రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం

On
రేపే

రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
*ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు*

'ప్రవాసీ ప్రజావాణి' తో గల్ఫ్ వలస జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఓదార్పు, మనో ధైర్యం

◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే... ఇక్కడ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు ! 

◉ భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం 

హైదారాబాద్ సెప్టెంబర్ 26:

విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.

   ఈనెల 27 వ తేదీ శుక్రవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో  " ప్రవాసీ ప్రజావాణి " ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది.

శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న " ప్రవాసీ ప్రజావాణి ' ఏర్పాట్లను ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్,  మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ( దుబాయ్ ), బొజ్జ అమరేందర్ రెడ్డి ( అమెరికా ), గంగసాని నవీన్ రెడ్డి ( లండన్ ),  చెన్నమనేని శ్రీనివాస్ రావు గురువారం ప్రజా భవన్ లో పరిశీలించారు.

గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించదానికి సరైన మార్గదర్శనం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. 

ఇలాంటి ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్యన ఒక వారధిలాగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. 

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలను వేగవంతం చేయడానికి 'ప్రవాసీ ప్రజావాణి' ఉపయోగపడుతుంది. 

వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), ఉద్యోగ ఒప్పంద సమస్య (కాంట్రాక్టు ప్రాబ్లం), పరిహారం (కాంపెన్సేషన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్),  మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్) లాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులు " ప్రవాసీ ప్రజావాణి " లో నమోదు చేసుకోవచ్చు.  

రిక్రూటింగ్ ఏజెంట్ల మోసాల గురించి పోలీస్ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) ల సహాయం తీసు కోవచ్చు.

Tags
Join WhatsApp

More News...

Local News 

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ   ఈ...
Read More...
Local News 

కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు ఈ నెల 20 తేదీన కెసిఆర్ బహిరంగ సభలో సందర్భంగా‌ జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం లో నిర్వహించనున్న బహిరంగ సభకు స్టేజి నిర్మాణ పనులను జగిత్యాల జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , ధర్మపురి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు...
Read More...
Local News 

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మేడిపల్లి ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం

జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం         జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని తెలంగాణ మైనారిటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటి మైనారిటీ గురుకులం విద్యార్థులను అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) శ్రీ. బి.రాజ గౌడ్  ఇంటర్ ఫలితాలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. కుమారి. నేల్లెంకుల నందిత అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని (ఏం.పి.సి.) వార్షిక పరీక్షల ఫలితాల్లో 470...
Read More...
Local News 

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)"అరైవ్ అలైవ్ " కార్యక్రమంలో భాగంగా వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ అరైవ్ అలైవ్" కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  ఆదేశాల...
Read More...
National  State News 

మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత 

మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత  - మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్  బిల్లును కాల్చే ప్రయత్నం హైదరాబాద్, ఏప్రిల్ 16 (ప్రజా మంటలు): మహిళల రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ అంశాన్ని అనుసంధానం చేయడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయాలని కేంద్ర...
Read More...
Local News 

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి జగిత్యాల ఏప్రిల్ 15 ( ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఎమ్మెల్సీ ఎల్ రమణ  కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ...
Read More...
Local News  State News 

పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్

పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్ వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు): పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్‌లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,...
Read More...
Local News 

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా  జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్ 

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా  జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్  జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు) జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన జిల్లా  గ్రంథాలయ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణ టిటిడి దేవస్థాన ధ్యానమండలిలో సంగనభట్ల దినేష్ కు తుంగూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్...
Read More...
Local News 

మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్

మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్ మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం...
Read More...
State News 

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?   హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను...
Read More...
State News 

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్...
Read More...