఈశ్వర గారి నరహరి శర్మ గారు తన సతీమణి స్మారకంగా సాహిత్య పురస్కారాలను ప్రధానం చేయడం వారి గొప్పదనాన్ని తెలియజేస్తుందని అన్నారు. శర్మ  వారి విద్యాసంస్థలలో ఎంతోమంది పేద విద్యార్థులకు
అవకాశాలు కల్పించి సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు.

IMG-20241103-WA0016

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి,  ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి  మాట్లాడుతూ సాహిత్యం సామాజిక విలువలను ఉన్నతీకరించడానికి, కొంగొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తున్నదని అన్నారు.

సాహితి పురస్కారాలను సమర్ధులైన రచయితలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణయతలను అభినందించారు.

తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా  పనిచేసిన ప్రముఖ సాహితీవేత్త బిఎస్ రాములు మాట్లాడుతూ, సాహిత్యంలో ఉన్నతమైన విలువలను పెంచడానికి ఈ పురస్కారాలు రుజువు చేస్తున్నాయని, తన సతీమణి పేరట విద్యావేత్త నరహరిశర్మ సాహితీ పురస్కారాలు ఇవ్వడం ఆదర్శంగా  నిలుస్తోందని ప్రశంసించారు. మత సంపుటి విభాగాల ఎంపికకు న్యాయ నిర్నేతగా వ్యవహరించిన న్యాయమూర్తి మంగారి రాజేందర్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో కథ సాహిత్యం గొప్ప విస్తృతిని కలిగి ఉన్నదని అన్నారు. తాను రాసిన వేములవాడ కథలు ప్రజాదరణ పొందాయని అన్నారు. మాజీ శాసనసభ్యులు, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధిలో నరహరి శర్మ పాత్ర ఎంతగానో ఉందని ప్రశంసించారు.

IMG-20241103-WA0018
ఈ సందర్భంగా వేములవాడ అనువంశిక రచయిత చెప్పకట్ల భాను శర్మ రచించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర శత బిల్వార్చన గ్రంథాన్ని జేఎన్ఎంఎస్ విద్యాసంస్థల అధినేత ఈశ్వరగారి నరహరి శర్మ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గిరిజ మనోహర్ బాబు, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డిలు లాంచనంగా ఆవిష్కరించారు.

డెబ్భై ఏడు(77) వసంతాలు పూర్తి చేసుకున్న విద్యావేత్త నరహరి శర్మ ను పలువురు ఘనంగా శాలువాలు కట్టి సన్మానించారు. తన సతీమణి పేరిట వచ్చే సంవత్సరం నుండి కవితా సంపుటి విభాగంలో ఎంపికైన రచనకు కూడా సాహితీ పురస్కారము అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. వేములవాడ యశోదరులుగా ఎంపికైన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కొమరవెల్లి రాజేందర్, ప్రముఖ రచయిత సంకేపల్లి నాగేంద్రశర్మ, సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రవీంద్ర, తదితరులను నిర్వాహకులు ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించారు.

IMG-20241103-WA0017

సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, ప్రముఖ రచయితలు డాక్టర్ నమిలకొండ సునీత, నాయిని సుజనాదేవి,. డా.అమరవాది నీరజ, ముని సురేష్ పిల్లై, గర్రెపల్లి అశోక్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, వేణుశ్రీ, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, యోగాచార్య సంపత్ కుమార్, ఆడేపు లక్ష్మీపతి, దూరదర్శన్ రిటైర్డ్ అధికారి కృష్ణారావు, గో సంరక్షకులు, సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ, తెలంగాణ పత్రిక పూర్వ సంపాదకులు అష్టకాల రామ్మోహన్ శర్మ, తదితరులను ఫౌండేషన్ తరపున నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Tags
Join WhatsApp

More News...

State News  Crime 

పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్

పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్ సికింద్రాబాద్, డిసెంబర్ 10 (ప్రజామంటలు) : వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో 18ఏళ్ల యువతి పవిత్రపై జరిగిన క్రూరహత్య కేసులో నిందితుడు దుక్కా ఉమాశంకర్‌ను వారాసిగూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.   డిసెంబర్ 8న జరిగిన...
Read More...

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి  : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి  : జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     ఎన్నికలు నిర్వహణకు 843  మంది పోలీస్ లతో  పటిష్ట బందోబస్తు.జగిత్యాల/కోరుట్ల మెట్పల్లి,డిసెంబర్ 10(ప్రజా మంటలు) జిల్లాలో జరుగుతున్న మొదటి విడత  గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  అన్నారు. బుధవారం బీమారం ,కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన...
Read More...
Local News 

శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ

శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ (అంకం భూమయ్య) గొల్లపల్లి, డిసెంబర్ 10 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (దొంగ మల్లన్న) జాతర కార్యక్రమంలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్. సుప్రియ బుధవారం ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమొగిలి కూడా స్వామి వారిని దర్శించుకుని...
Read More...

మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి

మైతాపూర్ గ్రామంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి కి మద్దతు గా ప్రచారము నిర్వహించిన డా భోగ శ్రావణి    రాయికల్ డిసెంబర్ 10 ( ప్రజా మంటలు)మండలములోని మహితాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజనాల సుందరి-జయానందం గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి ఈ కార్యక్రమంలో రాయికల్...
Read More...
Local News 

కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత

కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యుల చేయూత కొండగట్టు డిసెంబర్ 10 –(ప్రజా మంటలు): కొండగట్టుకు రోజు వారీ జీవనోపాధి కోసం వచ్చి చిన్న దుకాణాల ద్వారా బొమ్మలు, గాజులు, పిల్లల ఆట వస్తువులు అమ్ముకునే కుటుంబాలు కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. ఈ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జగిత్యాల లేడీస్ ఎంపోరియం సంఘం సభ్యులు...
Read More...

రోడ్డు విస్తరణ గూర్చి తమ వినతిని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేసిన డా బోగ శ్రావణి

రోడ్డు విస్తరణ గూర్చి తమ వినతిని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ అరవింద్ కు కృతజ్ఞతలు తెలియజేసిన డా బోగ శ్రావణి జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు)నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి కి గతంలో జగిత్యాల నియోజకవర్గం లోని జగిత్యాల రురల్ మండల్ అనంతరం గ్రామంలోని లో లెవెల్ బ్రిడ్జ్ వర్షాకాలంలో ప్రజలు తీవ్ర  ఇబ్బంది పడడం, నిత్యం ప్రమాదాలు జరగడం మరియు జగిత్యాల్ అర్బన్ మండల్ అంబారిపేట్ రోడ్డు విస్తరణ మరియు రైల్వే...
Read More...

బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి  డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలి   డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ   తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  జగిత్యాల డిసెంబర్ 10 (ప్రజా మంటలు,) బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలని శృంగేరీ శారద పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తీ  తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని  స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో మహాభారత ప్రవచన మహాయజ్ఞం 5...
Read More...

మొదటి విడత 11వ తేదీన  జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్

మొదటి విడత 11వ తేదీన  జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ మేడిపల్లి/ కథలాపూర్/ మల్లాపూర్ /ఇబ్రహీంపట్నం డిసెంబర్ 10(ప్రజా మంటలు   )    మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్ మరియు ఇబ్రహీంపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల  డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్   పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది బాధ్యతల పంపిణీ, లాజిస్టిక్స్ ఎన్నికల మెటీరియల్ను   జిల్లా కలెక్టర్...
Read More...

కేంద్ర మంత్రులు గడ్కరీ,  అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్ పలు సమస్యలపై విన్నపాలు సానుకూలంగా స్పందించిన మంత్రులు

కేంద్ర మంత్రులు గడ్కరీ,  అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్  పలు సమస్యలపై విన్నపాలు  సానుకూలంగా స్పందించిన మంత్రులు ఢిల్లీ డిసెంబర్ 10 (ప్రజా మంటలు) (S. వేణు గోపాల్)  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను  వేర్వేరుగా కలిశారు.  ఈ సందర్భంగా నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు.  కేంద్ర రైల్వే శాఖ...
Read More...
Local News  Crime 

స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి

స్కూల్ బస్సు ప్రమాదంలో విద్యార్థి మృతి కామారెడ్డి డిసెంబర్ 10 (ప్రజా మంటలు): కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడడంతో 10వ తరగతి విద్యార్థి ప్రణవ్‌ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను...
Read More...

నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం

నాలుగవ రోజుకు చేరుకున్న మహాభారతం ప్రవచనం   జగిత్యాల డిసెంబర్ 9 ( ప్రజా మంటలు)స్థానిక ధరూర్ శివారు కరీం నగర్ రోడ్డు లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గత 4 రోజులుగా  అత్యంత వైభవవో పేతంగా  సాగిపోతున్న మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఉర్రూతలూగిస్తూ సాగిపోతుంది. కళ్యాణమండపం భక్తులతో కిక్కిరిసిపోయి  జనసంద్రం లాగ కనిపిస్తుందని  సామాజిక కార్యకర్త తవుటు...
Read More...
Local News 

గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ

గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం * ఏఐ మార్ఫింగ్‌తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం * గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ * ఏఐ మార్ఫింగ్‌తో ఓటర్లలో అయోమయం భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) : మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి....
Read More...