గంజాయి కొనుగోలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
పరారీలో విక్రేత
ఎల్కతుర్తి 01 నవంబర్ (ప్రజామంటలు) : గంజాయి కొనుగోలు చేస్తున్న ఓ యువకుడిని ఎల్కతుర్తి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పులి రమేష్ వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఎల్కతుర్తి ఎస్సై గోదరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఎల్కతుర్తి మండలం గుంటూర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం వెహికల్ చెక్ చేస్తుండగా, రోడ్డు పక్కన కారు, బైక్ పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారి వద్దకు వెళ్లగా, కారులో ఉన్న ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్ అనే వ్యక్తి పారిపోయాడు. బైక్ పై ఉన్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన ఇరువాల అన్వేష్ (22) గా గుర్తించారు. అతడి వద్ద తనిఖీ చేయగా, 100 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. కారులో తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి కనిపించింది. శ్రీధర్ నుండి గంజాయి కొనుగోలు చేసి రోజూ సేవిస్తున్నట్లు అన్వేష్ అనే వ్యక్తి వెల్లడించాడు. కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అన్వేష్ ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి కొనుగోలు చేస్తున్న యువకుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై గోదరి రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సారంగపాణి, కానిస్టేబుల్ తిరుపతిని సీఐ అభినందించారు. సమావేశంలో కానిస్టేబుల్ బక్కయ్య, రాజు, నిరంజన్, రంజిత్, వలీ, స్వరూప పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కోలుకుంటున్నారు
తాడోంగ్ (సిక్కిం) నవంబర్ 14:
సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే), తేలికపాటి ముక్కు రక్తస్రావం మరియు రక్తపోటు పెరగడం కారణంగా శుక్రవారం సెంట్రల్ రిఫరల్ హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రి వైద్య బృందం వెంటనే చికిత్స ప్రారంభించడంతో ఆయన పరిస్థితి తక్షణమే స్థిరపడింది.
డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం సీఎం... రైతుల,విద్యార్థుల, సామాన్యులతో కవిత మమేకం
మెదక్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట తొలి రోజు పర్యటన నిర్వహించారు. నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, ఘనపూర్, వనదుర్గ, మెదక్ వంటి ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, ఆలయాలు, కాలనీలు—అన్ని రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా... జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా స్థానికంగా కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ సంబరాలు కొనసాగాయి. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల్లో భాగమయ్యారు.
జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్... గంజాయి పెంపకం – సరఫరా – అమ్మకానికి పాల్పడిన ముగ్గురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న ముగ్గురు నిందితులకు జగిత్యాల జిల్లా గౌరవ మొదటి అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ గారు కఠినమైన తీర్పును ప్రకటించారు. గంజాయి పెంపకం, సరఫరా మరియు అమ్మకానికి పాల్పడినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్షతో... జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం
నాయకత్వం – బాధ్యత – స్వయం నియంత్రణ: డైరెక్టర్ హరి చరణ్ రావు
జగిత్యాల (రూరల్), నవంబర్ 14 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం పురస్కరించుకొని సెల్ఫ్ గవర్నెన్స్ డే ను హర్షాతిరేకాలతో నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, బాధ్యతా భావం, పాఠశాల... జూబ్లీహిల్స్ విజయంలో సంబరాలు – ఎమ్మెల్యే డా. సంజయ్ ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం సందర్భంగా జగిత్యాల పట్టణంలో భారీ సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద... మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం
(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్.9440595494)
ధర్మపురి క్షేత్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మధుమేహ అవగాహన కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిన ప్రాముఖ్యమైన వేదికగా నిలిచింది. మధుమేహం పెరుగుతున్న నేపథ్యం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అవసరం దృష్ట్యా, ఈ కార్యక్రమానికి ప్రజలు... గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ
జగిత్యాల,నవంబర్ 14 (ప్రజా మంటలు):72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా, జగిత్యాలలోని గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో సహకార పతాకాన్ని బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం “డిజిటలైజేషన్ ప్రమోషన్” అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో సహకార విభాగ అధికారులు, బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు, సిబ్బంది... వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు
ఇబ్రహీంపట్నం నవంబర్ 14(ప్రజామంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున పాఠశాలలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎన్డీఏపై నమ్మకం ఉంచిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ నవంబర్ 14:
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజలు ఎన్డీఏపై చూపిన నమ్మకాన్ని ఆయన అభినందించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమని, అభివృద్ధి పట్ల ప్రజల నిబద్ధత మరోసారి రుజువైందని అన్నారు.
బిహార్ తీర్పు చరిత్రాత్మకం – మోదీ
ప్రధాని మోదీ మాట్లాడుతూ, బిహార్... శ్రీశ్రీనివాసఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా కుంకుమార్చనలు
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
వైదిక క్రతువును నంబి నరసింహ ఆచార్య (చిన్న స్వామి) నిర్వహించగా కార్యక్రమంలో మేడిపల్లి రాజన్న శర్మ శశాంక మౌళి భార్గవ్ శర్మ రుద్రంగి గోపాలకృష్ణశర్మ సిరిసిల్ల... “కర్మ తిరిగి వచ్చింది” జూబ్లీహిల్స్ ఓటమిపై భారీ చర్చ: కవిత సంచలన ట్వీట్
హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.బీఆర్ఎస్ అభ్యర్థి పరాజయంపై స్పందించిన ఆమె, “కర్మ తిరిగి వచ్చింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి.
కవితను... 