హుజురాబాద్ బస్టాండ్ సమీపంలో గంజాయి పట్టుకున్న హుజరాబాద్ పోలీసులు
ఇద్దరు యువకుల వద్ద నుంచి సుమారు 20 కిలోల గంజాయి స్వాధీనం
హుజురాబాద్ సెప్టెంబర్ 7 ప్రజామంటలు ప్రతినిధి దాసరి కోటేశ్వర్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంజాయి నిర్మూలనలో భాగంగా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి పట్టుకోవడంలో ఆపరేషన్ నిర్వహించారు. వరంగల్ నుంచి హుజురాబాద్ కి గంజాయిని తీసుకొస్తున్న ఇద్దరు యువకుల్ని పక్క సమాచారం మేరకు హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్సై యునస్ మహమ్మద్ అలీలు తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా వీరి వద్ద నుంచి సుమారు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఏసిపి శ్రీనివాస్ జి తెలిపారు. దాని విలువ సుమారు నాలుగు నుంచి ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కంగిరి జిల్లా వాసులైన అర్జున్ తనుగుల, సుభాష్ సీసా, పక్కపక్క గ్రామస్తులైన వీరిద్దరూ ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలిగా ఉండేవారని అన్నారు. గత ఐదు,ఆరు సంవత్సరాల నుంచి అక్కడ ప్రాంతంలో భూములలో గంజాయి పండిస్తూ మొదట అక్కడే దళారీలకు విక్రయించేవారని అన్నారు. అక్కడ అమ్మితే కేవలం కిలోకి కేవలం 2000 రూపాయలు మాత్రమే వస్తున్నాయని ఆలోచించి, తామే స్వయంగా అమ్మితే కిలోకు 20 వేల వరకు డబ్బులు వస్తాయని ఆలోచనతో గంజాయి అమ్మడం మొదలుపెట్టారని తెలిసిందన్నారు. డబ్బులు తక్కువ వస్తున్నాయని ఆలోచించి అధిక డబ్బులకు విక్రయించాలని ఉద్దేశంతో ఒరిస్సా నుంచి విశాఖపట్నం మీదుగా హుజురాబాద్ చేరుకున్నారని అన్నారు. ఇక్కడ కళాశాలలు ఎక్కువ ఉండడంతో విక్రయిస్తే అధిక మొత్తం వస్తుందని ఆలోచనతో వచ్చారని విచారణలో తేలిందని అన్నారు. గత రెండు నెలల క్రితమే హుజురాబాద్లో సుమారు 60 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ఇందులో చాలామంది యువకులే ఉన్నారని అన్నారు. యువకుల పట్ల తల్లిదండ్రులతోపాటు కాలేజీ యాజమాన్యం కూడా దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి మత్తులో యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. గంజాయిని పట్టుకున్న సీఐ తిరుమల గౌడ్, ఎస్సై యూనస్ మహమ్మద్ అలీ తోపాటు పోలీస్ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కలెక్టరేట్లో 'నషా ముక్త్ భారత్ ' అభియాన్ ప్రతిజ్ఞ డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతిఒక్కరూ పాటుపడలి –జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) బి. రాజ గౌడ్
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు ,కలెక్టరేట్ సిబ్బంది , విద్యార్థులచే మాదక ద్రవ్య నిరోధక ప్రతిజ్ఞ
డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో... అంగరంగ వైభవంగా శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతర స్వామి కళ్యాణ వేడుకలు
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయము లో ఘనంగా శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మంగళ వారం కార్తీక మాసం శుక్ల పక్షం త్రయోదశి ఉ. సుప్రభాత సేవ మరియు మూలవిరాట్టుకు అభిషేకములు నిర్వహించారు. భక్తులు... ప్రజల్లో చైతన్యం కోసం పోలీసుల కళా ప్రదర్శనలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామీణ ప్రాంతాలలో విస్తృత కార్యక్రమాలతో సామాజిక అంశాల పై అవగాహన
జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు- మూఢ విశ్వాసాల పై ప్రజలలో కనిపిస్తున్న మార్పు
జగిత్యాల జిల్లా ప్రజల్లో సామాజిక అంశాల పై చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు నిరంతరం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, తెలిపారు.
2016 నుoడి జగిత్యాల పోలీస్ కళా బృందం జిల్లా వ్యాప్తంగా... మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లీ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి. హిడ్మా భార్య, కీలక నాయకులు, PLGA సభ్యుల మరణం. AP ఇంటెలిజెన్స్ ధృవీకరణతో పూర్తి వివరాలు. హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని పరమ శివునికి పంచామృతాలతో అభిషేకించి కార్తీకదీపంలు వెలిగించారు.
ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ రావు దంపతులు సాంబశివునికి వివిధ... ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత
ఖమ్మం నవంబర్ 18 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు సందర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
స్కూల్ హాస్టల్ భవనంలో పెచ్చులూడిన గోడలు, పైకప్పు ఊడిపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లు... హైదరాబాద్లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా మంటలు):హైదరాబాద్లో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఊగిసలాట, రూపాయి మార్పిడి విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాలు నగర రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ధరలను స్థానిక వ్యాపారులతో మాట్లాడి సరిపోల్చుకోండి. ఇవి సమాచారం కొరకు మాత్రమే. వాస్తవ... ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ
జగిత్యాల (రూరల్), నవంబర్ 18 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్ నూతన ఉపనిర్వాహక అధికారి (SI)గా ఉమా సాగర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మాన సూచికగా మొక్కను అందజేశారు.
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమా సాగర్,... బేగంపేట్లో రోడ్డు ప్రమాదం: థార్ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా
బేగంపేట్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టిన హెవీ లోడ్ ట్రక్ బోల్తా. గాయపడిన వారు ఆసుపత్రికి తరలింపు. పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య
శంషాబాద్లో ఐవీఎఫ్ చికిత్స వికటించడంతో ఎనిమిదో నెల గర్భిణి శ్రావ్య, గర్భంలోని కవలలు మృతి. షాక్ తట్టుకోలేక భర్త విజయ్ ఆత్మహత్య. కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసిన హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు. ఐ–బొమ్మ పైరసీ వెబ్సైట్ లో సంచలన ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):
ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది.
ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా... ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం 