గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title
(శ్రీధర గణపతి శర్మ - 9849386786).
జగిత్యాల 05 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.
సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం.
ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..! రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్.
అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.
ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.
విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
హయత్నగర్లో కిలాడీ లేడీ అరెస్ట్ – ఎనిమిది బ్లాక్మెయిల్ కేసులు
హైదరాబాద్ డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
పురుషులను వ్యాపారం పేరుతో ట్రాప్ చేసి, సన్నిహితంగా ఉన్న సందర్భాలను రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత భారీ మొత్తాలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఒక కిలాడీ లేడీని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ మహిళపై ఇప్పటికే ఎనిమిది... భీం రెడ్డి గూడెం , నాయకపు గూడెం, గ్రామపంచాయతీ ఏకగ్రీవ పాలకవర్గాలను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సారంగాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు)మండల భీం రెడ్డి గూడెం,నాయకపు గూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక శుక్రవారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్... అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
* అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి
భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):
ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ... ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు – సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల భాగంగా ఆదిలాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు... IndiGo సంక్షోభం: దేశవ్యాప్తంగా 175 ఫ్లైట్లు రద్దు — బెంగళూరులో ఒక్కరోజులో 73 రద్దు
బెంగళూరు, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
దేశంలో అతి పెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగోలో కొనసాగుతున్న సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. డిసెంబర్ 4 ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 175 ఇండిగో ఫ్లైట్లు రద్దయ్యాయి. వీటిలో బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 73 ఫ్లైట్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర... చెరువులు, ఫ్లైఓవర్, ఎస్టీపీ—ప్రజా సమస్యలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్/మేడ్చల్–మల్కాజిగిరి (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా పరిశీలించి, ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
రామంతపూర్: ఐలమ్మ విగ్రహానికి నివాళులు – చెరువు పరిశీలన
కవిత రామంతపూర్ ఇందిరానగర్లోని చాకలి... ఘనంగా ముగిసిన గురు చరిత్ర పారాయణం
జగిత్యాల డిసెంబర్ 4 (ప్రజా మంటలు)దత్త జయంతి పురస్కరించుకొని స్థానిక షిరిడి సాయి మందిరంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న గురు చరిత్ర పారాయణం గురువారం ముగిసింది. ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, రాజేశ్వర శర్మ, వైదిక కార్యక్రమ క్రతువు నిర్వహించారు.
సామూహిక పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన,... పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ కె డి సి... బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్పై సస్పెన్షన్
కోల్కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
బెంగాల్లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది.
హుమాయున్ కబీర్... బీహార్ BJP ఎమ్మెల్యే ప్రమోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య
ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
పాట్నా డిసెంబర్ 04:
బీహార్లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,... ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)రూరల్ మండలము చర్లపల్లి, బీర్పూర్ మండలం గోండు గూడెం గ్రామాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా... హైదరాబాద్లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి ఒక 13 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ను కుదిపేసింది. ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ కేసులో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మరియు బాలిక పెద్దమ్మ అరెస్టయ్యారు.
నిందితులు:బండి... 