సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం
సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది
- వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
- ముక్తేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారాల ప్రధానం
వేములవాడ, నవంబర్ 03:
రచయితల బాధ్యతలను పెంచేది సాహిత్య పురస్కారములని, సామాజిక చైతన్యానికి సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తున్నదనీ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ పట్టణంలో మల్లారం రోడ్డులో జవహర్ లాల్ నెహ్రూ బీఈడీ కాలేజీలో ఆదివారం నాడు ఈశ్వర గారి ముక్తేశ్వరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కథా సంపుటి, వ్యాస సంపుటీ, ఆధ్యాత్మిక గ్రంథాల పోటీలలో విజేతలుగా నిలిచిన సాహితీ వేత్తల పురస్కారాల ప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
వేములవాడ ప్రాంతంలోని రచయితలు ప్రముఖ రచయితలుగా ఎదిగారని, తెలుగు సాహిత్యంలో ప్రముఖులైన హనుమాజీపేటకు చెందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలను హైదరాబాదులోని రవీంద్రభారతిలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఇటీవల ఘనంగా నిర్వహించినట్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డితో సహా , న్యాయమూర్తి జింబో మంగారి రాజేందర్ తదితరులు తెలుగు సాహిత్యంలో ఉద్దండలుగా ఎదిగారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వేములవాడలో పలు విద్యాసంస్థలను నెలకొల్పిన ప్రముఖ విద్యావేత్త ఈశ్వర గారి నరహరి శర్మ గారు తన సతీమణి స్మారకంగా సాహిత్య పురస్కారాలను ప్రధానం చేయడం వారి గొప్పదనాన్ని తెలియజేస్తుందని అన్నారు. శర్మ వారి విద్యాసంస్థలలో ఎంతోమంది పేద విద్యార్థులకు
అవకాశాలు కల్పించి సహాయ సహకారాలు అందించారని ప్రశంసించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ సాహిత్యం సామాజిక విలువలను ఉన్నతీకరించడానికి, కొంగొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తున్నదని అన్నారు.
సాహితి పురస్కారాలను సమర్ధులైన రచయితలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణయతలను అభినందించారు.
తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన ప్రముఖ సాహితీవేత్త బిఎస్ రాములు మాట్లాడుతూ, సాహిత్యంలో ఉన్నతమైన విలువలను పెంచడానికి ఈ పురస్కారాలు రుజువు చేస్తున్నాయని, తన సతీమణి పేరట విద్యావేత్త నరహరిశర్మ సాహితీ పురస్కారాలు ఇవ్వడం ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. మత సంపుటి విభాగాల ఎంపికకు న్యాయ నిర్నేతగా వ్యవహరించిన న్యాయమూర్తి మంగారి రాజేందర్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యంలో కథ సాహిత్యం గొప్ప విస్తృతిని కలిగి ఉన్నదని అన్నారు. తాను రాసిన వేములవాడ కథలు ప్రజాదరణ పొందాయని అన్నారు. మాజీ శాసనసభ్యులు, వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధిలో నరహరి శర్మ పాత్ర ఎంతగానో ఉందని ప్రశంసించారు.

ఈ సందర్భంగా వేములవాడ అనువంశిక రచయిత చెప్పకట్ల భాను శర్మ రచించిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర శత బిల్వార్చన గ్రంథాన్ని జేఎన్ఎంఎస్ విద్యాసంస్థల అధినేత ఈశ్వరగారి నరహరి శర్మ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గిరిజ మనోహర్ బాబు, ప్రముఖ సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డిలు లాంచనంగా ఆవిష్కరించారు.
డెబ్భై ఏడు(77) వసంతాలు పూర్తి చేసుకున్న విద్యావేత్త నరహరి శర్మ ను పలువురు ఘనంగా శాలువాలు కట్టి సన్మానించారు. తన సతీమణి పేరిట వచ్చే సంవత్సరం నుండి కవితా సంపుటి విభాగంలో ఎంపికైన రచనకు కూడా సాహితీ పురస్కారము అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. వేములవాడ యశోదరులుగా ఎంపికైన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కొమరవెల్లి రాజేందర్, ప్రముఖ రచయిత సంకేపల్లి నాగేంద్రశర్మ, సీనియర్ జర్నలిస్ట్ పిఎస్ రవీంద్ర, తదితరులను నిర్వాహకులు ఫౌండేషన్ తరపున ఘనంగా సత్కరించారు.

సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, ప్రముఖ రచయితలు డాక్టర్ నమిలకొండ సునీత, నాయిని సుజనాదేవి,. డా.అమరవాది నీరజ, ముని సురేష్ పిల్లై, గర్రెపల్లి అశోక్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, వేణుశ్రీ, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, యోగాచార్య సంపత్ కుమార్, ఆడేపు లక్ష్మీపతి, దూరదర్శన్ రిటైర్డ్ అధికారి కృష్ణారావు, గో సంరక్షకులు, సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ, తెలంగాణ పత్రిక పూర్వ సంపాదకులు అష్టకాల రామ్మోహన్ శర్మ, తదితరులను ఫౌండేషన్ తరపున నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బోడుప్పల్ భూ పోరాటం: కల్వకుంట్ల కవిత అరెస్ట్
హైదరాబాద్, జూలై 2 (ప్రజా మంటలు):
బోడుప్పల్లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాల హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భూ... రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకుల ముందుస్తు అరెస్టులు
హైదరాబాద్, జూలై 02 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న భూపోరాటానికి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.... తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):
రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టి, వాటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై జరిగిన ఉన్నతస్థాయి... ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ
టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు
జగిత్యాల జూలై 01(ప్రజా మంటలు):టియుడబ్ల్యూజే ఐజేయు కృషితో జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ లభించిందని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్... ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అజెండా మారాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి... విజయ్పై తప్పుడు ప్రచారం చేయొద్దు.. ఆరోపణలకు ఆధారాలు చూపాలి: మంత్రి నిర్మల్ కుమార్
చెన్నై, జూలై 01 (ప్రజా మంటలు):
తమిళనాడు మంత్రి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నటుడు, టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. వైకోతో పాటు మరెవరైనా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే, వారిని టీవీకే తరఫున మళ్లీ గెలిపిస్తానని ముఖ్యమంత్రి విజయ్ ఎక్కడా చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి... రాయికల్ మండలం మహితాపూర్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ శ్రీకారం
జగిత్యాల, జూలై 01 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేసి ప్రారంభించారు.అనంతరం గ్రామంలో ఐదు మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు... తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9... బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా... 2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్
హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి... పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) :
జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.
పోలియో... యూపీఏ, ఎన్డీఏ పాలనల్లో ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వైరల్ పోస్టు
న్యూఢిల్లీ, జూన్ 28 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం (2004–2014), ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (2014–2026) హయాంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను పోలుస్తూ ఒక గ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (2004–2014) పాలనలోని ధరలు, ఆ... 