గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title
(శ్రీధర గణపతి శర్మ - 9849386786).
జగిత్యాల 05 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.
సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం.
ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..! రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్.
అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.
ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.
విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9... బీజేపీ తెలంగాణకు సవతి తల్లి ప్రేమ చూపుతోంది.. ముషీరాబాద్ జండా పండగలో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు వేణుమాధవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బీజేపీ తెలంగాణపై "సవతి తల్లి ప్రేమ" ప్రదర్శిస్తోందని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు లేదా... 2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్
హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి... పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలి - పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల 28 జూన్ ( ప్రజా మంటలు) :
జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0-5 ఏండ్ల వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలను వేసి చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపాలని పి.సి.సి సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా వెల్లడించారు.
పోలియో... యూపీఏ, ఎన్డీఏ పాలనల్లో ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వైరల్ పోస్టు
న్యూఢిల్లీ, జూన్ 28 (ప్రజా మంటలు):మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం (2004–2014), ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (2014–2026) హయాంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను పోలుస్తూ ఒక గ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (2004–2014) పాలనలోని ధరలు, ఆ... తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు పి.డి. అరసకుమార్ అరెస్ట్
రూ.100 కోట్ల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల మోసం కేసు
చెన్నై, జూన్ 28 (ప్రజా మంటలు):
తమిళనాడులో ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు, శాశ్వత గుర్తింపు (Recognition), గ్రేడ్ అప్గ్రేడేషన్, డీటీసీపీ (DTCP), సీఎండీఏ (CMDA) అనుమతులు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ప్రైవేట్... మంచాల రామేశం స్మారకార్థం ఆర్వో వాటర్ ప్లాంటేషన్ వితరణ
జగిత్యాల జూన్ 22(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణంలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్ యందు మంచాల రామేశం స్మారకార్థం మంచాల కృష్ణ ఏర్పాటు చేసిన ఆర్వో (ఆర్ ఓ) వాటర్ ప్లాంట్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరియు జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంచాల కృష్ణ... జగిత్యాలలో 120 గ్రాముల గంజాయి స్వాధీనం.. నిందితుడు అరెస్ట్
జగిత్యాల, జూన్ 20 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ మండలం చల్గల్ శివార్లలో గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన దగ్గు రాజేష్ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, అనంతరం... నకిలీ ట్రక్ చిట్టీలతో రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం :
ఆరుగురు నిందితుల అరెస్ట్.. రూ.14.16 లక్షల నగదు స్వాధీనం, రూ.46.21 లక్షల ఖాతాలు ఫ్రీజ్
సిరిసిల్ల, జూన్ 20 (ప్రజా మంటలు):
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా... వీధికుక్కల దాడి, నిరాశ్రయ వృద్ధురాలి దుస్థితిపై మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ
హైదరాబాద్, జూన్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) న్యాయ సభ్యురాలు శ్రీమతి శివడి ప్రవీణ రెండు వార్తా కథనాలను స్వప్రేరితంగా (సుమోటో) విచారణకు స్వీకరించారు. సాక్షి దినపత్రికలో జూన్ 20న ప్రచురితమైన వార్తల ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.హెచ్ఆర్సీ నెం.2468/2026 కింద, వరంగల్ నగరంలోని శాలినీనగర్లో వీధికుక్క దాడిలో... సాహితీవేత్త ఎంవీ నరసింహారెడ్డికి ఘనంగా నివాళులు
జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు) సాహితీవేత్త, విద్యావేత్త రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఎంవి నరసింహారెడ్డి సంస్కరణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పద్మ నాయక మండపంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి శిష్య బృందం, విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, అధ్యాపకులు బంధువులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా... సింగరేణి ప్రాంత వనరులు, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ నేతలు: కవిత
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతుంది - కల్వకుంట్ల కవిత
పెద్దపల్లి, జూన్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంత ప్రజలు,... 