బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు - -సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు -
-పేలుడు పదార్థాల లైసెన్సు లు ఇవ్వకండి -
-ప్రభుత్వ విప్ అడ్లూరికి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ లకు విజ్ఞప్తి చేసిన బుగ్గారం ప్రజలు
-సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
-ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
-అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
జగిత్యాల / బుగ్గారం/ ధర్మపురి సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బాంబుల గోదాం (పేలుడు పదార్థాలైన డిటోనేటర్ల) నిలువలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు వేర్వేరుగా బుగ్గారం ప్రజలు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసి బాంబుల (డిటోనెటర్ల) గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అనుమతులు నిలిపివేయాలని వారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరారు. ప్రాణాంతకమైన ఈ బాంబుల గోదాం నిర్మాణం వలన ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు.
ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
బుగ్గారం విడిసి, ఎండీసి ల అధ్వర్యంలో వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు, పర్యావరణానికి, వన్య ప్రాణులకు నష్టం కలిగించే పనులు గానీ, ప్రాణ హాని తలపెట్టే పనులు గానీ నియోజక వర్గంలో ఎక్కడా కూడా చేయనీయమని హామీ ఇచ్చారు.
సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఇట్లాంటి ప్రాంతకమైన పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయకుండా చూస్తానని బుగ్గారం ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా క్షేమమే తన లక్ష్యమని - నియోజక వర్గంలో ఆయా గ్రామాల ప్రజల అభీష్టం మేరకే పనులు చేస్తూ, పాలన కొనసాగిస్తామని అభయ మిచ్చారు.
లక్ష్మణ్ కుమార్ హామీతో బుగ్గారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, ఎండీసి కో - కన్వీనర్ అయిన మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేణి రాగన్న, బుగ్గారం పోచమ్మ ఆలయాల కమిటి ఛైర్మన్ మసర్తి నర్సయ్య, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పొలంపెల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కూతురు పోచమల్లు, మసర్తి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------
More News...
<%- node_title %>
<%- node_title %>
పారాక్వాట్ విషం తాగిన 12 ఏండ్ల బాలుడు -రక్షించిన వైద్యులు
యశోదా ఆసుపత్రి వైద్య నిపుణుల అరుదైన విజయం సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు
సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పిర్యాదు దారుడిని నుంచి రూఒక లక్ష లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మండల సర్వేయర్ కలువ కిరణ్ కుమార్, చైన్ మెన్ గా పనిచేస్తున్న మేకల
వివరాలు... హైదరాబాద్లో మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్ బెదిరింపులపై కఠిన చర్యలు తప్పవు : కమిషనర్ సజ్జనార్
“క్రమబద్ధమైన ఆన్లైన్ వేధింపుల ముఠా పని చేస్తోంది” — మహిళా జర్నలిస్ట్ లు
ఫిర్యాదులు స్వీకరించిన సిటీ పోలీస్ కమిషనర్ — వీడియోలు, లింకులు అందించైనా జర్నలిస్టులు
హైదరాబాద్ నవంబర్ 18 (ప్రజా మంటలు):
మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న ఆన్లైన్ ట్రోలింగ్, బెదిరింపులు, అసభ్య వ్యాఖ్యలపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ వి.సి.... సాంఘీక దురాచారాలపై సంఘటితంగా పోరాడాలి
ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత కుటుంబాల హాజరు
హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):
శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుని వెళ్తున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్షత కొనసాగడం బాధాకరమని, సాంఘిక దురాచారాలపై సంఘటితంగా పోరాడాల్సిన
రాష్ట్ర... డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మందులు వాడకూడదు..
సికింద్రాబాద్, నవంబర్ 18 (ప్రజామంటలు):
డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా , నేరుగా మందులు కొనుక్కొని వేసుకోకూడదని వైద్య నిపుణులు సూచించారు. వరల్డ్ యాంటీబయాటిక్ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి ప్రసంగించారు వివిధ రోగాల ట్రీట్మెంట్ కు... శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం సందర్శించిన భద్రత ఏర్పాట్లు ను పరిశీలించిన డిఎస్పి,రఘు చందర్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయం ను జగిత్యాల డిఎస్పి సందర్శించి రాబోయే ఏడువారాల జాతరకు జాతర ఏర్పాట్ల పర్యవేక్షించారు ఆయన వెంట ధర్మపురి సిఐ,రామ్ నరసింహారెడ్డి ఈ సందర్భంగా డిఎస్పి , రఘు చందర్ మాట్లాడుతూ జాతరకు తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్ల ట్రాఫిక్... కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు ,కలెక్టరేట్ సిబ్బంది , విద్యార్థులచే మాదక ద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ
డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో... అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయము లో ఘనంగా శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మంగళ వారం కార్తీక మాసం శుక్ల పక్షం త్రయోదశి ఉ. సుప్రభాత సేవ మరియు మూలవిరాట్టుకు అభిషేకములు నిర్వహించారు. భక్తులు... ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు- మూఢ విశ్వాసాల పై ప్రజలలో కనిపిస్తున్న మార్పు
జగిత్యాల జిల్లా ప్రజల్లో సామాజిక అంశాల పై చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు.
2016 నుoడి జగిత్యాల పోలీస్ కళా బృందం జిల్లా వ్యాప్తంగా... మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లీ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి. హిడ్మా భార్య, కీలక నాయకులు, PLGA సభ్యుల మరణం. AP ఇంటెలిజెన్స్ ధృవీకరణతో పూర్తి వివరాలు. హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని పరమ శివునికి పంచామృతాలతో అభిషేకించి కార్తీకదీపంలు వెలిగించారు.
ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ రావు దంపతులు సాంబశివునికి వివిధ... ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత
ఖమ్మం నవంబర్ 18 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు సందర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
స్కూల్ హాస్టల్ భవనంలో పెచ్చులూడిన గోడలు, పైకప్పు ఊడిపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లు... 