సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది

- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

On
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది

ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం

సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

- ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం

వేములవాడ, నవంబర్ 03:

రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారములని, సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తున్నదనీ  వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. 

వేములవాడ పట్టణంలో మల్లారం రోడ్డులో జవహర్ లాల్ నెహ్రూ  బీఈడీ కాలేజీలో ఆదివారం నాడు ఈశ్వర గారి ముక్తేశ్వరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కథా సంపుటి, వ్యాస సంపుటీ, ఆధ్యాత్మిక గ్రంథాల పోటీలలో విజేతలుగా నిలిచిన సాహితీ వేత్తల పురస్కారాల ప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

వేములవాడ ప్రాంతంలోని రచయితలు ప్రముఖ రచయితలుగా ఎదిగారని,  తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన హనుమాజీపేటకు చెందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలను హైదరాబాదులోని రవీంద్రభారతిలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల ఘనంగా నిర్వహించినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డితో సహా , న్యాయమూర్తి జింబో మంగారి రాజేందర్ తదితరులు  తెలుగు సాహిత్యంలో ఉద్దండలుగా ఎదిగారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.IMG-20241103-WA0014

వేములవాడలో పలు విద్యాసంస్థలను నెలకొల్పిన ప్రముఖ విద్యావేత్త ఈశ్వర గారి నరహరి శర్మ గారు తన సతీమణి స్మారకంగా సాహిత్య పురస్కారాలను ప్రధానం చేయడం వారి గొప్పదనాన్ని తెలియజేస్తుందని అన్నారు. శర్మ  వారి విద్యాసంస్థలలో ఎంతోమంది పేద విద్యార్థులకు
అవకాశాలు కల్పించి సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు.

IMG-20241103-WA0016

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి,  ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి  మాట్లాడుతూ సాహిత్యం సామాజిక విలువలను ఉన్నతీకరించడానికి, కొంగొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తున్నదని అన్నారు.

సాహితి పురస్కారాలను సమర్ధులైన రచయితలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణయతలను అభినందించారు.

తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా  పనిచేసిన ప్రముఖ సాహితీవేత్త బిఎస్ రాములు మాట్లాడుతూ, సాహిత్యంలో ఉన్నతమైన విలువలను పెంచడానికి ఈ పురస్కారాలు రుజువు చేస్తున్నాయని, తన సతీమణి పేరట విద్యావేత్త నరహరిశర్మ సాహితీ పురస్కారాలు ఇవ్వడం ఆదర్శంగా  నిలుస్తోందని ప్రశంసించారు. మత సంపుటి విభాగాల ఎంపికకు న్యాయ నిర్నేతగా వ్యవహరించిన న్యాయమూర్తి మంగారి రాజేందర్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో కథ సాహిత్యం గొప్ప విస్తృతిని కలిగి ఉన్నదని అన్నారు. తాను రాసిన వేములవాడ కథలు ప్రజాదరణ పొందాయని అన్నారు. మాజీ శాసనసభ్యులు, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధిలో నరహరి శర్మ పాత్ర ఎంతగానో ఉందని ప్రశంసించారు.

IMG-20241103-WA0018
ఈ సందర్భంగా వేములవాడ అనువంశిక రచయిత చెప్పకట్ల భాను శర్మ రచించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర శత బిల్వార్చన గ్రంథాన్ని జేఎన్ఎంఎస్ విద్యాసంస్థల అధినేత ఈశ్వరగారి నరహరి శర్మ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గిరిజ మనోహర్ బాబు, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డిలు లాంచనంగా ఆవిష్కరించారు.

డెబ్భై ఏడు(77) వసంతాలు పూర్తి చేసుకున్న విద్యావేత్త నరహరి శర్మ ను పలువురు ఘనంగా శాలువాలు కట్టి సన్మానించారు. తన సతీమణి పేరిట వచ్చే సంవత్సరం నుండి కవితా సంపుటి విభాగంలో ఎంపికైన రచనకు కూడా సాహితీ పురస్కారము అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. వేములవాడ యశోదరులుగా ఎంపికైన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కొమరవెల్లి రాజేందర్, ప్రముఖ రచయిత సంకేపల్లి నాగేంద్రశర్మ, సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రవీంద్ర, తదితరులను నిర్వాహకులు ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించారు.

