విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 11 ( ప్రజా మంటలు) :
విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
బుధవారం రోజున జగిత్యాల మండలం తిప్పన్న పేట గ్రామంలో హెల్త్ క్యాంప్ ను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.....
గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారని, డెంగ్యూ పరీక్షలు చేస్తున్నారని ఇప్పటి వరకు డెంగ్యూ జ్వరం బారిన ఎవరు పడలేదని, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. అవరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదని కలెక్టర్ రిజిస్టర్ ను చెక్ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో కానీ, నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో, వాటర్ బాటిల్స్, టైర్స్ వంటి వాటిలో దోమలు వృద్ది చెందే అవకాశం ఉందని, అలాగే ఇంటి చుట్టూ పక్కల పరిసరాలలో నీరు నిల్వ ఉన్న స్థలంలో దోమలు ఉండే అవకాశం ఉందని, వ్యక్తిగత పరిశుభ్రతపై అధికారుల బృందాలు అవగాహన కల్పిస్తున్నాయని ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విష జ్వరాల బారిన పడకుండా ఉండాలని కోరారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సమీయుద్దీన్, జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ముసుగు జైపాల్ రెడ్డి, డిప్యూటీ జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత
జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)"అరైవ్ అలైవ్ " కార్యక్రమంలో భాగంగా వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ అరైవ్ అలైవ్" కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆదేశాల... మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత
- మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును కాల్చే ప్రయత్నం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):
మహిళల రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ అంశాన్ని అనుసంధానం చేయడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయాలని కేంద్ర... బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి
జగిత్యాల ఏప్రిల్ 15 ( ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ... పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్లో కవిత అరెస్ట్
వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు):
పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,... జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్
జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు) జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణ టిటిడి దేవస్థాన ధ్యానమండలిలో సంగనభట్ల దినేష్ కు తుంగూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్... మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్
మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం... అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... 