హుజురాబాద్ బస్టాండ్ సమీపంలో గంజాయి పట్టుకున్న హుజరాబాద్ పోలీసులు
ఇద్దరు యువకుల వద్ద నుంచి సుమారు 20 కిలోల గంజాయి స్వాధీనం
హుజురాబాద్ సెప్టెంబర్ 7 ప్రజామంటలు ప్రతినిధి దాసరి కోటేశ్వర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి నిర్మూలనలో భాగంగా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి పట్టుకోవడంలో ఆపరేషన్ నిర్వహించారు. వరంగల్ నుంచి హుజురాబాద్ కి గంజాయిని తీసుకొస్తున్న ఇద్దరు యువకుల్ని పక్క సమాచారం మేరకు హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్సై యునస్ మహమ్మద్ అలీలు తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా వీరి వద్ద నుంచి సుమారు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఏసిపి శ్రీనివాస్ జి తెలిపారు. దాని విలువ సుమారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కంగిరి జిల్లా వాసులైన అర్జున్ తనుగుల, సుభాష్ సీసా, పక్కపక్క గ్రామస్తులైన వీరిద్దరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలిగా ఉండేవారని అన్నారు. గత ఐదు,ఆరు సంవత్సరాల నుంచి అక్కడ ప్రాంతంలో భూములలో గంజాయి పండిస్తూ మొదట అక్కడే దళారీలకు విక్రయించేవారని అన్నారు. అక్కడ అమ్మితే కేవలం కిలోకి కేవలం 2000 రూపాయలు మాత్రమే వస్తున్నాయని ఆలోచించి, తామే స్వయంగా అమ్మితే కిలోకు 20 వేల వరకు డబ్బులు వస్తాయని ఆలోచనతో గంజాయి అమ్మడం మొదలుపెట్టారని తెలిసిందన్నారు. డబ్బులు తక్కువ వస్తున్నాయని ఆలోచించి అధిక డబ్బులకు విక్రయించాలని ఉద్దేశంతో ఒరిస్సా నుంచి విశాఖపట్నం మీదుగా హుజురాబాద్ చేరుకున్నారని అన్నారు. ఇక్కడ కళాశాలలు ఎక్కువ ఉండడంతో విక్రయిస్తే అధిక మొత్తం వస్తుందని ఆలోచనతో వచ్చారని విచారణలో తేలిందని అన్నారు. గత రెండు నెలల క్రితమే హుజురాబాద్లో సుమారు 60 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ఇందులో చాలామంది యువకులే ఉన్నారని అన్నారు. యువకుల పట్ల తల్లిదండ్రులతోపాటు కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి మత్తులో యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. గంజాయిని పట్టుకున్న సీఐ తిరుమల గౌడ్, ఎస్సై యూనస్ మహమ్మద్ అలీ తోపాటు పోలీస్ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సమర్థ పనితీరు – నేరాలు 5.05 శాతం తగ్గింపు* జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)పండుగలు, ఎన్నికలు, జాతరలు ప్రశాంతంగా – అవాంఛనీయ సంఘటన లేకుండా ముగిసిన ఏడాది*
*మహిళలు, చిన్నారుల భద్రతే ప్రథమ లక్ష్యం,– డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ విధానం అమలు*
*‘సురక్షిత ప్రయాణం’తో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు
జిల్లాలో గత సంవత్సర కాలంలో జిల్లా పోలీస్ శాఖ... యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో... పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరకృఢత్వం మానసిక ఆరోగ్య ము అత్యంత అవసరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 23 (ప్రజా మంటలు)
పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీస్ సిబ్బంది రోజువారీ... పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 23( ప్రజా మంటలు దగ్గుల అశోక్)
ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని పుష్కర ఘాట్ల అభివృద్ధి కొరకు కావలసిన పనులను పర్యవేక్షించిన గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ హైదరాబాద్ వారి కార్యాలయ అధికారులు మరియు ఇబ్రహీంపట్నం తాసిల్దార్, ఎంపీడీవో ఇతర మండల అధికారులు.... మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్పై ACB సోదాలు
మహబూబ్నగర్, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (Dy Commissioner) రవాణా శాఖాధికారి కిషన్ నాయక్ పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అధికార ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఈ దాడులు చేపట్టినట్లు... కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టేవరకు స్వామి మాల విరమణ చేయను : డా. సాయికుమార్
కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో డాక్టర్ సాయికుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సాయికుమార్ నేడు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జువ్వాడి నర్సింగరావు గారు “డాక్టర్ సాయికుమార్... ఏపీలో పలు జిల్లాల్లో ఏసీబీ మెరుపు సోదాలు – సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు
అమరావతి డిసెంబర్ 23(ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టి పలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను, ఉద్యోగుల నివాసాలను తనిఖీ చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం సబ్రిజిస్ట్రార్ రామకృష్ణతో పాటు ఆయన సహ ఉద్యోగులు, మరో ప్రైవేట్... కోచిలో రోడ్డుపై ప్రాణాలు నిలిపిన డాక్టర్ ధైర్యం – సినిమా సన్నివేశాన్ని తలపించిన నిజజీవిత రక్షణ
కోచి, కేరళ డిసెంబర్ 23 (ప్రత్యేక కథనం):
కోచిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అనంతరం ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తికి ఓ డాక్టర్ చేసిన అత్యవసర చికిత్స అక్షరాలా ప్రాణాలను నిలిపింది. శ్వాస తీసుకోలేక తంటాలు పడుతూ, మరణం అంచున ఉన్న ఆ వ్యక్తికి డాక్టర్ రోడ్డుపైనే తక్షణ శస్త్రచికిత్స చేసి... న్యూ ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు ఉద్రిక్తత – భారీగా మోహరించిన భద్రతా బలగాలు
న్యూ ఢిల్లీ డిసెంబర్ 24 (ప్రజా మంటలు):
దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం ముందు మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, మానవ హక్కుల అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పలు సంఘాలు హైకమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి.
నిరసనకారులు పెద్ద ఎత్తున... జాగృతి జనంబాట పర్యటనలో మానవత్వం చాటిన కవిత
హైదరాబాద్ డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనంబాట కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, నారపల్లి వద్ద కవిత గారికి అభివాదం చేసేందుకు ప్రయత్నించిన తండ్రీకుమార్తె బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు.
ఈ ఘటనను గమనించిన కవిత గారు వెంటనే తన వాహనాన్ని ఆపి, వారిని తన కాన్వాయ్లోని వాహనంలో... బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం
బీర్పూర్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు)ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
సోమవారం విజయం సాధించిన గ్రామపంచాయతీ సర్పంచ్లు ఉప సర్పంచ్ లు... 