ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

On
ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం
 - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి సెప్టెంబర్ 09:
 ప్రస్తుత వర్షాకాల పరిస్థితులలో ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వ  విప్, డిసిసి అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి 
లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ...వ్యాధుల బారిన పడిన ప్రజల ఇబ్బందుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ లో  ఆరోపించడాన్ని లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. జిల్లాలో విష జ్వరాలు ప్రబలు తున్న విషయం వాస్తవమని, అయితే జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని ఆసుపత్రులు సందర్శించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మేడారం, పైడిపెల్లి తదితర గ్రామాల్లో  వైద్య శిబిరాలు నిర్వహించా మన్నారు. అన్ని ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ధర్మపురిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా వైద్య పరీక్షల శిబిరం నిర్వహిస్తామన్నారు. ఎ ఎన్ ఎంలు, ఆశా కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ సహకారం అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ప్రభుత్వంపై బురద చల్లే ఆలోచన మానుకోవాలన్నారు. కరోనా విజృంభణ సమయంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రి హరీష్ రావు, బాధుల చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చ లేదన్నారు. ధర్మపురి ప్రాంత రోగులకు కనీసం అంబులెన్స్ సౌకరం కల్పించే ప్రయత్నం జరగ లేదన్నారు. బెడ్స్ లేక ఆసుపత్రులు నిండుగా ఉంటే నాడు ప్రభుత్వం చేతులు ఎత్తి కూర్చుందన్నారు. ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారే తప్ప, అందుబాటులోకి తేలేదన్నారు. ఇంకా పనులు మిగిలే ఉన్నాయన్నారు. ప్రధాన ఆసుపత్రిలో ఐ సి యూ ప్రారంభం చేయలేదన్నారు. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలా బాగోగులు చూస్తున్నామని నొక్కి చెప్పారు.
పి సి సి సభ్యులు దినేష్, నాయకులు జక్కు రవి, చిలుముల లక్ష్మణ్, వేముల రాజేశ్, ప్రసాద్, కస్తూరి శ్రీనివాస్, సి. హెచ్ రాజేశ్, కుంట సుధాకర్, సుముఖ్, నిషాంత్ రెడ్డి, అప్పం శ్రావణ్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి

ఇజ్రాయిల్ దాడిలో 3 గురు జర్నలిస్టుల మృతి       గాజా, జనవరి 22: ఇజ్రాయెల్–హమాస్ మధ్య అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు కొనసాగిస్తోంది. తాజా ఘటనలో గాజా నగరానికి దక్షిణంగా ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి ముగ్గురు జర్నలిస్టులను హతమార్చినట్లు రక్షణ సిబ్బంది మరియు స్థానిక పాత్రికేయులు వెల్లడించారు. సమాచారం సేకరణ కోసం...
Read More...
Crime  State News 

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి.

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం ముగ్గురు మృతి. నంద్యాల, జనవరి 23 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏఆర్ బీసీవీఆర్ (AR BCVR) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సుకు భారీగా మంటలు వ్యాపించడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు....
Read More...
Sports  International  

న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

 న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం నాగ్‌పూర్, జనవరి 21:భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు...
Read More...
Local News  State News 

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం :

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం : కరీంనగర్ జనవరి 21 (ప్రజా మంటలు): పార్లమెంట్ పరిధిలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. అదేవిధంగా కరీంనగర్...
Read More...
International  

గ్రీన్‌ల్యాండ్‌పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు:

గ్రీన్‌ల్యాండ్‌పై సైనిక చర్య లేదు : డావోస్ WEFలో ట్రంప్ వ్యాఖ్యలు: దావోస్ (స్విట్జర్లాండ్) జనవరి 21; డావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను డెన్మార్క్ నుంచి సైనిక బలంతో స్వాధీనం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు కీలకమని పేర్కొన్న ట్రంప్, దాని రక్షణ, అభివృద్ధి కోసం అమెరికా యాజమాన్యం అవసరమని...
Read More...

