అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య
మనస్తాపం చెంది మరణమే శరణ్యం అనుకున్న తీరు హృదయ విచారకర సంఘటన
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 06: ప్రజామంటలు
చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపం చెంది మల్లమారి రవీందర్(52) అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు మల్లమారి రవీందర్ గురువారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. పొద్దుగూకిన ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కలత చెంది వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వెతికారు. అతని ఆచూకీ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళగా చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో తోటి వ్యవసాయదారులు వంగర పోలీసులకు సమాచారం అందించారు. రవీందర్ కు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వీరి చదువుల నిమిత్తం అప్పులు కాగా పండించిన పంట ఆశించినంత మేర దిగుబడి రాలేదు. దీంతో మనస్థాపం చెందిన రవీందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య కవిత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఏఎస్ఐ ప్రకాష్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
