బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు - -సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి

On
 బుగ్గారంలో

 బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు -
-పేలుడు పదార్థాల లైసెన్సు లు ఇవ్వకండి -
-ప్రభుత్వ విప్ అడ్లూరికి,  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ లకు విజ్ఞప్తి చేసిన బుగ్గారం ప్రజలు
-సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
-ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
 -అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
 

జగిత్యాల / బుగ్గారం/ ధర్మపురి సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బాంబుల గోదాం (పేలుడు పదార్థాలైన డిటోనేటర్ల) నిలువలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు వేర్వేరుగా బుగ్గారం ప్రజలు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసి బాంబుల (డిటోనెటర్ల) గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అనుమతులు నిలిపివేయాలని వారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరారు. ప్రాణాంతకమైన ఈ బాంబుల గోదాం నిర్మాణం వలన ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు. 

ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ

 

బుగ్గారం విడిసి, ఎండీసి ల అధ్వర్యంలో వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు, పర్యావరణానికి, వన్య ప్రాణులకు నష్టం కలిగించే పనులు గానీ, ప్రాణ హాని తలపెట్టే పనులు గానీ నియోజక వర్గంలో ఎక్కడా కూడా చేయనీయమని హామీ ఇచ్చారు.  

 

సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఇట్లాంటి ప్రాంతకమైన పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయకుండా చూస్తానని బుగ్గారం ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా క్షేమమే తన లక్ష్యమని - నియోజక వర్గంలో ఆయా గ్రామాల ప్రజల అభీష్టం మేరకే పనులు చేస్తూ, పాలన కొనసాగిస్తామని అభయ మిచ్చారు.

లక్ష్మణ్ కుమార్ హామీతో బుగ్గారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

 

విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, ఎండీసి కో - కన్వీనర్ అయిన మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేణి రాగన్న, బుగ్గారం పోచమ్మ ఆలయాల కమిటి ఛైర్మన్ మసర్తి నర్సయ్య, మున్నూరు కాపు సంఘం  అధ్యక్షులు పొలంపెల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కూతురు పోచమల్లు, మసర్తి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------

Tags
Join WhatsApp

More News...

National  Filmi News 

ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు

ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు    హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్‌కో ఇస్ రాత్ కీ తన్‌హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని...
Read More...
Local News  State News 

నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న

నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనం బాటు కార్యక్రమంలో ప్రజలు నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి వెల్లడించారని, కల్వకుంట్ల కవిత వాటినే మీడియా ముందు చెప్పారని జాగృతి ప్రతినిధులు మనోజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శ చేయాలన్న ఉద్దేశం లేదని తెలిపారు. వనపర్తి–పెబ్బేరు ప్రాంతాలలో ప్రజలు చెరువులు, కుంటల...
Read More...

బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ

బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ ప్రభుత్వం ప్రకటించిన బిసి రిజర్వేషన్ల జాబితా బీసి నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఇచ్చిన 25 % కూడా కేటాయించలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో బిసి నాయకులు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ✔ప్రభుత్వం హామీ (42%) ✘ అమలైన...
Read More...
National  International   State News 

చైనా–అరుణాచల్ పాస్‌పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన

చైనా–అరుణాచల్ పాస్‌పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన న్యూఢిల్లీ/బీజింగ్ నవంబర్ 25 (మా ప్రత్యేక ప్రతినిధి): అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ మహిళను శాంఘై పుడోంగ్ విమానాశ్రయంలో చైనా అధికారులు “మీ పాస్‌పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం” అంటూ 18 గంటలపాటు నిర్బంధించిన ఘటన భారత్–చైనా మధ్య మరల ఉద్రిక్తతలకు దారి తీసింది. లండన్ నుంచి జపాన్‌కు ట్రాన్సిట్ ప్రయాణం...
Read More...

నల్లగొండ కాంగ్రెస్‌లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు

నల్లగొండ కాంగ్రెస్‌లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు): నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్‌ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి...
Read More...

“ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”:  జగిత్యాల BRS నేతల విమర్శలు

“ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”:  జగిత్యాల BRS నేతల విమర్శలు జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు): జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని...
Read More...
Local News  Crime 

ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం

ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) :  తెలియని మూలాల నుంచి వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేయకూడదని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్‌కు గురై వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు. RTO Challan.apk, Aadhar.apk, SBI.apk, PM...
Read More...
Local News 

చాచా నెహ్రూ నగర్‌లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

చాచా నెహ్రూ నగర్‌లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు): దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు మంగళవారం చాచా నెహ్రూ నగర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానికులు, దుకాణదారులకు సైబర్ మోసాల గురించి వివరించి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 వినియోగంపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పాంప్లెట్లు కూడా...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లపై నుండి వెళ్లిన విద్యుత్తు లైన్లు మరమత్తు కొరకు శంకుస్థాపన 

గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లపై నుండి వెళ్లిన విద్యుత్తు లైన్లు మరమత్తు కొరకు శంకుస్థాపన  (అంకం భూమయ్య(   గొల్లపల్లి నవంబర్ 25 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని శ్రీరాములపల్లె లో విద్యుత్ వైర్లు, విద్యుత్  పనులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు  ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.   ధర్మపురి నియోజకవర్గంలోశ్రీరాములపల్లె,...
Read More...
Local News  Spiritual  

భక్తి శ్రద్దలతో 350వ శహీద్ దినోత్సవం : నగర్ కీర్తన్‌ లో భక్తుల రద్దీ

భక్తి శ్రద్దలతో 350వ శహీద్ దినోత్సవం : నగర్ కీర్తన్‌ లో భక్తుల రద్దీ ఆకట్టుకున్న యోధ కళాకారుల కత్తి ప్రదర్శనలు... సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) : సిక్కుల తొమ్మిదవ మత గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సాహెబ్‌జీ 350వ శహీద్ దినోత్సవం సందర్భంగా మంగళవారం  సాయంత్రం నిర్వహించిన నగర్ కీర్తన్ ఘనంగా జరిగింది. శబద్ కీర్తనాలు, సాహాస కృత్యాలైన  సిక్కు కళ గట్కా యోధ కళ ప్రదర్శనలు...
Read More...
State News 

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ – మూడు విడతల్లో పోలింగ్

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ – మూడు విడతల్లో పోలింగ్ ఈ క్షణం నుంచే ఎలెక్షన్ కోడ్ అమల్లోకి హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. 🗳️పోలింగ్ షెడ్యూల్ 1️⃣ తొలి విడత – డిసెంబర్ 11 2️⃣ రెండో విడత –...
Read More...
Comment  State News 

 కాంగ్రెస్‌లో తలపడే రెండు సామ్రాజ్యాలు: ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు

 కాంగ్రెస్‌లో తలపడే రెండు సామ్రాజ్యాలు:  ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జీవన్ రెడ్డి ఆధిపత్యానికి సవాల్ విసిరిన సంజయ్ వర్గంగా నిలుస్తుంది. జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ పేరు సరిపోతుంది అంటే…“వర్గాల వేటగాళ్ల లీగ్”లేదా“జగిత్యాల అడవి — రెండు పులులు, ఒక కుర్చీ” ఎందుకంటే బయటకు కాంగ్రెస్...
Read More...