రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
రేపే "ప్రవాసీ ప్రజావాణి" ప్రారంభం
*ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు*
'ప్రవాసీ ప్రజావాణి' తో గల్ఫ్ వలస జీవులకు రాష్ట్ర ప్రభుత్వం ఓదార్పు, మనో ధైర్యం
◉ గల్ఫ్ కార్మికులకు కష్టమొస్తే... ఇక్కడ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు !
◉ భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం
హైదారాబాద్ సెప్టెంబర్ 26:
విదేశాల్లో పనిచేసే కార్మికుల బాధలను, వారి కుటుంబ సభ్యుల ద్వారా హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో విన్నవించుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
ఈనెల 27 వ తేదీ శుక్రవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో " ప్రవాసీ ప్రజావాణి " ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్న ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది.
శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానున్న " ప్రవాసీ ప్రజావాణి ' ఏర్పాట్లను ఎన్.ఆర్.ఐ. ప్రతినిధులు డాక్టర్ వినోద్ కుమార్, మంద భీం రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ( దుబాయ్ ), బొజ్జ అమరేందర్ రెడ్డి ( అమెరికా ), గంగసాని నవీన్ రెడ్డి ( లండన్ ), చెన్నమనేని శ్రీనివాస్ రావు గురువారం ప్రజా భవన్ లో పరిశీలించారు.
గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇండియాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించదానికి సరైన మార్గదర్శనం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటి ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్యన ఒక వారధిలాగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అందించే దౌత్య సంబంధమైన సేవలను వేగవంతం చేయడానికి 'ప్రవాసీ ప్రజావాణి' ఉపయోగపడుతుంది.
వేతన బకాయిలు (సాలరీ డ్యూస్), యజమానితో సమస్యలు (స్పాన్సర్ ప్రాబ్లం), ఉద్యోగ ఒప్పంద సమస్య (కాంట్రాక్టు ప్రాబ్లం), పరిహారం (కాంపెన్సేషన్), కార్మికులను ఇబ్బంది పెట్టడం (వర్కర్ అబ్యూస్), విదేశంలో జైలు పాలయినప్పుడు (ఇంప్రిజండ్ అబ్రాడ్), మృతదేహాలను స్వదేశానికి రవాణా చేయడం (మోర్టల్ రిమేన్స్), స్వదేశానికి వాపస్ పంపడం (రిపాట్రియేషన్), తప్పిపోయిన / జాడ తెలియని వారి ఆచూకి తెలుసుకోవడం (వేర్ అబౌట్స్ అన్నోన్), వివాహ సంబంధ వివాదాలు (మారిటల్ డిస్పూట్) లాంటి ఫిర్యాదులు, విజ్ఞప్తులు " ప్రవాసీ ప్రజావాణి " లో నమోదు చేసుకోవచ్చు.
రిక్రూటింగ్ ఏజెంట్ల మోసాల గురించి పోలీస్ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) ల సహాయం తీసు కోవచ్చు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తుంగురు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
బీర్పూర్ జనవరి 1 (ప్రజా మంటలు)
బీర్పూర్ మండల తుంగూరు గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గ్రామ పంచాయతీ స్టల దాత సర్పంచ్ రాజగోపాల్ రావు స్థలాన్ని అఫిడవిట్ రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పంచాయతీ రాజ్ డి.ఈ. మిలింద్ కి... మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమైన అగ్రనేత దేవన్న?
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
నిషేధిత మావోయిస్టు పార్టీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీఎల్జీఏ నెంబర్–1 కమాండర్గా పేరొందిన బార్సే దేవా అలియాస్ దేవన్న లొంగిపోనున్నారనే ప్రచారం భద్రతా వర్గాల్లో తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. భారీ ఆయుధాలతో పాటు అనుచరులతో కలిసి లొంగిపోవచ్చనే సమాచారం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.... బంగ్లా మాజీ ప్రధాని ఖాలీదా జియా అంత్యక్రియల్లో భారత విదేశాంగమంత్రి
ఢాకా జనవరి 01:
భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జయశంకర్ బంగ్లాదేశ్కు అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సంతాప సందేశాన్ని కూడా అందజేశారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ నాయకత్వంతో... అడానీపై కార్పొరేట్ వర్గాల్లో తిరుగుబాటు?
న్యూ ఢిల్లీ జనవరి 01:
దేశ రాజకీయ–ఆర్థిక వేదికపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వర్గాల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అడానీ గ్రూప్కు వ్యతిరేకంగా అంబానీ, టాటా వర్గాలు సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం జాతీయ స్థాయిలో సంచలనం... జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు–సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్... ఉత్తమ సేవ పథకాల కి ఎంపికైన పోలీస్ అదికారులను అభినందించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 1 (ప్రజా మంటలు)విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే పోలీస్ అధికారులకు దానంతటదే గుర్తింపు వస్తుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఉత్తమ సేవా, సేవ పథకాలు ఎంపిక అయిన 15 మంది పోలీస్ అదికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్... గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్... కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 1 ( ప్రజా మంటలు) జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. *ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*
2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య – కుటుంబాన్ని కబళించిన విషాదం
కల్వకుర్తి జనవరి 01 (ప్రజా మంటలు):
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కల్వకుర్తి పట్టణానికి చెందిన ప్రసన్న (40) అనే... పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు ఉచిత అద్దాలు ,మందులు పంపిణీ
జగిత్యాల జనవరి 1( ప్రజా మంటలు)
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యం లో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 13 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అనంతరం ఉచిత కళ్ళ అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో... ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ జనవరి 1 (ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 83 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మంజురైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి,మండల... 