బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు - -సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి

On
 బుగ్గారంలో

 బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు -
-పేలుడు పదార్థాల లైసెన్సు లు ఇవ్వకండి -
-ప్రభుత్వ విప్ అడ్లూరికి,  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ లకు విజ్ఞప్తి చేసిన బుగ్గారం ప్రజలు
-సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
-ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
 -అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
 

జగిత్యాల / బుగ్గారం/ ధర్మపురి సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బాంబుల గోదాం (పేలుడు పదార్థాలైన డిటోనేటర్ల) నిలువలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు వేర్వేరుగా బుగ్గారం ప్రజలు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసి బాంబుల (డిటోనెటర్ల) గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అనుమతులు నిలిపివేయాలని వారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరారు. ప్రాణాంతకమైన ఈ బాంబుల గోదాం నిర్మాణం వలన ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు. 

ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ

 

బుగ్గారం విడిసి, ఎండీసి ల అధ్వర్యంలో వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు, పర్యావరణానికి, వన్య ప్రాణులకు నష్టం కలిగించే పనులు గానీ, ప్రాణ హాని తలపెట్టే పనులు గానీ నియోజక వర్గంలో ఎక్కడా కూడా చేయనీయమని హామీ ఇచ్చారు.  

 

సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఇట్లాంటి ప్రాంతకమైన పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయకుండా చూస్తానని బుగ్గారం ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా క్షేమమే తన లక్ష్యమని - నియోజక వర్గంలో ఆయా గ్రామాల ప్రజల అభీష్టం మేరకే పనులు చేస్తూ, పాలన కొనసాగిస్తామని అభయ మిచ్చారు.

లక్ష్మణ్ కుమార్ హామీతో బుగ్గారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

 

విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, ఎండీసి కో - కన్వీనర్ అయిన మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేణి రాగన్న, బుగ్గారం పోచమ్మ ఆలయాల కమిటి ఛైర్మన్ మసర్తి నర్సయ్య, మున్నూరు కాపు సంఘం  అధ్యక్షులు పొలంపెల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కూతురు పోచమల్లు, మసర్తి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------

Tags
Join WhatsApp

More News...

ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్‌ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు

ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్‌ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు కరీంనగర్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుతూ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం...
Read More...

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు) ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి...
Read More...
Local News 

జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు జగిత్యాల, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మిపూర్, నర్సింగపూర్, చల్గల్, దరూర్, సింగారవుపేట్, అల్లిపూర్, ఉప్పమడుగు, అయోధ్య, మహితపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలతో తనకు...
Read More...

సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా,  అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ చంద్రశేఖర్ ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు. జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ శాలువతో సన్మానించి రివార్డును...
Read More...
Local News  State News 

గద్వాల్‌ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు

గద్వాల్‌ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. రాజకీయ మార్పే పరిష్కారం “70 ఏళ్లుగా...
Read More...
Local News  State News 

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:? జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు: జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే...
Read More...
Today's Cartoon  State News 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి....
Read More...
Local News  State News 

గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు

గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి...
Read More...
Local News 

తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ధర్మపురి డిసెంబర్ 21 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు – ఆండాళ్ దేవి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవరం విష్ణు ప్రకాశరావు (అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు) ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో...
Read More...
Local News 

గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్‌ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత  రాజేశ్వరి

గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్‌ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత  రాజేశ్వరి సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు): ఉపాధి హామీ పథకం పేరు మార్పును రాజకీయంగా మలిచి కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న నిరసనలు అర్థరహితమని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ మల్లేశ్వరపు రాజేశ్వరి అన్నారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..పథకం పేరు మారిందని గాంధీని అవమానించారంటూ చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు. ఉపాధి...
Read More...
Local News 

నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి

నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి సికింద్రాబాద్,  డిసెంబర్ 21 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం  సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు కార్యక్రమము  నిర్వహించారు.   సామాజిక బాధ్యతతో నిరంతరం విభిన్న సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దుస్తులు అందుకున్న  నిరాశ్రయులు, సంచారజాతులవారు స్కై ఫౌండేషన్ కి కృతఙ్ఞతలు
Read More...