IMG-20241103-WA0017

సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, ప్రముఖ రచయితలు డాక్టర్ నమిలకొండ సునీత, నాయిని సుజనాదేవి,. డా.అమరవాది నీరజ, ముని సురేష్ పిల్లై, గర్రెపల్లి అశోక్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, వేణుశ్రీ, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, యోగాచార్య సంపత్ కుమార్, ఆడేపు లక్ష్మీపతి, దూరదర్శన్ రిటైర్డ్ అధికారి కృష్ణారావు, గో సంరక్షకులు, సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ, తెలంగాణ పత్రిక పూర్వ సంపాదకులు అష్టకాల రామ్మోహన్ శర్మ, తదితరులను ఫౌండేషన్ తరపున నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Tags
Join WhatsApp

More News...

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్

సిట్ విచారణ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావుకు సంఘీభావం, కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి కొప్పుల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల, మాజీ జెడ్పి చైర్ పర్సన్ హైదరాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు)సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్...
Read More...

450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్

450 పడకల ఆసుపత్రికి భూమి పూజ పాల్గొన్న ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో 235 కోట్ల తో  నిర్మించనున్న 450 పడకల ఆసుపత్రి కి భూమిపూజ చేసి,23.5 కోట్ల తో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ,3 కోట్ల తో  నిర్మించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ,1.5 కోట్ల తో టి ఆర్ నగర్ లో...
Read More...

15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక

15, 28 వార్డుకు చెందిన పలువురు బిజెపిలో చేరిక    జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)పట్టణ 15వ వార్డ్ కి చెందిన న్యాయవాది అవుసం భాగ్యశ్రీ మరియు 28వ వార్డ్ కి చెందిన అడ్డగట్ల అక్షయ్ కుమార్-మాధురి  మరియు 28వ,15వ వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాల పట్టణ...
Read More...

బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

బిజెపి నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన  నితిన్ నబీన్  ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా భారతీయ జనత పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు...
Read More...
Local News  State News 

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక 

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీల ప్రాథమిక నివేదిక  హైదరాబాద్, జనవరి 20 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అలాగే రాష్ట్ర వనరుల సమర్థ వినియోగంపై లోతైన అధ్యయనం కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అధ్యయన కమిటీల సభ్యులతో బంజారాహిల్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి...
Read More...

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఘనంగా ప్రారంభమైంది. గుట్టపై రాజేశ్వరుని దర్శించి, ప్రత్యేక పూజలు...
Read More...

మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష

మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష ప్రయాగ్‌రాజ్ / ఉత్తరప్రదేశ్ జనవరి 20: మౌని అమావాస్య (ఆదివారం, జనవరి 18), మాఘమేళ సందర్భంగా, తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా అభిముక్తానంద శంకరాచార్య ఈ రోజు నిరసన దీక్ష చేపట్టారు. పవిత్ర స్నానాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానకరంగా వ్యవహరించడం జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన...
Read More...

:కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన

:కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన కొడిమ్యాల జనవరి 20(ప్రజా మంటలు)   హైదరాబాదు కు చెందిన ఓ కుటుంబం   వేములవాడ లో దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్తుండగా ఈ  ఘటన చోటు చేసుకుంది. జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది.  క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా...
Read More...
Crime  State News 

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP మహబూబాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామం ఇటుకల గడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందిన నాలుగేళ్ల చిన్నారులు చైత్ర, నిత్యశ్రీల మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్ట్‌ను వెంటనే బహిర్గతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర...
Read More...
State News 

WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి

WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి జ్యూరిచ్ / దావోస్ జనవరి 20: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ఈ ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు....
Read More...
National 

తమిళనాడు గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసన సభ నుంచి వెళ్లిపోయారు

తమిళనాడు గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసన సభ నుంచి వెళ్లిపోయారు చెన్నై, జనవరి 20: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఈ రోజు శాసన సభలో ప్రసంగించకుండానే బయటకు వెళ్లిపోయారు. సాధారణంగా శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యే రోజున గవర్నర్ ప్రసంగం చేయాలి. కానీ ఈసారి అది జరగలేదు. సభ ప్రారంభ సమయంలో జాతీయ గీతం పాడలేదని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంతోనే...
Read More...
Local News  State News 

బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు _ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు _ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  హైదరాబాద్ 19 జనవరి (ప్రజా మంటలు) :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇచ్చి 'అటెన్షన్ డైవర్షన్' రాజకీయాలకు...
Read More...