ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి సెప్టెంబర్ 09:
ప్రస్తుత వర్షాకాల పరిస్థితులలో ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వ విప్, డిసిసి అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ...వ్యాధుల బారిన పడిన ప్రజల ఇబ్బందుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ లో ఆరోపించడాన్ని లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. జిల్లాలో విష జ్వరాలు ప్రబలు తున్న విషయం వాస్తవమని, అయితే జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని ఆసుపత్రులు సందర్శించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మేడారం, పైడిపెల్లి తదితర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించా మన్నారు. అన్ని ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ధర్మపురిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా వైద్య పరీక్షల శిబిరం నిర్వహిస్తామన్నారు. ఎ ఎన్ ఎంలు, ఆశా కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ సహకారం అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ప్రభుత్వంపై బురద చల్లే ఆలోచన మానుకోవాలన్నారు. కరోనా విజృంభణ సమయంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రి హరీష్ రావు, బాధుల చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చ లేదన్నారు. ధర్మపురి ప్రాంత రోగులకు కనీసం అంబులెన్స్ సౌకరం కల్పించే ప్రయత్నం జరగ లేదన్నారు. బెడ్స్ లేక ఆసుపత్రులు నిండుగా ఉంటే నాడు ప్రభుత్వం చేతులు ఎత్తి కూర్చుందన్నారు. ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారే తప్ప, అందుబాటులోకి తేలేదన్నారు. ఇంకా పనులు మిగిలే ఉన్నాయన్నారు. ప్రధాన ఆసుపత్రిలో ఐ సి యూ ప్రారంభం చేయలేదన్నారు. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలా బాగోగులు చూస్తున్నామని నొక్కి చెప్పారు.
పి సి సి సభ్యులు దినేష్, నాయకులు జక్కు రవి, చిలుముల లక్ష్మణ్, వేముల రాజేశ్, ప్రసాద్, కస్తూరి శ్రీనివాస్, సి. హెచ్ రాజేశ్, కుంట సుధాకర్, సుముఖ్, నిషాంత్ రెడ్డి, అప్పం శ్రావణ్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ₹347 కోట్ల ప్రణాళిక - చిన్నారెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్లో కొలువైన పవిత్ర శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం ₹347 కోట్లతో ఆలయాన్ని ఆధునికంగా, భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దే కార్యక్రమం రూపొందించారు.
తక్షణ పనులకు ₹35 కోట్లు అవసరం
బాలాలయం నిర్మాణం, వజ్రలేపనం, కుంభాభిషేకం... ఇండిగో విమాన రద్దుల వెనుక అసలు కథ ఏమిటి?
గత నాలుగు రోజులుుగా జరుగుతున్న ఇండిగో విమాన రద్దులపై, ప్రచారంలో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, కార్పొరేట్ పోరాటం కోణంలో ఒక సమగ్ర విశ్లేషణాత్మక కథనం.
దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థకు చెందిన అనేక విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడం, కొన్ని గంటల తరబడి ఆలస్యంగా నడవడం, ప్రయాణికులు... అమెరికా బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం – ఇద్దరు తెలుగు విద్యార్థుల విషాద మరణం
బర్మింగ్హామ్ (అలబామా) డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్ నగరంలో గురువారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల ప్రాణాలు తీసింది. స్థానిక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కాసేపటికే భవనం మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అక్కడ నివాసముంటున్న మొత్తం 13 మంది... సోమాజిగూడలో అగ్నిప్రమాదం – శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్లో మంటలు
హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): నగరంలోని సోమాజిగూడలో మంగళవారం సాయంత్రం పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులో ఉన్న శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కిచెన్ ప్రాంతం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది, భవనం నివాసితులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కు... హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ వలలో
హనుమకొండ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
హనుమకొండ అడిషనల్ కలెక్టర్గా, అలాగే ఇన్చార్జ్ డీఈవోగా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి ఎసీబీ వలలో చిక్కారు. పుత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణ కోసం రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా అతడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేసినట్లు సమాచారం.
వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ను కూడా... జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచి జిల్లా పేరును నిలబెట్టాలి-జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లత
జగిత్యాల డిసెంబర్ 5 (ప్రజా మంటలు)
పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ ఆటల పోటీలను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బి. ఎస్ లత ప్రారంభించారు.
జగిత్యాల జిల్లా లోని 16 పీఎం శ్రీ స్కూల్స్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు కబడ్డీ, కోకో, వాలి... సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్
మెట్పల్లి / ఇబ్రహీంపట్నం/ మేడిపల్లి డిసెంబర్ 5 (ప్రజా మంటలు) శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి
ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో సాగేందుకు పోలీస్ శాఖ పరంగా కావలసిన భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పి... బలిదానాలు వద్దు బరి గీసి పోరాడుదాం–బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవిలు
సికింద్రాబాద్, డిసెంబర్ 05 (విప్రజామంటలు):
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహుతికి ప్రయత్నించి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందిన సాయి ఈశ్వర్ చారి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను మాజీ ఐఏఎస్ చిరంజీవులు పరామర్శించారు.
అనంతరం ఆయన... జగిత్యాల గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు – జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లిలో సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనంద్, ఉప సర్పంచ్ దుమల సుమన్తో పాటు ఆరు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు కన్నపూర్ గ్రామంలో పోట్టవత్తిని సతీష్ సర్పంచ్గా ఏకగ్రీవం అయ్యారు.
ఇందిరా భవన్లో రెండు గ్రామాల ఎన్నికైన ప్రతినిధులు మాజీ మంత్రి ... “ప్రాణాలు ఇవ్వడం పంథా కాదు” - సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి కవిత నివాళి
జగద్గిరిగుట్ట, డిసెంబర్ 5 (ప్రజా మంటలు):
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో ఆత్మహత్య చేసిన సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య, తల్లి, పిల్లలను ఓదార్చారు.
కవిత గారు మాట్లాడుతూ,“సాయి ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. చావు సొల్యూషన్ కాదు.”“బీసీ... నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 5 (ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జోనల్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఎన్నికల నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై... ఎన్నికల పీఓల–శిక్షణ కార్యక్రమం ప్రారంభం
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 5 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్):ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం జరిగిన మొదటి విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరై పర్యవేక్షించారు.
పోలింగ్ డే నాడు పీఓలు, ప్రొసీడింగ్ ఆఫీసర్లు చేపట్టాల్సిన బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, భద్రతా చర్యలు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై... 