రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
*ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు*
'ప్రవాసీ ప్రజావాణి' తో గల్ఫ్ వలస జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఓదార్పు, మనో ధైర్యం
◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే... ఇక్కడ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు !
◉ భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం
హైదారాబాద్ సెప్టెంబర్ 26:
విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
ఈనెల 27 వ తేదీ శుక్రవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో " ప్రవాసీ ప్రజావాణి " ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది.
శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న " ప్రవాసీ ప్రజావాణి ' ఏర్పాట్లను ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్, మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ( దుబాయ్ ), బొజ్జ అమరేందర్ రెడ్డి ( అమెరికా ), గంగసాని నవీన్ రెడ్డి ( లండన్ ), చెన్నమనేని శ్రీనివాస్ రావు గురువారం ప్రజా భవన్ లో పరిశీలించారు.
గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించదానికి సరైన మార్గదర్శనం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటి ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్యన ఒక వారధిలాగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలను వేగవంతం చేయడానికి 'ప్రవాసీ ప్రజావాణి' ఉపయోగపడుతుంది.
వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), ఉద్యోగ ఒప్పంద సమస్య (కాంట్రాక్టు ప్రాబ్లం), పరిహారం (కాంపెన్సేషన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్) లాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులు " ప్రవాసీ ప్రజావాణి " లో నమోదు చేసుకోవచ్చు.
రిక్రూటింగ్ ఏజెంట్ల మోసాల గురించి పోలీస్ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) ల సహాయం తీసు కోవచ్చు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో... ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు
జనగాం, జనవరి 26 (ప్రజా మంటలు):
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ప్రచురించి, 1997లో అదే పేరుతో సభ నిర్వహించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇన్నయ్య అని జాగృతి నేతలు పేర్కొన్నారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు.... కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.
గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి... రాయికల్లో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గం ఎన్నిక
రాయికల్, జనవరి 26 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గుర్రాల వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్,... పలు వార్డులలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి
జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)
గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు వార్డ్ లలో యూత్ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మాజీ... జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)
77 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ....ఎందరో త్యాగధనుల ఫలితం మే గణతంత్ర... జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు):
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 125 మంది ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ప్రదానం
జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్... ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు
జగిత్యాల జనవరి (26 ప్రజామంటలు)జిల్లా కార్యాలయంలో ఘనంగా గణ తంత్ర దినోత్సవ వేడుకలు
ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం అని టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు అన్నారు. 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో... రామకృష్ణ విద్యాసంస్థల భారీ జాతీయ పతాక ర్యాలీ
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాక ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు 550 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని మోస్తూ... భారత రాజ్యాంగం ఎంతో గొప్పది రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం కల్పించింది ప్రతి ఒక్కరు హక్కులతో పాటు బాధ్యతలు కలిగి ఉండాలి
జగిత్యాల జనవరి 26 (ప్రజామంటలు)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్ల ప్రతి పౌరుడికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం అందించిందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుఎల్లాల రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తహసిల్ చౌరస్తాలో గల జగిత్యాల ప్రెస్ క్లబ్ ( టి యు డబ్ల్యు జే ఐజేయు) లో జాతీయ జెండాను ఆవిష్కరించి... 