గంజాయి కొనుగోలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
పరారీలో విక్రేత
ఎల్కతుర్తి 01 నవంబర్ (ప్రజామంటలు) : గంజాయి కొనుగోలు చేస్తున్న ఓ యువకుడిని ఎల్కతుర్తి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పులి రమేష్ వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఎల్కతుర్తి ఎస్సై గోదరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఎల్కతుర్తి మండలం గుంటూర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం వెహికల్ చెక్ చేస్తుండగా, రోడ్డు పక్కన కారు, బైక్ పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారి వద్దకు వెళ్లగా, కారులో ఉన్న ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్ అనే వ్యక్తి పారిపోయాడు. బైక్ పై ఉన్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన ఇరువాల అన్వేష్ (22) గా గుర్తించారు. అతడి వద్ద తనిఖీ చేయగా, 100 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. కారులో తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి కనిపించింది. శ్రీధర్ నుండి గంజాయి కొనుగోలు చేసి రోజూ సేవిస్తున్నట్లు అన్వేష్ అనే వ్యక్తి వెల్లడించాడు. కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అన్వేష్ ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి కొనుగోలు చేస్తున్న యువకుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై గోదరి రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సారంగపాణి, కానిస్టేబుల్ తిరుపతిని సీఐ అభినందించారు. సమావేశంలో కానిస్టేబుల్ బక్కయ్య, రాజు, నిరంజన్, రంజిత్, వలీ, స్వరూప పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్రలో భాగంగా మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ను సన్మానించిన డా. బోగ శ్రావణి
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర" కార్యక్రమంలో భాగంగా, భారత త్రివిధ దళాల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన మాజీ సైనికుడు దూరిశెట్టి కిరణ్ కుమార్ ని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ... బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణి కి పోచమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రిక అందజేత
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా యూట్యూబర్స్ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోగ శ్రావణికి బోనాల జాతర వర్కింగ్ కమిటీ సభ్యులు, జగిత్యాల జిల్లా కళాకారులు మర్యాదపూర్వకంగా అందజేశారు.
ఈ సందర్భంగా... తల్లిపాలే శిశువుకు తొలి వరం – మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు )పట్టణంలోని స్థానిక 43వ వార్డు వాణీనగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ సమీండ్ల... విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 7(ప్రజా మంటలు)పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన "పరిచయ్–2K26" ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్య జీవితానికి బలమైన పునాది అని, ఈ దశలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను... సామాజిక న్యాయ తెలంగాణ కోసం టీఆర్ఎస్ సంకల్పం
హైదరాబాద్, ఆగస్టు 06 (ప్రజా మంటలు):
సామాజిక న్యాయ తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ నిర్వహించిన **"సామాజిక న్యాయ సంకల్ప సభ"**లో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. ఈ సభ దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చే ఉద్యమానికి నాంది అవుతుందని ఆమె పేర్కొన్నారు.
తాను బీసీల కోసం... ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి – మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్
జగిత్యాల ఆగస్ట్ 6(ప్రజా మంటలు)
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కరీంనగర్ రోడ్లోని జయశంకర్ విగ్రహం వద్ద, గొల్లపల్లి రోడ్లోని విగ్రహం వద్ద, అలాగే మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర... ధనం ఉంటే దాన స్వభావము ఉండాలి బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేష్ శర్మ
కోరుట్ల ఆగస్టు 5 ( ప్రజా మంటలు)
సిరిసిల్ల రాజేంద్ర శర్మ 9348422113
ధనమున్న వ్యక్తికి దాన స్వభావం ఉండాలని అదేవిధంగా శక్తి ఉంటే క్షమాగుణం ఉండాలని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు గర్రెపల్లి మహేష్ శర్మ అన్నారు. కోరుట్ల పట్టణములో సనాతన ధర్మ ప్రచార సమితి కోరుట్ల... తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.148 మీటర్లతో పోలిస్తే 152... నల్లమల్లలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి పరిశీలన
విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష – చెంచు కుటుంబాలతో ముఖాముఖిహైదరాబాద్, ఆగస్టు 5 (ప్రజా మంటలు):
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్... పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి లేక గొల్లపల్లి అభివృద్ధి కుంటుపాటు
గొల్లపల్లికి రావాలంటేనే జంకుతున్న కార్యదర్శులు!రాజకీయ ఒత్తిళ్లే కారణమా..? గ్రామంలో గుసగుసలు?
గొల్లపల్లి, ఆగస్టు 5 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి కార్యదర్శి లేక తీవ్ర పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నెలకోసారి ఇన్చార్జి కార్యదర్శిని నియమిస్తూ కాలం గడుపుతుండటంతో గ్రామ అభివృద్ధి పనులు పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి... ఐక్య ఉద్యమాలతోనే పీఆర్సీ సాధ్యం, అశాస్త్రీయమైన టెట్ పరీక్షను రద్దు చేయాలి : జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ లకు రావాల్సిన పి.ఆర్సి , డి.ఏ లు, పెండింగ్ బకాయిల సమస్యలు ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారమవుతాయని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం తీర్మానించింది. ఆదివారం జగిత్యాల పట్టణంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల సమావేశమందిరంలో ఎస్టీయు తృతీయ కార్యవర్గ... సహస్ర లింగాల దేవాలయంలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు
జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)
రూరల్ పొలాస గ్రామం శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో ఉదయం సంకటహర చతుర్థి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు. ఈ సందర్భంగా సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయంలోని సహస్ర లింగాలకు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం ఆలయంలోని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతికి పలు పంచామృతాభిషేకాలను... 