సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
- ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం
వేములవాడ, నవంబర్ 03:
రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారములని, సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తున్నదనీ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ పట్టణంలో మల్లారం రోడ్డులో జవహర్ లాల్ నెహ్రూ బీఈడీ కాలేజీలో ఆదివారం నాడు ఈశ్వర గారి ముక్తేశ్వరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కథా సంపుటి, వ్యాస సంపుటీ, ఆధ్యాత్మిక గ్రంథాల పోటీలలో విజేతలుగా నిలిచిన సాహితీ వేత్తల పురస్కారాల ప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
వేములవాడ ప్రాంతంలోని రచయితలు ప్రముఖ రచయితలుగా ఎదిగారని, తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన హనుమాజీపేటకు చెందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలను హైదరాబాదులోని రవీంద్రభారతిలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల ఘనంగా నిర్వహించినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డితో సహా , న్యాయమూర్తి జింబో మంగారి రాజేందర్ తదితరులు తెలుగు సాహిత్యంలో ఉద్దండలుగా ఎదిగారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వేములవాడలో పలు విద్యాసంస్థలను నెలకొల్పిన ప్రముఖ విద్యావేత్త ఈశ్వర గారి నరహరి శర్మ గారు తన సతీమణి స్మారకంగా సాహిత్య పురస్కారాలను ప్రధానం చేయడం వారి గొప్పదనాన్ని తెలియజేస్తుందని అన్నారు. శర్మ వారి విద్యాసంస్థలలో ఎంతోమంది పేద విద్యార్థులకు
అవకాశాలు కల్పించి సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ సాహిత్యం సామాజిక విలువలను ఉన్నతీకరించడానికి, కొంగొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తున్నదని అన్నారు.
సాహితి పురస్కారాలను సమర్ధులైన రచయితలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణయతలను అభినందించారు.
తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన ప్రముఖ సాహితీవేత్త బిఎస్ రాములు మాట్లాడుతూ, సాహిత్యంలో ఉన్నతమైన విలువలను పెంచడానికి ఈ పురస్కారాలు రుజువు చేస్తున్నాయని, తన సతీమణి పేరట విద్యావేత్త నరహరిశర్మ సాహితీ పురస్కారాలు ఇవ్వడం ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. మత సంపుటి విభాగాల ఎంపికకు న్యాయ నిర్నేతగా వ్యవహరించిన న్యాయమూర్తి మంగారి రాజేందర్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో కథ సాహిత్యం గొప్ప విస్తృతిని కలిగి ఉన్నదని అన్నారు. తాను రాసిన వేములవాడ కథలు ప్రజాదరణ పొందాయని అన్నారు. మాజీ శాసనసభ్యులు, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధిలో నరహరి శర్మ పాత్ర ఎంతగానో ఉందని ప్రశంసించారు.

ఈ సందర్భంగా వేములవాడ అనువంశిక రచయిత చెప్పకట్ల భాను శర్మ రచించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర శత బిల్వార్చన గ్రంథాన్ని జేఎన్ఎంఎస్ విద్యాసంస్థల అధినేత ఈశ్వరగారి నరహరి శర్మ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గిరిజ మనోహర్ బాబు, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డిలు లాంచనంగా ఆవిష్కరించారు.
డెబ్భై ఏడు(77) వసంతాలు పూర్తి చేసుకున్న విద్యావేత్త నరహరి శర్మ ను పలువురు ఘనంగా శాలువాలు కట్టి సన్మానించారు. తన సతీమణి పేరిట వచ్చే సంవత్సరం నుండి కవితా సంపుటి విభాగంలో ఎంపికైన రచనకు కూడా సాహితీ పురస్కారము అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. వేములవాడ యశోదరులుగా ఎంపికైన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కొమరవెల్లి రాజేందర్, ప్రముఖ రచయిత సంకేపల్లి నాగేంద్రశర్మ, సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రవీంద్ర, తదితరులను నిర్వాహకులు ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించారు.

సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, ప్రముఖ రచయితలు డాక్టర్ నమిలకొండ సునీత, నాయిని సుజనాదేవి,. డా.అమరవాది నీరజ, ముని సురేష్ పిల్లై, గర్రెపల్లి అశోక్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, వేణుశ్రీ, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, యోగాచార్య సంపత్ కుమార్, ఆడేపు లక్ష్మీపతి, దూరదర్శన్ రిటైర్డ్ అధికారి కృష్ణారావు, గో సంరక్షకులు, సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ, తెలంగాణ పత్రిక పూర్వ సంపాదకులు అష్టకాల రామ్మోహన్ శర్మ, తదితరులను ఫౌండేషన్ తరపున నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీఎంసీ మేయర్ ఎంపికపై బీజేపీలో అసంతృప్తి తేజస్వి గోసాల్కర్కు పదవి… మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమా?
