సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది

- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

On
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది

ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం

సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్

- ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం

వేములవాడ, నవంబర్ 03:

రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారములని, సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తున్నదనీ  వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. 

వేములవాడ పట్టణంలో మల్లారం రోడ్డులో జవహర్ లాల్ నెహ్రూ  బీఈడీ కాలేజీలో ఆదివారం నాడు ఈశ్వర గారి ముక్తేశ్వరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కథా సంపుటి, వ్యాస సంపుటీ, ఆధ్యాత్మిక గ్రంథాల పోటీలలో విజేతలుగా నిలిచిన సాహితీ వేత్తల పురస్కారాల ప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

వేములవాడ ప్రాంతంలోని రచయితలు ప్రముఖ రచయితలుగా ఎదిగారని,  తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన హనుమాజీపేటకు చెందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలను హైదరాబాదులోని రవీంద్రభారతిలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల ఘనంగా నిర్వహించినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డితో సహా , న్యాయమూర్తి జింబో మంగారి రాజేందర్ తదితరులు  తెలుగు సాహిత్యంలో ఉద్దండలుగా ఎదిగారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.IMG-20241103-WA0014

వేములవాడలో పలు విద్యాసంస్థలను నెలకొల్పిన ప్రముఖ విద్యావేత్త ఈశ్వర గారి నరహరి శర్మ గారు తన సతీమణి స్మారకంగా సాహిత్య పురస్కారాలను ప్రధానం చేయడం వారి గొప్పదనాన్ని తెలియజేస్తుందని అన్నారు. శర్మ  వారి విద్యాసంస్థలలో ఎంతోమంది పేద విద్యార్థులకు
అవకాశాలు కల్పించి సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు.

IMG-20241103-WA0016

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి,  ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి  మాట్లాడుతూ సాహిత్యం సామాజిక విలువలను ఉన్నతీకరించడానికి, కొంగొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తున్నదని అన్నారు.

సాహితి పురస్కారాలను సమర్ధులైన రచయితలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణయతలను అభినందించారు.

తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా  పనిచేసిన ప్రముఖ సాహితీవేత్త బిఎస్ రాములు మాట్లాడుతూ, సాహిత్యంలో ఉన్నతమైన విలువలను పెంచడానికి ఈ పురస్కారాలు రుజువు చేస్తున్నాయని, తన సతీమణి పేరట విద్యావేత్త నరహరిశర్మ సాహితీ పురస్కారాలు ఇవ్వడం ఆదర్శంగా  నిలుస్తోందని ప్రశంసించారు. మత సంపుటి విభాగాల ఎంపికకు న్యాయ నిర్నేతగా వ్యవహరించిన న్యాయమూర్తి మంగారి రాజేందర్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో కథ సాహిత్యం గొప్ప విస్తృతిని కలిగి ఉన్నదని అన్నారు. తాను రాసిన వేములవాడ కథలు ప్రజాదరణ పొందాయని అన్నారు. మాజీ శాసనసభ్యులు, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధిలో నరహరి శర్మ పాత్ర ఎంతగానో ఉందని ప్రశంసించారు.

IMG-20241103-WA0018
ఈ సందర్భంగా వేములవాడ అనువంశిక రచయిత చెప్పకట్ల భాను శర్మ రచించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర శత బిల్వార్చన గ్రంథాన్ని జేఎన్ఎంఎస్ విద్యాసంస్థల అధినేత ఈశ్వరగారి నరహరి శర్మ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గిరిజ మనోహర్ బాబు, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డిలు లాంచనంగా ఆవిష్కరించారు.

డెబ్భై ఏడు(77) వసంతాలు పూర్తి చేసుకున్న విద్యావేత్త నరహరి శర్మ ను పలువురు ఘనంగా శాలువాలు కట్టి సన్మానించారు. తన సతీమణి పేరిట వచ్చే సంవత్సరం నుండి కవితా సంపుటి విభాగంలో ఎంపికైన రచనకు కూడా సాహితీ పురస్కారము అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. వేములవాడ యశోదరులుగా ఎంపికైన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కొమరవెల్లి రాజేందర్, ప్రముఖ రచయిత సంకేపల్లి నాగేంద్రశర్మ, సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రవీంద్ర, తదితరులను నిర్వాహకులు ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించారు.

IMG-20241103-WA0017

సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, ప్రముఖ రచయితలు డాక్టర్ నమిలకొండ సునీత, నాయిని సుజనాదేవి,. డా.అమరవాది నీరజ, ముని సురేష్ పిల్లై, గర్రెపల్లి అశోక్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, వేణుశ్రీ, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, యోగాచార్య సంపత్ కుమార్, ఆడేపు లక్ష్మీపతి, దూరదర్శన్ రిటైర్డ్ అధికారి కృష్ణారావు, గో సంరక్షకులు, సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ, తెలంగాణ పత్రిక పూర్వ సంపాదకులు అష్టకాల రామ్మోహన్ శర్మ, తదితరులను ఫౌండేషన్ తరపున నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు

అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్, డిసెంబర్ 26 (ప్రజా మంటలు): గౌడ్ అధికారిక మరియు వృత్తి సంఘం (GOPA) 50వ వార్షికోత్సవ వేడుకలు కాచిగూడ, హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు హాజరై సంఘానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నెర్రెల్ల...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్‌వాల్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా -  కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా -  కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ డిసెంబర్ 26, (ప్రజా మంటలు): కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గం పూర్తిగా రైతులపై ఆధారపడిన...
Read More...

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి    జగిత్యాల డిసెంబర్ 26(ప్రజా మంటలు)రూరల్ మండల్ తక్కళ్లపెళ్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కచ్చు ముని రాజు , వార్డ్ సభ్యులు నరపాక రాజేష్ ,నాయకులు వడ్లూరి హరీష్, విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణిప్రవీణ్ ని స్వగృహంలో మర్యాదపూర్వక కలువగా వారిని శాలువతో...
Read More...

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ 

విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్        జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు) భారతీయ నాగరిక విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన  మృతి చెందారు. విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు. జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు...
Read More...

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు): విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష...
Read More...
National  State News 

ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం

 ఈరోజు ఉదయం గుజరాత్‌లో భూకంపం అహ్మదాబాద్ డిసెంబర్ 26: గుజరాత్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాకు సమీప ప్రాంతమే భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత సుమారు 3.8 నుంచి 4.2గా నమోదైంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం...
Read More...
Local News  State News 

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్‌రావు(80)  అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన మాజీ...
Read More...
Local News  Crime  State News 

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు నంద్యాల డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి...
Read More...

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..

ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ.. . ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు) శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2...
Read More...

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి  -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్    జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక...
Read More...