బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు - -సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి

On
 బుగ్గారంలో

 బుగ్గారంలో "డిటోనేటర్ల" (బాంబుల) గోదాం వద్దే వద్దు -
-పేలుడు పదార్థాల లైసెన్సు లు ఇవ్వకండి -
-ప్రభుత్వ విప్ అడ్లూరికి,  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ లకు విజ్ఞప్తి చేసిన బుగ్గారం ప్రజలు
-సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి
-ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :
 -అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ
 

జగిత్యాల / బుగ్గారం/ ధర్మపురి సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బాంబుల గోదాం (పేలుడు పదార్థాలైన డిటోనేటర్ల) నిలువలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని సోమవారం ప్రభుత్వ విప్ అయిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు వేర్వేరుగా బుగ్గారం ప్రజలు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు గ్రామ అభివృద్ది కమిటి అధ్వర్యంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

అలాగే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం జరిగిన ప్రజావాణిలో కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కలిసి బాంబుల (డిటోనెటర్ల) గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అనుమతులు నిలిపివేయాలని వారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను కోరారు. ప్రాణాంతకమైన ఈ బాంబుల గోదాం నిర్మాణం వలన ప్రజలకు, వన్యప్రాణులకు, పర్యావరణానికి తీరని నష్టం కలిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు వివరించారు. 

ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయం :

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ

 

బుగ్గారం విడిసి, ఎండీసి ల అధ్వర్యంలో వినతి పత్రాలు అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు, పర్యావరణానికి, వన్య ప్రాణులకు నష్టం కలిగించే పనులు గానీ, ప్రాణ హాని తలపెట్టే పనులు గానీ నియోజక వర్గంలో ఎక్కడా కూడా చేయనీయమని హామీ ఇచ్చారు.  

 

సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి ఇట్లాంటి ప్రాంతకమైన పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయకుండా చూస్తానని బుగ్గారం ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా క్షేమమే తన లక్ష్యమని - నియోజక వర్గంలో ఆయా గ్రామాల ప్రజల అభీష్టం మేరకే పనులు చేస్తూ, పాలన కొనసాగిస్తామని అభయ మిచ్చారు.

లక్ష్మణ్ కుమార్ హామీతో బుగ్గారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.

 

విడిసి కోర్ కమిటీ చైర్మన్ అయిన తెలంగాణ జన సమితి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి, మాజీ సర్పంచ్ మసర్తి రాజిరెడ్డి, ఎండీసి కో - కన్వీనర్ అయిన మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పెద్దనవేణి రాగన్న, బుగ్గారం పోచమ్మ ఆలయాల కమిటి ఛైర్మన్ మసర్తి నర్సయ్య, మున్నూరు కాపు సంఘం  అధ్యక్షులు పొలంపెల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి కూతురు పోచమల్లు, మసర్తి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------

Tags
Join WhatsApp

More News...

Local News 

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన  షేక్ చాంద్ పాషా 

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన  షేక్ చాంద్ పాషా  జగిత్యాల, అక్టోబర్ 18 (ప్రజా మంటలు): టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చాంద్బాషా గారు జగిత్యాల జిల్లా అతిథి గృహములో ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి, కండువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుల సమస్యలను వివరించారు. గత 20 సంవత్సరాలుగా గల్ఫ్...
Read More...

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం    హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): జ్యోతి సురేఖ వెన్నం (జననం: 3 జూలై 1996, చల్లపల్లి, కృష్ణ జిల్లా ఆంధ్రప్రదేశ్) భారతీయ క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్చర్. కాంపౌండ్ బోว์ విభాగంలో ఆమె అత్యంత ప్రతిభావంతురాలు. K L యూనివర్సిటీ నుండి బీటెక్ మరియు ఎంబిఎ పూర్తి చేసిన జ్యోతి, 2024...
Read More...

జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం! జ్యోతి సురేఖ వెన్నం – తొలి భారత మహిళా కంపౌండ్ ఆర్చర్‌గా వరల్డ్ కప్ ఫైనల్ పతక విజేత అమెరికాలో జరిగిన ఫైనల్‌లో కాంస్య పతకం అంతర్జాతీయ స్థాయిలో మరో గర్వకారణమైన ఘనత హైదరాబాద్ అక్టోబర్ 18: భారతీయ ఆర్చరీలో కొత్త చరిత్ర రాసింది తెలుగు తేజం జ్యోతి సురేఖ వెన్నం. వరల్డ్ కప్...
Read More...
Local News 

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్ జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో గల జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల కార్యాలయంలో శనివారం రోజున పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పల్లికొండ నరేష్
Read More...
Local News 

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు జగిత్యాల అక్టోబర్ 18 ( ప్రజా మంటలు) తెలంగాణ వ్యాప్తంగాబీసీ రిజర్వేషన్ బిల్ మద్దతుగా 42% రిజర్వేషన్ బీసీ లకు కల్పించాలని చట్టసభలలో రాష్ట్రమంతట బీసీ రిజర్వేషన్ ఉండాలని ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీలో ఆమోదించిన రాజ్యాంగపర సమస్యలు ఉన్నాయని బిల్ లో సమస్యలు ఉన్నాయని రిజర్వేషన్ను తాత్కాలీకంగా గా నిలుపుదల చేసారు. అందుకు ఈ బిల్...
Read More...
Local News 

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీ లోరెండు రోజుల పాటు చర్చ అనంతరం అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు.గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్...
Read More...
Local News 

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత

తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగుకు ఎమ్మెల్యే డా సంజయ్ కు ఆహ్వానం అందజేత    జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి  తేదీ : 26/10/2025 రోజున తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగ్ కు రావాల్సిందిగా ఆహ్వానం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి లు మరియు వివిధ...
Read More...
Local News 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ. (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో స్థానిక రైతు వేదికలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మార్చి 31,2024 నుండి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన పనులకు సంబంధించి 15వ సామాజిక తనిఖీ బృందం గ్రామాలలో తనిఖీ చేసి గ్రామసభలు నిర్వహించి శనివారం...
Read More...
Sports  International  

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు యువ ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి — ACB తీవ్ర ఖండన న్యూఢిల్లీ అక్టోబర్ 18: ఆఫ్ఘనిస్తాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్ సైన్యం చేసిన వైమానిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు దుర్మరణం చెందారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దీనిని “పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికి దాడి”గా పేర్కొంది. ఈ ఘటన తర్వాత, నవంబర్ 5 నుండి లాహోర్ మరియు రావల్పిండిలో...
Read More...

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక

మహిళల గౌరవం చర్చకు కాదు – ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరిక డెహ్రాడూన్ అక్టోబర్ 18: ఒక పోస్కో కేసులో నిందితుడికి సుప్రీంకోర్టు ద్వారా విముక్తి (acquittal) వచ్చిన తర్వాత, ఆ కేసు వాదించిన మహిళా న్యాయవాదికి సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు రేప్, హత్య బెదిరింపులు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్వయంగా (suo motu) కేసు తీసుకుంది. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...
Read More...
Local News 

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై జీవన్ రెడ్డి హామీ జగిత్యాల అక్టోబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలుసుకుని వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో, పదవీ విరమణ అనంతరం అందాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెండింగ్ బెనిఫిట్స్,...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము. ఇబ్రహీంపట్నం  అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ కొరకు శనివారం రోజున  రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాలలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ తమ గ్రామాలలో  బంద్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు...
Read More...