రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
*ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు*
'ప్రవాసీ ప్రజావాణి' తో గల్ఫ్ వలస జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఓదార్పు, మనో ధైర్యం
◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే... ఇక్కడ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు !
◉ భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం
హైదారాబాద్ సెప్టెంబర్ 26:
విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
ఈనెల 27 వ తేదీ శుక్రవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో " ప్రవాసీ ప్రజావాణి " ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది.
శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న " ప్రవాసీ ప్రజావాణి ' ఏర్పాట్లను ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్, మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ( దుబాయ్ ), బొజ్జ అమరేందర్ రెడ్డి ( అమెరికా ), గంగసాని నవీన్ రెడ్డి ( లండన్ ), చెన్నమనేని శ్రీనివాస్ రావు గురువారం ప్రజా భవన్ లో పరిశీలించారు.
గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించదానికి సరైన మార్గదర్శనం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటి ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్యన ఒక వారధిలాగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలను వేగవంతం చేయడానికి 'ప్రవాసీ ప్రజావాణి' ఉపయోగపడుతుంది.
వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), ఉద్యోగ ఒప్పంద సమస్య (కాంట్రాక్టు ప్రాబ్లం), పరిహారం (కాంపెన్సేషన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్) లాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులు " ప్రవాసీ ప్రజావాణి " లో నమోదు చేసుకోవచ్చు.
రిక్రూటింగ్ ఏజెంట్ల మోసాల గురించి పోలీస్ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) ల సహాయం తీసు కోవచ్చు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్
మధిర నవంబర్ 24 (ప్రజా మంటలు):
మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా పని చేస్తున్న కె. చందర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ఏసీబీ బృందం చందర్ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
➤ భవన కార్మికుడు మృతి – ఇన్సూరెన్స్ మొత్తం బిల్లు కోసం... ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు... బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.
జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దగ్గరకు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రీయ లోకల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి... న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
ఐ
హైదరాబాద్ నవంబర్ 24(ప్రజా మంటలు)జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి... ఐబొమ్మ రవి కన్ఫెషన్లో సంచలన వివరాలు వెల్లడి?
హైదరాబాద్ నవంబర్ 24 (ప్రజా మంటలు):
ఐబొమ్మ బెట్టింగ్ వెబ్సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రవి (ఐబొమ్మ రవి) అరెస్ట్ అనంతరం ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవిది చిన్నప్పటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ అని విచారణ అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడేందుకు తన స్నేహితుల ఫేక్ ఐడెంటిటీ కార్డులను వినియోగించినట్లు... పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలోని గోపులాపూర్ పల్లె ప్రక్రుతి వనం గంజాయి తో పట్టు బడ్డ యువకులు ఏ1 సురజ్ కుమార్,సం18 ఏ2. రాహుల్ కుమార్,బీహార్ రాష్ట్రం చెందిన ఇద్దరు యువకులు గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరీ వద్ద 60 గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని ఎన్డిపిఎస్ సెక్షన్... గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్సేవలను వినియోగించుకోవాలి
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్గాంధీఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పోస్టల్సేవలను వినియోగించు కోవాలని సికింద్రాబాద్డివిజన్సీనియర్సూపరింటెండెంట్, ఐపీఓఎస్అధికారిణి అనన్యప్రియ కోరారు. ఈమేరకు గాంధీ సూపరింటెండెంట్ప్రొఫెసర్వాణిని సోమవారం కలిసి పోస్టల్శాఖ అందిస్తున్న పోస్టల్ఖాతాలు, లైఫ్ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన తదితర సేవలను వివరించారు.
ఎక్కువ వడ్డీ ఇచ్చే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్శాఖ అని పేర్కొన్నారు.... నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న ఆవుల సాయవ్వ
ఇందిరమ్మ ఇళ్లు గృహం ప్రవేశం చేసిన రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్,కలెక్టర్ సత్యప్రసాద్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో బెస్తపల్లె వాడలో ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి, సోమవారం గృహప్రవేశం చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్... గాంధీలో యాంటీ మైక్రోబయల్ పై అవగాహన
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజా మంటలు)::
గాంధీ మెడికల్ కాలేజ్, గాంధీ ఆసుపత్రి మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారం (WAAW) సోమవారంతో ముగిసింది. నవంబర్ 18 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాయి.
ఈ సందర్భంగా సోమవారం 2024 బ్యాచ్ అండర్గ్రాడ్యుయేట్లు యాంటిబయాటిక్స్ సరైన వినియోగంపై స్కిట్... రోడ్డుపైనే అక్రమ నిర్మాణం... ప్రజావాణిలో ఫిర్యాదు
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజా మంటలు):
బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోలాక్పూర్ లో ఓ ఇంటి యజమాని( 6-4-43/1) ప్రధాన రహదారిని ఆక్రమించుకొని ఇంటి ముందు ఇనుప మెట్లను నిర్మించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం GHMC బేగంపేట డిప్యూటీ కమిషనర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఇక్కడున్న నల్ల... శరణఘోషలతో వంగరలో అయ్యప్ప స్వాముల సందడి
అమలా కొండాల్ రెడ్డి దంపతుల సంప్రదాయ అయ్యప్ప పడిపూజ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసిన జగిత్యాల ఎలెక్ట్రికల్ డి ఈ గా నూతనంగా నియామకం అయిన గంగారామ్ ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి శ్రీరామ్ భిక్షపతి దుమాల రాజ్ కుమార్... 