గంజాయి కొనుగోలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

పరారీలో విక్రేత

On
గంజాయి కొనుగోలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎల్కతుర్తి 01 నవంబర్ (ప్రజామంటలు) : గంజాయి కొనుగోలు చేస్తున్న ఓ యువకుడిని ఎల్కతుర్తి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పులి రమేష్ వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఎల్కతుర్తి ఎస్సై గోదరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఎల్కతుర్తి మండలం గుంటూర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం వెహికల్ చెక్ చేస్తుండగా, రోడ్డు పక్కన కారు, బైక్ పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారి వద్దకు వెళ్లగా, కారులో ఉన్న ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్ అనే వ్యక్తి పారిపోయాడు. బైక్ పై ఉన్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లికి చెందిన ఇరువాల అన్వేష్ (22) గా గుర్తించారు. అతడి వద్ద తనిఖీ చేయగా, 100 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. కారులో తనిఖీ చేయగా 100 గ్రాముల గంజాయి కనిపించింది. శ్రీధర్ నుండి గంజాయి కొనుగోలు చేసి రోజూ సేవిస్తున్నట్లు అన్వేష్ అనే వ్యక్తి వెల్లడించాడు. కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అన్వేష్ ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న దామెర గ్రామానికి చెందిన రొడ్డబోయిన శ్రీధర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి కొనుగోలు చేస్తున్న యువకుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై గోదరి రాజ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ సారంగపాణి, కానిస్టేబుల్ తిరుపతిని సీఐ అభినందించారు. సమావేశంలో కానిస్టేబుల్ బక్కయ్య, రాజు, నిరంజన్, రంజిత్, వలీ, స్వరూప పాల్గొన్నారు.

 

Tags
Join WhatsApp

More News...

Local News 

మహిళా పోలీస్ సిబ్బందికి  ఫ్రీ హెల్త్ క్యాంప్,  క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు

మహిళా పోలీస్ సిబ్బందికి  ఫ్రీ హెల్త్ క్యాంప్,  క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే  రొమ్ము, సర్వైకల్  క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా  గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్‌ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన  హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో  స్థానిక  ఐ...
Read More...
Local News 

జగిత్యాల వీరశైవ సమాజం  నూతన కార్యవర్గ ఎన్నిక 

జగిత్యాల వీరశైవ సమాజం  నూతన కార్యవర్గ ఎన్నిక  జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి  నాగేంద్రం  ఎన్నికయ్యారు.     గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్   ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్  కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా  వూడే అవంతిక అంగడి మఠంవీర...
Read More...
Local News 

ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు

ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా  ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన           గావించి,  కార్యక్రమాలు ప్రారంభించారు.   మహిళలు ఆటపాటలతో  అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు...
Read More...
Local News 

రేపు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి

రేపు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి కరీంనగర్, మార్చి 01 (ప్రజా మంటలు): రేపు మార్చి 2న మాజీ శాసనసభ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి జయంతి సందర్భంగా కరీంనగర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీసీసీ ప్రకటించింది. ఉదయం 09:30 గంటలకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10:00 గంటలకు కరీంనగర్...
Read More...
State News 

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ కామారెడ్డి, ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు): తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్షం కీలక సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించింది.కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, రానున్న అసెంబ్లీ బడ్జెట్...
Read More...
Local News 

సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సీఎం ప్రజావాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక హైదరాబాద్, మార్చి 01 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి ప్రజావాణి రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయమైన సమస్యల పరిష్కార వేదికగా నిలుస్తోంది. ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్కు తరలివస్తున్నారు.రెండేళ్ల ఒక నెల క్రితం ప్రారంభమైన సీఎం ప్రజావాణి, ప్రతి...
Read More...
Local News 

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ పేరుతో ఘరానా మోసం

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ పేరుతో ఘరానా మోసం వేములవాడ, మార్చి 01 (ప్రజా మంటలు): సోషల్ మీడియాను వేదికగా చేసుకుని యువతీ–మహిళలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా వేములవాడలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.లాడ్జిలో మహిళ నగలు, నగదుతో ప్రియుడు పరార్జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన ఒక మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే...
Read More...
Sports  State News 

రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మెన్.

రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మెన్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల 1 మార్చి (ప్రజామంటలు) :  ఇటీవల నిజామాబాదు లో జరిగిన రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాస్కెట్ బాల్ పోటీలలో మన జగిత్యాల జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం, బాలికల జట్టు నాలుగవ స్థానం సాధించిన క్రీడా కారులకు మున్సిపల్ ఛైర్పర్సన్ సమీండ్ల...
Read More...
Local News 

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు ధర్మపురి ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు)పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు...
Read More...
Local News 

విద్యానగర్  శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ. 

విద్యానగర్  శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ.     జగిత్యాల ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)విద్యానగర్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని శనివారం దేవాలయం ఆవరణలో ఆవిష్కరించారు. మార్చి 26 నుండి 28 వరకు శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఇనగంటి అశోక్ రావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మార్చి 26 గురువారం విశ్వక్సేన...
Read More...
Local News 

కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

కిషన్ రావు పేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు    వెల్గటూర్ ఫిబ్రవరి 28 ( ప్రజా మంటలు)మండలంలోని కిషన్రావుపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్ముల గంగన్న ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ  వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సర్ సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా రామన్ ఎఫెక్ట్ కనుగొని  చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28  రోజున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారని రామన్ ఎఫెక్ట్ను...
Read More...
Local News 

వేట్లపాలెం పేలుడు ఘటన: 18 మంది మృతి : బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

వేట్లపాలెం పేలుడు ఘటన: 18 మంది మృతి : బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు కాకినాడ ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):) వేట్లపాలెం పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి18 మంది మృతి – బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండకాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు ప్రాణాలు...
Read More...