గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title

On
గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title

(శ్రీధర గణపతి శర్మ - 9849386786).

జగిత్యాల 05 సెప్టెంబర్ (ప్రజా మంటలు) : 

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.

సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం.

ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..! రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్‌గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్. 

 అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.

 దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.

ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.

విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.

Tags

More News...

Local News 

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్ ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపై దాడి – బంగారం, నగదు అపహరణ వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు)నెక్కొండ మండలంలోని పనికర గ్రామం అవతల ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిలో శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు దొంగతనానికి...
Read More...

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు    గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు వేలేరు, ప్రజామంటలు:గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తుది సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ, భూ నిర్వాసితులకు ఎదురవుతున్న ఏవైనా సమస్యలు ఉంటే, అవి అర్జీ రూపంలో సమర్పించాలని తెలిపారు....
Read More...
Local News 

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు    జగిత్యాల  జూలై 11 ( ప్రజా మంటలు) ఆషాడమాసం శుక్రవారం సందర్భంగా పట్టణం లోని పురాణిపేట  శ్రీ లోకమాత (గాజుల) పోచమ్మ తల్లి ఆలయంలో మహిళలు గోరింటాకు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ  కార్యక్రమంలో మహిళలు పాల్గొని గోరింటాకు సంబరాలు  జరుపుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి  ఆశీస్సులు కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని  కోరుకున్నారు....
Read More...
Local News 

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్    మల్కాజ్‌గిరి, జూలై 11 (ప్రజా మంటలు) మల్కాజ్‌గిరి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఓల్డ్ మల్కాజ్‌గిరిలో మరియు సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్ల ప్యాచ్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, నాలా (డ్రైనేజీ) పనులు, అలాగే పెద్ద ఎత్తున ప్యాచ్...
Read More...
Local News 

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం   జగిత్యాల జమంటలు11 (ప్రజా మంటలు)జిల్లా వైద్య, మరియు ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఐఎంఏ భవన్ వరకుఈ యాత్ర కొనసాగింది  . ఈ నాటి  కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.ఎన్ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్...
Read More...
Local News 

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) మోతే రోడ్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్  కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు...
Read More...
Local News 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల జులై 11 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక  కాలంలో ముమ్మర తనిఖీ లు చేసారు. వాహనాల తనిఖీ చేయగా...
Read More...
Local News 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్ 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్  గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని చిల్వర్ కోడూర్ గ్రామ శివారులో బసంత్ నగర్ నుండి నిజామాబాద్ కు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు
Read More...
Local News 

ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్ జగిత్యాల జులై 11(ప్రజా మంటలు) ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే  ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు.. శుక్రవారం అర్బన్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఆ సంఘ సభ్యత్వాన్ని నిర్వహించి మాట్లాడారు.. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలు సుశిక్షితమైన ఉపాధ్యాయులతో...
Read More...
Local News  State News 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి హైదరాబాద్ జూలై 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కె.ధర్మార్జున్,పల్లె వినయ్ కుమార్, తెలంగాణ జన సమితి పార్టి  ప్రధాన కార్యదర్శులు అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుట కొరకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు...
Read More...
Local News  State News 

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలి - తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా- ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూలై...
Read More...
Local News 

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు)  గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు ఉపాధ్యాయురాళ్లు ఆషాఢమాస గోరింటాకు పండగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయం అలాగే దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు...
Read More...