గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title
(శ్రీధర గణపతి శర్మ - 9849386786).
జగిత్యాల 05 సెప్టెంబర్ (ప్రజా మంటలు) :
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.
సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం.
ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..! రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్.
అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.
ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.
విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సత్యసాయి జిల్లా 16 జనవరి (ప్రజా మంటలు) :
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికను న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు)
భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికలు శాంతియుతంగా సజావుగా నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
ధర్మపురి జనవరి 16 (ప్రజా మంటలు)
మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్... రాయికల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు) పట్టణంలోని స్థానిక వి ఎస్ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ
రాయికల్ మున్సిపల్ ఏర్పడి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఆశించిన అభివృద్ధి జరగలేదు. ప్రజలకు కనీస అవసరాలైన వీధి... తపస్ రాష్ట్ర అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి"
జగిత్యాల జనవరి 16 ( ప్రజా మంటలు)
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఓ డ్నాల రాజశేఖర్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణిప్రవీణ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి మరియు నూతనంగా ఎన్నికైన తపస్... పోపా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
రాయికల్ జనవరి 16 (ప్రజా మంటలు)పట్టణంలో స్థానిక భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి అఫీషియల్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో రాయికల్ మాజీ మునిసిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు,రాష్ర్ట... బీద, మధ్యతరగతి ప్రజలకు భరోసా సీఎం సహాయ నిధి
జగిత్యాల, జనవరి 16 (ప్రజా మంటలు):
బీద మరియు మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో, పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా... సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ఆంధ్ర నుండి హైదరాబాద్ వచ్చే వాహనాలకు దారి మళ్లింపు. - జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
నల్గొండ 16 జనవరి (ప్రజా మంటలు) :
సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకేసారి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే నేపథ్యంలో, నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై... జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఆయన నివాసం లో కలిసిన నూతనంగా ఎన్నికైన తపస్ రాష్ట్ర అధ్యక్షులు.
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వొడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసిన వోడ్నా ల రాజశేఖర్ .ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించారు జగిత్యాల... ధనుర్మాస కొఠారి ఉత్సవాలలో భాగంగా ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము
నిజామాబాద్ జనవరి 15 (ప్రజా మంటలు) నిజామాబాద్ లోని బ్రహ్మపురిలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ రథోత్సవం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. .ప్రతి ఏట సంక్రాంతి పర్వదినం నాడు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు . రథము చక్రం గుడి నుండి బయలుదేరి గాజులపేట, పెద్ద బజారు, మీదుగా ఆలయం చేరుకుంది .... జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య, అక్క మహంకాళికి బోనాల సమర్పణ
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు) జగిత్యాల కురుమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా బీరయ్య ,అక్క మహంకాళి మాతకు కుల బాంధవులు గురువారం బోనాల సమర్పించారు .కొత్తగా వచ్చిన ధాన్యంతో స్వామివారికి బోనాలను నివేదించారు.
పిల్లాపాపలతో పాటు పశుసంపద ,గొర్రెలు, మేకలు,పాడిపంటలతో చల్లంగా ఉండాలని మొక్కుకున్నారు .ఒగ్గు కళాకారుల డోలు చప్పులతో ఆలయానికి... తెలంగాణ ప్రభుత్వం–భారత ఆర్మీ మధ్య సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం, భారత ఆర్మీకి మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాల సత్వర పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్... 