జనరల్ బజార్‌లో నటి, యాంకర్ సుమ సందడి

జనరల్ బజార్‌లో నటి, యాంకర్ సుమ సందడి సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో కుబేరా సిల్క్స్ నూతన షోరూమ్‌ను ప్రముఖ నటి, యాంకర్ సుమ కనకాల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ పరిసరాలు సందడిగా మారాయి. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు శ్యామ్‌సుందర్, శాలిని, వ్యాపార ప్రముఖులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2025 జూలై 12న...
Read More...
National  Opinion  Current Affairs   Science  

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో పెరుగుతున్న ‘ఆకస్మిక’ గర్భధారణలు

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో పెరుగుతున్న ‘ఆకస్మిక’ గర్భధారణలు హైదరాబాద్ / న్యూఢిల్లీ జనవరి 21: టైప్-2 డయాబెటిస్ చికిత్స, బరువు తగ్గడానికి వినియోగిస్తున్న ఆధునిక GLP-1 ఇంజెక్షన్లు (Ozempic, Wegovy, Mounjaro) భారతదేశంలో అనూహ్య పరిణామానికి దారితీస్తున్నాయి. ఈ మందులు వాడుతున్న మహిళల్లో ఊహించని విధంగా గర్భధారణలు పెరుగుతున్నాయని గైనకాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టులు వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాన్ని వైద్య పరిభాషలో **‘ఒజెంపిక్ బేబీస్’**గా పిలుస్తున్నారు. ప్రత్యేకించి ...
Read More...
Local News 

నేరాల నియంత్రణకు,కమ్యూనిటీ భద్రతకు  సీసీ కెమెరాలు దోహ‌దం చేస్తాయి. సీసీ కెమెరాలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

నేరాల నియంత్రణకు,కమ్యూనిటీ భద్రతకు  సీసీ కెమెరాలు దోహ‌దం చేస్తాయి.  సీసీ కెమెరాలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  జగిత్యాల రూరల్ జనవరి 21 (ప్రజా మంటలు) నూతన సాంకేతికత ను గ్రామాల్లో ఉపయోగించి దాతల సహకారంతో 2లక్షల రూపాయల విలువగల సి సి కెమెరాలు ఏర్పాటు అభినందనీయం.  సిసి కెమెరాల ఏర్పాటు తో పాటు వారు నిర్వహణ చాలా ముఖ్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నేరాల నియంత్రణ,గ్రామంలో కొత్త వ్యక్తుల రాకపోకలు చిత్రించి,అనుమానాస్పద...
Read More...
State News 

25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు

25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజామంటలు) :   గాంధీఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథోరాసిస్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సర్జరీ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొ. వాణితో కలిసి సీటీసర్జరీ హెచ్‌ఓడీ ప్రొ. రవీంద్ర బుధవారం మీడియాకు  వెల్లడించారు. వివరాలు ఇవి...ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి (25) పలు...
Read More...

శంకరాచార్యులు – మహంత్ యోగి వివాదం : హోదా, ధర్మం, క్షమాపణ ప్రశ్న

శంకరాచార్యులు – మహంత్ యోగి వివాదం : హోదా, ధర్మం, క్షమాపణ ప్రశ్న (ప్రత్యేక కథనం) ఉత్తరప్రదేశ్‌లో జ్యోతిర్పీఠ శంకరాచార్యులు మరియు సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న వాదనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వివాదం కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా, హిందూ ధర్మంలో ఉన్న శంకరాచార్యుల హోదా, మహంత్ స్థానం, ధార్మిక మర్యాదలు వంటి అంశాలను మళ్లీ ప్రశ్నార్థకంగా నిలబెట్టింది. శంకరాచార్యులు – హిందూ ధర్మంలో...
Read More...

25వ వార్డ్ కు చెందిన పలువురు బిజెపిలో చేరిక

25వ వార్డ్ కు చెందిన పలువురు బిజెపిలో చేరిక జగిత్యాల జనవరి 21 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డ్ కి చెందిన గుండేటి సాయి  మరియు 25 వార్డ్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ  అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి భారతీయ జనతా పార్టీ  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన...
Read More...

డిప్యూటీ సీఎం ను కలిసిన బీసీ నేతలు 

డిప్యూటీ సీఎం ను కలిసిన బీసీ నేతలు       ధర్మపురి జనవరి 21 ( ప్రజా మంటలు)పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కు ధర్మపురి కి విచ్చేసినతెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ  కలసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం వినతి పత్రం అందించారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42...
Read More...