ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం
- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి సెప్టెంబర్ 09:
ప్రస్తుత వర్షాకాల పరిస్థితులలో ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వ విప్, డిసిసి అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి
లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ...వ్యాధుల బారిన పడిన ప్రజల ఇబ్బందుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ లో ఆరోపించడాన్ని లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. జిల్లాలో విష జ్వరాలు ప్రబలు తున్న విషయం వాస్తవమని, అయితే జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని ఆసుపత్రులు సందర్శించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మేడారం, పైడిపెల్లి తదితర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించా మన్నారు. అన్ని ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ధర్మపురిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా వైద్య పరీక్షల శిబిరం నిర్వహిస్తామన్నారు. ఎ ఎన్ ఎంలు, ఆశా కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ సహకారం అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ప్రభుత్వంపై బురద చల్లే ఆలోచన మానుకోవాలన్నారు. కరోనా విజృంభణ సమయంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రి హరీష్ రావు, బాధుల చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చ లేదన్నారు. ధర్మపురి ప్రాంత రోగులకు కనీసం అంబులెన్స్ సౌకరం కల్పించే ప్రయత్నం జరగ లేదన్నారు. బెడ్స్ లేక ఆసుపత్రులు నిండుగా ఉంటే నాడు ప్రభుత్వం చేతులు ఎత్తి కూర్చుందన్నారు. ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారే తప్ప, అందుబాటులోకి తేలేదన్నారు. ఇంకా పనులు మిగిలే ఉన్నాయన్నారు. ప్రధాన ఆసుపత్రిలో ఐ సి యూ ప్రారంభం చేయలేదన్నారు. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలా బాగోగులు చూస్తున్నామని నొక్కి చెప్పారు.
పి సి సి సభ్యులు దినేష్, నాయకులు జక్కు రవి, చిలుముల లక్ష్మణ్, వేముల రాజేశ్, ప్రసాద్, కస్తూరి శ్రీనివాస్, సి. హెచ్ రాజేశ్, కుంట సుధాకర్, సుముఖ్, నిషాంత్ రెడ్డి, అప్పం శ్రావణ్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల ఎమ్మెల్యే వైఖరి విడ్డూరంగా ఉంది - మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)యావర్ రోడ్డు పై అక్రమ నిర్మాణాలు తొలగించండి
జిల్లా కలెక్టర్ ప్రజా వాణిలో జీవన్ రెడ్డి పిర్యాదు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అవలంబిస్తున్న వైఖరి చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో... బదిలీ పై వెళుతున్న సహాయ సంచాలకులు డా.బి.నరేష్ ను సన్మానించిన టిఎన్జీఓ లు
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లా పశు సంవర్థక శాఖ లో సహాయ సంచాలకులు గా పని చేసిన డా.బోనగిరి నరేష్ ఇటీవలే బదిలీ పై కరీంనగర్ వెళ్లిన సందర్బంగా జిల్లా పశు వైద్యాధికారి డా.బి.ప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సన్మాన కార్యక్రమం లో టిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఎన్జీఓ... జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 15(ప్రజా మంటలు)జిల్లాను వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడానికి, పేద వర్గాల వారికి ఆధునిక వైద్య సౌకర్యాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో... సింగరేణి నుంచి ఆదివాసీ హక్కుల వరకు: ఉత్తర తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన విస్తరణ యాత్రలో కవిత
మంచిర్యాల/బెల్లంపల్లి/ఆసిఫాబాద్, జూన్ 15 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన ఉత్తర తెలంగాణ పర్యటనలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, కేస్లాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలు, ఆదివాసీ హక్కులు, యువత ఉపాధి, విద్యా-వైద్య రంగాలపై పార్టీ వైఖరిని వెల్లడించారు.
మంచిర్యాలలో... తహసీల్దార్ సంతకం ఫోర్జరీ ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్
జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):
(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల జిల్లా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్లను మెట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి... ఖమ్మం బాధితురాలికి న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు):
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని త్వరితగతిన శిక్ష పడేలా... ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి గింజతో సహా ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ డిమాండ్ చేశారు. కేంద్రం 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుండగా, రాష్ట్రంలో 70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి... సాహితీవేత్త ,విద్యావేత్త ఎమ్ వి నరసింహారెడ్డి భౌతిక కాయానికి అంతిమ నివాళులు
జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కు చెందిన ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త ఎంవీ నరసింహారెడ్డి సోమవారం సాయంత్రం మృతి చెందగా బుధవారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నరసింహారెడ్డి కుమారులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అంతిమయాత్రలో బంధువులు అభిమానులు శిష్యులు కళాశాల... రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కంటిదానం ,నేత్రదాన ప్రతిజ్ఞ అవగాహన
జగిత్యాల : జూన్ 10(ప్రజా మంటలు)
ప్రపంచ నేత్రదాన దినోత్సవం జూన్ 10, సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, హైదరాబాద్ వారి సహకారంతో బుధవారం పెన్షనర్స్ భవన్ (కోర్ట్ ప్రక్కన) “కంటి దానం – నేత్రదాన ప్రతిజ్ఞ, అవగాహన కార్యక్రమం”... స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు
జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు)స్వర్గీయ మంచాల రామేశం నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ కు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సునీల్ కుమార్, ఎం సి హెచ్ సూపరింటెండెంట్ డా. కృష్ణమూర్తి, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ సిరిసిల్లశ్రీనివాస్, రోటరీసభ్యులు టీవి సూర్యం ద్వారా అందజేస్తున్న రామేశం కుమారుడు మంచాల... దేశంలో అత్యంత దీర్ఘకాలం ప్రధాని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు: ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్ 10 (ప్రజా మంటలు):
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో అత్యంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతానని తాను ఎప్పుడూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.... నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి
హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):
జవహర్లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.
ఒక... 