ముంబై జనవరి 22:
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కొత్త మేయర్గా బీజేపీ నేత తేజస్వి గోసాల్కర్ ఎన్నిక కావడంతో ముంబై రాజకీయాల్లోనే కాదు, బీజేపీ అంతర్గత వర్గాల్లోనూ చర్చలు, అసంతృప్తి మొదలైంది. ఈ ఎన్నిక బీజేపీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి.
తేజస్వి గోసాల్కర్ ఇటీవల జరిగిన... మీర-భాయందర్కు తొలి బెంగాలీ మేయర్? జయ దత్త పేరుతో బీజేపీ ఆలోచన… ఎంఎన్ఎస్ తీవ్ర వ్యతిరేకత
ముంబై జనవరి 22:ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో మరోసారి ‘మరాఠీ వర్సెస్ బయటి వారు’ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఈ వివాదానికి కేంద్రంగా మారింది ముంబై సమీపంలోని మీరా-భాయందర్. మేయర్ పదవికి సంబంధించి బీజేపీ తీసుకునే అవకాశమున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
మీరా-భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (MBMC) తాజా ఎన్నికల్లో... 3వ రోజు కొనసాగుతున్న శివ మహాపురాణం
జగిత్యాల జనవరి 22 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం గురు వారం 3 వ రోజుకు చేరింది. బ్రహ్మశ్రీ భాస్కర... 84 లక్షల ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం పున ప్రారంభించిన, ---- ఎస్టి ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్.
వెల్గటూర్ జనవరి 22 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో గతంలో ట్రాన్స్ఫార్మాల కాపర్ దొంగిలించబడి లిఫ్ట్ నడవక రైతులు నానా ఇబ్బందులకు గురయ్యారు. రైతులు మంత్రి దృష్టికి తీసుకుపోగా ఇబ్బందులను తొలగించడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్త కుమార్ రెడ్డి కి ప్రత్యేకంగా విన్నవించి మంజూరు ఇప్పించారు.
ఏసంగి పంటకు నీరు... రాయికల్ మున్సిపల్ ను అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ దే జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత
రాయికల్ జనవరి 22 ( ప్రజా మంటలు) పట్టణం లో.బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం లో పాల్గొన్న జిల్లా తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ....* గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ ను మున్సిపల్ గా మార్చి 25 కోట్లతో ప్రతి వార్డులో... విజయ్ టీవీకే పార్టీకి ‘విజిల్’ ఎన్నికల గుర్తు కేటాయింపు
చెన్నై జనవరి 22 (ప్రజా మంటలు):
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాజకీయ రంగంలో కీలక అడుగు వేసింది. పార్టీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి ‘విజిల్’ (Whistle) ఎన్నికల... ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి
గాజా, జనవరి 22:
ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు కొనసాగిస్తోంది. తాజా ఘటనలో గాజా నగరానికి దక్షిణంగా ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి ముగ్గురు జర్నలిస్టులను హతమార్చినట్లు రక్షణ సిబ్బంది మరియు స్థానిక పాత్రికేయులు వెల్లడించారు.
సమాచారం సేకరణ కోసం... ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి.
నంద్యాల, జనవరి 23 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఏఆర్ బీసీవీఆర్ (AR BCVR) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుకు భారీగా మంటలు వ్యాపించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.... న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం
నాగ్పూర్, జనవరి 21:భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం :
కరీంనగర్ జనవరి 21 (ప్రజా మంటలు):
పార్లమెంట్ పరిధిలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
అదేవిధంగా కరీంనగర్... గ్రీన్ల్యాండ్పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు:
దావోస్ (స్విట్జర్లాండ్) జనవరి 21;
డావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ను డెన్మార్క్ నుంచి సైనిక బలంతో స్వాధీనం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గ్రీన్ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్న ట్రంప్, దాని రక్షణ, అభివృద్ధి కోసం అమెరికా యాజమాన్యం అవసరమని... జనరల్ బజార్లో నటి, యాంకర్ సుమ సందడి
సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ జనరల్ బజార్లో కుబేరా సిల్క్స్ నూతన షోరూమ్ను ప్రముఖ నటి, యాంకర్ సుమ కనకాల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ పరిసరాలు సందడిగా మారాయి. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు శ్యామ్సుందర్, శాలిని, వ్యాపార ప్రముఖులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
2025 జూలై 12న... 