గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title
(శ్రీధర గణపతి శర్మ - 9849386786).
జగిత్యాల 05 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.
సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం.
ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..! రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్.
అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.
ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.
విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్రూమ్స్ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి.... గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు
జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి... తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ధర్మపురి డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు – ఆండాళ్ దేవి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవరం విష్ణు ప్రకాశరావు (అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు) ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో... గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత రాజేశ్వరి
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు):
ఉపాధి హామీ పథకం పేరు మార్పును రాజకీయంగా మలిచి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరసనలు అర్థరహితమని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి అన్నారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..పథకం పేరు మారిందని గాంధీని అవమానించారంటూ చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు.
ఉపాధి... నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు కార్యక్రమము నిర్వహించారు.
సామాజిక బాధ్యతతో నిరంతరం విభిన్న సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచారజాతులవారు స్కై ఫౌండేషన్ కి కృతఙ్ఞతలు ఎల్కతుర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పుల్లూరి శ్రీధర్ రావు ఏకగ్రీవ ఎన్నిక
ఎల్కతుర్తి డిసెంబర్ 21 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండలంలోని నూతన సర్పంచుల ఐక్యతకు ప్రతీకగా సర్పంచ్ ల ఫోరం కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ అధ్యక్షుడిగా వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి శ్రీధర్ రావును సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన్ లో నిర్వహించిన సమావేశానికి, కాంగ్రెస్... యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ఆటోకు TVS XL అనే టూ వీలర్ పైన వస్తున్నటువంటి వ్యక్తి ఆదివారం సాయంత్రం యాక్సిడెంట్ గురి కాగా అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు యాక్సిడెంట్స్ ని గమనించి అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్నజాతీయ లోక్... విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నాగోల్ లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ఏర్పాటై ఎనిమిది దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్,... నదీ జలాల కోసం మరో ఉద్యమం అవసరం – పాలమూరు ద్రోహాన్ని మరచిపోం: కేసీఆర్
హైదరాబాద్, డిసెంబరు 21 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
సమైక్యాంధ్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలమూరు ప్రయోజనాలను కాలరాశాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన విస్తృత... అక్రమ నిర్మాణాలు చేపట్టలేదు - న్యూ బోయిగూడ బస్తీవాసులు
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు):
జీహెచ్ఎమ్సీ బేగంపేట సర్కిల్–30 పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ న్యూబోయిగూడలోని ఉప్పలమ్మ దేవాలయం పక్కన ఉన్న ప్రభుత్వ రహదారిపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగడం లేదని పలువురు బస్తీవాసులు పేర్కొన్నారు. 6-–5-–144 నంబర్ గల ఇంటి రెనోవేషన్ పనులు పూర్తిగా రిజిస్ట్రేషన్ పట్టా ఉన్న స్థల పరిధిలోనే జరుగుతున్నాయని జీబీ... కాంగ్రెస్ హయాంలోనే క్రీడలకు అధిక ప్రాధాన్యత
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు) : తెలంగాణలో క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జీ ఆదం సంతోష్కుమార్ అన్నారు. చిలకలగూడ జీహెచ్ఎంసీ పార్కులో షటిల్ బాడ్మింటన్కోర్టులను ఆయన ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆదం సంతోష్కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత... 