బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు - -సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు -
-పేలుడు పదార్థాల లైసెన్సు లు ఇవ్వకండి -
-ప్రభుత్వ విప్ అడ్లూరికి, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ లకు విజ్ఞప్తి చేసిన బుగ్గారం ప్రజలు
-సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
-ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
-అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
జగిత్యాల / బుగ్గారం/ ధర్మపురి సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బాంబుల గోదాం (పేలుడు పదార్థాలైన డిటోనేటర్ల) నిలువలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు వేర్వేరుగా బుగ్గారం ప్రజలు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసి బాంబుల (డిటోనెటర్ల) గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అనుమతులు నిలిపివేయాలని వారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరారు. ప్రాణాంతకమైన ఈ బాంబుల గోదాం నిర్మాణం వలన ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు.
ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
బుగ్గారం విడిసి, ఎండీసి ల అధ్వర్యంలో వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు, పర్యావరణానికి, వన్య ప్రాణులకు నష్టం కలిగించే పనులు గానీ, ప్రాణ హాని తలపెట్టే పనులు గానీ నియోజక వర్గంలో ఎక్కడా కూడా చేయనీయమని హామీ ఇచ్చారు.
సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఇట్లాంటి ప్రాంతకమైన పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయకుండా చూస్తానని బుగ్గారం ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా క్షేమమే తన లక్ష్యమని - నియోజక వర్గంలో ఆయా గ్రామాల ప్రజల అభీష్టం మేరకే పనులు చేస్తూ, పాలన కొనసాగిస్తామని అభయ మిచ్చారు.
లక్ష్మణ్ కుమార్ హామీతో బుగ్గారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, ఎండీసి కో - కన్వీనర్ అయిన మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేణి రాగన్న, బుగ్గారం పోచమ్మ ఆలయాల కమిటి ఛైర్మన్ మసర్తి నర్సయ్య, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పొలంపెల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కూతురు పోచమల్లు, మసర్తి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------
More News...
<%- node_title %>
<%- node_title %>
కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ... కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు
కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన... దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన కోనేరుపల్లె గ్రామం
చొప్పదండి, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు):
చొప్పదండి మండలంలోని కోనేరుపల్లె గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు “క్రీడా మిత్ర పంచాయతీ” ప్రణాళికలో భాగంగా యువతను క్రీడల వైపు మళ్లించే దిశగా చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది.క్వాలిటీ... జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం
జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని,... బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం... పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని... జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.రియల్ ఎస్టేట్... జగిత్యాలలో మహిళా చైతన్య బైక్ ర్యాలీ.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 10 ఏప్రిల్ ( ప్రజా మంటలు ) :
భారతీయ సంస్కృతిని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని హిందూ మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఉద్దేశించి పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలో మహిళలు బైక్... జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఆహ్వానం, రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు
జగిత్యాల, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):
కే.టి. రామారావు (కేటీఆర్) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా వైఫల్యాలతోనే ప్రభుత్వం కొనసాగుతోందని, ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదని ఆరోపించారు.
గురువారం జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్కు జిల్లా కేంద్రం శివారులోని దరూర్ కెనాల్ వద్ద... కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన
హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):
తెలంగాణ భవిష్యత్ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో... మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్మాస్టర్, క్లర్క్ అరెస్ట్
మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు):
మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్పీహెచ్ఎస్ మహబూబాబాద్కు చెందిన స్కూల్... అవినీతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది - కేరళ ప్రజలకు కవిత విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని సూచిస్తూ, పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమికి మద్దతు తెలపాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన... 